దొమ్మటి సాంబన్న కు రాజ్యసభ ఎంపీగా అవకాశం ఇవ్వాలి…

దొమ్మటి సాంబన్న కు రాజ్యసభ ఎంపీగా అవకాశం ఇవ్వాలి

పార్టీకోసం కష్టపడ్డా నాయకుడు సాంబన్న

అల్లం కార్తీక్ కాంగ్రెస్ యువ నాయకులు

పరకాల,నేటిధాత్రి

రాజ్యసభ ఎంపీగా దొమ్మటి సాంబయ్యకు అవకాశం కల్పించాలని కాంగ్రెస్ యువ నాయకులు అల్లం కార్తీక్ కోరారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా నిబద్ధతతో పనిచేస్తున్నారని
గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రజలతో మమేకమై సేవలందించారని పేర్కొన్నారు.అణగారిన వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉన్న నాయకుడని ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి సాంబన్న అని అన్నారు.రాజ్యసభలో ప్రజల గొంతుకగా నిలబడగల సామర్థ్యం సాంబన్నకు ఉందన్నారు.పేదలు,రైతులు, కార్మికుల సమస్యలను దేశవ్యాప్తంగా ప్రస్తావించగల ధైర్యం ఆయనకు ఉందని రాజకీయ అనుభవం,ప్రజాదరణ రెండూ ఉన్న నాయకుడిగా గుర్తింపు పొందారని పేర్కొన్నారు.అలాంటి సమయంలో సాంబన్నకు అవకాశం ఇవ్వడం సముచితమని సమాజంలోని వివిధ వర్గాల మద్దతు సాంబన్నకు ఉందని తెలిపారు.
పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని పరిగణించి అవకాశం ఇవ్వాలని కోరారు.

ఘనంగా మాయావతి 70వ జన్మదినోత్సవం…

ఘనంగా మాయావతి 70వ జన్మదినోత్సవం

పరకాల,నేటిధాత్రి

 

పట్టణకేంద్రంలో కేంద్రంలో నియోజకవర్గ ఇన్చార్జి కర్రె రమేష్ ఆధ్వర్యంలో బిఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి 70వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్చార్జి శనిగరపు రాజు హాజరై మాట్లాడుతూ ఈరోజు దేశం మొత్తం బహుజనులైన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు రాజ్యాధికార రుచి చూపించి గర్వించదగ్గ రోజు అని మనువాద రాజకీయ పార్టీల గుండెల్లో వణుకు పుట్టించిన నాయకురాలు మాయావతి అని అన్నారు.మాయావతిని దేశ బహుజన కులాలన్నీ కలిసి ప్రధానమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాకి శరత్ చంద్ర,జిల్లా నాయకులు పసుల వినయ్ అంబేడ్కర్,మేకల విష్ణు నియోజకవర్గ ఉపాధ్యక్షులు పసుల బిక్షపతి,పట్టణ అధ్యక్షురాలు మడికొండ రవళి,పార్టీ వార్డు మెంబర్లు శనిగరపు రాహుల్,శనిగరపు రజినీకాంత్,గూడెల్లి శంకర్, బొట్ల భాస్కర్,క్రాంతి కుమార్, మనోజ్ కుమార్,హరీష్,సతీష్,అనిల్, మహేష్,రంజిత్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version