క్యాతన్ పల్లి అభివృద్ధికి అధికార కాంగ్రెస్ పార్టీ సహకరించేనా…

క్యాతన్ పల్లి అభివృద్ధికి అధికార కాంగ్రెస్ పార్టీ సహకరించేనా…?

చైర్మెన్ పీఠం కైవసం చేసుకున్న బిఆర్ఎస్, సిపిఐ కూటమికి పెద్ద సవాలేనా…?

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

క్యాతన్ పల్లి మున్సిపాలిటీ ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపధ్యంలో ఎట్టకేలకు
మున్సిపాలిటీ లో నూతనంగా బిఆర్ఎస్ సీపీఐ కూటమి పదవి బాధ్యతలు చేపట్టింది.నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లకు మునిసిపాలిటీ అభివృద్ధి పెద్ద సవాలు గానే నిలిచే అవకాశం లేకపోలేదు.వివరాల్లోకి వెళితే.. తెలంగాణ రాష్ట్రంలో కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ తో జత కలిస్తే అందుకు భిన్నంగా క్యాతన పల్లి మునిసిపాలిటీలో బిఆర్ఎస్ పార్టీ తో జతకట్టి విజయం సాధించి 50 రోజుల నిరీక్షణానంతరం చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకున్నారు. ఈ ప్రాంతంలో అధికార కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరు నియోజక వర్గంలో ఈ మున్సిపాలిటీ ఉండటంతో అభివృద్ధికి మంత్రి వివేక్ సహకరించి నిధులు కేటాయిస్తారా..? లేదా అని వేచి చూడాల్సిందే. అందుకు నిదర్శనమే ఇప్పటికే గెలిచిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు తమ వార్డుల్లో అభివృద్ధి పనుల్లో పాల్గొంటున్నప్పటికీ పోటీ చేసి ఓడిన కౌన్సిలర్ అభ్యర్థులు సైతం తమ వార్డుల్లో తామే కౌన్సిలర్లుగా భావించి అభివృద్ధి పనుల్లో కలుగచేసుకుంటు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఇక రానున్న రోజుల్లో వారే ఆధిపత్యం కొనసాగిస్తారేమో అనే సందేహాలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. ఇప్పటికే కొందరు కాంగ్రెస్ పెద్దలు చైర్మన్ పీఠం దక్కించుకున్న కౌన్సిలర్లకు డ్రైనేజ్ కాలువలు తీయించే పని తప్ప అభివృద్ధి పనుల్లో వారికి పనేం ఉండదు అంటూ ఎద్దేవా చేస్తూ మునిసిపాలిటీలో ప్రచారం చేస్తుండడం అందుకు బలం చేకూరుస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.ఏదేమైనా క్యాతన్ పల్లి మున్సిపాలిటీ అభివృద్ధి జరగాలంటే కింది స్థాయిలో ఉన్న నాయకులు మంత్రిని తప్పుదోవ పట్టించకుండా ఉంటే మంత్రి వివేక్ వెంకటస్వామి సైతం మున్సిపల్ అభివృద్ధికి సహకరిస్తారనే ఆశాభావం ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.

పేటకాంగ్రెస్ విజయం వెనుక త్యాగధనులు…

పేటకాంగ్రెస్ విజయం వెనుక త్యాగధనులు,

,,,, రెబల్గా పార్టీకి అన్యాయం కన్నా గెలుపు కోసం త్యాగం,,,,

,,,, ఐక్యమత్యానికి వారీ సహకారం,,,,,,

ఒక్కొక్క గడ్డిపరక ఏనుగుని బంధించినట్టు,,,,,,

విజయానికి వీ రు కూడా భాగస్తులే,,,,

,, అధినాయకుని గౌరవించి మాటకు విలువ ఇచ్చారు,,,,,,

రామాయంపేట ఫిబ్రవరి 18 నేటి ధాత్రి (మెదక్)

 

జిల్లాలో రాష్ట్రంలో కాంగ్రెస్ అనుకున్నట్టు కాకుండా విజయం చాలాచోట్ల దోబూచులాడింది. అధికారం ఉన్న నాయకులు ఉన్న ప్రజల్లో సంశయమైన దోబూచులాట కాంగ్రెస్ ఓటమికి చాలాచోట్ల ఆటంకాలు ఏర్పడ్డాయి మెదక్ జిల్లాలో కూడా బి ఆర్ఎస్ బిజెపి పార్టీలు మెదక్ జిల్లాలోని కాక రాష్ట్రంలో తీవ్రమైన పోటీని బలమైన అభ్యర్థులను మాజీ అధికార పార్టీ అయితే డబ్బులను పెద్ద ఎత్తు న పెట్టి కాంగ్రెస్కు పెద్ద సవాలే విసిరింది రామాయంపేట మున్సిపల్ కు వస్తే అధికారం ఉన్న ఎమ్మెల్యే పదవి ఉన్నా స్థానిక ఎన్నికల్లో గతం నుండి పది సంవత్సరాలుగా అన్ని స్థానిక సంస్థల పదవులను ఏకపక్షంగా సాధించి కాంగ్రెస్ ను పంజరంలో వేసిన ఘనత విఆర్ఎస్ పార్టీ దే గతంలో అనైక్యత పార్టీలో నుండి కోవట్లు టిఆర్ఎస్కు పెద్ద మొత్తంలో ఉండడమే కాకుండా అధినాయకత్వం కూడా లేకపోవడంతో ఎవరికి వారే యమునా తీరే ఇక్కడ ఉన్న నాయకులు పోతే పోనీ నాకేంటి మాకు మాత్రం నాయకత్వానికి లోటు లేదు అనే ధోరణిలో గడిచింది కాబట్టి టిఆర్ఎస్ కు పోటీ లేకుండా సాధించాలన్నది పరిశీలిస్తున్న భావన కానీ మైనంపల్లి మంత్రాంగం అందర్నీ ఏకతాటిపై తీసుకువచ్చి నయాన భయాన ఓకే అభ్యర్థికి విజయానికి సహకరించాలని ఆదేశాలు చాలా బాగా పనిచేశాయి. యువజన కార్యకర్తలు సాకేత్ రెడ్డి పుట్టి నికుల్ తమ కు టికెట్టు ఇచ్చే అవకాశం ఉన్న కేటాయించకపోవడం పట్ల ఏమాత్రం కూడా స్వార్థంతో ఆలోచించకుండా నిస్వార్ధంగా అభ్యర్థుల గెలవడానికి కారణమయ్యారు..పార్టీ ఐక్యమత్యంతో పాటు కోవట్లను కూడా జాగ్రత్తగా గమనిస్తూ వారికి ఎన్నికలు దూరంగా ఉంచడం మరొక ఆలోచన ఇకపోతే అధినాయకత్వానికి గెలిచే సస్తావున్న అభ్యర్థులు కూడా పార్టీ ధ్రువీకరించిన అభ్యర్థులకు పూర్తి సహకారం అందించడమే కాక ముందుండి ఓట్లను సంపాదించడం మరొకటి విజయానికి సాధ్యమైంది రెబ్బలు ఒకటి రెండు చోట్ల ఇతర పార్టీల అనుమతితో నిలబడ్డ వారిని పూర్తిగా ఓడించే ప్రయత్నం పూర్తిగా సఫలమైంది 12వ వార్డులో గతంలో షరాబు శ్యామ్ కుమార్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో బలంగా ఆర్థికంగా గెలిచి సత్తా ఉన్న గతంలో తనతో ఓడిపోయిన పోచమ్మల గణేష్ కు ఛాయిస్ ఇవ్వడం ప్రచారంలో ఉండి కాంగ్రెస్కు బలంగా ఓట్లు తేవడం నిజంగా అతను త్యాగానికి పార్టీ ప్రతిఫలం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒకటో వార్డులో గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి కొన్ని సీట్లలో టిఆర్ఎస్ గాలిని అడ్డుకొని గెలిచి నిలిచిన బుర్ర అనిల్ కుమార్ చైర్మన్ కాండిడేట్ నాగరాజు లావణ్య కు పెద్ద విజయాన్ని సాధించి పెట్టాడు పట్టణ అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నుకోబడ్డ చింతల స్వామి 11 లో అతనికి అవకాశం ఉన్న కాంగ్రెస్ నిలబెట్టిన అభ్యర్థికి పూర్తి న్యాయం చేయడం ఏడో వార్డులో గొలుపర్తి 700 ఓట్లు గ్రామంలోని ఉండడం గత కొన్ని సంవత్సరాలుగా పచ్చంటి రాము పోటీ కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూర్చేదైన చైర్మన్ భర్త నాగరాజుకు త్యాగం చేసి పార్టీకి లాభం చేకూర్చాడు .అందుకే రామాయంపేట మెదక్ జిల్లాలో వేస్తున్న పోటాపోటీ బిఆర్ఎస్ గారికి ఐకమత్యములు మరియు త్యాగాలతో విజయం చేకూర్చడంలో భాగస్వాములు అయ్యారని చెప్పవచ్చు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version