పాలిస్టర్ వస్త్రానికి కూలీ పెంచే విధంగా యజమానులపై.!

పాలిస్టర్ వస్త్రానికి కూలీ పెంచే విధంగా యజమానులపై చర్యలు తీసుకోవాలి

సి.ఐ.టి.యు ఆధ్వర్యంలో జిల్లా లేబర్ అధికారికి వినతిపత్రం అందజేత

సిరిసిల్లలో పాలిస్టర్ వస్త్రానికి సంబంధించి పవర్లూమ్ , వార్పిన్ , కార్మికులు

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని పాలిస్టర్ వస్త్రానికి సంబంధించి పవర్లూమ్ కార్మికులకు , వార్పిన్ , వైపని కార్మికులకు అదేవిధంగా టెక్స్ టైల్ పార్క్ కార్మికులకు సంబంధించి యజమానులు కూలి పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా లేబర్ అధికారికి వినతిపత్రం అందజేయడం జరిగినది.
ఈ సందర్భంగా సి.ఐ.టి.యు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ మాట్లాడుతూ పాలిస్టర్ వస్త్రానికి సంబంధించి పవర్లూమ్ కార్మికులకు , వార్పిన్ , వైపని కార్మికులకు మరియు టెక్స్టైల్ పార్కు కార్మికులకు కూలి ఒప్పందం ముగిసి సంవత్సరం దాటిందని యజమానులు కూలీ పెంచకపోవడంతో కార్మికులకు సరైన వేతనాలు రాక ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కార్మికుల కూలి పెంచాలని పలు దఫాలుగా యజమానులకు విన్నవించినా కూడా కూలీ పెంపు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కార్మికుల కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వకుండా నష్టం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
పాలిస్టర్ వస్త్రానికి సంబంధించి కార్మికులకు సంబంధించి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కూలీ అగ్రిమెంట్ జరుగుతుందని 2022 సంవత్సరం ఏప్రిల్ నెలలో జరిగిన కూలీ ఒప్పందం 2024 ఏప్రిల్ నెలతో ముగిసిందని కూలీ ఒప్పందం ముగిసి ఇప్పటికీ సంవత్సరం దాటినా కూడా యజమానులు కూలీ పెంచడం లేదని కావున ఇప్పటికైనా లేబర్ అధికారులు యజమానులతో వెంటనే కూలి చర్చలు జరిపించి కూలి పెంచాలని లేకుంటే రానున్న రోజుల్లో అవసరమైతే నిరవధిక సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు, ఎగమంటి ఎల్లారెడ్డి,సిఐటియు నాయకులు కోల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

స్విమ్స్ కార్మికులకు వేతనాలు పెంచాలి.

*స్విమ్స్ కార్మికులకు వేతనాలు పెంచాలి.
వివక్ష వీడాలి:

*టీటీడీ పరిపాలన భవనం ముందు స్విమ్స్ కార్మికుల భారీ ధర్నాలో కందారపు మురళి డిమాండ్..

తిరుపతి(నేటి ధాత్రి) మార్చి 27:

 

 

స్విమ్స్ కార్మికుల కు వేతనాలు పెంచాలని, సమస్యలు పరిష్కారం చేయాలని బుధవారం ఉదయం స్విమ్స్ ఆసుపత్రి నుండి కార్మికులు ప్రదర్శనగా టీటీడీ పరిపాలన భవనం వద్దకు చేరుకుని అక్కడ మధ్యాహ్నం ధర్నా నిర్వహించారు.

ధర్నా అనంతరం టీటీడీ జేఈవో వీర బ్రహ్మం కు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు.

ఈ సందర్భంగా ధర్నా ను ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి మాట్లాడుతూ స్విమ్స్ ఆస్పత్రి ఏర్పడినప్పటి నుండి నేటి వరకు పనిచేస్తున్న కార్మికుల కు వేతనాలు పెంచటం లేదని, సమస్యలు పరిష్కారం కావడం లేదని ప్రభుత్వాలు మారుతున్నా, అధికారులు మారుతున్నా, కార్మికుల జీవితాలు వారి తలరాతలు మాత్రం మారడం లేదని అన్నారు.

గతంలో స్విమ్స్ ఏర్పడినప్పుడు ఉద్యోగాల్లో వార్డు బాయులుగా చేరిన వీరిని శానిటేషన్ కార్మికులుగా పేరు మార్చడం వల్ల వీరికి శాపంగా మారిందని అధికారులు చేసిన తప్పులకు కార్మికులు బలవుతున్నారని అన్నారు.

పని భారం నుండి కార్మికులకు మినహాయింపు ఇవ్వాలని కార్మికులతో అన్ని పనులు చేయించడo, ఊడవటం మొదలు ఆపరేషన్ థియేటర్ ల్లో అన్ని పనులు వరకు వీరి దగ్గరే చేయిస్తూ తీవ్ర పనిభారం మోపుతున్నారని నిర్దిష్టమైన పనిని కేటాయించడం లేదని వీరికి నిర్దిష్టమైన పనిని కేటాయించాలని డిమాండ్ చేశారు.

గతంలో మూడుసార్లు స్విమ్స్ డైరెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళనలు నిర్వహించినాస్వయంగా డైరెక్టర్ చర్చల్లో పాల్గొని సమస్యలపై హామీ ఇచ్చినా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన భవనం ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందని, టీటీడీ స్విమ్స్ సమన్వయంతో కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని లేని పక్షంలో సమ్మెలోకి వెళతామని హెచ్చరించారు.

సిఐటియు జిల్లా అధ్యక్షులు జి. బాలసుబ్రమణ్యం,సిఐటియు తిరుపతి నగర ప్రధాన కార్యదర్శి కే వేణుగోపాల్ ఇరువురు మాట్లాడుతూ స్విమ్స్ గతంలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్నప్పుడు టీటీడీలోకి విలీనం చేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని, వేతనాలు పెరుగుతాయని కార్మికులందరూ ఆశపడ్డారని దానికి భిన్నంగా ప్రభుత్వం నుండి టీటీడీలోకి విలీనం చేసిన తరువాత పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టుగా వీరి పరిస్థితి అయిందని అన్నారు.

టీటీడీ స్విమ్స్ పై స్విమ్స్ టీటీడీ పై ఒకరి ఒకరు దాట వేసుకుంటూ సమస్యను పక్కదారి పట్టిస్తున్నారని పరిష్కారం చేయడం లేదని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి, కార్మిక శాఖకు, టీటీడీ ఈవో కు లేఖలు పంపినా పరిష్కారం కాలేదని టీటీడీ పరిపాలనా భవనం ముందు నిరసన కార్యక్రమం చేపడుతున్నామని, ఎప్పటికైనా టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్య పట్ల సానుకూలంగా వ్యవహరించి పరిష్కారం చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకుంటామని హెచ్చరించారు.

సానుకూలంగా స్పందించిన జేఈవో వెంటనే ఈ సమస్యల పట్ల చర్చించి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని అన్నారు.

ఈ కార్యక్రమంలో సిమ్స్ కార్మికుల యూనియన్ కార్యదర్శి రవి అధ్యక్షులు సూరి కోశాధికారి మారి ముత్తు నాయకులు గోపి వేలు వెంకటేష్ విజయలక్ష్మి సుబ్రహ్మణ్యం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు..

స్కావెంజర్స్ వేతనాలు విడుదల చేయాలి.!

పాఠశాలలో పనిచేస్తున్న స్కావెంజర్స్ వేతనాలు విడుదల చేయాలి

విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో డి ఈ వో కు వినతి పత్రం అందజేత

హనుమకొండ, నేటిధాత్రి :

అనంతరం ఏ బి ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్, స్వేరోస్ మాజీ అధ్యక్షుడు రాజేందర్ ప్రసాద్ మాట్లాడుతూ.. జిల్లా పరిధిలో ప్రభుత్వ ప్రాథమిక, జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో పనిచేస్తూనా స్కావెంజర్స్ వర్కర్ల వేతనాలు 7 నెల నుండి రాలేకపోవడం వలన కుటుంబాలు గడవడం ఇబ్బందిగా మారుతుందని అన్నారు. పాఠశాలలో పచ్చదనం పరిశుభ్రత, పాఠశాల ఆవరణం మొత్తం పరిశుభ్రం చేస్తున్న క్రమంలో వేతనాలు రాలేకపోవడం వలన ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. కావున జిల్లా కలెక్టర్, డీఈవో జ్ఞానేశ్వర్ స్పందించి స్కావెంజర్స్ వర్కర్ల వేతనాలు విడుదల చేసి వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.

వ్యవసాయ కార్మికులకు కూలి పెంచాలి

కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి నాగయ్య

భూపాలపల్లి నేటిధాత్రి

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, ఆధ్వర్యంలో భూపాలపల్లి పట్టణంలోని శ్రామిక భవన్లో విస్తృత సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి నాగయ్య హాజరైనారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో 2025-26 సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌ తిరోగమనంగా ఉందనీ, అది దేశ అభివృద్ధికి శాపంగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు
కూలి పెంచాలి భూమి లేని వారికి ప్రభుత్వం 3 ఎకరాల భూమి ఇవ్వాలి అన్నారు. వృషలేసుకున్న పేదలందరికీ ఇంటి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆధీనంలో భూమిని తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి పంచితే ఒక్కొక్క కుటుంబానికి 5 ఎకరాల భూమి వస్తుంది అని అన్నారు. భూమి పంచటం వలన ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ పథకాలు ఇవ్వాల్సిన పని లేదన్నారు. భూమి పంచడం వలన ప్రజలు తమ అవసరాలు వారే తీర్చుకుంటారని అన్నారు. బడాబాబుల బొజ్జలను మరింతగా నింపేలా, మధ్యతరగతి ఉద్యోగులను మభ్యపెట్టేలా ఈ బడ్జెట్‌ ఉందన్నారు. ప్రమాదకరమైన విధానాలు అమలు జరిపేందుకు మరింత ప్రోత్సాహంగా ఉన్న ఈ బడ్జెట్‌ను ప్రజలందరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఇంత మొండిగా బరితెగించి ప్రజావ్యతిరేక విధానాలను అమలు జరుపుతున్న నేపథ్యంలో శ్రామికులు, ఇతర ప్రజానీకం ఐక్యంగా పోరాటాలు నిర్వహించటం తప్ప మరో మార్గం లేదన్నారు. సరళీకృత ఆర్థిక విధానాలను వేగంగా అమలు చేసేందుకు ఊతమిచ్చేలా బడ్జెట్‌ రూపకల్పన జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ విధానాల ఫలితంగానే దేశం తిరోగమిస్తున్నదని బడ్జెట్‌ కంటే ముందురోజు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఎకనామిక్‌ సర్వేలో చాలా స్పష్టంగా బట్టబయలైందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానికి ఎకనామిక్‌ అడ్వైజర్‌గా ఉండే వ్యక్తి పర్యవేక్షణలో రూపొందిన రిపోర్టును సైతం పరిగణనలోకి తీసుకోకపోవటం విడ్డూరంగా ఉందన్నారు. జాతీయ అభివృద్ధి వెనుకపట్టుపట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థూల జాతీయోత్పత్తి అంచనాలు భిన్నంగా పడిపోయాయని చెప్పారు. దీనికి కారణం ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడమే నన్నారు. ఈ కాలంలో నిత్యజీవితావసరాల సరుకులను సాధారణ ప్రజలు పెద్దగా కొనుగోలు చేయలేదన్నారు. ఉద్యోగుల, కార్మికుల వేతనాలు పెరగకపోవటమే ఇందుకు కారణమని తెలిపారు. కాని ధరలు విపరీతంగా పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. అందులో ఆహార సరుకుల ధరలు మరింత గా పెరిగాయని గుర్తు చేశారు. ఇది కష్టజీవుల జీవితాలను అతలాకుతలం చేసిన చర్య తప్ప మరేమిటని ప్రశ్నించారు. ఉపాధి, నిరుద్యోగ సమస్యను పరిష్కరించటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో ఉపాధి కల్పన, కార్మిక భద్రతకు సంబంధించిన అంశాలు ఈ బడ్జెట్‌లో ప్రతిపాదించకపోవడం అన్యాయమన్నారు. విభజన హామీ చట్టంలోని అంశాలను తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ పదేండ్ల తర్వాత కూడా పరిష్కరించే చర్యలు తీసుకోకపోవడం మోసం కాక మరేమిటని ప్రశ్నించారు. వ్యవసాయ రంగానికి మొదటి ప్రాధాన్యత అని చెప్పి బడ్జెట్‌ కేటాయింపులు ప్రకటించకుండా రైతాంగాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి మోసగించిందని విమర్శించారు. బీమా రంగంలో ఎఫ్‌డీఐలను 74 శాతం నుంచి 100 శాతం పెంచడం జాతీయ బీమా సంస్థలను బలహీనం చేయడమేనని చెప్పారు. ఆర్ధిక సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకే కేంద్రం సహకరిస్తామని బడ్జెట్‌లో ప్రకటించడం ఫెడరల్‌ స్ఫూర్తికి విఘాతమన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పాలెం చిన్న రాజేందర్, జిల్లా నాయకులు గట్టు శంకర్, రాజలింగు, కోడం శంకర్, ఆర్ రమా, అశోక్, రాజమణి, వావిళ్ళ రమ, తదితరులు పాల్గొన్నారు.

వ్యవసాయ కార్మికులకు కూలి పెంచాలి

కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి నాగయ్య

భూపాలపల్లి నేటిధాత్రి

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, ఆధ్వర్యంలో భూపాలపల్లి పట్టణంలోని శ్రామిక భవన్లో విస్తృత సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి నాగయ్య హాజరైనారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో 2025-26 సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌ తిరోగమనంగా ఉందనీ, అది దేశ అభివృద్ధికి శాపంగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు
కూలి పెంచాలి భూమి లేని వారికి ప్రభుత్వం 3 ఎకరాల భూమి ఇవ్వాలి అన్నారు. వృషలేసుకున్న పేదలందరికీ ఇంటి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆధీనంలో భూమిని తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి పంచితే ఒక్కొక్క కుటుంబానికి 5 ఎకరాల భూమి వస్తుంది అని అన్నారు. భూమి పంచటం వలన ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ పథకాలు ఇవ్వాల్సిన పని లేదన్నారు. భూమి పంచడం వలన ప్రజలు తమ అవసరాలు వారే తీర్చుకుంటారని అన్నారు. బడాబాబుల బొజ్జలను మరింతగా నింపేలా, మధ్యతరగతి ఉద్యోగులను మభ్యపెట్టేలా ఈ బడ్జెట్‌ ఉందన్నారు. ప్రమాదకరమైన విధానాలు అమలు జరిపేందుకు మరింత ప్రోత్సాహంగా ఉన్న ఈ బడ్జెట్‌ను ప్రజలందరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఇంత మొండిగా బరితెగించి ప్రజావ్యతిరేక విధానాలను అమలు జరుపుతున్న నేపథ్యంలో శ్రామికులు, ఇతర ప్రజానీకం ఐక్యంగా పోరాటాలు నిర్వహించటం తప్ప మరో మార్గం లేదన్నారు. సరళీకృత ఆర్థిక విధానాలను వేగంగా అమలు చేసేందుకు ఊతమిచ్చేలా బడ్జెట్‌ రూపకల్పన జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ విధానాల ఫలితంగానే దేశం తిరోగమిస్తున్నదని బడ్జెట్‌ కంటే ముందురోజు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఎకనామిక్‌ సర్వేలో చాలా స్పష్టంగా బట్టబయలైందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానికి ఎకనామిక్‌ అడ్వైజర్‌గా ఉండే వ్యక్తి పర్యవేక్షణలో రూపొందిన రిపోర్టును సైతం పరిగణనలోకి తీసుకోకపోవటం విడ్డూరంగా ఉందన్నారు. జాతీయ అభివృద్ధి వెనుకపట్టుపట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థూల జాతీయోత్పత్తి అంచనాలు భిన్నంగా పడిపోయాయని చెప్పారు. దీనికి కారణం ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడమే నన్నారు. ఈ కాలంలో నిత్యజీవితావసరాల సరుకులను సాధారణ ప్రజలు పెద్దగా కొనుగోలు చేయలేదన్నారు. ఉద్యోగుల, కార్మికుల వేతనాలు పెరగకపోవటమే ఇందుకు కారణమని తెలిపారు. కాని ధరలు విపరీతంగా పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. అందులో ఆహార సరుకుల ధరలు మరింత గా పెరిగాయని గుర్తు చేశారు. ఇది కష్టజీవుల జీవితాలను అతలాకుతలం చేసిన చర్య తప్ప మరేమిటని ప్రశ్నించారు. ఉపాధి, నిరుద్యోగ సమస్యను పరిష్కరించటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో ఉపాధి కల్పన, కార్మిక భద్రతకు సంబంధించిన అంశాలు ఈ బడ్జెట్‌లో ప్రతిపాదించకపోవడం అన్యాయమన్నారు. విభజన హామీ చట్టంలోని అంశాలను తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ పదేండ్ల తర్వాత కూడా పరిష్కరించే చర్యలు తీసుకోకపోవడం మోసం కాక మరేమిటని ప్రశ్నించారు. వ్యవసాయ రంగానికి మొదటి ప్రాధాన్యత అని చెప్పి బడ్జెట్‌ కేటాయింపులు ప్రకటించకుండా రైతాంగాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి మోసగించిందని విమర్శించారు. బీమా రంగంలో ఎఫ్‌డీఐలను 74 శాతం నుంచి 100 శాతం పెంచడం జాతీయ బీమా సంస్థలను బలహీనం చేయడమేనని చెప్పారు. ఆర్ధిక సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకే కేంద్రం సహకరిస్తామని బడ్జెట్‌లో ప్రకటించడం ఫెడరల్‌ స్ఫూర్తికి విఘాతమన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పాలెం చిన్న రాజేందర్, జిల్లా నాయకులు గట్టు శంకర్, రాజలింగు, కోడం శంకర్, ఆర్ రమా, అశోక్, రాజమణి, వావిళ్ళ రమ, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version