తహసిల్దార్ కార్యాలయంలో వన మహోత్సవం
జైపూర్,నేటి ధాత్రి:
జైపూర్ తహసిల్దార్ కార్యాలయంలో సోమవారం వనమహోత్సవ కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమం తహసిల్దార్ వనజా రెడ్డి, ఎంపీఓ శ్రీపతి బాబురావు ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ పుట్టినరోజు,పెళ్లిరోజు వేడుకల సందర్భంగా మొక్కలు నాటి వాటిని విరివిరిగా సంరక్షిస్తూ వాతావరణ సమతుల్యతకు పాటుపడలని తెలిపారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ సంతోష్,ఏపీవో బాలయ్య,ఎఫ్ఎస్ఓ రామకృష్ణ,ఐసిడిఎస్ సూపర్వైజర్ కవిత,పంచాయతీ కార్యదర్శి బి.ఉదయ్,తహసిల్దార్ కార్యాలయ సిబ్బంది,ఫీల్డ్ అసిస్టెంట్ తదితరులు పాల్గొన్నారు.