ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతు ఎవరికి…

 ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతు ఎవరికి ?

 

 

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఇప్పటికే దేశంలోని దాదాపు అన్ని పార్టీలు ఈ అంశం మీద ఒక నిర్ణయానికి రావడం, తమ మద్దతు ప్రకటించడం జరిగాయి. అయితే,

 ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఇప్పటికే దేశంలోని దాదాపు అన్ని పార్టీలు ఈ అంశం మీద ఒక నిర్ణయానికి రావడం, తమ మద్దతు ప్రకటించడం జరిగాయి. అయితే, బీఆర్ఎస్ పార్టీ మాత్రం తన స్టాండ్ ఏంటన్నది చెప్పడంలేదు. ఇప్పుడిది తెలంగాణలో చర్చనీయాంశమైంది. ఉప రాష్ట్రపతి అభ్యర్థుల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే దానిపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల కొన్ని షరతులు పెట్టారు. ఇది రాష్ట్ర రైతుల సమస్యలతో ముడిపడి ఉందన్న కేటీఆర్.. బీఆర్ఎస్ తెలంగాణలో ప్రధాన విపక్ష పార్టీగా ఉన్నప్పటికీ, ఎన్‌డీఏ, ఇండియా కూటమి రెండింటికీ అదే దూరం పాటిస్తోందని చెప్పుకొచ్చారు. ఆగస్టు 20న కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ రైతులకు 2 లక్ష టన్నుల యూరియా సరఫరా చేస్తామని హామీ ఇచ్చే కూటమికి మాత్రమే తమ మద్దతు ఉంటుందని ప్రకటించిన సంగతి తెలిసిందే.

తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉందని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ‘కృత్రిమంగా’ సృష్టించిన సమస్య అని కేటీఆర్ ఆరోపించారు. సెప్టెంబర్ 9కు ముందు యూరియా రాష్ట్రానికి రావాలి.. మోదీ ప్రభుత్వం ఇస్తే ఎన్‌డీఏ అభ్యర్థికి, రాహుల్ గాంధీ ఇస్తే ఇండియా అభ్యర్థికి తాము మద్దతిస్తామని కూడా కేటీఆర్ చెప్పారు. దీనిపై బీఆర్ఎస్ పార్టీలో చర్చలు జరుగుతున్నాయని, ఈ విషయమై ఇంకా ఎవరూ మాతో సంప్రదించలేదని కేటీఆర్ అన్నారు. తెలంగాణ రైతుల హితమే మాకు ప్రధానమని అదే సమయంలో కేటీఆర్ అంటున్నారు. కాగా, ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి తెలుగు వాసి, మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి కావడంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘తెలుగు గౌరవం’ పేరుతో బీఆర్ఎస్‌ మద్దతివ్వాలని కోరారు. కానీ, కేటీఆర్ దీన్ని తిరస్కరించి, ‘రేవంత్ రెడ్డి మూడో తరగతి సీఎం. కాంగ్రెస్ మూడో తరగతి పార్టీ అని విమర్శించారు. బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీది కపట ప్రేమ అని.. అసలు కాంగ్రెస్ బీసీ అభ్యర్థిని ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్నించారు.

ఇక, బీఆర్ఎస్ ను ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో మద్దతు కోరుతారా అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు సీఎం రేవంత్ సూటిగా సమాధానమిచ్చారు. తనను అధిష్టానం ఆదేశిస్తే, తప్పక బీఆర్ఎస్ పార్టీని కోరతానని తేల్చి చెప్పారు. కాగా, బీఆర్ఎస్ పార్టీకి రాజ్యసభలో నలుగురు సభ్యులు ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు బీఆర్ఎస్ పార్టీ ఎవరికైనా మద్దతు ఇస్తుందా.. లేక ఎవరికీ ఇవ్వకుండా మిన్నకుంటుందా అనేది తేలాలి. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగనున్నాయి.

ఈనాటి ఈ బంధమేనాటిదో…

 

ఈనాటి ఈ బంధమేనాటిదో…

 

రాజ్యసభ సభ్యునిగా ఎంపిక అయిన సందర్భంగా తన చిరకాల, ప్రాణ మిత్రుడు రజనీకాంత్ ను కమల్ హాసన్ కలిశారు. ఈ సందర్భంగా రజనీ… కమల్ ను అభినందించారు.

 

సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) అంటే అందరికీ అభిమానమే. పార్టీలకు అతీతంగా ఆయన్ని ప్రేమించే వారు, అభిమానించేవారు, ఆరాధించేవారు, అనుసరించేవారు ఉంటారు. తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ (Kamal Haasan) కూడా అందుకు అతీతమేమీ కాదు. వీరిద్దరి మధ్య ఉన్న బంధం ఈనాటిది కాదు. ఆ అనుబంధంతోనే రాజ్యసభ సభ్యునిగా ఎంపిక అయిన సందర్భంగా తన చిరకాల, ప్రాణ మిత్రుడు రజనీకాంత్ ను కమల్ హాసన్ కలిశారు. ఈ సందర్భంగా రజనీ… కమల్ ను అభినందించారు. దీనికి సంబంధించిన ఫోటోలను కమల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

 

రజనీకాంత్, కమల్ హాసన్ అనుబంధానికి ప్రధాన కారణం వీరిద్దరి గురువు కె. బాలచందర్ (K. Bala Chander). ఆయన తెరకెక్కించిన ‘అపూర్వ రాగంగళ్’తో రజనీకాంత్ నటుడిగా వెండితెరకు పరిచయం అయ్యారు. ఇదే సినిమా తెలుగులో ‘తూర్పు-పడమర’గా రీమేక్ అయ్యింది. అలా ఆ సినిమాతో మొదలైన బంధం 1985లో ‘గిరఫ్తార్’ వరకూ సాగింది. ఈ మధ్య కాలంలో వీరిద్దరూ కలిసి దాదాపు ఇరవై సినిమాల్లో నటిచారు. అందులో ప్రధానంగా చెప్పుకోదగ్గవి ‘అంతులేని కథ, ఎత్తుకు పై ఎత్తు, వయసు పిలిచింది, అందమైన అనుభవం, మూండ్రు ముడిచ్, అల్లావుద్దీన్ అద్భుతద్వీపం, పదనారు వయదినిలె, అవర్ గళ్’ వంటివి. అయితే తమిళనాడులోని ఓ థియేటర్ లో ఇద్దరు కలిసి నటించిన సినిమా విడుదలైన సందర్భంలో ఫ్యాన్స్ మధ్య ఏర్పడిన గొడవ చినికి చినికి గాలివానగా మారి, ఆ థియేటర్ కు నష్టం వాటిల్లింది. అభిమానులకు సర్ది చెప్పేకంటే… ఇద్దరూ కలిసి ఇకపై కలిసి నటించడం మానుకంటే మంచిదనే నిర్ణయానికి రజనీ, కమల్ వచ్చారు. అప్పటి నుండి కలిసి సినిమాలు చేయకపోయినా… ఒక సినిమాను మరొకరు ప్రశంసించడం, ఒకరి చర్యలను మరొకరు సమర్థించడం వస్తూ ఉంది.

 

కమల్ హాసన్ కంటే ముందే రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని అందరూ అనుకున్నారు. రజనీకాంత్ సైతం ఒకటి రెండు సార్లు అలాంటి ప్రయత్నాలకు శ్రీకారం చుట్టి… ఆ తర్వాత మనసు మార్చుకున్నారు. కానీ మడపతిప్పే అలవాటు లేని కమల్ హాసన్ తమిళ ప్రజలకు, తన అభిమానులకు మాట ఇచ్చినట్టుగానే ‘మక్కల్ నీది మయ్యం’ అనే పార్టీ పెట్టేశారు. ప్రజల నుండి కమల్ హాసన్ పార్టీకి సానుకూల స్పందన రాకపోవడంతో ఆయన గత ఎన్నికల్లో డీఎంకేకు మద్దత్తు పలికారు. దానికి ప్రతిగా ఆ పార్టీ కమల్ హాసన్ ను రాజ్యసభకు నామినేట్ చేసింది. దీంతో తొలిసారి చట్టసభల్లోకి వెళ్ళబోతున్న కమల్ హాసన్… దానికంటే ముందు రజనీకాంత్ ను కలిసి, ఆయన శుభాశీస్సులను స్వీకరించారు. ఇద్దరు తమిళ సీనియర్ ఆర్టిస్టులు ఇలా కలుసుకోవడం ఇద్దరి అభిమానుల్లో ఆనందాన్ని నింపింది.

అంబేద్కర్ రాసిన రాజ్యాం గమే ఆదర్శం. 

అంబేద్కర్ రాసిన రాజ్యాం గమే ఆదర్శం. 

అంబేద్కర్ భవనం రావడం అన్ని కులాల పేదప్రజల అదృష్టం

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండలంలో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు అంబేద్కర్ భవనం రావడం అన్ని కులాల పేదల ప్రజల అదృష్టం. అంబేద్కర్ ఆశయ కొనసాగిస్తాం. ఎమ్మా ర్పీఎస్ మండల అధ్యక్షుడు తుడుం వెంకటేష్ పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మారపేల్లి రవీంద ర్ (బుజ్జన్న) మర్యాద పూర్వ కంగా కలిసి శాలువాతో సన్మానించారు. మండలకేంద్రం ఒకప్పుడు నియోజకవర్గ కేంద్రమైన అంబేద్కర్ భవనం లేకపోవడం చాలా దురదృష్ట కరం. అంబేద్కర్ భవనం రావడం సంతోషం. అంబేద్కర్ భవనం నిర్మాణ చేస్తానని కాంగ్రెస్ భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారా యణరావు హామీ ఇవ్వడం జరిగింది.. ఈ ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని ప్రజలు కోరారు. ఈ కార్యక్రమంలో ముక్కెర ముఖేష్ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి తుడుం వెంకటేష్ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మామిడి భాస్కర్ మాదిగ, ఎంఎస్ పి మండల అధ్యక్షులు మారపేల్లి చిరంజీవి మాదిగ ఎమ్మార్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి పోతుగంటి రజినికర్ మాదిగ ,మాజీ మండల అధ్యక్షులు కొమ్ముల పరమేష్, ఎమ్మార్పీ ఎస్ మండల సీనియర్ నాయకు లు.రంగు బాబు మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల సీనియర్ నాయకులు రమేష్ మాదిగ ఎమ్మార్పీఎస్ నాయకు లు,పోతుగంటి సాంబరాజ్, ఎమ్మార్పీఎస్ పత్తిపాక గ్రామ శాఖ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version