సీఎం రేవంత్ కు రాఖీకట్టిన మాజీ ఎంపీపీ సౌజన్య గౌడ్..

సీఎం రేవంత్ కు రాఖీకట్టిన మాజీ ఎంపీపీ సౌజన్య గౌడ్

వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట, నేటిధాత్రి:

అన్నాచెల్లెళ్లు అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ మహోత్సవం.శనివారం
రాఖీ పౌర్ణమి సందర్భంగా హైదారాబాద్ జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో రేవంత్ రెడ్డికి టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి బీమగాని సౌజన్య గౌడ్ రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.ఎంతో ఆప్యాయంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Former MPP Soujanya Goud

రాఖీ పండుగ సందర్భంగా సీఎం ఆత్మీయత ఎంతో సంతోషాన్ని కలిగించిందని వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మాజీ ఎంపిపి,టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి భీమాగాని సౌజన్య గౌడ్ తెలిపారు.

వివాహ కార్యక్రమంలో పాల్గొన్న టీజీఐడిసి మాజీ చైర్మన్..

వివాహ కార్యక్రమంలో పాల్గొన్న టీజీఐడిసి మాజీ చైర్మన్

జహీరాబాద్ నేటి ధాత్రి:

మొయినాబాద్ జెపిఎల్ కన్వెన్షన్ లో జరిగిన పస్తాపూర్ వాస్తవ్యులు ప్రభుత్వ ఉపాధ్యాయుడు సంగారెడ్డి గారి కుమారుడు శంకర్ రెడ్డి (సి.ఆర్.పి.ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్) & మనీషా రెడ్డి (ఐ.పి.ఎస్.) గార్ల వివాహ విందు వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన టీజీఐడిసి మాజీ చైర్మన్ మహమ్మద్ తన్విర్
వారితో పాటు మాజీ కౌన్సిలర్లు మోతిరామ్ జహంగీర్ యూనస్ రాములు నేత నాయకులు శ్రీకాంత్ బి జి సందీప్ అరుణ్ బాల్రెడ్డి పాల్గొన్నారు.

మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి…

మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి

మాజీ సర్పంచుల జేఏసీ స్టేట్ ప్రెసిడెంట్ అక్కనపల్లి కరుణాకర్ డిమాండ్

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-02T133644.758-1.wav?_=1

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )

రాజన్న సిరిసిల్ల జిల్లా మాజీ సర్పంచులు 2019 -24 సంవత్సరానికి పని చేసినటువంటి మాజీ సర్పంచులు సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగినది. మాజీ సర్పంచుల జేఏసీ స్టేట్ ప్రెసిడెంట్ అక్కనపల్లి కరుణాకర్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వo కాలనీలో, గ్రామాల్లో సర్పంచులు చేసినటువంటి అభివృద్ధి
పనులకు ఇంతవరకు బిల్లులు చెల్లించలేదు. గత ప్రభుత్వ కాలం పోయి నూతన ప్రభుత్వం వచ్చినాక కూడా బిల్లులు చెల్లించకపోవడం వల్ల చాలామంది సర్పంచులు తమ ఇల్లు, పొలాలు తాకట్టు పెట్టి గత ప్రభుత్వంలో సర్పంచుల సొంత నిధులతో ఖర్చు పెట్టించి నా గత బిఆర్ఎస్ ప్రభుత్వం. నేడు నూతన ప్రభుత్వంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లులు ఇవ్వకుండా పోవడం వల్ల మాజీ సర్పంచులకు కుటుంబ పరంగా మరియు ఆర్థిక పరంగా నష్టపోయారని సర్పంచుల జిల్లా ఫోరం పేర్కొన్నారు. అంతేకాకుండా గత ప్రభుత్వంలో సర్పంచులు కట్టించినటువంటి కార్యాలయాలల్లో
నేడు నూతనంగా వచ్చిన ప్రభుత్వ, అధికారులు గానీ నాయకులు గానీ ఉండలేరా అని ప్రశ్నించడం జరిగినది. కాబట్టి వెంటనే మాజీ సర్పంచుల బిల్లులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేయాలని ప్రెస్ మీట్ ద్వారా కోరడం జరిగినది.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు మాజీ సర్పంచుల జేఏసీ స్టేట్ ప్రెసిడెంట్. అక్కనపల్లి కరుణాకర్ జిల్లా అధ్యక్షులు దుమ్మ అంజయ్య. గుణాల లక్ష్మణ్. సిరికొండ శ్రీనివాస్. ఆరే మహేందర్. రవి నాయక్. శ్రీనివాస్. తదితరులు పాల్గొన్నారు.

వివాహా వేడుకల్లో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం..

వివాహా వేడుకల్లో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం..

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండల కేంద్రంలోని వాసవి కళ్యాణ మండపంలో బుధవారము జరిగిన మేదపల్లి గ్రామం కీ.శే.సంఘమేశ్వర్ పట్లోల సువర్ణ ల కుమారుని వివాహా వేడుకల్లో ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం పాల్గొని నూతన వదువరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసారు, ఈ వివాహా వేడుకల్లో మాజీ సర్పంచ్ లు శంకర్, సంఘమేశ్వర్,పరమేశ్వర్,నాయకులు జి.నర్సింలు,సుభాష్ రావు,నర్సింలు,చెంగల్ జైపాల్,బసంత్ పాటిల్, అభిలాష్ రెడ్డి,ప్రవీణ్ కుమార్, బి.దిలీప్,తదితరులు పాల్గొన్నారు.

మాజీ ఉపసర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన..

మాజీ ఉపసర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర.

చిట్యాల ,నేటి దాత్రి ;

భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండల కేంద్రంలోని మాజీ ఉపసర్పంచ్ కోడెల రాజయ్య కుటుంబాన్ని భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి శుక్రవారం రోజున పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియచేశారు.
నేడు వారి ఇంటికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియచేసినారు,
వారి వెంట మండల అధ్యక్షులు అల్లం రవీందర్. వర్కింగ్ ప్రెసిడెంట్ పిట్ట సురేష్ చిట్యాల యూత్ అధ్యక్షుడు తవటంనవీన్ టౌన్ అధ్యక్షులు బుర్ర శ్రీధర్ పెరుమాండ్ల రవీందర్ పసుపుల శీను కోడేలరాజమల్లు సదానందం రవి రాంబాబు నరేందర్ తాటిపల్లి శీను రజినికాంత్ తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు.

బిఆర్ఎస్ రాష్ట్రవర్కింగ్ ప్రెసిడెంట్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన…

బిఆర్ఎస్ రాష్ట్రవర్కింగ్ ప్రెసిడెంట్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన
మాజీ ఎమ్మెల్యే

మొగులపల్లి నేటి ధాత్రి
భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో :27/07/2025 న తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు,బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు భూపాలపల్లి నియోజకవర్గానికి విచ్చేస్తున్న సందర్భంగా మొగుళ్ళపల్లి మండలం, ఇస్సిపేట గ్రామ వాస్తవ్యులు మాజీ సర్పంచ్ కీ.శే కొడారి కొమురయ్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించి, అనంతరం మొగుళ్ళపల్లి లక్ష్మి సాయి గార్డెన్స్ నందు మండల ముఖ్య నాయకులతో కేటీఆర్ పర్యటన ఏర్పాట్లు మరియు కార్యకర్తల సమీకరణ పై సమీక్షా నిర్వహించిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి.
వారి వెంట మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మాజీ ఎంపీటీసీ లక్ష్మయ్య జన్మ దిన వేడుకలు..

ఘనంగా.. మాజీ ఎంపీటీసీ లక్ష్మయ్య జన్మ దిన వేడుకలు

బాలానగర్ /నేటి ధాత్రి.

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని పెద్దాయపల్లి గ్రామ మాజీ ఎంపీటీసీ లక్ష్మయ్య జన్మదిన వేడుకలు మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో.. సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు చించోడు అభిమన్యు రెడ్డి హాజరై శాలువాతో సన్మానించి కేక్ కట్ చేసి పలువురికి పంచారు. ముందుగా మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఫోన్లో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

పెయింటర్‌గానే ఎక్కువ సంపాదన..

పెయింటర్‌గానే ఎక్కువ సంపాదన

దాదాపు మూడు దశాబ్ధాల క్రితమే క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన ఇంగ్లండ్‌ మాజీ వికెట్‌ కీపర్‌ జాక్‌ రస్సెల్‌ ఇప్పుడు కాన్వాస్‌ పెయింటర్‌గా స్థిరపడ్డాడు. 1988-1998 మధ్య తను…

లండన్‌: దాదాపు మూడు దశాబ్ధాల క్రితమే క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన ఇంగ్లండ్‌ మాజీ వికెట్‌ కీపర్‌ జాక్‌ రస్సెల్‌ ఇప్పుడు కాన్వాస్‌ పెయింటర్‌గా స్థిరపడ్డాడు. 1988-1998 మధ్య తను 54 టెస్టులు, 40 వన్డేలు ఆడాడు. కళ్లకు నల్లటి గ్లాసులు, తలకు పనామా టోపీ, పొడవాటి మీసాలతో విలక్షణంగా కనిపించే రస్సెల్‌ 90 దశకంలో క్రికెట్‌ ఫ్యాన్స్‌ను అమితంగా ఆకట్టుకునేవాడు. క్రికెట్‌ నుంచి వైదొలిగాక పెయింటింగ్‌లో బిజీ అయ్యానని చెప్పాడు. అంతేకాకుండా క్రికెట్‌ ఆడే సమయంలోకన్నా ఇప్పుడే ఎక్కువగా సంపాదిస్తున్నట్టు రస్సెల్‌ తెలిపాడు. అయితే ధన సంపాదన కోసమే పెయింటింగ్స్‌ వేయడం లేదని, బొమ్మలు గీయడం తనకో వ్యసనమని తేల్చాడు. భారత జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్నందున తాను రంజిత్‌ సింగ్‌జీ బొమ్మను సైతం చిత్రించినట్టు పేర్కొన్నాడు.

వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకు బిగ్ షాక్!

వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకు బిగ్ షాక్!

వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి హైకోర్టు షాక్ ఇచ్చింది. టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతి కుమార్ రెడ్డిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఆయనపై BNS లోని 35(3) ప్రకారం నోటీసులు ఇచ్చి విచారించాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది.

కొవ్వూరు, జులై 16: టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో ఎమ్మెల్యేపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి ధర్మాసనం ఊహించని షాక్ ఇచ్చింది. ఆయనపై BNS లోని 35(3) ప్రకారం నోటీసులు ఇచ్చి విచారించాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. ఆర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలి అని స్పష్టం చేసింది.

ఏడు ఏళ్ల లోపు శిక్ష..!

పిటిషనర్ పై పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు అన్ని ఏడు ఏళ్ల లోపు శిక్ష పడే సెక్షన్లు అని నల్లపురెడ్డి తరపు న్యాయవాది మనోహర్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ సెక్షన్లు కూడా ఆయనకు వర్తించవు అని చెప్పారు. ప్రసన్న కుమార్ రెడ్డి తొలిరోజు ప్రశాంతిరెడ్డిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసి మళ్ళీ రెండవ రోజు కూడా పునరుద్ఘాటించారు అని ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం.. పోలీసులు పెట్టిన సెక్షన్లు అన్ని ఏడేళ్లు లోపు శిక్ష పడేవి కావడంతో ప్రసన్నకుమార్ రెడ్డి ను BNS లోని 35(3) ప్రకారం పిలిచి విచారించాలని ఆదేశాలు ఇచ్చింది.

ఝరాసంగం తాజా మాజీ సర్పంచ్ జగదీశ్వర్ ను పరామర్శించిన.

ఝరాసంగం తాజా మాజీ సర్పంచ్ జగదీశ్వర్ ను పరామర్శించిన తెలంగాణ ఇండస్ట్రియల్ మాజీ చైర్మన్ తన్వీర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండల కేంద్రం లోని ఝరాసంగం తాజా మాజీ సర్పంచ్ జగదీశ్వర్ ను పరామర్శించిన తెలంగాణ ఇండస్ట్రియల్ మాజీ చైర్మన్ తన్వీర్ సర్పంచ్ అనారోగ్యం తో అస్పత్రి లో చేరి ఇటీవల తన సొంత గ్రామమైన ఝరాసంగం కి వచ్చిన సందర్భంగా ఆయనను పరామర్శించిన మహమ్మద్ తన్వీర్ ఆయనతోపాటు కక్కర్వాడ మాజీ సర్పంచ్ జగన్ ఝరాసంగం టిఆర్ఎస్ యువ నాయకులు సద్దాం తదితరులు ఉన్నారు.

ఝరాసంగం మాజీ సర్పంచ్ ను పరామర్శన..

ఝరాసంగం మాజీ సర్పంచ్ ను పరామర్శన ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఇటీవల ఎమ్మెల్యే గారి సొంత గ్రామమైన ఝరాసంగం లో అనారోగ్యంతో బాధపడుతు కోలుకున్నా గ్రామ మాజీ సర్పంచ్ బొగ్గుల జగదీశ్వర్,రామ్ సింగ్,కేతన్ చౌతయి, గార్ల వారి నివాసనికి చేరుకొని శాసనసభ్యులు కోనింటి మానిక్ రావు గారు,ఉమ్మడి మెదక్ జిల్లా చైర్మన్ డీసీఎంఎస్ శివకుమార్ గార్లు వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి త్వరగా కోవాలని కోరారు.
వారితో పాటుగా మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మాజీ ఎంపీపీ బొగ్గుల సంగమేశ్వర్, మాజీ కేతకీ సంగమేశ్వర ఆలయ చైర్మన్ నర్సింహా గౌడ్, పట్టణ అధ్యక్షులు ఎజాస్ బాబా, మాజీ సర్పంచ్ లు పరమేశ్వర్ పటేల్,శ్రీనివాస్ రెడ్డి, బస్వరాజ్, అమరజిత్, ప్రభు పటేల్,బస్వరాజ్ పటేల్,ఫరూక్ పటేల్, నాయకులు వెంకట్ రెడ్డి, నవాజ్ రెడ్డి, నాగేశ్వర్ సజ్జన్,సంగన్న, శివ శంకర్ పటేల్, శశి వర్ధన్ రెడ్డి, కిజర్, విజయ్ పాటిల్, మాణిక్ యాదవ్,ఎంపీ శ్రీనివాస్ పటేల్,ఎంపీ నాగన్న, సోహైల్,రమేష్,రాజు కుమార్, బాలరాజ్, విల్లాస్, అనిల్ పటేల్, కృష్ణ, విజయ్, సాయ్యేద్, శివ వైజ్యనాథ్, రామ్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

మారుతీ గారి కుమారుడి మొదటి జన్మదిన.!

మల్గి మాజీ సర్పంచ్ మారుతీ గారి కుమారుడి మొదటి జన్మదిన వేడుకల్లో పాల్గొన ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మానిక్ రావు జన్మదిన వేడుకలో పాల్గొని సుఖ సంతోషాలతో ఉండాలని చిన్నారిని ఆశీర్వదించారు అందరూ కలిసి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ప్రజా ప్రతినిధులు నాయకులు న్యాల్కల్ మండల పార్టీ అధ్యక్షులు రవీందర్, జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, పాక్స్ చైర్మన్ మచేందర్, రాజేందర్ రెడ్డి, సంఘరామ్ పాటిల్, రవి కుమార్, రాజ్ కుమార్, భూమా రెడ్డి,మైపాల్, చంద్రన్న,ఇస్మాయిల్, లోకేష్ పాటిల్,గొల్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు

ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ నేత స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని రామకృష్ణాపూర్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం పట్టణ అధ్యక్షులు పల్లె రాజు మాట్లాడారు. ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి పరిపాలన ప్రతి ముఖ్యమంత్రికి ఆదర్శమని అన్నారు. రైతులకు ఉచిత కరెంట్, 108 వాహనం, పేదలకు ఆరోగ్యశ్రీ ,ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు లాంటి పథకాలు ప్రజలకు చేరవేసిన మహానేత అని కొనియాడారు. రాజశేఖర్ రెడ్డి ఆశయాలను కొనసాగిస్తామని అన్నారు .ఈ కార్యక్రమంలో నాయకులు బత్తుల వేణు, బుడిగ శ్రీనివాస్, గోపతి బానేష్,గోపు రాజం,రామ కృష్ణ,బొద్దుల ప్రేమ్ సాగర్,పసరకొండ కృష్ణ,గోళ్ళ మల్లేష్,రామ్ సాయి,రవీందర్,గూడ సత్తయ్య, లచ్చులు, మహిళ నాయకురాళ్లు పందుల సునీత, కమల,జాలిగపు రాజేశ్వరి, మహిళలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

టిఎస్ఎస్ సిసిడిసి ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్.

జన్మదిన వేడుకల్లో పాల్గొన్న టిఎస్ఎస్ సిసిడిసి ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం..

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణంలోని ఉత్తమ్ గార్డెన్ లో ఈ రోజు జరిగిన విశ్రాంత సంగీత ఉపాద్యాయులు శంకర్ జోషి గారి మనమరాలు జన్మదిన వేడుకల్లో ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం గారు సతీ సమేతంగా పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు, ఈ కార్యక్రమంలో టి. రవికుమార్,చెంగల్ జైపాల్, తదితరులు పాల్గొన్నారు

ఆధ్వర్యంలో ఘనంగా మాజీ మంత్రివఎర్రబెల్లి దయాకర్ రావు.

తొర్రూరు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ మంత్రివఎర్రబెల్లి దయాకర్ రావు పుట్టినరోజు వేడుకలు

తొర్రూర్ డివిజన్ నేటి ధాత్రి

మాజీ మంత్రివర్యులు
గౌరవనీయులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారి జన్మదిన సందర్భంగా నేడు తోరూర్ డివిజన్ కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో తొర్రూర్ మండల మరియు పట్టణ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా బర్త్డే వేడుకలు నిర్వహించడం జరిగింది ముందుగా బాణాసంచా పేల్చి కేక్ కట్ చేసి దయన్నకు బిఆర్ఎస్ శ్రేణులు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపినారు. అనంతరం దయన్న అభిమానులు శ్రేయోభిలాషులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మెగా రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మధ్యాహ్నం మహా అన్నదాన కార్యక్రమం లో అందరూ పాల్గొని విజయవంతం చేశారు. అనంతరం పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో తొర్రూరు మండల పార్టీ అధ్యక్షులు పసుమర్తి సీతారాములు, మాజీ జెడ్పిటిసి జిల్లా ఫ్లోర్ లీడర్ మంగళ శ్రీనివాస్, మాజీ ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య,పట్టణ పార్టీ అధ్యక్షులు బిందు శ్రీనివాస్,తొర్రూర్ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ శ్రీరామ్ సుధీర్,పట్టణ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుమాండ్ల ప్రదీప్ రెడ్డి, తొర్రూర్ మండల మరియు పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శిలు నలమాస ప్రమోద్ ,కుర్ర శ్రీనివాస్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఎన్నమనేని శ్రీనివాసరావు, పెద్ద వంగర,మండల పార్టీ అధ్యక్షులు ఈదురు ఐలయ్య,కాలు నాయక్, కర్నే నాగరాజు, జై సింగ్, మాజీ కౌన్సిలర్ గుగులోత్ శంకర్ , పేర్ల జంపా,రాయిశెట్టి వెంకన్న ,మయూరి వెంకన్న ,లేగల వెంకటరెడ్డి, పినాకపాణి, కడెం యాకయ్య, మంగళపల్లి ఆశయ,స్వామి నాయక్, భూసాని ఉప్పలయ్య, దొనికెనా కుమారస్వామి, బాలు నాయక్, మెకానిక్ రాజు, గుగులోతు రమేష్, నిమ్మల శేఖర్, ముద్దం వీరారెడ్డి, మహిళా నాయకులు కల్లూరి కళావతి ,సుచరిత ,ముత్యాల సోమేశ్వరి,శీలం లింగన్న గౌడ్, గడిల సాయిలు, కొండ వెంకన్న బుర్రి మురళి, గుంటుక కుమార్, దానం రమేష్, పీఎం కృష్ణ, గుంటుక వెంకటేష్ ,దీకొండ శీను, పెద్ద బోయిన రామ్మూర్తి, మాలిక్, అనుదీప్ ,మారోజు నరేష్,,గోసంగి భాస్కర్, పల్లె యాకన్న గోన శ్రీను ,ఆవుల ఉపేందర్ ,రాగి జగదీశ్వర చారి పుట్ట మురళీకృష్ణ బొమ్మెర వినోద్ గడ్డం సృష్టి, బిఆర్ఎస్ తొర్రూర్ సోషల్ మీడియా అధ్యక్షులు యర్రం రాజు తదితరులు పాల్గొన్నారు

ఘనంగా మాజీ సిఎం రోశయ్య జయంతి వేడుకలు..

ఘనంగా మాజీ సిఎం రోశయ్య జయంతి వేడుకలు

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ గా వ్యవహరించిన కొణిజేటి రోశయ్య జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో అధికారికంగా జయంతి వేడుకలను జరిపారు రోశయ్య చిత్రపటానికి కలెక్టర్ డాక్టర్ సత్య శారద పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డి ఆర్ ఓ విజయలక్ష్మి, జెడ్పి సీఈఓ రామిరెడ్డి, డిఆర్డీఓ కౌసల్యాదేవి, డిబిసిడిఓ పుష్పాలత, కలెక్టరేట్ ఏ.ఓ విశ్వ ప్రసాద్, ఇతర అధికారులు, సంఘ నాయకులు, కలెక్టరేట్ లోని వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెద్దాం…

 

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెద్దాం…

◆: ప్రతిపక్ష బిఆర్ఎస్, బీజేపీ చీకటి ఒప్పందాలను బహిర్గతం చేద్దాం

◆: జహీరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ యువనాయకులు మహమ్మద్ షౌకత్.

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్వ వైభవం తేద్దామని జహీరాబాద్ యువనాయకులు రాంజోల్ మండలం మహమ్మద్ షౌకత్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న చారిత్రాత్మక పథకాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. పార్టీ శ్రేణులు, నాయకులు సమిష్టి కృషితో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. బిఆర్ఎస్, బీజేపీల చీకటి ఒప్పందాలను బహిర్గతం చేద్దామని, అలాగే ఉమ్మడి మెదక్ జిల్లాలో బలంగా ఉన్న ఆ పార్టీలను ఎదుర్కొనేందుకు నావంతు కృషి చేస్తానాని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పంట రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, భూభారతి, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, పేద వర్గాలకు 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్, రూ 500 లకే వంట గ్యాస్ సిలిండర్, తెల్ల రేషన్ కార్డుల మంజూరి, ఖాళీ పోస్టుల భర్తీ తదితర పథకాలు అమలుతో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. కష్టపడిన ప్రతి కార్యకర్తకు పార్టీలో సముచిత గౌరవం దక్కుతుందని, వారికి స్థానిక సంస్థల ఎన్నికలు, నామినేటెడ్ పోస్టుల భర్తీలో అవకాశం కల్పిస్తునదని స్పష్టం చేశారు. త్వరలో సంగారెడ్డి జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పర్యటించి పార్టీ శ్రేణుల కష్టసుఖాలను తెలుసుకోవడంతో పాటు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పూర్తిగా మంత్రి గారి మద్దతు ఉంటుందని తెలిపారు.

టిడిపి మాజి ఎంపీటీసీ ఎమ్మెల్యే మెగారెడ్డి సమీక్ష.

టిడిపి మాజి ఎంపీటీసీ ఎమ్మెల్యే మెగారెడ్డి సమీక్ష ములో కాంగ్రెస్ పార్టీ లో చేరిక

వనపర్తి నేటిదాత్రి :

 

 

గోపాల్ పేట్ మండల కేంద్ర నికి చెందిన
టిడిపి మాజీ ఎంపిటిసి రామచంద్రయ్య వనపర్తి ఎమ్మెల్యే తూ డి మేఘారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు యాదవ సంఘం అధ్యక్షుడిగా ఈ కార్యక్రమంలో టిపిసిసి వనపర్తి జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ కొంకి వెంకటేష్,ఉమ్మడి గోపాల్ పేట్ మండలలా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పోలికపాడు సత్య శీలా రెడ్డి,.మాజీ జెడ్పిటిసి మంద భార్గవి కోటిశ్వర్ రెడ్డి, శివన్న,గంట వెంకట్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.గోపా.ల్ పేట యాదవ సంఘము అధ్యక్షులు శ్రీశైలంమును శాలువతో ఎమ్మెల్యే మెగారెడ్డి.సన్మానించారు తెలుగుదేశం పార్టీనేత రామచంద్రయ్య కాంగ్రెస్ పార్టీలో చేరి న oదుకు ఎమ్మెల్యే మెగారెడ్డి అభినందించారు

మృతుని కుటుంబానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి పరామర్శ.

మృతుని కుటుంబానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి పరామర్శ
అనారోగ్యంతో మృతి చెందిన లింగమోరి గూడెం మాజీ ఉప సర్పంచ్ శ్రీహరి

ఐనవోలు నేటిధాత్రి:

ఐనవోలు మండలంలోని లింగమొరిగూడెం గ్రామంలో అనారోగ్యంతో మరణించిన మాజీ ఉప సర్పంచ్ బుర్ర శ్రీహరి గౌడ్ కుటుంబ సభ్యులను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. శ్రీహరి గౌడ్ భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ, శ్రీహరి గతంలో బి. ఆర్. ఎస్ పార్టీ కి ఎనలేని సేవ చేశారని భవిష్యత్లో మృతుని కుటుంబానికి అండగా నిలబడతామని మాజీ మంత్రి దయాకర్ రావు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బి. ఆర్. ఎస్ పార్టీ ఐనవోలు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ తక్కలపెల్లి చందర్ రావు జిల్లా నాయకులు మరుపట్ల దేవదాసు ఎస్. కె. జిందా ఎం.డి గ్రామ బి. ఆర్. ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఏపీ బీజేపీ కొత్త బాస్ మాజీ ఎమ్మెల్సీ మాధవ్.

ఏపీ బీజేపీ కొత్త బాస్ మాజీ ఎమ్మెల్సీ మాధవ్…

 

AP BJP Chief: ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడి పేరు ఖరారైందని ఎమ్మెల్సీ సోమువీర్రాజు తెలిపారు. కార్యకర్తలు, నాయకుల అభీష్టం మేరకు పేరు ఖరారైందన్నారు.

విజయవాడ, జూన్ 30: ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా (AP BJP New Chief) మాజీ ఎమ్మెల్సీ మాధవ్ (Former MLC Madhav) పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. అందరి అభిప్రాయాల మేరకు మాధవ్ పేరు ఖరారు చేసినట్లు సమాచారం. అయితే అధికారికంగా వెల్లడించే వరకు పేరు చెప్పవద్దని కమలం పార్టీ నాయకులకు అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. ఏపీ బీజేపీ చీఫ్‌ ఎంపిక నేపథ్యంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ కొత్త బాస్‌పై మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నేడు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయ్యిందన్నారు.రాష్ట్ర రాజకీయ పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. అధ్యక్ష పదవికి పేరు నిర్ణయం జరిగిపోయిందని చెప్పారు. కార్యకర్తలు, నాయకుల అభీష్టం మేరకు పేరు ఖరారైందన్నారు. అధికారికంగా అధ్యక్షుడి పేరు ప్రకటించడమే మిగిలి ఉందని ఎమ్మెల్సీ సోము వీర్రాజు పేర్కొన్నారు.బీజేపీ ఎన్నికల నియమావళికి అనుగుణంగా అధ్యక్ష ఎంపిక జరుగుతుందని కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ తెలిపారు. బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు నామినేషన్లు వేయడం, సాయంత్రం ఉపసంహరణ జరుగుతుందన్నారు. రేపు అధికారికంగా అధ్యక్షుని పేరు ప్రకటిస్తారన్నారు. రెండేళ్ల పదవీ కాలం ముగియడంతో ఈ ఎన్నిక జరుగుతోందని చెప్పారు. అధిష్టానం నిర్ణయాలను అందరూ గౌరవిస్తారని..స్వాగతిస్తారని కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ వెల్లడించారు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version