రైతులకు సులభంగా యూరియా లభించేలా చర్యలు తీసుకోవాలి..

రైతులకు సులభంగా యూరియా లభించేలా చర్యలు తీసుకోవాలి

 

నడికూడ,నేటిధాత్రి:

 

 

 

 

ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా యూరియా బుకింగ్ చేయించడం వల్ల రైతులకు కలుగుతున్న ఇబ్బందులపై తీవ్రంగా ఖండిస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు
తెలంగాణ రైతు రక్షణ సమితి వరికేల కిషన్ రావు మాట్లాడుతూ
తెలంగాణ ప్రభుత్వం ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ను ప్రవేశపెట్టి యూరియా బుకింగ్ చేయించడానికి తప్పనిసరి చేసింది.ఈ నిర్ణయం వల్ల మా జిల్లాలోని చాలా మంది రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
రైతులకు కలుగుతున్న ఇబ్బందులు
స్మార్ట్ ఫోన్/ఇంటర్నెట్ లేకపోవడం చాలా మంది రైతులకు స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ సదుపాయం లేకపోవడం వల్ల యాప్ లో బుకింగ్ చేయించడం సాధ్యం కావడం లేదు వృద్ధ వయస్సు రైతులకు ఇబ్బంది,చదువు తక్కువ ఉన్న రైతులు యాప్ ని ఉపయోగించడంలో ఇబ్బంది పడుతున్నారు.
సమయం,డబ్బు వృధా ప్రతి రైతు కు విడిగా యాప్ లో రిజిస్ట్రేషన్ చేయించాల్సి ఉండడం వల్ల సమయం, డబ్బు రెండూ వృథా అవుతాయి డీలర్ల నుండి ఎరువులు లభించకపోవడం యాప్ లో బుకింగ్ చేయించినా కొంతమంది డీలర్లు సరిగా ఎరువులు ఇవ్వకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు.
ప్రభుత్వానికి కోరికలు
ఈ సమస్యలను పరిష్కరించడానికి తెలంగాణ ప్రభుత్వానికి కింది కోరికలు తెలియజేస్తున్నాము
ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ తప్పనిసరి నిబంధనను సడలించి,రైతులు ఆఫ్ లైన్ లో కూడా యూరియా బుకింగ్ చేయించే వీలు కల్పించాలి
ప్రతి గ్రామంలో ఒక స్థానిక సహాయకుడు (ఉదా: సర్పంచ్,వ్యవసాయ సహాయకుడు,గ్రామ సచివాలయ సిబ్బంది) ద్వారా యాప్ లో బుకింగ్ చేయించే వీలు కల్పించాలి.
యాప్ లో బుకింగ్ చేయించిన రైతులకు డీలర్లు సకాలంలో ఎరువులు ఇవ్వాలని బలమైన నియంత్రణ పెట్టాలి.
యాప్ ని సరళంగా, తెలుగులో ఉండేలా చేసి, రైతులకు శిక్షణ ఇవ్వాలి.
చివరి హెచ్చరిక
ఈ పరిస్థితి సాగితే రైతులు సకాలంలో యూరియా పొందలేకపోతారు,దీని వల్ల పంటలకు హాని చేకూరుతుంది.ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు సులభంగా,సురక్షితంగా యూరియా లభించేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వరికేల కిషన్ రావు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

గూగుల్ ప్లే స్టోర్ లో ఫర్టిలైజర్ బుకింగ్ యాప్….

గూగుల్ ప్లే స్టోర్ లో ఫర్టిలైజర్ బుకింగ్ యాప్

 

నడికూడ,నేటిధాత్రి:

 

మండలంలోని సమస్త రైతు సోదర సోదరీమణులకు, ఎరువుల డీలర్లకు తెలియజేయునది ఏమనగా!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రాబోవు యాసంగి పంట కాలంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూరియాను సరఫరా చేయాలనే ఉద్దేశంతో ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ను ప్రవేశపెట్టడం జరిగింది.
తేదీ 20.12.2025 నుండి ఈ యాప్ లో రైతులు తమ మొబైల్ నెంబర్ ను ఉపయోగించి ఓటిపి ద్వారా లాగిన్ కావాలి తర్వాత జిల్లాను ఎంచుకుంటే వివిధ సొసైటీలు లేదా డీలర్ల వద్ద ఉన్న స్టాక్ వివరాలు కనిపిస్తాయి తమకు అనుకూలమైన మరియు అందుబాటులో ఉన్న సొసైటీలు లేదా డీలర్ వద్ద యూరియా బస్తాల కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. స్లాట్ బుకింగ్ చేసే క్రమంలో పంట సీజను,పట్టా పాస్ బుక్ నెంబరు,ఏ పంట ఎంత విస్తీర్ణం,పంట రకము నమోదు చేసుకోవాలి.పంట విస్తీర్ణాన్ని బట్టి యూరియా బస్తాలు తీసుకోవచ్చు. రైతుల బుకింగు కు 24 గంటల వ్యవధి ఉంటుంది. ఈ యూరియా బుకింగ్ విధానంలో ఒక ఎకరం వరకు ఒకేసారి ఒకటి నుండి 5 ఎకరాల వరకు 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు ఐదు నుండి 20 ఎకరాల వరకు మూడు సార్లు 15 రోజుల వ్యవధిలో బుక్ చేసుకోవచ్చు.
పాసుబుక్ లేని రైతులు ఆధార్ నెంబర్ ద్వారా యూరియా బస్తాలను పొందవచ్చు,కౌలు రైతులను కూడా ఈ యాప్ లో అవకాశం కల్పించారు.
డీలర్లు కూడా మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయి రోజువారి స్టాకు అమ్మకం వివరాలను నమోదు చేసుకోవలసి ఉంటుంది.
కావున నడికూడ మండల సమస్త రైతు సోదర సోదరీమణు లకు ఇట్టి విషయాన్ని తెలియపరుస్తూ మరియు సాధారణ పద్ధతిలో యూరియా బస్తాలు అందించబడదని తెలియజేయడమైనది.
గూగుల్ ప్లే స్టోర్లో ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఎలాంటి ఇబ్బంది లేకుండా స్లాట్ బుక్ చేసుకొని యూరియా బస్తాలను పొందగలరని తెలియపరచనైనది.
అదేవిధంగా ఈ ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ కు సంబంధించి ఎలాంటి సందేహాలున్న సంబంధిత క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారులను కూడా సంప్రదించవచ్చని మండల వ్యవసాయ అధికారి పోరిక జైసింగ్ తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version