అనర్హులను డబ్బులు బెడ్ రూమ్ ఇండ్లు…

అనర్హులను డబ్బులు బెడ్ రూమ్ ఇండ్లు

లబ్దిదారుల పట్ల పోలీసులు, అధికారులు వ్యవహరించిన తీరును ఖండిస్తున్నాం.

 

L1,L2,L3 కేటగిరిలు చేసిన వాటిని కూడా విస్మరించిన జిల్లా అధికారులు..

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.
భూపాలపల్లి పట్టణంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పంపిణీ కార్యక్రమంలో నిన్న ఏదైతే గతంలో ఎంపిక చేసిన లబ్దిదారుల పట్ల పోలీస్ అధికారులు వ్యవహరించిన తీరు గాని, అధికారులు వ్యవహరించిన తీరును బిఆర్ఎస్ పార్టీ తరుపున ముక్తకంఠంతో ఖండిస్తున్నాం.
లబ్దిదారులను పోలీస్ స్టేషన్ లో చెట్టు కింద నిల్చోబెట్టి వారిని దొంగలాగ, నేరస్థుడిలా ట్రీట్ చేయడాని ఖండిస్తున్నాం.

గతంలో మాజీ గండ్ర వెంకట రమణా రెడ్డి ఎంపికైన లబ్దిదారుల వివరాలను మున్సిపాలిటీ కార్యాలయంలో నోటీస్ బోర్డులో అంటించి ప్రజల అభ్యంతరాలను కోరిన తరువాత వాటిని పరిగణలోకి తీసుకున్న తరువాతనే లబ్ది దారులకు ఇళ్ళను కేటాయించడం జరిగింది.

కానీ జిల్లా అడిషనల్ కలెక్టర్ హౌసింగ్ డిపార్ట్మెంట్, పిడి అధికారులు దొంగలాగా, రహస్యంగా పోలీస్ బందోబస్తు నడుమ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను పంపిణీ చేయడం పనికిమాలిన చర్యగా పరిగణిస్తున్నాం.

L1,L2,L3 కేటగిరి జాబితా చేసి కూడా వాటిని విస్మరించి డబ్బులు తీసుకుని కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన పేర్లను లబ్దిదారులుగా పరిగణలోకి తీసుకోవడాన్ని ప్రజలు చీదరించుకుంటున్నారని ఏద్దేవా చేశారు.

ఇది చాలా బాధాకరమైన విషయం దీనికి పూర్తి బాధ్యత జిల్లా కలెక్టర్, జిల్లా అడిషనల్ కలెక్టర్, పీడీ, ఎమ్మెల్యే, మున్సిపల్ కమిషనర్ బాధ్యత వహించాలి.

గతంలో ఎంపిక చేసిన లబ్దిదారులను తొలగించడం సిగ్గుచేటు.

గతంలో ఎంపికైన లబ్ధిదారులలో అనర్హులను తొలగించి, అర్హులకు ఇవ్వాలి.

కానీ ఏదో పెద్ద పని చేసిన, ఏదో గొప్ప పని చేసినం అని చెప్పుకుంటే దానిని ఎవరిని ఒప్పుకోరు.

మీరు చేసిన ఈ తప్పిదం రానున్న ఎన్నికల్లో ప్రజలు మీకు బుద్ది చెప్పుతారు.

నిరుపేదలబ్దిదారుల పక్షాన పోరాడుతాం, కోర్టును ఆశ్రయించి న్యాయం జరిగే వరకు పోరాడతామని తెలియచేస్తున్నాం.
ఈ సందర్భంగా చెపుతున్నాం అనర్హుల జాబితా ఇచ్చే దమ్ము మాకుంది, వారిని తొలగించి అర్హులైన వారికీ ఇచ్చే దమ్ము మీకు ఉందా.
ప్రజలను వంచించే చర్యలను మానుకోవాలని బిఆర్ఎస్ పార్టీ తరుపున హెచ్చరిస్తున్నాం.
ప్రజల పక్షాన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి బిఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది. అని అన్నారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు

ఆజంనగర్–పెగడపల్లి రోడ్డు సమస్య…

బురదమయమైన రోడ్లు పట్టించుకోని అధికారులు

ఆజంనగర్ పెగడపల్లికి రోడ్డు మరమ్మత్తులు చేయాలి

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి రూరల్ మండలం ఆజం నగర్ గ్రామం నుండి పెగడపల్లికి సరైన రోడ్డు లేక మధ్యలో ఉన్న చిన్న వాగు భారీ వర్షాలు కురిసినట్లైతే దాటలేక పోతున్న రెండు గ్రామాల ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు ఆజాంనగర్ గ్రామ రైతులు పొలాల వద్దకు వెళ్లాలంటే చిన్న వాగు దాటి వెళ్లాలి అంటే రోడ్డు లేక బుర్దమయమైన రోడ్లో నడుచుకుంటూ వ్యవసాయ పనుల నిమిత్తం పొలాల వద్దకు వెళ్లాలంటే అనేక ఇబ్బందులకు గురవుతున్నారు
ఆజాంనగర్ ప్రగడపల్లి గ్రామాల మధ్య చిన్న వాగు పై బిర్జి నిర్మాణం లేక భారీ వర్షాలు కోవడం వలన రైతుల యొక్క డాక్టర్లు చిన్నవాగులో కొట్టుకపోయినా అయినా జిల్లా అధికారులు స్పందించడం లేదు ఇప్పటికైనా జిల్లా రైతులు స్పందించి ఆజంనగర్ పెగడపల్లి మధ్యలో ఉన్న చిన్న వాగుపై వంతెన నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు

 

* ఆజంనగర్ రైతు తుమ్మేటి దామోదర్ రెడ్డి ని వివరణ కోరగా ఆజంనగర్ పెగడపల్లి మధ్యలో మట్టి రోడ్డు ఉండడంతో మా రెండు గ్రామాల ప్రజలకు అనేక ఇబ్బందులకు గురవుతున్నాం వ్యవసాయ పని నిమిత్తం పనుల కోసం వెళ్లాలి అంటే రోడ్డుపై బురదలో నడుచుకుంటూ వెళ్లాలి అలాగే వర్షాకాలం వచ్చిందంటే భారీ వర్షాలు కురవడం వలన రోడ్డు మొత్తం బురదమయం అవుతుంది అలాగే రెండు గ్రామాల మధ్య ఉన్న చిన్న వాగు దాటలేక పోతున్నాం రెండు గ్రామాలకు రాకపోకలు బంద్ అవుతున్నాయి వ్యవసాయ పనులకు వెళ్లలేక పోతున్నాం గతంలో చిన్న వాగులో రైతుల వ్యవసాయ ట్రాక్టర్లు పనిముట్లు కొట్టుకపోయినా

* ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయ నాయకులకు ప్రజాప్రతినిధులకు జిల్లా అధికారులకు ఆజాంనగర్ పెగడపల్లి గ్రామాల ఓటర్లు గుర్తుకు వస్తున్నారు ఓట్లు వేయించుకొని తర్వాత మా గ్రామాల ప్రజలను మర్చిపోతున్న ప్రజా ప్రతినిధులు ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి చిన్నవాగుపై వంతెన నిర్మాణం చేపట్టాలని రెండు గ్రామాల ప్రజలు స్థానిక ఎమ్మెల్యేను జిల్లా కలెక్టర్ ను కోరుతున్నాం

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version