తెలంగాణ స్వాతంత్ర సైనానిగా బద్దం ఎల్లారెడ్డికి నివాళి..

సంకెళ్ళతో ఊరేగించినా,జైల్లో నిర్భందించినా వెనకడు వేయని ధీరుడు,తెలంగాణ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన సేనాని, ఎంపిగా, ఎమ్మెల్యేగా,రాజ్యసభ సభ్యుడిగా పేదలకు విశిష్ట సేవలు అందించిన గొప్ప నేత బద్దం ఎల్లారెడ్డి-సిపిఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి

కరీంనగర్, నేటిధాత్రి:

 

భారత దేశానికి స్వాతంత్ర్యం కావాలని స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొనడమే కాకుండా హైదరాబాద్ సంస్థానంలో నిజాం నవాబుల పరిపాలనను వ్యతిరేకిస్తూ ఉద్యమాలు నిర్వహిస్తున్న బద్దం ఎల్లారెడ్డిని సంకెళ్లతో ఊరేగించినా, జైల్లో నిర్బంధించిన మొక్కవోని ధైర్యంతో అనేక పోరాటాలకు నాయకత్వం వహించిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట సేనాని, కరీంనగర్ మొట్టమొదటి పార్లమెంటు సభ్యులుగా, బుగ్గారం ఇందుర్తి శాసనసభ్యులుగా, రాజ్యసభ సభ్యులుగా పేద బడుగు బలహీన వర్గాలకు విశిష్ట సేవలు అందించిన గొప్ప నాయకుడు బద్దం ఎల్లారెడ్డి అని సిపిఐ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి కొనియాడారు. బద్దం ఎల్లారెడ్డి నలభై ఆరవ వర్ధంతిని పురస్కరించుకొని సిపిఐ కరీంనగర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో శనివారం నగరంలోని కోతి రాంపూర్ బైపాస్ రోడ్డులో గల బద్దం ఎల్లారెడ్డి విగ్రహానికి రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్,జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ లతో కలిసి చాడ వెంకటరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వెంకటరెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలిస్తున్న నిజాం నవాబు ను, రజాకార్లను,దేశ్ ముఖ్ లను ఎదిరించడానికి, వెట్టి చాకిరి,బానిసత్వం,దోపిడీకి వ్యతిరేకంగా దున్నే వానికి భూమి కావాలని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన గొప్ప యోధుడు పోరాట సేనాని బద్దం ఎల్లారెడ్డి అని, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపెల్లి గ్రామంలో జన్మించిన బద్దం ఎల్లారెడ్డి దేశ స్వాతంత్ర్యం కోసం మహాత్మా గాంధీ చేస్తున్న సత్యాగ్రహానికి ఆకర్షితుడై స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని జైలుకెళ్లాడని, నిజాం నవాబుకు వ్యతిరేకంగా ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్నాడని, సంకెళ్ళతో బంధించి ఊరేగించారని ఆనాటి కమ్యూనిస్టు పార్టీ అగ్ర నాయకులు రావి నారాయణరెడ్డి, మగ్ధుo మోహియుద్దిన్ లాంటి వారితో కలిసి ఆంధ్ర మహాసభ,కమ్యూనిస్టు పార్టీ లో కీలకం నేతగా పనిచేశారని, నిజాం నవాబుల అరాచకాలను ఎదిరించడానికి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చారని, అనాటి పరిస్థితుల్లో కమ్యూనిస్టు పార్టీకి ఆకర్షితులై వేలాదిమంది రజాకారులకు,దేశముఖ్ లకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించాలంటే వారికి అండగా ఎల్లారెడ్డి లాంటి నాయకులు ఉండడమేనన్నారు. ఆమహత్తర పోరాటం మూలంగా మూడువేల గ్రామాలు విముక్తి అయ్యాయని, నాలుగు వేల ఐదు వందల మంది అమరులయ్యారని, పది లక్షల ఎకరాల ప్రభుత్వ భూమిని పేదలకు పంచడానికి బద్దం ఎల్లారెడ్డి అగ్రభాగాన నిలిచాడని, భారతదేశంలో జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో కరీంనగర్ మొట్టమొదటి పార్లమెంట్ సభ్యులుగా బద్దం ఎల్లారెడ్డి ఎన్నికయ్యారని, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇందుర్తి, బుగ్గారం శాసనసభ్యులుగా పని చేశారని, రాజ్యసభ సభ్యులుగా కూడా పనిచేసి ఉమ్మడి జిల్లా సమగ్రాభివృద్ధికి ఎనలేని కృషి చేసిన గొప్ప నాయకుడని, ముఖ్యంగా పేద, బడుగు, బలహీన, అణగారిన వర్గాల కోసం వారి సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించిన మహోన్నతమైన గొప్ప వ్యక్తి బద్దం ఎల్లారెడ్డి అని,అలాంటి నాయకుడి ఆశయాలను, లక్ష్యాలను నేటి తరం పునికి పుచ్చుకొని ముందుకు తీసుకెళ్లేందుకు సీపీఐ శ్రేణులు సిద్ధం కావాలని వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. నివాళులర్పించిన కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్,జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ, కౌన్సిల్ సభ్యులు న్యాలపట్ల రాజు పైడిపల్లి రాజు, కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్, మచ్చ రమేష్, కొట్టే అంజలి, బోనగిరి మహేందర్, నగర నాయకులు గామినేని సత్యం, కసిబోజుల సంతోష్ చారి,మాడిశెట్టి అరవింద్,బాకం ఆంజనేయులు, నగునూరి రమేష్, బెక్కంటి రమేష్, తదితరులు పాల్గొన్నారు.

ఏళ్ల వయసులో ప్రభుత్వ కొలువు పొందినట్టు ఫీలయ్యా: కమల్ హాసన్…

ఏళ్ల వయసులో ప్రభుత్వ కొలువు పొందినట్టు ఫీలయ్యా: కమల్ హాసన్

 

ఎంఎన్ఎం పార్టీ అధినేత, నటుడు కమల్‌హాసన్ రాజ్యసభకు ఎంపికవడం పట్ల స్పందిస్తూ.. ప్రభుత్వ ఉద్యోగం సాధించినంత గర్వంగా ఉందన్నారు. ఆ క్షణంలో తన తల్లిదండ్రులు గుర్తుకువచ్చారని, వెంటనే సమాచారం ఇవ్వాలనుకున్నట్టు తన అనుభవాన్ని పంచుకున్నారు. ఇంకా ఏమన్నారంటే..మక్కల్‌ నీది మయ్యం(MNM) పార్టీ అధినేత, నటుడు కమల్‌హాసన్(Kamal Haasan) ఇటీవల రాజ్యసభ(Rajya Sabha) సభ్యుడిగా ఎంపికయ్యారు. ఇలా పెద్దలసభలో ఎంపీగా ఎన్నికైనప్పుడు తన అనుభూతి ఏమిటని కేరళ(Kerala)లో జరిగిన ఓ కార్యక్రమంలో ఓ వ్యక్తి ప్రశ్నించారు. బదులుగా.. ఏడు పదుల వయసులో ప్రభుత్వ కొలువు పొందినట్టుగా ఉందని సమాధానమిచ్చారు కమల్. ఆ సమయంలో తన తల్లిదండ్రులు గుర్తుకువచ్చారని చెప్పిన ఆయన.. వెంటనే వాళ్లకు ఫోన్ చేసి చెప్పాలనుకున్నట్టు వివరించారు.

‘ఆ క్షణంలో నా తల్లిదండ్రులు డి.శ్రీనివాసన్ అయ్యంగార్(D Srinivasan Iyengar), రాజ్యలక్ష్మి(Rajalakshmi)లను తలచుకున్నాను. నేను రాజ్యసభకు వెళ్లి సంతకం చేసినప్పుడు వారే గుర్తుకొచ్చారు. నేను స్కూల్లో ఓ డ్రాపౌట్ స్టూడెంట్‌ను. కనీసం ఎస్ఎస్ఎల్సీ(SSLC) పాసైనా.. నాకు రైల్వేలో ప్రభుత్వ ఉద్యోగం(Govt Job) వచ్చేదని మా అమ్మ ఎప్పుడూ అంటుండేవారు. అలాంటిది 71 ఏళ్ల వయసులో సాధించినట్టుంది. ఆ సమయంలో నా తల్లికి ఫోన్ చేసి.. ప్రభుత్వ కొలువులో పనిచేస్తున్నానని చెప్పాలనిపించేంత గర్వంగా అనిపించింది.’ అని కమల్ హాసన్ తన రాజ్యసభ ఎంపీ అనుభవాన్ని పంచుకున్నారు.ఇక, కమల్ తన రాజకీయ అనుభవం గురించి మాట్లాడుతూ.. తనను తాను మధ్యేవాదిగా చెప్పుకుంటానని పేర్కొన్నారు. తన నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్(Raj Kamal Films International) కూడా తాను సైద్ధాంతికంగా నమ్మే అంశాలకు మద్దతిస్తోందని ఆయన స్పష్టం చేశారు. కమల్ చివరిసారిగా.. మణిరత్నం(Director Maniratnam) దర్శకత్వం వహించిన ‘థగ్ లైఫ్(Thug Life)’ మూవీలో నటించారు. అయితే.. ఆ సినిమాకు అనుకున్నంత స్పందన రాలేదు.

 ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతు ఎవరికి…

 ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతు ఎవరికి ?

 

 

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఇప్పటికే దేశంలోని దాదాపు అన్ని పార్టీలు ఈ అంశం మీద ఒక నిర్ణయానికి రావడం, తమ మద్దతు ప్రకటించడం జరిగాయి. అయితే,

 ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఇప్పటికే దేశంలోని దాదాపు అన్ని పార్టీలు ఈ అంశం మీద ఒక నిర్ణయానికి రావడం, తమ మద్దతు ప్రకటించడం జరిగాయి. అయితే, బీఆర్ఎస్ పార్టీ మాత్రం తన స్టాండ్ ఏంటన్నది చెప్పడంలేదు. ఇప్పుడిది తెలంగాణలో చర్చనీయాంశమైంది. ఉప రాష్ట్రపతి అభ్యర్థుల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే దానిపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల కొన్ని షరతులు పెట్టారు. ఇది రాష్ట్ర రైతుల సమస్యలతో ముడిపడి ఉందన్న కేటీఆర్.. బీఆర్ఎస్ తెలంగాణలో ప్రధాన విపక్ష పార్టీగా ఉన్నప్పటికీ, ఎన్‌డీఏ, ఇండియా కూటమి రెండింటికీ అదే దూరం పాటిస్తోందని చెప్పుకొచ్చారు. ఆగస్టు 20న కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ రైతులకు 2 లక్ష టన్నుల యూరియా సరఫరా చేస్తామని హామీ ఇచ్చే కూటమికి మాత్రమే తమ మద్దతు ఉంటుందని ప్రకటించిన సంగతి తెలిసిందే.

తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉందని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ‘కృత్రిమంగా’ సృష్టించిన సమస్య అని కేటీఆర్ ఆరోపించారు. సెప్టెంబర్ 9కు ముందు యూరియా రాష్ట్రానికి రావాలి.. మోదీ ప్రభుత్వం ఇస్తే ఎన్‌డీఏ అభ్యర్థికి, రాహుల్ గాంధీ ఇస్తే ఇండియా అభ్యర్థికి తాము మద్దతిస్తామని కూడా కేటీఆర్ చెప్పారు. దీనిపై బీఆర్ఎస్ పార్టీలో చర్చలు జరుగుతున్నాయని, ఈ విషయమై ఇంకా ఎవరూ మాతో సంప్రదించలేదని కేటీఆర్ అన్నారు. తెలంగాణ రైతుల హితమే మాకు ప్రధానమని అదే సమయంలో కేటీఆర్ అంటున్నారు. కాగా, ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి తెలుగు వాసి, మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి కావడంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘తెలుగు గౌరవం’ పేరుతో బీఆర్ఎస్‌ మద్దతివ్వాలని కోరారు. కానీ, కేటీఆర్ దీన్ని తిరస్కరించి, ‘రేవంత్ రెడ్డి మూడో తరగతి సీఎం. కాంగ్రెస్ మూడో తరగతి పార్టీ అని విమర్శించారు. బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీది కపట ప్రేమ అని.. అసలు కాంగ్రెస్ బీసీ అభ్యర్థిని ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్నించారు.

ఇక, బీఆర్ఎస్ ను ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో మద్దతు కోరుతారా అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు సీఎం రేవంత్ సూటిగా సమాధానమిచ్చారు. తనను అధిష్టానం ఆదేశిస్తే, తప్పక బీఆర్ఎస్ పార్టీని కోరతానని తేల్చి చెప్పారు. కాగా, బీఆర్ఎస్ పార్టీకి రాజ్యసభలో నలుగురు సభ్యులు ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు బీఆర్ఎస్ పార్టీ ఎవరికైనా మద్దతు ఇస్తుందా.. లేక ఎవరికీ ఇవ్వకుండా మిన్నకుంటుందా అనేది తేలాలి. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగనున్నాయి.

ఈనాటి ఈ బంధమేనాటిదో…

 

ఈనాటి ఈ బంధమేనాటిదో…

 

రాజ్యసభ సభ్యునిగా ఎంపిక అయిన సందర్భంగా తన చిరకాల, ప్రాణ మిత్రుడు రజనీకాంత్ ను కమల్ హాసన్ కలిశారు. ఈ సందర్భంగా రజనీ… కమల్ ను అభినందించారు.

 

సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) అంటే అందరికీ అభిమానమే. పార్టీలకు అతీతంగా ఆయన్ని ప్రేమించే వారు, అభిమానించేవారు, ఆరాధించేవారు, అనుసరించేవారు ఉంటారు. తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ (Kamal Haasan) కూడా అందుకు అతీతమేమీ కాదు. వీరిద్దరి మధ్య ఉన్న బంధం ఈనాటిది కాదు. ఆ అనుబంధంతోనే రాజ్యసభ సభ్యునిగా ఎంపిక అయిన సందర్భంగా తన చిరకాల, ప్రాణ మిత్రుడు రజనీకాంత్ ను కమల్ హాసన్ కలిశారు. ఈ సందర్భంగా రజనీ… కమల్ ను అభినందించారు. దీనికి సంబంధించిన ఫోటోలను కమల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

 

రజనీకాంత్, కమల్ హాసన్ అనుబంధానికి ప్రధాన కారణం వీరిద్దరి గురువు కె. బాలచందర్ (K. Bala Chander). ఆయన తెరకెక్కించిన ‘అపూర్వ రాగంగళ్’తో రజనీకాంత్ నటుడిగా వెండితెరకు పరిచయం అయ్యారు. ఇదే సినిమా తెలుగులో ‘తూర్పు-పడమర’గా రీమేక్ అయ్యింది. అలా ఆ సినిమాతో మొదలైన బంధం 1985లో ‘గిరఫ్తార్’ వరకూ సాగింది. ఈ మధ్య కాలంలో వీరిద్దరూ కలిసి దాదాపు ఇరవై సినిమాల్లో నటిచారు. అందులో ప్రధానంగా చెప్పుకోదగ్గవి ‘అంతులేని కథ, ఎత్తుకు పై ఎత్తు, వయసు పిలిచింది, అందమైన అనుభవం, మూండ్రు ముడిచ్, అల్లావుద్దీన్ అద్భుతద్వీపం, పదనారు వయదినిలె, అవర్ గళ్’ వంటివి. అయితే తమిళనాడులోని ఓ థియేటర్ లో ఇద్దరు కలిసి నటించిన సినిమా విడుదలైన సందర్భంలో ఫ్యాన్స్ మధ్య ఏర్పడిన గొడవ చినికి చినికి గాలివానగా మారి, ఆ థియేటర్ కు నష్టం వాటిల్లింది. అభిమానులకు సర్ది చెప్పేకంటే… ఇద్దరూ కలిసి ఇకపై కలిసి నటించడం మానుకంటే మంచిదనే నిర్ణయానికి రజనీ, కమల్ వచ్చారు. అప్పటి నుండి కలిసి సినిమాలు చేయకపోయినా… ఒక సినిమాను మరొకరు ప్రశంసించడం, ఒకరి చర్యలను మరొకరు సమర్థించడం వస్తూ ఉంది.

 

కమల్ హాసన్ కంటే ముందే రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని అందరూ అనుకున్నారు. రజనీకాంత్ సైతం ఒకటి రెండు సార్లు అలాంటి ప్రయత్నాలకు శ్రీకారం చుట్టి… ఆ తర్వాత మనసు మార్చుకున్నారు. కానీ మడపతిప్పే అలవాటు లేని కమల్ హాసన్ తమిళ ప్రజలకు, తన అభిమానులకు మాట ఇచ్చినట్టుగానే ‘మక్కల్ నీది మయ్యం’ అనే పార్టీ పెట్టేశారు. ప్రజల నుండి కమల్ హాసన్ పార్టీకి సానుకూల స్పందన రాకపోవడంతో ఆయన గత ఎన్నికల్లో డీఎంకేకు మద్దత్తు పలికారు. దానికి ప్రతిగా ఆ పార్టీ కమల్ హాసన్ ను రాజ్యసభకు నామినేట్ చేసింది. దీంతో తొలిసారి చట్టసభల్లోకి వెళ్ళబోతున్న కమల్ హాసన్… దానికంటే ముందు రజనీకాంత్ ను కలిసి, ఆయన శుభాశీస్సులను స్వీకరించారు. ఇద్దరు తమిళ సీనియర్ ఆర్టిస్టులు ఇలా కలుసుకోవడం ఇద్దరి అభిమానుల్లో ఆనందాన్ని నింపింది.

అంబేద్కర్ రాసిన రాజ్యాం గమే ఆదర్శం. 

అంబేద్కర్ రాసిన రాజ్యాం గమే ఆదర్శం. 

అంబేద్కర్ భవనం రావడం అన్ని కులాల పేదప్రజల అదృష్టం

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండలంలో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు అంబేద్కర్ భవనం రావడం అన్ని కులాల పేదల ప్రజల అదృష్టం. అంబేద్కర్ ఆశయ కొనసాగిస్తాం. ఎమ్మా ర్పీఎస్ మండల అధ్యక్షుడు తుడుం వెంకటేష్ పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మారపేల్లి రవీంద ర్ (బుజ్జన్న) మర్యాద పూర్వ కంగా కలిసి శాలువాతో సన్మానించారు. మండలకేంద్రం ఒకప్పుడు నియోజకవర్గ కేంద్రమైన అంబేద్కర్ భవనం లేకపోవడం చాలా దురదృష్ట కరం. అంబేద్కర్ భవనం రావడం సంతోషం. అంబేద్కర్ భవనం నిర్మాణ చేస్తానని కాంగ్రెస్ భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారా యణరావు హామీ ఇవ్వడం జరిగింది.. ఈ ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని ప్రజలు కోరారు. ఈ కార్యక్రమంలో ముక్కెర ముఖేష్ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి తుడుం వెంకటేష్ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మామిడి భాస్కర్ మాదిగ, ఎంఎస్ పి మండల అధ్యక్షులు మారపేల్లి చిరంజీవి మాదిగ ఎమ్మార్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి పోతుగంటి రజినికర్ మాదిగ ,మాజీ మండల అధ్యక్షులు కొమ్ముల పరమేష్, ఎమ్మార్పీ ఎస్ మండల సీనియర్ నాయకు లు.రంగు బాబు మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల సీనియర్ నాయకులు రమేష్ మాదిగ ఎమ్మార్పీఎస్ నాయకు లు,పోతుగంటి సాంబరాజ్, ఎమ్మార్పీఎస్ పత్తిపాక గ్రామ శాఖ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version