యూనియన్ బ్యాంకు లో స్టాఫ్ లేక ఖాతాదారుల కు ఇబ్బందులు
డి.ఎస్.పి పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కండె రవి
గణపురం నేటి ధాత్రి:
గణపురం మండల కేంద్రంలో ఉన్న యూనియన్ బ్యాంక్ ను ధర్మ సమాజ్ పార్టీ భూపాలపల్లి జిల్లా ప్రదాన కార్యదర్శి కండె రవి ఆధ్వర్యంలో పరిశీలించడం జరిగింది ఈ బ్యాంకులో 80,000 మంది ఖాతాదారులు ఉండగా ముగ్గురు మాత్రమే సిబ్బంది వారికి తోడుగా ఒకరిద్దరు సహా సిబ్బంది ఉన్నారు రోజుకు మండలంలోని 17 గ్రామాలు కాకుండా పక్క గ్రామాలను కలుపుకొని 80,000 మంది ఖాతాదారులు ఉన్నారు వీరందరికీ సరిపడా స్టాఫ్ లేరు రైతు భరోసా పైసలు వడ్ల పైసలు ఏకకాలంలో పడడం వల్ల రైతులు ఖాతాదారులు బ్యాంకుకు వస్తున్నారు వారి డబ్బులను వారికి సకాలంలో చెల్లించడంలో ఈ ప్రభుత్వం మరియు బ్యాంకు విఫలమైంది గంటల తరబడి ఖాతాదారులంతా లోపల నిలబడుతున్నారు కనీస సౌకర్యాలు బ్యాంకులో లేవు బిపి షుగర్ ఉన్న పేషెంట్లు చాలా ఇబ్బంది పడుతున్నారు కూర్చోడానికి కుర్చీలు లోపల ఉండవు మూత్రం పోదా పోద్దాం అంటే బయట టాయిలెట్ గది ఉండదు ఖాతాదారులకు అనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలి ఇది ప్రజా ప్రభుత్వం అని చెప్పినప్పుడు ఒక్కొక్క రైతు చెప్పులు అరిగేలా ఎనిమిది రోజులు బ్యాంకు చుట్టూ తిరుగుతున్నారు ఒక పేద రైతుకు చెక్ బుకు ఎందుకు చెక్ బుక్ ల పేరుతోనే కాలయాపన చేస్తున్నారు సరైన సెక్యూరిటీ లేక ప్రజలు గుంపులుగాడుతున్నారు స్థానిక ఎస్ఐ సహకరించాలని కోరుతున్నాం ఒక రెండు నెలలు ఈ సమస్య పైన బ్యాంకు మేనేజర్ స్థానిక ఎస్సై ఆర్ అశోక్ స్పందించాలని కోరుతున్నాం ఇది ప్రజా ప్రభుత్వం కాదు దళారి ప్రభుత్వం ప్రజల అవసరాలు తీర్చని ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఎట్లా అయితది అని ధర్మ సమాజ్ పార్టీ పక్షాన ప్రశ్నిస్తున్నాం ఇక ముందు ఇలా కొనసాగితే ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బ్యాంక్ ఖాతాదారులు అందరితో కలిసి ధర్నా రాస్తారోకోలు చేస్తాం ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ గాంధీనగర్ గ్రామ అధ్యక్షులు ఇంజపల్లి విక్రమ్ నరసన్న మొగిలి వినయ్ శ్రీ కరణ్ బ్యాంకు ఖాతాదారులు పాల్గొన్నారు