నోటీస్ బోర్డులో ఓటర్ల తుది జాబితా
మహాదేవపూర్ సెప్టెంబర్ 2 (నేటి దాత్రి)
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ గ్రామపంచాయతీ లో ఓటర్ల తుది జాబితాను మంగళవారం రోజున ప్రజల సందర్శనార్థం నోటీసు బోర్డులో ఉంచారు. గ్రామపంచాయతీ లో ఓటర్ల తుది జాబితాను గ్రామపంచాయతీ సిబ్బందితో సేకరించి మండల పంచాయతీ అధికారి ప్రసాద్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సందర్శనార్థం నోటీస్ బోర్డ్ లో ఉంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి కల్పన, గ్రామ ప్రజలు మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.