“నేటిధాత్రి”, బిగ్ బ్రేకింగ్
ఇదేమి రాజ్యమురన్నో చూడబోతే రెండు కళ్ళు పోతున్నాయి
యూరియా కై..రాత్రి వేళలో పడిగాపులు.
లోడ్ వచ్చిన పంపిణీ. జరగడం లేదు.
అధికారులు స్పందించి.. పంపిణీ చేయాలని వేడుకోలు.
కుండ పోత వర్షం పడిన రైతులు పడిన కాపులు కాస్తున్నారు.
రైతు వేదిక వద్ద కరెంటు సప్లై లేకున్నా ఫోన్ లైట్ ద్వారా చూసుకుంటూ పడిగాపులు కాస్తున్న రైతులు.
“నేటిధాత్రి”,నిజాంపేట, మెదక్
రైతు యూరియా పొందడం అంటే ఓ యుద్ధం చేసినట్టుగా మారింది. నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు యూరియా లోడ్ రావడం జరిగింది.
సమాచారం తెలుసుకున్న రైతులు గ్రామంలో గల రైతు వేదికలో యూరియా పంపిణీ చేస్తారెమొనని వేచి ఉన్నప్పటికీ యూరియా పంపిణీ జరగడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి భారీ వర్షం కురవడంతో కరెంటు బంద్ అయినప్పటికీ వర్షాన్ని కూడా లెక్కచేయకుండా చీకటిలో, చెప్పులతో సహా క్యూలైన్లో ఉన్నారు.
యూరియా పంపిణీ జరగకపోవడంతో తెల్లవారితే.. క్యూలైన్ పెరుగుతుందని రైతులు రాత్రి వేళలో క్యూ లైన్ కట్టారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించి యూరియాను పంపిణీ చేయాలని వేడుకుంటున్నారు.