టిడబ్ల్యూజేఎప్ జిల్లా మహాసభల పోస్టర్ ల ఆవిష్కరణ

టిడబ్ల్యూజేఎప్ జిల్లా మహాసభల పోస్టర్ ల ఆవిష్కరణ

మహాసభలను విజయవంతం చేయండి

జిల్లా అద్యక్షులు తాడగోని రాజు

పరకాల నేటిధాత్రి

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫోరం హనుమకొండ జిల్లా తృతీయ మహాసభలు
ఈనెల 13 తేదీన హనుమకొండ ప్రెస్ క్లబ్ లో జరుగనున్నాయని జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ మహాసభలను జయప్రదం చేయాలని టిడబ్ల్యూజేఎప్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు తడగోని రాజు పిలుపునిచ్చారు.మంగళవారం అమరాదామంలో మహాసభల వాల్ పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా గూడెల్లి నాగేంద్ర అద్యక్షతన జరిగిన సమావేశంలో రాజు మాట్లాడుతూ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో గత బిఆర్ఎస్ అడుగుజాడల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందన్నారు.అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా అక్రిడేషన్ కార్డులు ఇవ్వడం లేదన్నారు.అదికారంలోకి వచ్చే ముందు జర్నలిస్టులకు ఇండ్లు,ఇండ్ల స్థలాలు కేటాయిస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడా ఊసే ఎత్తడం లేదంటు విమర్శించారు.రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులు, దౌర్జన్యాలు నిత్యకృత్యంగా మారాయని అక్రమ కేసుల్లో ఇరికించి ఇబ్బందులకు గురి చేస్తున్న ఘటనలు సైతం నెల కొంటున్నాయంటు ఆవేదన వ్యక్తం చేశారు‌.ఈలాంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ పునారావృతం కాకుండా సమర్దవంతంగా తిప్పి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.అందుకు జర్నలిస్టు సమాజం ఐక్యంగా ముందుకు సాగాల్సిన అవసరంఉందన్నారు.జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం కృషి చేస్తున్న తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫోరం జిల్లా మహాసభలకు ప్రతి జర్నలిస్టు హాజరై విజయవంతం చేయాలని రాజు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యుజెఎఫ్ జిల్లా నాయకులు అంతడుపుల శ్రీనివాస్,దామెర రాజేందర్,కోగిల చంద్రమౌళి,ఏకు రవికుమార్,సిలువేరు రాజు,దేవు నాగరాజు,నాగెల్లి సంతోష్,చుక్క సతీష్, తదితరులు పాల్గొన్నారు.

CITU ఆధ్వర్యంలో సమ్మె పోస్టర్స్ ఆవిష్కరణ.

CITU ఆధ్వర్యంలో సమ్మె పోస్టర్స్ ఆవిష్కరణ

మే 20 న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి

సిరిసిల్ల టౌన్ 🙁 నేటి ధాత్రి )

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని,బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని దేశంలోని అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మే 20 న జరుగుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పోస్టర్లను సిఐటియు ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగినది.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ గారు మాట్లాడుతూ శతాబ్ద కాలంగా కార్మికవర్గం అనేక త్యాగాలు,పోరాటాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ లుగా తీసుకొచ్చి వాటి అమలుకు కేంద్ర బిజెపి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నదని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మే 20 తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చేయాలని జాతీయ కార్మిక సంఘాలు,కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు,స్వతంత్ర ఫెడరేషన్లు పిలుపు ఇచ్చాయని లేబర్ కోడ్స్ అమలు జరిగితే కార్మిక సంఘాల ఏర్పాటు కష్టతరం కష్టతరం అవుతుందని, కార్మికుల సమష్టి బేరసారాల శక్తి నిర్వీర్యం కాపాడుతుందన్నారు. కార్మికులకు ఉద్యోగ భద్రత,ఉపాధి భద్రత దూరమవడమే కాకుండా కార్మిక శాఖ కూడా నిర్వీర్యం కాబడుతుందని అందుకని కేంద్ర బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేయాలని కార్మికులకు కనీస వేతనం రూ 26000 ఇవ్వాలని తదితర ప్రధానమైన డిమాండ్లతో మే 20 న తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని రంగాల కార్మికులు తప్పకుండా పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు సిరిమల్ల సత్యం,ఉడుత రవి,మచ్చ వేణు,గాజుల రాజు ,బూట్ల వెంకటేశ్వర్లు,అవధూత హరిదాసు,చింత కింది సుదన్,దోమల రమేష్ , శ్యామ్,సతీష్ ,సదానందం తదితరులు పాల్గొన్నారు.

బిఆర్ఎస్ బహిరంగ సభ వాల్ పోస్టర్ల ఆవిష్కరణ.

బిఆర్ఎస్ బహిరంగ సభ వాల్ పోస్టర్ల ఆవిష్కరణ.

మిగిలిన రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేయాలి

మండల పార్టీ అధ్యక్షుడు నామాల సత్యనారాయణ.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

ఈనెల 27 న వరంగల్ జిల్లా సమీప ఎల్కతుర్తిలో నిర్వహించే బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభ పట్ల నర్సంపేట రూరల్ మండలంలోని ఇటుకలపల్లి,ఆకుల తండా,ఏనుగుల తండా,ఇప్పల్ తండ గ్రామలలో బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ ఆయా గ్రామాల్లో మండల పార్టీ అధ్యక్షుడు నామాల సత్యనారాయణ ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించారు.అనంతరం గోడ పత్రికలను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ రుణ మాఫీ పట్ల ప్రకటన ప్రకారం మిగిలిన రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం అన్నీ రంగాల్లో విఫలమయ్యిందని అన్నారు.
ఈ కార్యక్రమం లో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఈర్ల నరసింహరాములు,క్లస్టర్ ఇన్చార్జిలు మోటూరి రవి,కడారి కుమారస్వామి,మాజీ ఎంపీటీసీ భూక్యా వీరన్న,మండల పార్టీ ఉపధ్యక్షుడు అల్లి రవి,ఇటుకాపల్లి గ్రామకమిటీ అధ్యక్షుడు పిట్టల శ్రీనివాస్,ఆకుల తండ గ్రామ పార్టి అధ్యక్షుడు కూకట్ల రవి,ఇప్పల్ తండ గ్రామ పార్టి అధ్యక్షుడు ధరావత్ బద్దు,ఏనుగుల తండ గ్రామ పార్టి అధ్యక్షుడు,మాజీ సర్పంచ్ బానోతు రవి,మాజీ సర్పంచ్ లు మండల రవీందర్,భానోత్ శంకర్ నాయక్,మాజీ ఉప సర్పంచ్ జమాల చంద్రమౌళి,వాడికారి గోపాల్,కుసుంబ కోటి,మండల రాజమౌళి,రాధరపు రాజు,నకినబొయిన సారంగం,జామచెట్ల చేరాలు, సాంబయ్య,గజ్జి బాబు, హరీష్, సుమన్,కిషన్ నాయక్,బోయిని సమ్మాలు,పాసికంటి శంకర్ లింగం,కన్నెబోయిన రాజు, కూకట్ల కుమార్ ఉప్పునూతల వీరాచారి,గోపు సాంబయ్య,బానోతు దశ్రు,కిషన్,ధరావత్ దసురు,జై కిసాన్ బద్రు,గ్రామ కమిటీ సభ్యులు,నాయకులు,పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల హామీ ఆరు గ్యారెంటీలను అమలు చేయాలి

సజ్జనపు సరస్వతి ఐ ఎఫ్ టి యు జిల్లా నాయకురాలు

కేసముద్రం/ మహబూబాబాద్: నేటి ధాత్రి:

కేసముద్రం. మండల కేంద్రంలో వాల్ పోస్టర్లు ఆవిష్కరించడం. జరిగింది.
6 గ్యారంటీల అమలకై ఫిబ్రవరి 20న చలో హైదరాబాద్ ఇందిరా పార్కులో జరిగే ధర్నా కు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనాలని సజ్జనపు సరస్వతి మాట్లాడుతూ
సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈనెల 20వ తారీఖున హైదరాబాదులో జరుగు ప్రదర్శన బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ మాట్లాడారు ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీఅమలుపరచటంలో పూర్తిగా విఫలమైందని రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ రైతుల ఖాతాలో వేస్తామన్న రైతుబంధు ఎకరంకు 15000 ఇస్తామన్నారు ప్రతి మహిళా ఖాతాలో 2500 రూపాయలు ఇందిరమ్మ ఇండ్లు. భూమిలేని నిరుపేదలకు 12000 ఇస్తామన్నారు రేషన్ కార్డులు ప్రతి నెల 4000 రూపాయల పెన్షన్లు వివిధ రకాల పెన్షన్లుఆరు గ్యారంటీలు 420 వాగ్దానాలు చేసి అందరికీ అందిస్తామని మాయ మాటలుచెప్పి అరచేతిలో స్వర్గం చూపించి అన్ని వర్గాల ప్రజలందరినీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసం చేసిందని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో వీరి కపట నీతిని ప్రజలందరూ అర్థం చేసుకొని తగిన విధంగా బుద్ధి చెప్పాలని కోరుతూ వీటి అమలుకై ఈనెల 20 తారీఖున హైదరాబాదులో జరుగు భారీ ప్రదర్శన బహిరంగ సభ ఇందిరా పార్క్ లో ధర్నాకు ప్రజలు పెద్దవేత్తుగా పాల్గొని జయప్రదం చేయాలని ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు అనుబంధ కూలీ యూనియన్ నాయకులు ఏమి, జాటోత్ మంజుల, వినోద్ విజయ, రజిత, రంగమ్మ ,లలిత, రుక్కమ్మ , ప్రమీల, రాధిక, లలిత, పార్వతి, శోభ, కమిలి, చిట్టి,తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version