ఈ వారం.. ఓటీటీకి వ‌చ్చిన సినిమాలు, సిరీస్‌లివే.

OTT: ఈ వారం.. ఓటీటీకి వ‌చ్చిన సినిమాలు, సిరీస్‌లివే

ఈ లాంగ్ వీకెండ్ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేంద‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా చిత్రీక‌రించిన సినిమాలు, సిరీస్‌లు, డాక్యుమెంట‌రీలు డిటిజ‌ల్ ఫ్లాట్ ఫాంల‌లోకి వ‌చ్చేశాయి.

ఈ లాంగ్ వీకెండ్ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేంద‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా చిత్రీక‌రించిన సినిమాలు, సిరీస్‌లు, డాక్యుమెంట‌రీలు పేరెన్నిక‌గ‌న్న అనేక డిటిజ‌ల్ ఫ్లాట్ ఫాంల‌లోకి వ‌చ్చేశాయి. ఇప్ప‌టికే అయా ఓటీటీల‌లో స్ట్రీమింగ్ కూడా అవుతున్నాయి.

సినిమా థియేటర్స్

అయితే.. చాలా మందికి వారి వారి భాష‌ల‌లో ఏ కంటెంట్ వ‌చ్చింద‌నే మీమాంస, కుతుహాలం ఉంటుంది. అలాంటి వారంద‌రి కోసం వారి లాంగ్వేజెస్‌లో వ‌చ్చిన కంటెంటు ఏంటో ఇక్క‌డ మీకు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆల‌స్యం మీకు న‌చ్చిన భాష‌లో, మీకు న‌చ్చిన సినిమానో, సిరీస్‌ను చూసి ఆస్వాదించండి.

 

Malayalam

Nadikar (Mal, Tel,Tam, Kan, Hin) Saina Play

ManasaVacha (Malayalam) Manorama Max

Eth Nerathanavo (Malayalam) Manorama Max

 

Kannada

Timmana Mottegalu (Kannada) PrimeVideo

Hebbuli Cut (Kannada) Sunnxt

 

Hindi

Salakaar (Hin, Telu, Tam, Mal, Kan) [Series] JioHotstar

Bindiya Ke Bahubali Season 1 (Hindi) MxPlayer

Marathi

Jarann (Marathi)

 

Tamil

Maaman (Tamil) Zee5

Trending (Tamil) Sunnxt

ParanthuPo (Tam, Tel, Mal, Kan, Hin) JioHotstar

Oho Enthan Baby (Tam, Tel, Mal, Kan, Hin) Netflix

 

Telugu

Badmashulu (Telugu) PrimeVideo, ETv Win

Mothevari LoveStory (Telugu) [Series] Zee5

Mayasabha (Tel, Tam, Mal, Kan, Hin) [Series] Sony Liv

Arabia Kadali (Tel, Tam, Mal, Kan, Hin) [Series] PrimeVideo

 

English

 

Netflix

Lisa Frankenstein (English)

Stolen : Heist of the Century (English)

SEC Football: Any Given Saturday (English) [Series]

Wednesday: Season 2 Part 1 (Eng, Telu, Tam, Mal, Kan, Hin)

Blood Brothers: Bara Naga (Malaysian) Netflix

 

Prime Video

Sorry Baby (English) Rent

The Occupant (English) Rent

The Pickup (Eng, Telu, Tam, Mal, Kan, Hin)

Abrahams Boys: A Dracula Story (English) Rent

Jurassic World Rebirth   (Eng, Telu, Tam, Mal, Kan, Hin) Rent

 

Jio Hotstar

Mickey17 (English)

Love Hurts (English, Hindi)

The Yogurt Shop Murders (English) [Documentry]

 

Pretty Thing (Eng, Telu, Tam, Mal, Kan, Hin) Lions Gate Play

Harvest (English) MUBI

Freaky Tales (English) HBO Max

Bob Trevino Likes It (English) Hulu

మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి…

మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి

మాజీ సర్పంచుల జేఏసీ స్టేట్ ప్రెసిడెంట్ అక్కనపల్లి కరుణాకర్ డిమాండ్

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-02T133644.758-1.wav?_=1

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )

రాజన్న సిరిసిల్ల జిల్లా మాజీ సర్పంచులు 2019 -24 సంవత్సరానికి పని చేసినటువంటి మాజీ సర్పంచులు సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగినది. మాజీ సర్పంచుల జేఏసీ స్టేట్ ప్రెసిడెంట్ అక్కనపల్లి కరుణాకర్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వo కాలనీలో, గ్రామాల్లో సర్పంచులు చేసినటువంటి అభివృద్ధి
పనులకు ఇంతవరకు బిల్లులు చెల్లించలేదు. గత ప్రభుత్వ కాలం పోయి నూతన ప్రభుత్వం వచ్చినాక కూడా బిల్లులు చెల్లించకపోవడం వల్ల చాలామంది సర్పంచులు తమ ఇల్లు, పొలాలు తాకట్టు పెట్టి గత ప్రభుత్వంలో సర్పంచుల సొంత నిధులతో ఖర్చు పెట్టించి నా గత బిఆర్ఎస్ ప్రభుత్వం. నేడు నూతన ప్రభుత్వంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లులు ఇవ్వకుండా పోవడం వల్ల మాజీ సర్పంచులకు కుటుంబ పరంగా మరియు ఆర్థిక పరంగా నష్టపోయారని సర్పంచుల జిల్లా ఫోరం పేర్కొన్నారు. అంతేకాకుండా గత ప్రభుత్వంలో సర్పంచులు కట్టించినటువంటి కార్యాలయాలల్లో
నేడు నూతనంగా వచ్చిన ప్రభుత్వ, అధికారులు గానీ నాయకులు గానీ ఉండలేరా అని ప్రశ్నించడం జరిగినది. కాబట్టి వెంటనే మాజీ సర్పంచుల బిల్లులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేయాలని ప్రెస్ మీట్ ద్వారా కోరడం జరిగినది.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు మాజీ సర్పంచుల జేఏసీ స్టేట్ ప్రెసిడెంట్. అక్కనపల్లి కరుణాకర్ జిల్లా అధ్యక్షులు దుమ్మ అంజయ్య. గుణాల లక్ష్మణ్. సిరికొండ శ్రీనివాస్. ఆరే మహేందర్. రవి నాయక్. శ్రీనివాస్. తదితరులు పాల్గొన్నారు.

ర‌జ‌నీకాంత్ కూలీ నుంచి ‘పవర్‌హౌస్‌’ సాంగ్ విడుద‌ల..

ర‌జ‌నీకాంత్ కూలీ నుంచి ‘పవర్‌హౌస్‌’ సాంగ్ విడుద‌ల

Power House | సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ‘కూలీ’ చిత్రం నుంచి తాజాగా ‘పవర్‌హౌస్'(Power House) అనే మూడవ పాట విడుదలైంది.

ఎస్సారెస్పీ కాలువకు నీటిని విడుదల చేయాలి-సుంకె..

ఎస్సారెస్పీ కాలువకు నీటిని విడుదల చేయాలి-సుంకె

కరీంనగర్, నేటిధాత్రి:

రైతు వ్యతిరేక కాంగ్రెస్ పాలనను నిరసిస్తూ బిఆర్ఎస్ నాయకులు వినూత్న నిరసనకు చేశారు. చొప్పదండి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కొత్తపెల్లి(హ) ఎస్సారెస్పీ కాలువ నీరు లేక ఎండిపోవడంతో క్రికెట్ ఆడుతూ ప్రభుత్వ పాలనను ఎద్దేవాచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎత్తిపోతల పథకం ద్వారా దిగువనున్న జలాలను ఎగువకు మళ్ళించి ఎస్సారెస్పీ వరద కాలువ ద్వారా లోయర్ మానేరు డ్యాం, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, తదితర జిల్లాలకు నీరందించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నీళ్లు ఇచ్చే ఉండి అవకాశం ఉన్నా కూడా పంపులను ఆన్ చేయకుండా వృధాగా దిగువకు విడుదల చేస్తున్నారని ఆవేధన వ్యక్తం చేశారు. సాగు, త్రాగు నీటికి ఇబ్బంది గురిచేస్తున్నారని మండిపడ్డారు. నాలుగు రోజుల్లోగా నీటిని విడుదల చేసి రైతులకు అందించకపోతే భారీ ఎత్తున రైతులతో ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, మాజీ జడ్పిటిసిలు, మాజీ సర్పంచులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

ఉపాధి హామీ కార్మికుల వేతన బకాయిలు విడుదల చేయాలి.

ఉపాధి హామీ కార్మికుల వేతన బకాయిలు విడుదల చేయాలి…

నేటి ధాత్రి -గార్ల :-

మండల పరిధిలోని గార్ల,ముల్కనూర్, చిన్నకిష్టపురం,పెద్దకిష్టాపురం, సత్యనారాయణపురం, శేరిపురం,మర్రిగూడెం, పుల్లూరు,పోచారం, గోపాలపురం, పినిరెడ్డిగూడెం, సీతంపేట,మద్దివంచ, రాంపురం తదితర గ్రామపంచాయతీలలో పనిచేసిన ఉపాధి హామీ కూలీలకు చెల్లించాల్సిన వేతన బకాయిలను తక్షణమే చెల్లించాలని ఉపాధి హామీ పథకం కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.అసౌకర్యాల నడుమ మండుటెండల్లో చెమట చిందించి పనిచేసిన కార్మికులకు 15 రోజులకు ఒకసారి వేతనాలు చెల్లించే విధానాన్ని పాలకులు స్వస్తి పలికారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనులు చేసి నెలలు గడుస్తున్నప్పటికీ వేతనాలు ఇవ్వకపోతే కూలీలు ఏమి తిని బ్రతుకుతారని ప్రశ్నిస్తున్నారు. వేతనాలు అందక అనేక కుటుంబాలు సుదుల ప్రాంతాలకు వలస వెళ్లే పరిస్థితి దాపురించిందని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పెండింగ్ వేతనాలు చెల్లించాలని లేనిపక్షంలో ప్రజలు సరైన సమయంలో పాలకులకు గుణపాఠం చెబుతారని ప్రజాసంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు..

పంట పొలాలకు తాలిపేరు నీటిని విడుదల చేసిన..

పంట పొలాలకు తాలిపేరు నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు

నేటిదాత్రి చర్ల

చర్ల మండలం పెదమిడిసిలేరు గ్రామంలో తాలిపేరు ప్రాజెక్టు నుంచి ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన పంటలకు సాగునీరు అందించడం కొరకు కాలువ గేట్లు ఎత్తి నీళ్లును విడుదల చేసిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు

MLA Dr. Tellam Venkat Rao

ఈ ప్రాజెక్ట్ 0. 5 టిఎంసి నీటిని ఉపయోగించుకుంటూ ఈ ఆయకట్టు ద్వారా చర్ల దమ్ముగూడెం మండలాల్లోని గ్రామాలకు చెందిన సుమారు 25000 ఎకరాలకు సాగునీరును అందిస్తుందని తెలిపారు

MLA Dr. Tellam Venkat Rao

ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు మాజీ ప్రజా ప్రతినిధులు యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

MLA Dr. Tellam Venkat Rao

 

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download.wav?_=2

 

ట్రిప్తి డిమ్రి, సిద్ధార్థ్ చతుర్వేది జోడిగా ‘ధడక్ 2’.

ట్రిప్తి డిమ్రి, సిద్ధార్థ్ చతుర్వేది జోడిగా ‘ధడక్ 2’ ట్రైలర్ విడుదల!

సిద్దార్థ్ చ‌తుర్వేది, ట్రిప్తి డిమ్రి జంట‌గా ద‌డ్క‌న్ 2 సినిమా ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించేందుకు రెడీ అయింది.

బాలీవుడ్‌లో మ‌రో ఆస‌క్తిక‌ర సినిమా రెడీ అవుతోంది. 2018లో జాన్వీ, ఇషార్ క‌ట్ట‌ర్ జంట‌గా వ‌చ్చిన‌ ద‌శాబ్దాల ద‌డ‌క్‌ (DHADAK) చిత్రానికి సీక్వెల్‌గా ఓ కొత్త క‌థ‌తో ఇప్పుడు ద‌డ‌క్‌ 2 (DHADAK 2) అనే సినిమా త‌యార‌వుతోంది. గ‌ల్లీబాయ్ చిత్రంతో ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న సిద్దార్థ్ చ‌తుర్వేది (Siddhant Chaturvedi) హీరోగా న‌టించ‌గా ప్ర‌స్తుత నేష‌న్ సెన్షేష‌న్ ట్రిప్తి డిమ్రి (Triptii Dimri) క‌థానాయిక‌గా చేసింది.

ఈ చిత్రం ఈగ‌స్ట్ 1న థియేట‌ర్ల‌కు రానుంది. ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ తాజాగా ఈ మూవీ ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. జియో స్టూడియో (Zee Studios), క‌ర‌ణ్ జోహ‌ర్ ధ‌ర్మ ప్రోడ‌క్ష‌న్స్ (Dharma Productions) సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించ‌గా షాజియా ఇక్బాల్ (Shazia Iqbal) ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

ప్రభుత్వ డిగ్రీ 2,4 వ సెమిస్టర్ ఫలితాల విడుదల

ప్రభుత్వ డిగ్రీ 2,4 వ సెమిస్టర్ ఫలితాల విడుదల

నర్సంపేట,నేటిధాత్రి:

ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) నర్సంపేట లో మే 2025 నెలలో నిర్వహించిన బిఏ,బికామ్,బిఎస్సి (లైఫ్ సైన్సెస్),బిఎస్సి (ఫిజికల్ సైన్సెస్) రెండవ, నాల్గవ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామ్ చంద్రం, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్ ప్రొఫెసర్ కట్ల రాజేందర్ విడుదల చేశారు.

ఈ సందర్బంగా నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ మాట్లాడుతూ కళాశాల అటానమస్ సెమిస్టర్ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించినందుకు కాకతీయ విశ్వ విద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కే.ప్రతాప్ రెడ్డి అభినందించారని అన్నారు.అనంతరం ప్రిన్సిపాల్ ఫలితాల వివరాలు తెలిపారు.బిఎస్సిలో 41.74 శాతం,
బి.ఏ లో 51.85 శాతం,బి.కామ్ లో 39.02 శాతం పాస్ కాగా మొత్తం 42.62 శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు.ఈ ఫలితాలు క్యూ.ఆర్ కోడ్ తో పాటు లింక్ ద్వారా అందుబాటులో కళాశాల వెబ్సైట్ లో ఉంటాయని తెలిపారు.ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మల్లం నవీన్, కళాశాల విద్య కమీషనర్ ఎ.శ్రీదేవసేన, జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాజేందర్ సింగ్, జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బాల భాస్కర్ ధన్యవాదాలు తెలిపారు.
ఫలితాల విడుదల ఈ కార్యక్రమంలో పరీక్షల నియంత్రణ అధికారి శ్రీ ఎస్. కమలాకర్,అదనపు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ రాజీరు,
డాక్టర్ భద్రు, స్టాఫ్ సెక్రటరీ రహీముద్దీన్ పాల్గొన్నారు.

డ్ర‌గ్స్ కేసు.. జైలు నుంచి విడుద‌లైన హీరో

 

డ్ర‌గ్స్ కేసు.. జైలు నుంచి విడుద‌లైన హీరో

మాదక ద్ర వ్యాల వినియోగం కేసులో గ‌త నెల‌లో అరెస్టయి జైలులో ఉన్న శ్రీకాంత్, కృష్ణల‌కు బెయిలు మంజూరైంది

 

మాదకద్రవ్యాల కేసులో నటులు శ్రీరామ్ శ్రీకాంత్ (Sriram Srikanth), కృష్ణ (krishna)లకు నిబంధనలతో కూడిన బెయిలు మంజూరైంది. మాదక ద్ర వ్యాల వినియోగం కేసులో గ‌త నెల‌లో అరెస్టయి జైలులో ఉన్న శ్రీకాంత్, కృష్ణ తమకు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లు సోమవారం న్యాయమూర్తి నిర్మల్ కుమార్ విచారించారు.

ఈ కేసులో మొదటి నిందితుడు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా నటుడు శ్రీకాంత్ను అరెస్ట్ చేశారని, అరెస్ట్ చేసిన సమయంలో శ్రీకాంత్ వద్ద ఎలాంటి మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకోలేదని శ్రీకాంత్ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. కృష్ణకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో మాదకద్రవ్యాలు వినియో గించినట్లు నిరూపణ కాలేదని కృష్ణ తరఫు న్యాయవాది వివరించారు.

అయితే.. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ చేసిన AIADMK మాజీ నేత నిందితుల వాంగ్మూలం ఆధారంగా శ్రీకాంత్, కృష్ణలను అరెస్ట్ చేసినట్లు, వారికి బెయిలు మంజూరు చేయరాదని పోలీసుల తరపు న్యాయవాది కోరారు. వాదనల అనంతరం శ్రీకాంత్, కృష్ణ బెయిలుపై తీర్పును న్యాయమూర్తి, మంగళవారానికి వాయిదా వేశారు.

దీంతో.. మంగళవారం న్యాయమూర్తి వారికి బెయిలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రూ.10 వేల సొంత పూచీకత్తు, అదే మొత్తంలో ఇద్దరు పూచీకత్తు సమర్పించాలని, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు దర్యాప్తు అధికారి ముందు హాజరై సంతకం చేయాలని న్యాయమూర్తి నిబంధనలు విధించారు.

 

సీక్వెల్‌ రాబోతోంది.

సీక్వెల్‌ రాబోతోంది

 

 

 

యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్న సినిమాల్లో ఈ నగరానికి ఏమైంది ఒకటి. విశ్వక్‌ సేన్‌ కథానాయకుడిగా తరుణ్‌ భాస్కర్‌ దాస్యం దర్శకత్వంలో 2018లో విడుదలైన ఈ…

యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్న సినిమాల్లో ‘ఈ నగరానికి ఏమైంది’ ఒకటి. విశ్వక్‌ సేన్‌ కథానాయకుడిగా తరుణ్‌ భాస్కర్‌ దాస్యం దర్శకత్వంలో 2018లో విడుదలైన ఈ చిత్రానికి కొనసాగింపు భాగం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఆదివారం ఈ సినిమాకు సీక్వెల్‌ రాబోతుందని ప్రకటించారు మేకర్స్‌. ‘ఈఎన్‌ఈ రిపీట్‌’ అనేది టైటిల్‌. ‘ఏలినాటి శనిపోయింది. కన్యారాశి టైమ్‌ వచ్చింది’ అనేది ట్యాగ్‌లైన్‌. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ దశలో ఉందీ చిత్రం. మొదటి పార్ట్‌కు పనిచేసిన చిత్రబృందమే ఈ సీక్వెల్‌లోనూ భాగమవుతున్నారు. తరుణ్‌భాస్కర్‌ దాస్యం దర్శకత్వంలో డి.సురేశ్‌బాబు, సృజన్‌ యరబోలు, సందీప్‌ నాగిరెడ్డి నిర్మించనున్నారు. విశ్వక్‌ సేన్‌, సాయి సుశాంత్‌ రెడ్డి, అభినవ్‌ గోమతం, వెంకటేశ్‌ కాకుమాను ప్రధాన పాత్రలు పోషించనున్నారు.

ఓటీటీలో దుమ్ము రేపుతున్న కోర్టు రూం డ్రామా.

ఓటీటీలో దుమ్ము రేపుతున్న.. కోర్టు రూం డ్రామా

 

స‌డ‌న్‌గా క‌న్న‌డ నుంచి రిమేక్ అయి తెలుగులో డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చిన కోర్టు డ్రామా చిత్రం యుద్ధకాండ ఛాప్ట‌ర్‌2 చిత్రం కుటుంబ‌ ప్రేక్ష‌కుల‌ను బాగా ఆక‌ర్షిస్తోంది.

 

 

 

 

ఇటీవ‌ల ఎలాంటి ప్ర‌క‌ట‌న లేకుండానే స‌డ‌న్‌గా క‌న్న‌డ నుంచి రిమేక్ అయి తెలుగులో డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చిన కోర్టు డ్రామా చిత్రం యుద్ధకాండ ఛాప్ట‌ర్‌2 (Yuddhakaanda Chapter 2).

చిత్రం కుటుంబ‌ ప్రేక్ష‌కుల‌ను బాగా ఆక‌ర్షిస్తోంది.

అజ‌య్ రావు (Ajay Rao) హీరోగా న‌టిస్తూ నిర్మించిన ఈ సినిమాకు ప‌వ‌న్ భ‌ట్ (Pavan Bhat) ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా ప్ర‌కాశ్ బెల‌వాడి (Prakash Belawadi), K.G.F ఫేమ్‌ అర్చ‌న జోయిస్ (Archana Jois), టీఎస్ నాగాభ‌ర‌ణ (T. S. Nagabharana) కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

రెండు నెల‌ల క్రితం ఏప్రిల్18న థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ చిత్రం క‌న్న‌డ నాట మంచి విజ‌యాన్ని న‌మోదు చేసింది.

సుమారు రెంఉ గంట‌ల నిడివితో గ‌త వారం ప్ర‌పంచ వ్యాప్తంగా క‌న్న‌డ‌తో పాటు తెలుగు ఇత‌ర భాష‌ల్లోనూ స్ట్రీమింగ్‌కు వ‌చ్చింది.

క‌థ విష‌యానికి వ‌స్తే..

త‌న ఏడేండ్ల కూతురు రాధన్యను ఓ ఎమ్మెల్యే త‌మ్ముడు పాడు చేశాడ‌ని త‌ల్లి నివేదిత‌ కోర్టుకెళుతుంది.
అయితే అక్క‌డ నెల‌లు, సంవ‌త్స‌రాలు గ‌డుస్తున్నా న్యాయం దొర‌క‌డం లేద‌ని ఆవేద‌న చెందుతూ ఓ రోజు కోర్టు ఆవ‌ర‌ణ‌లోనే నిందితుడిని అంద‌రి ముందే గ‌న్‌తో కాల్చి చంపుతుంది.
దాంతో ఆమె జైలే పాల‌వుతుంది.
ఆమె ఒంట‌రి కావ‌డంతో కేసును వాదించ‌డానికి ఎవ‌రూ ముందుకు రారు.
అదే స‌మ‌యంలో భ‌ర‌త్ అనే కుర్రాడు లా పూర్తి చేసి ఓ సీనియ‌ర్ అడ్వ‌కేట్ ద‌గ్గ‌ర ప్రాక్టీస్ స్టార్ట్ చేసి త‌క్కువ స‌మ‌యంలోనే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటాడు.
ఈ నేప‌థ్యంలో నివేదిత దుస్తితి చూసి చ‌లించిన భ‌ర‌త్ ఆ కేసు టేక‌ప్ చేస్తాడు.
మ‌రోవైపు త‌న త‌మ్ముడిని చంపిన నివేదిత‌ను బ‌య‌ట‌కు రాకుండా క‌ఠిన శిక్ష వేయించాల‌ని దేశంలోనే పేరున్న ఓ పెద్ద క్రిమిన‌ల్ లాయ‌ర్ రాబ‌ర్ట్ డిసౌజాకు ఎమ్మెల్యే భారీగా డ‌బ్బు ఇచ్చి రంగంలోకి దింపుతాడు.
దీంతో పెద్ద లాయ‌ర్ కావ‌డంతో ఓట‌మి ఖాయ‌మ‌ని భ‌ర‌త్‌కు హెల్ప్ చేయ‌డానికి చాలా మంది ముందుకు రారు.

ఈ క్ర‌మంలో భ‌ర‌త్ అంత పెద్ద లాయ‌ర్‌ను ఎదుర్కొంటూ ఆ కేసును ఎలా వాదించాడు, ఇద్ద‌రి మ‌ధ్య‌ ఎలాంటి వాద‌న‌లు, ప్ర‌తివాద‌న‌లు జ‌రిగాయి, ఎవ‌రు పై చేయి సాధించారు చివ‌ర‌కు ఓ యువ‌కుడిని చంపి నేరం చేసిన‌ నివేదిత‌ను బ‌య‌ట‌కు ఎలా తీసుకు వ‌చ్చాడ‌నే ఈ సినిమా క‌థ‌.

మ‌నం ఇప్ప‌టి వ‌ర‌కు చూసిన చిత్రాల లాగే ఈ చిత్రం ఉంటుంద‌ని ముందే తెలిసిన్న‌ప్ప‌టికీ క‌థ‌ను న‌డిపించిన విధానం భిన్నంగా ఉంటుంది.

అన్ని సినిమాల్లో జైలులో ఉన్న నిర‌ప‌రాధులను హీరో విడిపిస్తే..

ఈ చిత్రంలో మాత్రం కోర్టులో అంద‌రి ముందే నేరం చేసిన ఓ మ‌హిళ‌ను హీరో ఏ విధంగా బ‌య‌ట‌కు తీసుకు వ‌చ్చాడ‌నే పాయింట్ కొత్త‌గా ఉంటుంది.

ఎలాంటి సినిమాటిక్ లిబ‌రిటీస్ తీసుకున్నార‌నే మాట రాకుండా చ‌ట్టంలో ఉన్న పాయింట్ల‌ను బేస్ చేసుకుని ఈ స్టోరినీ అద్భుతంగా తీర్చిదిద్దారు.

సినిమా మొద‌ట్లో హీరో అన‌వ‌స‌ర‌ ప్రేమ వ్య‌వ‌హారం త‌ప్పితే సినిమా అంతా కోర్టు చుట్టూనే తిరుగుతూ ఉంటుంది.

ముఖ్యంగా సెకండాఫ్ ఫైన‌ల్ హియ‌రింగ్ స‌మ‌యంలో హీరో చెప్పే డైలాగ్స్ గూస్‌బ‌మ్స్ తీసుకు వ‌చ్చేలా ఉంటాయి.

అందుకు భ‌గ‌వ‌ద్గీత శ్లోకాల‌ను వాడుకున్న విధానం, ఏళ్ల‌కు ఏళ్లు కేసులు పెండింగ్, స‌రైన స‌మ‌యానికి న్యాయం ల‌భించ‌క‌పోవ‌డం అనే పాయింట్లు చ‌ర్చించిన విధానం ఆక‌ట్టుకుంటుంది.

కుటుంబంతో క‌లిసి మంచి సినిమా చూడాల‌నుకునే వారు ఈ చిత్రాన్ని ఎలాంటి జంకుబొంకు లేకుండా హాయిగా ఫ్యామిలీ మొత్తం చూసేయ‌వ‌చ్చు.

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఓటీటీలో అందుబాటులో ఉంది.

అందుకే పాకిస్థాన్‌లో విడుదల చేయలేదు.

అందుకే పాకిస్థాన్‌లో విడుదల చేయలేదు.

 

 

shine junior college

ఆమిర్‌ఖాన్‌ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘దంగల్‌’. 2016లో విడుదలైన ఈ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా రెండు వేల కోట్ల రూపాయలకు…

ఆమిర్‌ఖాన్‌ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘దంగల్‌’. 2016లో విడుదలైన ఈ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా రెండు వేల కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాఽధించింది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని ఆమిర్‌ఖాన్‌ వెల్లడించారు. తాజాగా ఓ టెలివిజన్‌ షో పాల్గొన్న ఆయన ‘దంగల్‌’ను పాకిస్థాన్‌లో విడుదల చేయకపోవడం వెనుకున్న కారణాన్ని వివరించారు. ‘గీతా ఫొగట్‌ విజయం సాధించిన అనంతరం జాతీయ పతాకం నింగిలోకి ఎగురుతూ ఉండగా… జాతీయ గీతం వినిపించే దృశ్యాలు సినిమా నుంచి తొలగించండి లేదంటే చిత్ర ప్రదర్శనకు అంగీకరించం’ అని పాకిస్థాన్‌ సెన్సార్‌ బోర్డు షరతు విధించింది. ఇదే విషయమై చిత్ర సహ నిర్మాణ సంస్థ డిస్నీ నన్ను సంప్రదించగా నష్టం వచ్చినా సరే.. మనం సినిమాని పాకిస్థాన్‌లో విడుదల చేయడం లేదు అని ఖరాఖండిగా చెప్పేశాను’ అని ఆమిర్‌ఖాన్‌ వివరించారు. ‘మీ జాతీయ పతాకాన్ని తొలగించండి, మీ జాతీయ గీతాన్ని తీసివేయండి అనే వారితో నాకు పనేంటి. అలాంటి వ్యాపారం అక్కర్లేదని చెప్పేశాను’ అంటూ ఆయన ఆ నాటి విషయాన్ని గుర్తు చేసుకున్నారు.

ప్ర‌భాస్‌.. ది రాజా సాబ్ టీజ‌ర్ వ‌చ్చేసింది!

ప్ర‌భాస్‌.. ది రాజా సాబ్ టీజ‌ర్ వ‌చ్చేసింది!

 

 

 

ఎడాదిగా ప్ర‌భాస్ రాజా సాబ్ మూవీ నుంచి అప్డేట్ ఎప్పెడెప్పుడు వ‌స్తుందా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌, సినీ ల‌వ‌ర్స్ కోరిక‌కు ఎట్ట‌కేల‌కు ఎండ్ కార్డ్ ప‌డింది.

 

దాదాపు ఓ ఎడాదిగా ప్ర‌భాస్ (Prabhas) రాజా సాబ్ (The Raja Saab) మూవీ నుంచి అప్డేట్ ఎప్పెడెప్పుడు వ‌స్తుందా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌, సినీ ల‌వ‌ర్స్ కోరిక‌కు ఎట్ట‌కేల‌కు ఎండ్ కార్డ్ ప‌డింది.
హైద‌రాబాద్ ప్ర‌సాద్ ఐ మాక్స్ లో ఉద‌యం 10.51 నిమిషాల‌కు ది రాజా సాబ్ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు.
ప్ర‌భాస్ మొట్ట మొద‌టి సారి హ‌ర్ర‌ర్ జాన‌ర్, డ‌బుల్ రోల్‌ చేయ‌డం, ఇప్పటికే
ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ మరింత ఆసక్తిని రేకెత్తించాయి.

ఇప్ప‌టికే.. ముంద‌స్తుగా రిలీజ్ చేసిన‌ ప్రీ టీజర్ సెన్షేష‌న్ అవ‌గా తాజాగా సోమ‌వారం విడుద‌ల కానున్న టీజ‌ర్పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

ఆ ప్రీ టీజర్ లో క‌థానాయిక‌లు మాళవిక మోహనన్ (Malavika Mohanan), నిధి అగర్వాల్ (Nidhhi Agerwal), రిద్ది కుమార్ (Riddhi Kumar) స‌హా చాలా మంది ఆకాశాన్ని చూస్తూ షాక్ కు గురి అవుతున్న‌ట్లు చూయించారు.
ఆ షాట్ సోష‌ల్ మీడియాలోహైలైట్ అయింది.
అయితే టీజ‌ర్ విడుద‌ల సంద‌ర్బంగా ఐమాక్స వ‌ద్ద జాత‌ర వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది.
వేల‌ల్ఓ ప్ర‌భాస్‌ఫ్యాన్స్ త‌ర‌లి వ‌చ్చి అక్క‌డ ప్ర‌భాస్ చిత్ర ప‌టాల‌కు పాలాభిషేకం చేయ‌డంతో పాటు పెద్దెత్తున బాణా సంచా పేల్చి హంగామా చేశారు.

ఇదిలాఉంటే..

సినిమా టీజ‌ర్‌ను చూస్తే అభిమానుల‌కు ఓ పండ‌గే అనేలా ఉంది.

హ‌ర్ర‌ర్ సీక్వెన్సులు, కామెడీ బాగా వ‌ర్కౌట్ అయిన‌ట్లు తెలుస్తుంది.

విజువ‌ల్స్, త‌మ‌న్ సంగీత కూడా సినిమా రేంజ్‌ను అమాంతం పెంచేలా ఉన్నాయి.

ప్రభాస్ ఈ సినిమాలో తాతమనవడిగా డబుల్ రోల్ చేస్తుండ‌గా ఆయ‌న స‌ర‌స‌న నిధి ఆగ‌ర్వాల్‌, మాళ‌వికా మోహ‌న‌న్‌, రిద్ధి కుమార్ న‌టిస్తున్నారు.

కామెడీ హర్రర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మారుతి (Director Maruthi) డైరెక్ట్ చేయ‌గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యాన‌ర్‌పై విశ్వ ప్ర‌సాద్ నిర్మించారు.

డిసెంబ‌ర్‌5న ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లోకి రానుంది.

విహర యాత్రల పోస్టర్ విడుదల.

విహర యాత్రల పోస్టర్ విడుదల

యాత్రల స్థలాలకు డిలక్స్,ఎక్స్ ప్రెస్ బస్సుల సౌకర్యం కల్పిస్తున్నాం

డిపో మేనేజర్ రవిచందర్

పరకాల నేటిధాత్రి

 

టిజియస్ ఆర్టిసి పరకాలడిపో ఆద్వర్యంలో విహరయాత్రల వివరాల పోస్టర్ ను డిపో మేనేజర్ రవిచందర్ ఆధ్వర్యంలో సోమవారం రోజున విడుదల చేశారు.అరుణాచలం (డీలక్స్),మల్లూరు,భద్రాచలం, పర్ణశాల,ధర్మపురి,బాసర,మల్లూరు,మేడారం,రామప్ప,వేములవాడ,కొండగట్టు,గూడెం గుట్ట(ఎక్స్ ప్రెస్) పై యాత్ర స్థలాలకు బస్సులు నడిపిస్తున్నట్టు తెలిపారు.పై స్థలాలకు కాకుండ భక్తులకు అనుకూలమైన ప్రదేశాట విహరయాత్రులకు బస్సులు సమకూరుస్తామని,చార్జీలు మరియు ఇతర వివరాలకు 9666919190 9705479088 సంప్రదించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ కృష్ణ కుమారి,అసిస్టెంట్ ఇంజనీర్ రాజశ్రీ పాల్గొన్నారు.

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డు నమూనా విడుదల..!

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డు నమూనా విడుదల..! ఫస్ట్ లుక్ అదుర్స్

 

తెలుగు సినిమా రంగంలో విశేష ప్రతిభను కనబరిచిన వారికి తెలంగాణ ప్రభుత్వం అవార్డులను ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విప్లవాత్మక తెలుగు కవి గద్దర్ గౌరవార్థం ఆయన పేరు మీద ‘గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ (GTFA) ప్రదానం చేయనున్నారు. ఈ మేరకు తాజాగా అవార్డు నమూనాకు సంబంధించి ఓ ఫొటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఆ ఫొటోలో అడుగు భాగంలో గద్దె ఆపైన చేతిలో ఓ మూవీ రీల్ బాక్స్ ఉండటం మనం గమనించవచ్చు.

కాగా, మే 29న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డు (Gaddar Telangana Film Award)లను ఇవాళ జ్యూరీ చైర్పర్సన్ జయసుధ (Jayasudha)తో పాటు ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు (Dil Raju), జ్యూరీ సభ్యులు ప్రకటించారు. 2024కు గాను ఉత్తమ చిత్రంగా కల్కి 2898 AD మూవీ ఎంపికైంది. రెండో బెస్ట్ మూవీగా పొట్టేల్, మూడో ఉత్తమ చిత్రంగా లక్కీ భాస్కర్ అవార్డును సొంతం చేసుకున్నాయి. అదేవిధంగా ఉత్తమ దర్శకుడి అవార్డు కల్కి మూవీ దర్శకుడు నాగ్ అశ్విన్ను వరించింది .

ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ (పుష్ప-2), ఉత్తమ నటిగా నివేదా థామస్ (చిన్న కథ కాదు.. 35), ఉత్తమ నేపథ్య గాయనిగా శ్రేయా ఘోషల్ (పుష్ప-2), ఉత్తమ నేపథ్య గాయకుడు సిద్ శ్రీరామ్ (ఊరి పేరు భైరవకోన), ఉత్తమ సినిమాటోగ్రాఫర్ విశ్వనాథ్ రెడ్డి (గామి) స్పెషల్ జ్యూరీ అవార్డులను దుల్కర్ సల్మాన్ (లక్కీ భాస్కర్), అనన్య నాగళ్ల (పొట్టేల్), ఫరియా అబ్దుల్లా (మత్తు వదలరా-2), ఉత్తమ సహాయ నటుడిగా ఎస్ జే సూర్య (సరిపోదా శనివారం), ఉత్తమ సహాయ నటి శరణ్యా ప్రదీప్ (అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్), ఉత్తమ గేయ రచయిత చంద్రబోస్ (రాజూ యాదవ్) అవార్డును సొంతం చేసుకున్నారు. ఇక ఉత్తమ స్క్రీన్ ప్లే వెంకీ అట్టూరి (లక్కి భాస్కర్), ఉత్తమ సంగీత దర్శకుడు భీమ్ (రజాకార్), ఉత్తమ హస్య నటులుగా వెన్నెల కిషోర్, సత్య, ఉత్తమ కొరియోగ్రాఫర్గా గణేష్ ఆచార్య (దేవర), బెస్ట్ స్టోరీ రైటర్గా శివ పాలడుగు, బెస్ట్ యాక్షన్ కొరియోగ్రాఫర్- చంద్రశేఖర్ గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులను అందుకోనున్నారు. అదేవిధంగా ఉత్తమ బాలల చిత్రంగా 35.. ఇది చిన్న కథ కాదు, ఉత్తమ ఫీచర్ హెరిటేజ్ చిత్రంగా ‘రజాకార్’, ఉత్తమ పుస్తకంగా రెంటాల జయదేవ్ (మన సినిమా పుస్తకం) అవార్డులను కైవసం చేసుకున్నాయి.

నితిన్ ‘తమ్ముడు’ నుంచి హీరోయిన్ పోస్టర్ రిలీజ్.

నితిన్ ‘తమ్ముడు’ నుంచి హీరోయిన్ పోస్టర్ రిలీజ్.. ట్రైబల్ యువతిగా ఆకట్టుకుంటున్న లుక్

 

నేటిధాత్రి

 

 

 

 

యంగ్ హీరో నితిన్ (Nithin) రీసెంట్గా ‘రాబిన్ హుడ్’ (Robin Hood) సినిమాతో మనముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీగా బోల్తా కొట్టింది. ప్రస్తుతం నితిన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘తమ్ముడు’ (Thammudu). శ్రీరామ్ వేణు(Sriram Venu) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు (Dil Raju) నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో లయ(Laya), స్వశిక (Swashika), వర్ష బొల్లమ్మ(Varsha Bollamma), సౌరభ్ సన్దేవా (Sourabh Sachdev) కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రానికి అజనీష్ లోక్నాథ్ (Ajaneesh Loknath) సంగీతం అందించారు.

 

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మూవీ టైటిల్తో వస్తున్న ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ చిత్రం జులై 25న గ్రాండ్గా థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా నుంచి ఓ హీరోయిన్ పోస్టర్ను రిలీజ్ చేశారు మూవీ టీమ్. ఈ సినిమాలో ‘కాంతార’ (Kanthara) నటి సప్తమి గౌడ (Sapthami Gouda) కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. నేడు సప్తమి బర్త్డే కావడంతో ఆమెకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కొత్త పోస్టర్ను పంచుకున్నారు. ఈ ఫొటో చూస్తుంటే.. ట్రైబల్ యువతిగా సప్తమి కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.

రెండవ సెమిస్టర్ పరీక్షా ఫలితాలు విడుదల.

రెండవ సెమిస్టర్ పరీక్షా ఫలితాలు విడుదల

శ్రీ పద్మావతి ఉమెన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ నారాయణమ్మ

తిరుపతి(నేటి ధాత్రి) మే 26:

 

 

శ్రీపద్మావతి మహిళా డిగ్రీ రెండవ సెమిస్టర్ పరీక్షా ఫలితాలు విడుదల చేసామని శ్రీ పద్మావతి ఉమెన్స్ డిగ్రీ మరియు పీజీ కళాశాల ప్రిన్సిపల్ నారాయణమ్మ ఆ ప్రకటనలో తెలిపారు. స్వయం ప్రతిపత్తి కలిగిన శ్రీపద్మావతి మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాలలో 2024-2025 విద్యా సంవత్సరంలో డిగ్రీ చదువుతున్న మొదటి సంవత్సరం విద్యార్థినులకు 28 ఏప్రిల్ నుండి 9 మే 2025 వరకు జరిగిన రెండవ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.నారాయణమ్మ విడుదల చేశారు. స్వయం ప్రతిపత్తిని సాధించి ఈ పరీక్షలు నిర్వహించడానికి సహాయ సహకారాలు అందించిన తిరుమల తిరుపతి దేవస్థానముల కార్య నిర్వాహణాధికారి కి, సంయుక్త కార్య నిర్వాహణాధికారి కి, విద్యాశాఖాధికారి కి, సంబంధిత విభాగాధికారులకు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నారాయణమ్మ కృతజ్ఞతలు తెలిపారు. ఈ పరీక్షలలో 92 శాతం విద్యార్థినిలు ఉత్తీర్ణతను సాధించారని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎ. విద్యుల్లత తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ జి భద్రమణి, డాక్టర్ సి దివ్యవాణి, సూపరిండెంట్ శాంతి, ఎగ్జామినేషన్ మెంబెర్స్ జి సుధాకర, చంద్రశేఖర్, సంధ్య మరియు అధ్యాపక బృందం పాల్గొన్నారు..

బెస్ట్ అవైలబుల్ నోటిఫికేషన్ విడుదల చేయాలి.

బెస్ట్ అవైలబుల్ నోటిఫికేషన్ విడుదల చేయాలి.

ఏబిఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్

నర్సంపేట నేటిధాత్రి:

రాష్ట్రవ్యాప్తంగా 2025,2027 విద్య సంవత్సరం కోసం ప్రైవేట్,కార్పొరేట్ స్కూళ్లలో, షెడ్యూల్ క్యాస్ట్, గిరిజన సంక్షేమ, శాఖ ఆధ్వర్యంలో బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ద్వారా షెడ్యూల్ కులాల, గిరిజన ఒకటవ తరగతి, ఐదో తరగతి విద్యార్థుల కోసం, నోటిఫికేషన్ విడుదల చేసి, అర్హులైన విద్యార్థులను లక్కీ డ్రా ఎంపిక చేయాలని ఏబిఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్ అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా సంవత్సరం ముగుస్తున్న తరుణంలో నేటి వరకు బెస్ట్ అవైలబుల్ స్కీం నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం అర్హులైన ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారన్నారు.ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి నోటిఫికేషన్ విడుదల చేసి విద్యార్థిను ఆదుకోవాల్సిందిగా అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో వినయ్, భాస్కర్, సతీష్, కుమార్,అరవింద తదితరులు పాల్గొన్నారు.

గ్రామాల అభివృద్ధి చేశాం బిల్లులు విడుదల చేయాలి.

గ్రామాల అభివృద్ధి చేశాం… బిల్లులు విడుదల చేయాలి.

◆- అప్పుల బాధలు తట్టుకోలేక ఆత్మహత్యలు మాజీ సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు జగదీశ్వర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండల్ తాజా మాజీ మండల్ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు జగదీశ్వర్ పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ పాలనలో గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయన్నారు. 50 సంవత్సరాలలో జరుగని అభివృద్ధి గత ప్రభుత్వ పది సంవత్సరాల పాలనలో జరిగి దేశానికి రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు కావస్తున్న ఒక్క బిల్లు రాకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేసారు. గ్రామాల అభివృద్ధికి అప్పులు తెచ్చి పనులు చేసామన్నారు. పనులకు సంబందించిన బిల్లులు రాకపోవడంతో కొందరు మాజీ సర్పంచ్లు తెచ్చిన అప్పులు కట్టలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న సీఎం రేవంత్రెడ్డికి చలనం రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరగా స్పందించి పెండింగ్ బిల్లులు విడుదల చేసి మాజీ సర్పంచ్లను ఆదుకోవాలని కోరారు.

పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి.

పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:

పెండింగ్ జీపీఎఫ్,టీఎస్ జి ఎల్ఐ,ఎస్ ఎల్ బిల్లులు విడుదల చేయాలనీ డి ఏ ,పి ఆర్ సి ప్రకటించి సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఓ పి ఎస్ అమలు చేయాలనీ పొదిలి సత్యనారాయణ కుటుంబాన్ని ఆడుకోవాలని గుండాల మండల పిఆర్టీ యూటీఎస్ అధ్యక్షులు వి వీరాస్వామి, ప్రధాన కార్యదర్శి ఎన్ ప్రసాద్ గుండాల తహసీల్దార్ ఇమ్మానుయేల్ కు వినతి పత్రం ఇచ్చారు.ఈ కార్యక్రమం లో పిఆర్టీ యూ సభ్యులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version