మంచిర్యాలలో లైసెన్స్ సర్వేయర్లకు గుర్తింపు

జిల్లా ల్యాండ్ సర్వే అధికారి కి వినతిపత్రం అందజేత

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

 

తెలంగాణ సర్వే అకాడమీ నుండి శిక్షణ పొందిన పాత లైసెన్స్ సర్వేయర్స్ జిల్లా అధికారి వి.శ్రీనివాస్ కి మంగళవారం వినతిపత్రం అందజేశారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి అమలులో భాగంగా లైసెన్స్ సర్వేయర్స్ సేవలు వినియోగించుకోవడం కోసం సిద్దమైన విషయం వీధితమే. ఈ విషయంలో భాగంగా స్పెల్ -1 శిక్షణ పొందిన లైసెన్స్ సర్వేయర్స్ తో పాటు కొద్దిమంది పాత లైసెన్స్ సర్వేయర్స్ కి మండలాలు కేటాయించడం జరిగింది.ఇంకా చాలా మందికి లైసెన్స్ ఉండి ప్రయివేట్ గా సర్వే పనులు నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్నామని,మా అందరికి కూడా మండల్ అలాట్మెంట్ చేయాలనీ కోరగా వారు సానుకూలంగా స్పందిస్తూ తదుపరి లిస్ట్ లో తప్పకుండా అవకాశం కలిపిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియర్ లైసెన్స్ సర్వేయర్స్ సదయ్య,సుధాకర్,మల్లేష్,లక్ష్మణ్,మేరాజ్,మురళి తదితరులు పాల్గొన్నారు.

రామాయంపేట తహసీల్దార్ కార్యాలయంలో ఆర్‌డీఓ తనిఖీ…

రామాయంపేట తహసీల్దార్ కార్యాలయంలో ఆర్‌డీఓ తనిఖీ

రామాయంపేట సెప్టెంబర్ 10 నేటి ధాత్రి (మెదక్)

 

 

మెదక్ జిల్లా రామాయంపేట మండల తహసీల్దార్ కార్యాలయంలో ఆదివారం ఆర్‌డీఓ గారు ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పరిధిలో యూరియా పంపిణీ పరిస్థితులు, 22-ఎ సమాచారం, భూభారతి పనులు, రెవెన్యూ సభల్లో ఫైళ్ల పరిష్కారం, మీ సేవ డాష్‌బోర్డ్‌ వంటి అంశాలపై సమీక్ష చేపట్టారు. అదేవిధంగా కార్యాలయంలో నిర్వహిస్తున్న వివిధ రిజిస్టర్లను పరిశీలించారు.
తదుపరి సిబ్బందితో మాట్లాడిన ఆర్‌డీఓ గారు సమయపాలన కచ్చితంగా పాటించాలని, దరఖాస్తులు, అభ్యంతరాలపై ఆలస్యం లేకుండా వెంటనే పరిష్కారం చేయాలని సూచించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యదర్శులు, లైసెన్స్ సర్వేయర్లతో సమావేశమై రెవెన్యూ సంబంధిత పనులపై మార్గదర్శకాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ లు మహమ్మద్ గౌస్. గోపి. సిబ్బంది సుష్మ. సౌమ్య. రోజా. సునీత. తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version