రైతులకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ అవసరం

*రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి*
వ్యవసాయ అధికారి సురేందర్ రెడ్డి
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

మొగుళ్ళపల్లి మండలంలోని పట్టధార్ పాస్ బుక్ కల్గిన రైతులు తప్పకుండా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వ్యవసాయశాఖ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. మొగుళ్ళపల్లి మండలంలోని అన్ని రెవెన్యూ గ్రామాలలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుంది కావున ఇది చేసుకోవడం వల్ల రైతు గుర్తింపు కార్డు అందిస్తారని తెలిపారు. వ్యవసాయ రంగాన్ని డిజిటలైజేషన్ చేయాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ చేపట్టింది. దీంతో రైతుల యొక్క డిజిటల్ డేటా బేస్, ఫార్మర్ రిజిస్ట్రేషన్ ద్వారా రైతుల ఆధార్ నెంబర్, పట్టాదారు పాస్ బుక్ నంబర్ ఇతర పూర్తి వివరాలు పొందుపరిచి రైతులకు కేంద్రం ద్వారా వచ్చే పథకాలను అందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ నమోదు లేనివారికి కేంద్ర ప్రభుత్వ పథకాలు వర్తించవని కేంద్ర ప్రభుత్వం వారు తెలిపారు. కావున ఇప్పటివరకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకొని రైతులు మీ సమీప మీసేవ కేంద్రాల్లో లేదా మీ యొక్క క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారిని (AEO) సంప్రదించి వెంటనే ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వ్యవసాయశాఖ ద్వారా కోరుతున్నాం.

రువుల కోసం పట్టా పాస్ బుక్కు ఆధార్ జిరాక్స్ లు తీసుకురావాలి…

రువుల కోసం పట్టా పాస్ బుక్కు ఆధార్ జిరాక్స్ లు తీసుకురావాలి

గణపురం సొసైటీ చైర్మన్ కన్నె బోయిన కుమార్ యాదవ్

గణపురం నేటి ధాత్రి

 

 

 

 

 

గణపురం మండల కేంద్రంలో గణపురం సొసైటీ చైర్మన్ కన్నెబోయిన కుమార్ యాదవ్ ప్రెస్ మీట్ తో మాట్లాడుతూ వ్యవసాయ సహకార సంఘం ఖరీఫ్ సీజన్ గాను ఎరువులు తీసుకునే రైతులు దయచేసి వారి ఆధార్ కార్డు పట్టా పాస్ బుక్ జిరాక్స్ తీసుకొని సొసైటీ ద్వారాఎరువులు తీసుకోవాల్సిందిగా రైతులను వేడుకుంటున్నాము పట్టా పాస్ బుక్ లేని రైతులు మండల వ్యవసాయ అధికారి లేదా గ్రామ వ్యవసాయ అధికారి ద్వారా సంతకం పెట్టించుకుని అట్టిపత్రాలను సొసైటీకి తీసుకొని వచ్చి ఎరువులు తీసుకోవాల్సిందిగా రైతులను వేడుకుంటున్నాను 15 రోజుల క్రితం వివిధ రాష్ట్రాలలో భారీ వర్షాలు కురవడం వల్ల రైలు పట్టాలు కొట్టుకపోవడం రహదారులు తెగిపోవడం వల్ల యూరియాకు కొన్ని రోజులు అంతరాయం ఏర్పడ్డాది పది రోజుల నుండి ప్రతిరోజు ఒక లారీ చొప్పున యూరియాను దిగుమతి చేసుకుంటున్నాము రైతు మహాశయులారా యూరియా కొరత ఉన్నదని కొంతమంది వ్యక్తులు ప్రభుత్వంపై వ్యతిరేకత భావం ఏర్పడే విధంగా పనిగట్టుకుని లేని యూరియా కొరతను సృష్టిస్తున్నారు రైతులు వారి మాయ మాటలు నమ్మవద్దని రైతులను చైర్మన్ గా వేడుకుంటున్నాను మనకు యూరియా సరిపడే విధంగా అందించడానికి భూపాలపల్లి శాసనసభ్యులు
గండ్ర సత్యనారాయణ రావు సహకారంతో ప్రతిరోజు యూరియా రావడం జరుగుతుంది రైతులు ఎటువంటి అపోలో నమ్మకుండా ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version