యూరియా కోసం బిఆర్ఎస్ ధర్నా – కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు.

అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెదిగాలి

యూరియా కోసం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా

నర్సంపేట,నేటిధాత్రి:

అధికారంలోకి వచ్చిన నుండి రైతులకు యూరియా అందించని అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెదిగాలని వరంగల్ జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్,దుగ్గొండి బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సుకినే రాజేశ్వరరావు డిమాండ్ చేశారు. రాష్ట్ర రైతాంగానికి సకాలంలో పంటలకు యూరియా అందించని అసమర్ధ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రాన్ని పరిపాలించే హక్కులేదని టిఆర్ఎస్ విమర్శించారు. సోమవారం మండలంలోని గిర్నిబావి సెంటర్లో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులకు యూరియా అందించాలని ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు.గత బారాస ప్రభుత్వంలో రైతులకు సరిపడా ఎరువులను అందించామని, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను వంచించి యూరియా కొసం రైతులు ఇబ్బందులను గురి చేస్తుందని పేర్కొన్నారు.నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గ వ్యవసాయశాఖపై సమీక్ష సమావేశాలు నిర్వహించకపోవడం సిగ్గుచేటన్నారు. రైతులకు సరిపడా యూరి అందించే వరకు బారాస పార్టీ రైతులకు అండగా ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కట్ల కొమల భద్రయ్య, క్లస్టర్ ఇంచార్జిలు కంచరకుంట్ల శ్రీనివాస్ రెడ్డి, శంకేసి కమలాకర్, గుండెకారి రంగారావు, కామిశెట్టి ప్రశాంత్, తోటకూరి రాజు, భూంపల్లి రజనీకర్ రెడ్డి, మాజీ సర్పంచులు అజ్మీర రవీందర్, ఒడేటి తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీటీసీలు పిండి కుమారస్వామి, సంగతి రాజన్న, వివిధ గ్రామాల గ్రామ పార్టీ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సిర్గాపూర్ లో బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు, రైతుల ధర్నా…

సిర్గాపూర్ లో బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు, రైతుల ధర్నా…

◆:-ముఖ్య అతిథిలుగా హాజరైన సంగారెడ్డి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్…

◆:- జహీరాబాద్ శాసనసభ్యులు ఎమ్మెల్యే మాణిక్ రావు,

◆:- నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి* …

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి నల్లవాగు ప్రాజెక్ట్ కుడి ఎడమ కాలువల నీళ్ళు వదులుతూ ప్రజల మన్ననలు పొందాలని చూస్తే ఎవ్వరు పిక్చోలు లేరు అని డిమాండ్ చేశారు.ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ నల్లవాగు ప్రాజెక్టు పైన మీ ప్రభుత్వం ఎన్ని నిధులు మంజూరు చేశారు తెలపాలి
నల్లవాగు ప్రాజెక్టుకు మీరు ఎలాంటి రిపేర్లు చెయ్యలేదు నిధులు గాని మంజూరు చేయకుండా ప్రజలను మోసం చేస్తూ వారి వ్యవసాయానికి నష్టం కలిగిస్తున్నారు మీరు. కాలువలు మరమ్మత్తులు గాని పూడిక తీయడం గాని చేసింది మా బి ఆర్ ఎస్ ప్రభుత్వం హయాంలోనని ఉన్న నీటిని అన్నారు. వ్యవసాయదారులకి అందించకుండా కాలయాపన చేసింది మీరు అని ఎద్దేవ్య చేశారు రైతులకు నీళ్లు ఇవ్వాలని మా పంటలు ఎండిపోయిన నష్టపోయే ప్రమాదం ఉందని ముందుకు వచ్చేసరికి ప్రజలు తిరగబడతారని ఉద్దేశంతో నేడు వచ్చి నీరు విడుదల చేస్తున్నావ్ కానీ మీరు నల్లవాగు ప్రాజెక్టు పైన ఇలాంటి నిధులు మంజూరు చేయలేదు ఇలాంటి పనులు చేయలేదు.కానీ ప్రజలకు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారూ.. కానీ ఇప్పటికైనా మీరు రైతులకు కనీసం యూరియా కూడా సరిగా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. రైతులను తప్పు దోవ పట్టించడం మానుకొని వాళ్లకు అందించాల్సిన యూరియా గాని నల్లవాకు ప్రాజెక్ట్ పైన కుడికాలువ ఎడమకలవల నీళ్లను గాని సకాలంలో అందిస్తూ అభివృద్ధికి పాటుపడేలా తప్ప మందిపై బురద జలగం మానుకోవాలని ఎద్దేవా చేశారు.

కోనాపూర్‌లో యూరియా కొరతపై రైతుల ధర్నా…

కోనాపూర్‌లో యూరియా లభ్యం లేక రైతుల రోడ్డుపై ధర్నా..

రామాయంపేట ఆగస్టు 25 నేటి ధాత్రి (మెదక్)

రామాయంపేట మండలం నుండి
మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని కోనాపూర్ గ్రామంలో యూరియా లభ్యం కాక రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఉదయం గ్రామంలోని వందలాది మంది రైతులు కలిసి గ్రామ ప్రధాన రహదారిపై బైఠాయించి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. దీంతో రహదారిపై వాహనాల రాకపోకలు పూర్తిగా ఆగిపోయి, ట్రాక్టర్లు, ఆటోలు, బస్సులు, రెండు చక్రాల వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి. ఆకస్మికంగా ఏర్పడిన ఈ పరిస్థితితో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Farmers Protest Over Urea Shortage in Konapur

రైతులు మాట్లాడుతూ—వర్షాకాలంలో పంటల సాగు ఉధృతంగా సాగుతున్న తరుణంలో యూరియా అందకపోవడం వల్ల పంటలు ఎండిపోతున్నాయని, పంటలపై పెట్టిన ఖర్చు వృథా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజులుగా యూరియా కోసం సహకార సంఘం, మార్కెట్ యార్డ్ చుట్టూ తిరుగుతున్నప్పటికీ ఒక్క బస్తా కూడా అందలేదని, ప్రభుత్వం రైతాంగ సమస్యల పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
రైతులు మాట్లాడుతూ, “ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమవుతోంది. రైతులకు ఎరువులు అందించడం లో విఫలమవుతోంది. ఈ పరిస్థితి కొనసాగితే పంటలన్నీ నాశనం అవుతాయి. మా జీవితాలు ప్రమాదంలో పడతాయి” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ధర్నా విషయం తెలిసి పోలీసులు అక్కడకు చేరుకొని రైతులతో మాట్లాడారు. అధికారులు త్వరలోనే యూరియా సరఫరా చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాను విరమించారు. అయితే హామీలు కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని, లేకపోతే మరింత తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.
స్థానికులు కూడా ఈ సందర్భంలో మాట్లాడుతూ—గ్రామంలో యూరియా కొరత కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

చర్లలో యూరియా కొరతపై ధర్నా…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-76.wav?_=1

చర్ల మండల రైతాంగానికి యూరియా అందించండి

బిఆర్ఎస్ చర్ల మండల కన్వీనర్ దొడ్డి తాతారావు డిమాండ్

నేటిదాత్రి చర్ల

బిఆర్ఎస్ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు చర్ల మండల కేంద్రంలోని అగ్రికల్చర్ కార్యాలయం ముందు పార్టీ మండల కన్వీనర్ దొడ్డి తాతారావు ఆధ్వర్యంలో యూరియా కొరతపై ధర్నా నిర్వహించి అనంతరం అగ్రికల్చర్ ఏఓ లావణ్య కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా దొడ్డి తాతారావు మాట్లాడుతూ రైతుల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెసు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని
రైతులకు మోసపూరిత హమీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెసు ప్రభుత్వం నట్టేట ముంచుతుంది ప్రభుత్వ ముందు చూపు లేకపోవడం వలన యూరియా సరఫరా సక్రమంగా జరగక పోవడంతో రైతులు రోడ్డుపైకి రావలసిన పరిస్థితి ఏర్పడింది
పంటలు పండక పండిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు అప్పుల్లో కూరుకుపోయిన రైతులకు కనీసం యూరియా కూడా ఇవ్వలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రైతుల పట్ల కాంగ్రెసు ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది
రైతు రుణ మాఫీ రైతులందకి చేయలేదు
రైతు బంధు పూర్తిగా ఇవ్వలేదు
రైతు బీమా లేదు
నీళ్ళు లేవు కరెంటు లేదు అనేక సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు
కెసిఆర్ 9 సంవత్సరాల పరిపాలనలో ఏనాడు యూరియా ఇబ్బందులు లేవు ఇప్పటికైన ప్రభుత్వం రైతులకు సరిపడే యూరియా అందించాలని లేని ఎడల రేపు రాబోయే ఎన్నికల్లో రైతులు ఓటు ద్వారా బుద్ది చెబుతారని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు సయ్యద్ అజీజ్ పంజా రాజు తడికల బుల్లబ్బాయి డివిజన్ యూత్ నాయకులు కాకి అనిల్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కొంబత్తిని రాము బీసీ సెల్ అధ్యక్షులు గోరింట్ల వెంకటేశ్వరరావు ఎస్టీ సెల్ అధ్యక్షులు యూత్ అధ్యక్షులు అంబోజీ సతీష్ కారం కన్నారావు సాదిక్ కట్టం కన్నారావు రత్నాల శ్రీరామ్మూర్తి బట్ట కొమరయ్య తడికల చంద్రశేఖర్ సంతపూరి సతీష్ ఎడ్ల రామదాస్ గాదం శెట్టి కిషోర్ కుక్క డపు సాయి గుమ్మల నరేంద్ర తదితరులు పాల్గొన్నారు

యూరియా కోసం రైతుల తిప్పలు..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-25T114421.812.wav?_=2

 

— యూరియా కై..
తప్పని తిప్పలు..
* సొసైటీ వద్ద కిక్కిరిసిన రైతులు..

నిజాంపేట: నేటి ధాత్రి

 

గత కొన్ని రోజుల నుండి రైతులకు యూరియా అందక అవస్థలు పడుతున్న విషయం విధితమే.. నిజాంపేట మండలం కల్వకుంట గ్రామంలో సోమవారం సుమారు 300 బస్తాలతో లోడ్ సొసైటీలోకి రావడంతో రైతులు ఉదయం నుండి ఆధార్ కార్డు, పట్ట పాస్బుక్ తో రైతులు క్యూ కట్టారు. రైతులు అధిక సంఖ్యలో మోహరించడంతో ఒక్కో రైతుకు ఒక్కో బస్తా కూడా వస్తుందో రాదోనని విమర్శిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తగినంత యూరియా అందుబాటులోకి తీసుకురావాలని వేడుకుంటున్నారు.

“సింగరేణిలో యూరియా కొరతపై రైతుల ఆందోళన”..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-23T160951.107.wav?_=3

 

సింగరేణి మండల కేంద్రములో యూరియా మందుకట్టల కోరకు రైతుల ఆందోళన.

కారేపల్లి నేటి ధాత్రి

 

ఖమ్మం జిల్లా సింగరేణి మండలం లోని వివిధ గ్రామాల నుండి రైతులు యూరియా మందుకట్టల కోసం తెల్ల వారు జామున 3.గంటల నుండి మండల కేంద్రము లోని సహకార పరపతి సంఘం.సోసైటి వద్దకు రైతులు వచ్చి యూరియా మందుకట్టల కోసం లైన్ లో ఉంటు పడిగాపులు కాస్తున్నారు.శనివారం తెల్లవారుజామున వచ్చిన రైతులు లైన్ లో ఉంటు సింగరేణి మండల అగ్రికల్చర్ అధికారికి రైతులు ఫోన్లో యూరియా మందుకట్టల కోసం అడుగగా మిమ్మల్ని ఎవరు రమ్మన్నారని చెప్పాగా అనేక రోజులుగా మందుకట్టల కోసం పడిగాపులు కాస్తున్నా రైతులు ఆగ్రహించి కారేపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని సెంటర్ లో మండలం లోని వివిధ గ్రామాల నుండి తరలి వచ్చిన రైతులు యూరియా మందుకట్టల కోసం రోడ్లు పైన బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.రైతులు చేస్తున్న ఆందోళన వల్ల ఇల్లందు నుండి ఖమ్మం మాదారం నుండి ఖమ్మం వెళ్ళే ఆర్టిసి బస్సులు కాలేజీ బస్సులతో పాటు వాహనాల్లోవెళ్ళె ప్రయాణికులు వేళ్ళ కుండా రైతులు ఆందోళన చెస్తుండగ కారేపల్లి ఎస్సై బైరు గోపి పోలీసు సిబ్బందితో రైతుల వద్దకు వచ్చి రైతులవద్ద నుండి విషయం అడిగి తేలుసుకోగ రైతులు యూరియా మందుకట్టల కోసం ప్రతిరోజూ పడిగాపులు కాస్తున్నారని రైతులకు యూరియా మందుకట్టలు సకాలంలో అందిచకపోగ మండల రైతులు అడుగగా మందుకట్టలు లేవని అసలు మీమ్ములను ఎవరు రమ్మన్నారని కారేపల్లి ఎస్సై కి రైతులు తెలుపగా ఎస్సై బైరు గోపి వెంటనే స్పందించి ఎఓ బట్టు అశోక్ తో మాట్లాడి రోడ్లు పైన బైఠాయించి రాస్తారోకో నిర్వహించిన రైతులను సముదాయించి ఆందోళనను విరమింపజేశారు.రైతులు సోసైటి కార్యాలయానికి వచ్చిన సింగరేణి మండల అగ్రికల్చర్ అధికారికి బట్టు అశోక్ ని రైతులు యూరియా మందుకట్టల కోసం నిలదియ్యగ ఎఓ మందుకట్టలను రెపుయిస్తామని తెలుపడంతో ఎస్సై బైరు గోపి రైతులకు నచ్చజెప్పి పంపించారు.

రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలి..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-23T153118.778-1.wav?_=4

 

రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలి

యూరియా లేక రైతుల ఇబ్బందులు

బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మోతే కర్ణాకర్ రెడ్డి

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలంలో యూరియా లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం జిల్లా యంత్రాంగం స్పందించి రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలని ఘనపురం మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మోతే కరుణాకర్ రెడ్డి అన్నారు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు సంక్షేమం విషయంలో మాట తప్పిందని కనీసం రైతులకు యూరియా అందించలేని దుస్థితి ఏర్పడిందని ఇప్పటికైనా ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయాలని రైతుల పక్షాన బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందని లేనిపక్షంలో రైతుల కోసం రైతు సంక్షేమం కోసం ధర్నా చేస్తామని అన్నారు
కార్యక్రమంలో వారి వెంట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పోలుసాని లక్ష్మీనరసింహారావు, మాజీ పిఎసిఎస్ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి, మాజీ సర్పంచులు తోట మానస శ్రీనివాస్, పెంచల రవీందర్, నాయకులు బైరగాని కుమారస్వామి, ఉడుత సాంబయ్య, పేరాల దేవేందర్ రావు, మామిండ్ల సాంబయ్య, గాజర్ల చింటూ, వాజిద్, తదితరులు ఉన్నారు

నెక్స్ట్ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-22T131323.179.wav?_=5

 

నెక్స్ట్ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే..

మాజీ జెడ్పిటిసి పోలీస్ ధర్మారావు

వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట, నేటిధాత్రి:

 

ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పథకాల అమలులో వైఫల్యం చెందిందని,నేడు రైతులను అష్ట కష్టాలు పెడుతూ యూరియా అందించలేని పరిస్థితిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెలకొన్నదని గీసుకొండ మండల మాజీ జెడ్పిటిసి పోలీస్ ధర్మారావు ఎద్దేవా చేశారు.
పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆదేశాల మేరకు గీసుగొండ మండల బిఆర్ఎస్ పార్టీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో కోనయమకుల,ఊకల్,మరియపురం మనుగొండ గ్రామలలో పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మారావు మాట్లాడుతూ
420 హామీల అమలు పట్ల ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తున్నారని రాష్ట్రంలో నెక్స్ట్ రాబోయేది బిఆర్ఎస్ ప్రభుత్వమే అని జోష్యం చెప్పారు.
త్వరలో జరగబోయే స్థానికసంస్థల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని కోరారు.కేసీఆర్ ప్రభుత్వంలో ఎప్పుడు యూరియా కొరత అనేది లేదన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నాటినుండి వ్యవసాయ సొసైటీల వద్ద యూరియా కోసం రైతులు లైన్లలో నిలబడలసిన దుస్థితి ఏర్పడిందని అవేదన వ్యక్తం చేశారు.కాళేశ్వరం ప్రాజెక్టు మీద కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దృష్ప్రచారాలను బిఆర్ఎస్ సోషల్ మీడియాలో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.గీసుకొండ మండలంలో ఉన్న కొందరు బిఆర్ఎస్ శ్రేణులు కష్టకాలంలో పార్టీని వదిలిపెట్టి వెళ్లిన వాళ్ళని మరల తిరిగి తీసుకునే ప్రసక్తే లేదని మాజీ జెడ్పీటీసీ పోలీస్ ధర్మారావు తెలిసి చెప్పారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ కార్యదర్శి వేణుగోపాల్,సమన్వయ కమిటీ సభ్యులు బోడకుంట్ల ప్రకాష్,అంకతి నాగేశ్వర్ రావు,పుండ్రు జైపాల్ రెడ్డి , ముంత రాజయ్య యాదవ్ ,కంబల కోటి,గుర్రం రఘు,యూత్ అధ్యక్షుడు శిరిసే శ్రీకాంత్, కోట్రా రఘుపతి రెడ్డి ,జక్కు మురళి,నమిండ్ల రాజు యూత్ నాయకులు కోట ప్రమోద్,చల్లా యూవసేన మండల అధ్యక్షుడు మంద రాజేందర్,దనుంజయ్,గ్రామాల అధ్యక్ష కార్యదర్శిలు,యూత్ నాయకులు, స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎరువుల షాపులపై కలెక్టర్ తనిఖీ..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-51-3.wav?_=6

ఎరువుల షాపులను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

యూరియా వచ్చిన వెంటనే డీలర్లు రైతులకు సరఫరా చేయాలి

అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు

జిల్లా కలెక్టర్” మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్

కేసముద్రం/ నేటి ధాత్రి

కేసముద్రం మండలం కాట్రపల్లి గ్రామంలో గల కావ్య ఏజెన్సీస్ ఎరువుల దుకాణాన్ని ఆకస్మికంగా మహబూబాబాద్ జిల్లా కలెక్టర్” మ్యాజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్ , సహాయ వ్యవసాయ సంచాలకులు మహబూబాబాద్ డివిజన్ అజ్మీరా శ్రీనివాసరావు తో కలిసి ఎరువుల దుకాణాలలో గల యూరియా నిలువలను తనిఖీ చేయడం జరిగింది, వారు స్టాక్ రిజిస్టర్, బ్యాలెన్స్, పి ఓ ఎస్ మిషన్ బాలన్స్, గోడం బ్యాలెన్స్, స్టాక్ బోర్డు వివరాలు ఇన్వైస్లను తనిఖీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎరువుల డీలర్లు తమ షాపులో ఉన్నటువంటి యూరియా నిలువలను ఉంచుకొని ఎవరైనా యూరియా రైతులకు సరఫరా చేయకపోయినా, అధిక ధరలకు విక్రయించిన కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు, రైతులకు పిఓఎస్ మిషను మరియు ఆధార్ కార్డు, పట్టాదారు పాసు బుక్ జీరా క్సు ద్వారా మాత్రమే యూరియాను, ఇతర ఎరువులను సప్లై చేయాలని వారు కోరారు, ప్రతి ఎరువుల డీలర్లు తమకు వచ్చినటువంటి యూరియా నిలువలను ప్రతిరోజు ఎప్పటికప్పుడు మండల వ్యవసాయ అధికారి కి తెలియజేయాలని వారు సూచించారు, యూరియా వచ్చిన వెంటనే ఎరువుల డీలర్లు రైతులకు సరఫరా చేయాలని వారు కోరారు.
ప్రతిరోజు ఎరువుల నిల్వలను స్టాకు రిజిస్టర్ అప్డేట్ చేయాలని, స్టాక్ బోర్డు ద్వారా ప్రతిరోజు నిలువలు రైతులకు కనిపించే విధంగా, బోర్డులు రాయాలని,
ప్రతిరోజు తమకు వచ్చే యూరియా నిల్వలను వెంటనే మండల వ్యవసాయ అధికారి కి తెలియజేసి, వ్యవసాయ శాఖ అధికారుల సమక్షంలో యూరియా పంపిణీ వెంటనే పూర్తి చేయాలని వారు సూచించారు నియమ నిబంధనలు అతిక్రమించిన ఎరువుల డీలర్ల పై నిత్యవసరం వస్తువుల చట్టం 1955 మరియు ఎరువుల నియంత్రణ చట్టం 1985 ప్రకారం చర్యలు తీసుకుంటామని వారు సూచించారు, ప్రతిరోజు స్టాక్ రిజిస్టర్, బిల్ బుక్కులు,ఇన్వైస్లు,స్టాక్ బోర్డులు అప్డేట్ చేయాలని వారు సూచించారు.
దఫా ల వారీగా యూరియా మండలానికి వస్తున్నందున రైతులు ఎవరూ అధైర్య పడొద్దని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో, మండల వ్యవసాయ అధికారి కేసముద్రం బి వెంకన్న, వ్యవసాయ విస్తరణ అధికారి సాయి చరణ్ పాల్గొన్నారు

యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతులు

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-50-4.wav?_=7

యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతులు

* రైతుల గొస పంచుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం.

మరిపెడ నేటిధాత్రి

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో రైతులు యూరియా కొరతతో గురువారం రోజున ఆర్ అండ్ బీ అతిథి గృహం ముందు రైతులు ధర్నా నిర్వహించారు,మరిపెడ మండల నికి 45 నుండి 50 గ్రామపంచాయతీలు అనుసంధానం గా ఉండడంతో ప్రతి గ్రామంలో వ్యవసాయ పనులు ప్రారంభం కావడంతో రైతులకు ఒక్కసారిగా యూరియా అవసరము పడడంతో యూరియా కొరత ఏర్పడింది. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడం, వర్షాకాలం కావడం తో రవాణా సదుపాయం చురుగ్గా లేకపోవడం సమయానికి యూరియా అందుబాటు కాలేకపోవడంతో యూరియా కొరత ఏర్పడింది. దూర ప్రాంతం నుండి వచ్చిన రైతులు ఎండకి ఎండుతూ వర్షానికి తడుస్తూ యూరియా కోసం తిండి తిప్పలు లేకుండా షాపుల ముందు లైన్లో నిలబడుతూ ఇబ్బంది పడుతూ ఉంటే ఒక రైతుకు రెండు బస్తాలనే ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని కొందరు రైతులు వాపోయారు. పైమందులు తీసుకుంటేనే యూరియా బస్తా ఇస్తామని షాపు యజమానులు ఇబ్బందులు పడుతున్నారన్నారు,గత ప్రభుత్వంలో ప్రతి రైతుకు యూరియా సరిపడా బస్తాలు ఇచ్చేవారని ఇప్పుడు ఒక రైతుకు రెండు బస్తాలనే ఇస్తున్నారని ఇచ్చిన యూరియా బస్తాలు వ్యవసాయానికి సరిపోక పోవడంతో ఏం చేయాలో తోచడం లేదని సదరు రైతులు వాపోయారు. ఏది ఏమైనా ఉన్నతాధికారులు చొరవ తీసుకొని యూరియా కొరతను తీర్చి ప్రతి రైతుకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన అధికారులని కోరారు.

రైతులకు తప్పని యూరియా కష్టాలు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-20T154922.742-1.wav?_=8

 

రైతులకు తప్పని యూరియా కష్టాలు

రైతులకు సకాలంలో యూరియా అందించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం

తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మండల అధ్యక్షులు కోమటిరెడ్డి జైపాల్ రెడ్డి ప్రధాన కార్యదర్శి గోలి చంద్రారెడ్డి

కరీంనగర్, నేటిధాత్రి:

 

చిగురుమామిడి మండలంలోని రైతులకు యూరియా బస్తాలు సకాలంలో అందించడంలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని దీనిని నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం చిగురుమామిడి మండల సమితి ఆధ్వర్యంలో ఈరోజు ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం ముందు నిరసన ధర్నా చేయడం జరిగింది. ఈసందర్భంగా కోమటిరెడ్డి జైపాల్ రెడ్డి, గోలి చంద్రారెడ్డిలు మాట్లాడుతూ ఎన్నడు లేని విధంగా మండలంలో యూరియా బస్తాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ నియోజకవర్గంలో యూరియా కష్టాలు ఉండడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సరైన సమన్వయం లేకపోవడంతో యూరియా కష్టాలు తీవ్రం అయ్యాయని దీనిని పరిష్కరించడంలో స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ ఘెరంగా విఫలమయ్యారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు యూరియా కోసం ప్రతిరోజు ప్రాథమిక సహకార కేంద్రం వద్ద బారులు తీరుతూ చెప్పులు పెట్టి గంటల తరబడి లైన్లో నిల్చున్న పొన్నం ప్రభాకర్ కు కనీస కనికరం లేకుండా పోయిందని రైతులను గోస పెట్టిన ఏప్రభుత్వం కూడా నిలవదని ఆయన అన్నారు. పట్టాదారు పాసు బుక్కు ఆధార్ కార్డు ఉంటేనే యూరియా ఇస్తున్నారని ఇది చాలా దుర్మార్గమైన చర్యని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియాతోపాటు నాన్ లిక్విడ్ కొంటేనే యూరియా బస్తా ఇస్తున్నారని రైతుకు ఇష్టం లేకున్నా అంటగడుతున్నారని ఆరోపించారు. కృత్రిమ కొరత సృష్టించి బయట విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని దీనికి అడ్డుకట్ట వేయాలన్నారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ తీసుకొని వెంటనే రైతులకు చిగురుమామిడి మండలంలో సరిపడ యూరియాని తెప్పించాలని లేనిపక్షంలో రైతులతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని కోమటిరెడ్డి జైపాల్ రెడ్డి, గోలి చంద్రారెడ్డిలు హెచ్చరించారు. ఈకార్యక్రమంలో ముద్రకోల రాజయ్య, మనోజ్, మహేందర్, రెడ్డి, ఐలయ్య, గంగారెడ్డి, మల్లారెడ్డి, రామస్వామి, పోచయ్య, స్వామి, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

22వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్..

22వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణంలో మంగళవారం కేఫ్ ఎతనిక్ లో వివిధ కుల సంఘల నాయకులందరూ ఈ నెల 22వ తేదీన జేఏసీ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు పిలుపునివ్వడం జరిగింది. జహీరాబాద్ పట్టణంలో బాహర్ వాలే హటావ్ తెలంగాణ బచావ్ అనే నినాదాలతో బంద్ కి పిలుపు ని ఇవ్వడం జరిగింది.తెలంగాణ తెచ్చుకుంది ఎవరి కోసం అని తెలంగాణ రాష్ట్ర ఉద్యమా కాలంలో ఎంతో మంది బలిదానాలు చేస్తే తెలంగాణ వచ్చింది అని జహీరాబాద్ పట్టణంలో వివిధ కుల సంఘాల నాయకులు అన్నారు.ఈ కారిక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు రాములునేత,పెద్ద గోల్ల నారాయణ, తిన్మార్ నర్సిములు,మహమ్మద్ ఇమ్రాన్, మాదినం శివప్రసాద్, దిగ్వాల్ రామేష్,మంగాలి ప్రభు,దత్తు,ఉమేష్,సి.హేచ్ శ్రీనివాస్, ప్యార్ల దశరథ్, తదితరులు పాల్గొన్నాడం జరిగింది.

యూరియా బ్లాక్‌పై రైతుల ఆందోళన హెచ్చరిక…

యూరియా ను రైతులకు పూర్తిస్థాయిలో అందించాలి

కొండు బానేష్ జిల్లా కార్యదర్శి రైతుసంఘం

మంచిర్యాల19ఆగస్టు నేటి దాత్రి

మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా వివిధ గ్రామాలలో ఫర్టిలైజర్. డీ. సీ. ఎం. ఎస్. హాక. పి ఎ సి ఎస్. సెంటర్ల ద్వారా రైతులకు ఎరువులను అధిక ధరలకు అమ్ముతున్న డీలర్లపై తనిఖీలు చేపట్టాలి.
యూరియా కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు అమ్ముతున్న ఎరువుల షాపులను రద్దు చేయాలి.
రైతులకు ఎరువులను సబ్సిడీ ద్వారా ఇవ్వకుండా అధికంగా వసూలు చేస్తున్న డీలర్ల లైసెన్స్ రద్దు చేసి కేసులు నమోదు చేయాలి.
యూరియా ఎంఆర్ పి 266.5 రూపాయలు ప్రభుత్వం నిర్ణీత రేటు కంటే ఎక్కువ నమ్ముతున్న డీలర్లపై కేసులు నమోదు చేయాలి.
యూరియా కొరతను ఆసరాగా చేసుకుని రైతులను నిలువునా దోచుకుంటున్న వ్యవహారంపై వ్యవసాయ అధికారులు దృష్టి పెట్టడం లేదు ప్రభుత్వ నిర్ణీత ధరలకే డీలర్లు అమ్మకాలు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలి.
సబ్సిడీ ద్వారా రైతులకు అందాల్సిన ఎరువులు పక్కదారి పట్టకుండ దళారుల చేతులలోకి పోకుండ చూడాలి.
ఎరువుల దుకాణాలపై వ్యవసాయ అధికారులు దృష్టి పెట్టకపోవడం వల్ల దళారులు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి రైతులని నిలువునా దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి గ్రామ. మండల కేంద్రాలలో కొనసాగుతుంది.
ఒక్కో యూరియా బస్తా మీద 80 నుండి 100 రూపాయలు వరకు వసూలు చేస్తున్నారు.
కానీ రైతులకు బిల్లులు ఇవ్వడం లేదు ఫర్టిలైజర్ షాపులపై అధికారులు నిరంతరం తనిఖీ చేస్తూ ఉండాలని ఫర్టిలైజర్ షాపుల నిర్వాహకులు యూరియా తదితర ఎరువుల కొరత సృష్టించి పేద మధ్య తరగతి రైతులకు అధిక ధరలకు ఎరువులను అమ్ముతున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి.
మారుమూల ప్రాంతాల్లో ఊరుకోక ఎరువుల దుకాణాలు ఏర్పాటు చేసుకొని పేద మధ్య తరగతి రైతుల నడ్డి విరుస్తున్నారు.
ఫర్టిలైజర్ దుకాణాలపై అధికారులు తనిఖీ చేస్తూ వారి పైన చర్యలు తీసుకోవాలి.
లేని యెడల తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం (ఏఐకేఎస్) మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రైతులను ఐక్యం చేసి ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని ఆయన హెచ్చరించడం జరిగింది.

యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతులు

యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతులు
* ఒక రైతుకు రెండు బస్తాలేనా…!

మహాదేవపూర్ ఆగస్టు 19 (నేటి ధాత్రి)

జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉమ్మడి మహాదేవపూర్ మండల కేంద్రంలో రైతులు యూరియా కొరతతో మంగళవారం రోజున పి.ఎ.సి.ఎస్ కార్యాలయం ముందు బారు తీరారు. ఉమ్మడి మండలమైన మహాదేవపూర్ కి 27 గ్రామపంచాయతీలు అనుసంధానం గా ఉండడంతో ప్రతి గ్రామంలో వ్యవసాయ పనులు ప్రారంభం కావడంతో రైతులకు ఒక్కసారిగా యూరియా అవసరము పడడంతో యూరియా కొరత ఏర్పడింది. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడం, వర్షాకాలం కావడం తో రవాణా సదుపాయం చురుగ్గా లేకపోవడం సమయానికి యూరియా అందుబాటు కాలేకపోవడంతో యూరియా కొరత ఏర్పడింది. దూర ప్రాంతం నుండి వచ్చిన రైతులు ఎండకి ఎండుతూ వర్షానికి తడుస్తూ యూరియా కోసం తిండి తిప్పలు లేకుండా పి.ఎ.సి.ఎస్ కార్యాలయం ముందు లైన్లో నిలబడుతూ ఇబ్బంది పడుతూ ఉంటే ఒక రైతుకు రెండు బస్తాలనే ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని కొందరు రైతులు వాపోయారు. గత ప్రభుత్వంలో ప్రతి రైతుకు యూరియా సరిపడా బస్తాలు ఇచ్చేవారని ఇప్పుడు ఒక రైతుకు రెండు బస్తాలనే ఇస్తున్నారని ఇచ్చిన యూరియా బస్తాలు వ్యవసాయానికి సరిపోక పోవడంతో ఏం చేయాలో తోచడం లేదని సదరు రైతులు వాపోయారు. ఏది ఏమైనా ఉన్నతాధికారులు చొరవ తీసుకొని యూరియా కొరతను తీర్చి ప్రతి రైతుకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన అధికారులని కోరారు.

యూరియా వివక్షపై తెలంగాణ ఎంపీల ఆందోళన..

తెలంగాణపై వివక్ష
`యూరియా రాజకీయంపై తెలంగాణ ఎంపీల ఆందోళన
`పార్లమెంట్‌ ముందు నిరసన ప్రదర్శన
న్యూఢల్లీ,నేటిధాత్రి:

తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న యూరియా సమస్యను పరిష్కరించాలంటూ పార్లమెంట్‌ ఆవరణలో రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు ఆందోళనకు దిగారు. వారితోపాటు కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు ప్రియాంకగాంధీ నిరసనలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులపై వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన యూరియాను సరఫరా చేయకుండా తెలంగాణ రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్నారని ఎంపీలు మండిపడ్డారు. యూరియాను భాజపా పాలిత రాష్ట్రాలకు దారి మళ్లిస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది.
యూరియా పంపిణీ విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతోందని విమర్శించారు కాంగ్రెస్‌ ఎంపీలు. మంగళవారం పార్లమెంటు ఆవరణలో యూరియా కొరతపై మాట్లాడారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు యూరియా పంపుతూ.. తెలంగాణపై వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు ఎంపీలు మల్లురవి, గడ్డం వంశీకృష్ణ. తెలంగాణపై కేంద్ర వైఖరికి నిరసనగా పార్లమెంటు ఆవరణలో ఆందోళనకు దిగారు
తెలంగాణకు మొత్తం 9 లక్షల టన్నుల యూరియా రావాల్సి ఉండగా 3 నుంచి 4 లక్షల టన్నుల యూరియా మాత్రమే ఇచ్చినట్లు ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఫెర్టిలైజర్స్‌ పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్‌ క్రితీ ఆజాద్‌ ను సోమవారం ఎంపీలు అంతా కలిసి ఈ అంశంపై వివరించినట్లు- చెప్పారు. మంగళవారం జీరో అవర్‌ లో దీనిపై ప్రశ్నించనున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వాలున్న రాష్ట్రాలకు యూరియా పంపుతూ.. విపక్ష పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాలపై వివక్ష చూపిస్తున్నట్లు ఆరోపించారు.

రైతులకు సరిపడాయూరియా పంపిణీ చేయాలి..

రైతులకు సరిపడాయూరియా పంపిణీ చేయాలి

కేంద్ర ప్రభుత్వం రైతులకు,యూరియా పంపిణీ తగ్గించడం దుర్మార్గమైన చర్య

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు మానుకొని రైతులకు న్యాయం చేయాలి
ప్రైవేట్ ఫెర్టిలైజర్ షాపుల దోపిడి అరికట్టాలి

సిపిఎం జిల్లా కార్యదర్శి ముషo రమేష్

సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి)

ఈరోజు జిల్లా కేంద్రంలోని అమృత లాల్ శుక్ల కార్మిక భవన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని రైతులకు వానకాలానికి సరిపోవు యూరియా అందించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు అలాగే జిల్లాలోని సహకార సంఘ గోదాముల వద్ద తెల్లవారుజాము నుండే బార్లు తీరుతున్న రైతుల బాధలు పట్టించుకునే నాధుడే లేడని అన్నారు ఇంత జరుగుతున్నా జిల్లా వ్యవసాయ అధికారులు మాత్రం జిల్లాలో యూరియా కొరతలేదని రైతులు ఆందోళన చెందవద్దని ప్రకటనలు చేస్తున్నారని అన్నారు అలాగే ప్రైవేటు వ్యాపారులు కూడా ఇదే అదునుగా భావించి ఒక యూరియా బస్తా 310 రూపాయల నుండి 350 వరకు అమ్ముతూ యూరియాతోపాటు మిగతా పెటిలైజర్ కొంటేనే యూరియా ఇస్తామని అవసరం లేకున్నా దంటు గోళీలు గడ్డి మందు తదితర ఫెర్టిలైజర్ అంట కడుతున్నారని వారిపై వ్యవసాయ శాఖ ఎందుకు చర్య తీసుకోవడం లేదని ఆయన అన్నారు గతంలో ప్రతి సహకార సంఘ గోదాముల్లో నిల్వ ఉండే యూరియా బస్తాలు నేడు కనిపించడం లేదని యూరియా బస్తాలు కేటాయింపుల్లో కూడా పెద్ద రైతులు భూస్వాములు లైన్లో ఎక్కడ కనిపించడం లేదని ఎక్కడ చూసినా సన్నకారు చిన్న కారు రైతులే ఇబ్బందులు పడుతున్నారని మరి వారికి యూరియా ఎలా అందుతుందో అర్థం కావడం లేదని అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి సీజనకు సరిపడా యూరియా సప్లై చేయాలని లేని పక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున రైతులతో ధర్నా చేస్తామని ఆయన హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోడం రమణ,జవ్వాజి విమల పాల్గొన్నారు

రైతులకు యూరియా కొరతను తీర్చాలి..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-14-1.wav?_=9

రైతులకు యూరియా కొరతను తీర్చాలి

బిజెపి కిషన్ మోర్చా మండల అధ్యక్షుడు చింతకుంట సాగర్

చందుర్తి, నేటిధాత్రి:

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సకాలంలో యూరియా సరఫరా చేయాలని కిసాన్ మోర్చా చందుర్తి మండల అధ్యక్షులు చింతకుంట సాగర్ డిమాండ్ చేశారు.
మండల కేంద్రంలో వారు మాట్లాడుతూ రైతుల పక్షపాతి అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు యూరియా సరఫరా చేయడంలో విఫలమైందని వారు అన్నారు
ఎకరానికి ఒక బస్తా అని చెబుతున్న ప్రభుత్వం దానికి సరిపడా కూడా చేయడం లేదు పైగా కేంద్ర ప్రభుత్వంపై నిందలు వేయడం సరికాదన్నారు కేంద్ర ప్రభుత్వం ఒక యూరియా బస్తా పై 2100 సబ్సిడీ రైతుల గురించి ఇస్తుందని వారు పేర్కొన్నారు ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం యూరియా ను తక్షణమే సరఫరా చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చేయాలనీ కోరారు.

యూరియా కోసం బారులు తీరిన రైతులు.

యూరియా కోసం బారులు తీరిన రైతులు.

#పూర్తిగా కాలం కాకముందే కరువైన యూరియా.

#కృత్రిమ కొరతను సృష్టిస్తున్న డీలర్లు.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

పూర్తిగా కాలం కాకముందే యూరియా బస్తాలు కరువైనాయని మండల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ఎదుట యూరియా బస్తాల కోసం రైతులు భారీ ఎత్తున బారులు తీరారు. ఆదివారం రోజున సహకార సంఘానికి 850 బస్తాల యూరియా దిగుమతి కాగా విషయము తెలుసుకున్న మండల రైతులు సోమవారం ఉదయాన్నే కార్యాలయం వద్దకు చేరుకొని యూరియా బస్తాల కోసం క్యూ లైన్ లో నిలబడ్డారు. బస్తాలు పంపిణీ చేసే సందర్భంగా ఒక్కసారిగా రైతులందరూ తోచుకుంటూ రావడంతో తొక్కిసలాట జరగగా దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొనగా కార్యాలయ సిబ్బంది పంపిణీ కార్యక్రమం నిలిపివేశారు దీంతో రైతులు ఆగ్రహంతో సిబ్బందితో వాగ్వాదానికి దిగగా.

 

సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తక్షణమే పోలీస్ సిబ్బంది సెంటర్ వద్దకు చేరుకొని రైతులను సముదాయించి యూరియా బస్తాల పంపిణీ సక్రమంగా జరిగే విధంగా చూశారు. ఇదిలా ఉంటే ఒకపక్క వ్యవసాయ అధికారులు మండల రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని చెబుతున్న కూడా అది ఆచరణలో ఎక్కడ లేకుండా పోయిందని పలువురు రైతులు బాహాటంగానే అంటున్నారు. గత ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతులకు సరిపడా యూరియా బస్తాలు ఉండేవని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత యూరియా బస్తాల కరువు మొదలైందని చిన్న తండకు చెందిన మహిళ రైతు అజ్మీర విజయ ఆవేదన వ్యక్తం చేశారు.

 

 

 

అలాగే ప్రైవేటు డీలర్లు సైతం యూరియా బస్తాలు నిలువ ఉంచుకొని లింకుల పేరుతో రైతుకు అవసరం లేని మందులను కొంటేనే యూరియా బస్తా ఇవ్వడం జరుగుతుందని కరాకండిగా డీలర్లు చెబుతున్నారని మండల రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత జిల్లా వ్యవసాయ అధికారులు తక్షణమే స్పందించి మండల రైతులకు ఖరీఫ్ సీజన్ కు సరిపడా యూరియా బస్తాలను సహకార సంఘాల , రైతు ఆగ్రోస్ ల ద్వారా పంపిణీ చేస్తేనే రైతుకు మేలు జరుగుతుందని రైతులు అన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version