సీజనల్ వ్యాధుల పై విద్యార్థులకు అవగాహన.

సీజనల్ వ్యాధుల పై విద్యార్థులకు అవగాహన ‌‌

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

 

 

మొగుళ్ళపల్లి మండల కేంద్రంలోని ఎంజేపి (మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే) పాఠశాలలో మొగుళ్ళపల్లి ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారిణి డాక్టర్ నాగరాణి గారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా 110 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి మందులు ఇవ్వడం జరిగినది. విద్యార్థులకు సీజన్ వ్యాధుల గూర్చి అవగాహన కల్పించడం జరిగినది ,వేడి వేడి ఆహార పదార్థాలు తినాలని, కాచి చల్లార్చిన నీరు తాగాలని తెలియజేసినారు . విద్యార్థులకు ఎవరికైనా జ్వరం కానీ, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే మా వైద్య సిబ్బంది తెలియజేయాలని డాక్టర్ నాగరాణి గారు సూచనలు ఇచ్చారు .ఈ కార్యక్రమంలో డాక్టర్ సంధ్య, ప్రిన్సిపల్ శారద ,సూపర్వైజర్ సునీత, ఏఎన్ఎం శ్రీలత ,స్టాఫ్ నర్స్ అశ్ర ఆశా కార్యకర్తలు ఉపాధ్యాయులు ,విద్యార్థులు పాల్గొన్నారు.

సీజనల్ వ్యాధుల అవగాహన.

*సీజనల్ వ్యాధుల అవగాహన. * *

డాక్టర్ నాగరాణి .

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి .

 

 

 

*మొగుళ్ల పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ నాగరాణి ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది మరియు ఆశ కార్యకర్తలకు సీజనల్ వ్యాధులకు సంబంధించిన సమావేశం నిర్వహించడం జరిగినది .ఈ సందర్భంగా డాక్టర్ నాగరాణి మాట్లాడుతూ వేసవికాలం పూర్తి కాలేదు ఎండలు బాగా ఉండటంవల్ల వడదెబ్బ తలిగే అవకాశం ఉన్నందున ప్రజలను అప్రమత్తం చేయాలని అదేవిధంగా వర్షాలు కూడా అధికముగా పడడం వల్ల నీరు నిల్వ ఉండి దోమలు పెరిగి మలేరియాl, డెంగ్యూ ,చికెన్ గున్యా లాంటి వ్యాధులు ప్రభలే అవకాశం ఉన్నందున వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ప్రజలకి తగిన సూచనలు ఇవ్వాలని వైద్యాధికారి తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు సునీత, జమున, హెల్త్ అసిస్టెంట్ బిక్షపతి ఏఎన్ఎంలు ఆశాలు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version