ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించిన ఏడిఏ.

ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించిన ఏడిఏ

నర్సంపేట నేటిధాత్రి:

 

దుగ్గొండి మండలం వెంకటాపూర్, మల్లంపల్లి గ్రామాలలో జరుగుతున్న ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ, రైతు భరోసా కొత్త దరఖాస్తులను నర్సంపేట ఏడిఏ దామోదర్ రెడ్డి పర్యవేక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది కేంద్ర ప్రభుత్వం ప్రతీ రైతుకు ఒక యూనిక్ ఐడిని ఇస్తుంది.అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు దీనిని అనుసంధానం చేయడం జరుగుతుందన్నారు.పీఎం కిసాన్ లబ్ధిదారాలకు తదుపరి విడత లబ్ది పొందుటకు ప్రామాణికoగా ఫార్మర్ రిజిస్ట్రీలొ నమోదు తప్పనిసరి చేస్తూ కేంద్రప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందని పేర్కొన్నారు.రైతులందరు ఫార్మర్ రిజిస్ట్రీలో త్వరితగతిన నమోదు చేసుకోవాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఏఓ
మాధవి, ఏఈఓ వైజయంతి,రాజేష్ లు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version