దళిత విద్యపై కాంగ్రెస్ కత్తి ఎస్సీ గురుకుల కాలేజీల కుదింపు.

దళిత విద్యపై కాంగ్రెస్ కత్తి ఎస్సీ గురుకుల కాలేజీల కుదింపు

నిరుపేద దళిత విద్యార్థులు గురుకుల విద్యకు దూరం

ఎస్సీ గురుకులాల సెక్రటరీ అలుగు వర్షిని సస్పెండ్ చెయ్యాలి

 

శాయంపేట నేటిధాత్రి:

 

రాష్ట్రవ్యాప్తంగా సాంఘిక సంక్షేమ గురుకులాలలో వివిధ చోట్ల జూనియర్ కళాశాలలో మూసివేయడానికి కుట్రలు చేస్తున్న ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తూ ఎస్సి విద్యా ర్థుల పట్ల వివక్షత చూపుతున్న సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి అలుగు వర్షిని తొల గించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ సంక్షేమం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడు తూ ఎస్సీ విద్యార్థుల కోసం పెద్ద పీఠం వేస్తున్న తరుణంలో సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి అలుగు వర్షిని జోగు లాంబ,గద్వాల ,కరీంనగర్, చొప్పదండి, ఖమ్మం, మహబూ బాద్, సిద్దిపేట, సంగారెడ్డి, కామారెడ్డి ,జయశంకర్ భూపాలపల్లి ,జనగాం మేడ్చల్ మల్కాజిగిరి,12 జిల్లాల ఎస్సీ గురుకులాల కళాశాలను సరిపడా విద్యార్థులు లేరని సాకులతో మూసివేయడం సరి కాదు. ఈ విషయం సీఎం రేవం త్ రెడ్డి చీఫ్ సెక్రటరీ గురుకుల మంత్రి పొన్నం ప్రభాకర్ కు టెట్ ద్వారా చేర్చపరచం 2025 విద్య సంవత్సరంలో నుండి అక్కడ చదువుతున్న విద్యా ర్థులు ఎక్కడికి పోవాలి తెలి యక ఆందోళన చెందుతు న్నారు ఈ నిర్ణయం పట్ల దళిత విద్యార్థులు తీవ్రంగా నష్టపో యే ప్రమాదం ఉందని వాపో యారు ఒకే కాలేజీలో రెండు కోర్సుల చొప్పున ఇంటర్ ప్రాథమిక సంవత్సరంలో 120 ద్వితీయ సంవత్సరంలో 120 మంది మొత్తం 240 సీట్లు ఉంటాయి. 12 గురుకులాల్లో జూనియర్ కళాశాలలు మూసి వేయడం వల్ల 28 సీట్లు రద్దు అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు దీనివల్ల నిరు పేద దళిత విద్యార్థులు గురుకుల విద్యను కోల్పోతారు. ఈ విష యాన్ని గమనించి సీఎం స్పందించి ఎస్సి విద్యార్థులను ఆదుకోవాలని అన్నారు.

ఉద్యమం తప్పదు

బిఎస్ యు ఉమ్మడి వరం గల్ జిల్లా అధ్యక్షుడు మంద సురేష్

గురుకుల కాలేజీ కుదుంపు కోర్సుల నిర్వహణపై పరిమి తులు విధించాలని సొసైటీ ఉన్నతాధికారుల నిర్ణయంపై ఒకవైపు విద్యార్థుల తల్లిదండ్రు లు మరోవైపు గురుకుల ఉద్యో గ ఉపాధ్యాయ యూనియన్ అనాలోచితంగా అసంబద్ధ మైన నిర్ణయాలు తీసుకుంటు న్నారని తప్పుడు పడుతు న్నారు గురుకుల సొసైటీ పూర్తిగా నిర్ణయం చేస్తే ఉద్యమాలు చేయడానికి ముందు ఉంటామని హెచ్చరించారు. ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే నిర్ణయం తీసుకోవాలని బీఎస్ యు డిమాండ్ చేశారు లేదంటే భారీ ఉద్యమం చేపడతామని  హెచ్చరించారు

గిరిజనులపై జరుగుతున్న దాడులను నిలిపివేయాలి.!

ఆపరేషన్ కగార్ పేరిట అమాయక గిరిజనులపై జరుగుతున్న దాడులను వెంటనే నిలిపివేయాలి

గుండాల,నేటిధాత్రి:

 

గుండాల మండల కేంద్రంలో ఓ ప్రైవేట్ కార్యక్రమం కు వచ్చిన టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జి గోపగాని శంకర్ రావు మండల విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ
మన పొరుగు రాష్ట్రమైన చత్తీస్గడ్ లో ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసి ప్రజానీకాన్ని స్వదేశీ, విదేశీ కార్పోరేట్ కంపెనీల ప్రయోజనాల కోసం హతమారుస్తున్న విధానాన్ని దేశంలోని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు తీవ్రంగా ఖండిస్తున్న కేంద్రంలోని మనువాద మతోన్మాద ప్రభుత్వం నిసిగ్గుగా మావోయిస్టుల ఏరివేత పేరుతో అనేకమంది పేరుతో అనేకమంది ఆదివాసి యువకులను దారుణంగా చంపి రాజ్య హింసకు పాల్పడుతూ మధ్య భారత దేశంలోని ఆదివాసి ప్రజానీకం. జల్, జంగల్, జమీన్ కోసం పోరాడుతూ అడవిని, అడవిలో గల సహజ, ఖనిజ సంపదను రక్షించుకునేందుకు సాగిస్తున్న విరోచత పోరాటాలపై కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నిర్బంధాన్ని, హత్యకాండను ప్రతికటిద్దాం
ఈ దేశ మూలవాసులు అనాదిగా అడవిని వాగులు, వంకలు, ఒర్రెలు, చెట్టు పుట్ట మరియు మూగజీవాలతో సహజీవనం చేస్తూ, తర తరాలుగా అడవినే నమ్ముకుని జీవనం గడుపుతున్న ఆదివాసి ప్రజానీకాన్ని, అడవి నుండి ఖాళీ చేసి, సహజ, ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థలకు ధారా దత్తం చేసేందుకు కుటిల రాజనీతిని ప్రదర్శిస్తూ ఆదివాసీల మనుగడను ప్రశ్నార్ధకంగా మార్చింది. ఒక ప్రక్కన మావోయిస్టులను దేశంలో నుండి ఏరిపారేసామని గొప్పలు చెబుతున్న పాలకులు, ఈనాడు ఇంకా మావోయిస్టులు ఉన్నారన్న నెపంతో అడవిలో ప్రశ్నించే శక్తులు లేకుండా కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసం వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామిక వాదులు ముక్తకంఠంతో ఖండించాలన్నారు.భారతదేశ రాష్ట్రపతి 5. 6 షెడ్యూల్ ప్రాంతంలో జన్మించి రాజకీయంగా ఎదిగి, ఈనాడు ఆయా తెగల మీద ఫాసిస్టు ప్రభుత్వం ఆదివాసీలపై ఆపరేషన్ కగారు పేరుతో హననం చేస్తుంటే, మౌన ముని వలె ప్రేక్షక పాత్ర పోషించడం తగదు. దేశ సరిహద్దు ప్రాంతంలో ఉండవలసిన సైన్యం ఆదివాసి గూడాలపై పడి మరణ హోమం కలిగించడం బాధాకరం.
ప్రజలు ప్రజాస్వామిక వాదులు, ప్రజా సంఘాలు ఆదివాసీలకు అండగా నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆట, పాట, వేట, ఆదివాసీల సంస్కృతి, వారిని అడవికి దూరంగా పారామిలటరీ దళాలు తరుముతున్నాయి. తెలంగాణలో పారా మిలటరీ మరియు బిఎస్ఎఫ్ క్యాంపులను సత్వరమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గొల్లపల్లి రమేష్ పాల్గొన్నారు.

జహీరాబాద్: ఉగ్రవాదుల దాడులకు నిరసనగా ర్యాలీ.

జహీరాబాద్: ఉగ్రవాదుల దాడులకు నిరసనగా ర్యాలీ

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

కాశ్మీర్ లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడులకు నిరసనగా బుధవారం యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు పట్లోళ్ళ నాగిరెడ్డి ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించి, ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం ఉగ్రవాదుల దాడులలో 26 మంది మృతి చెందిన వారికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ విభాగం రాష్ట్ర కార్యదర్శి హర్షవర్ధన్ రెడ్డి, సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

ఉగ్రవాదుల దాడులకు నిరసనగా కాగడాల ర్యాలీ.

జహీరాబాద్: ఉగ్రవాదుల దాడులకు నిరసనగా కాగడాల ర్యాలీ.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

 

కాశ్మీర్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు చేసిన దాడులకు నిరసనగా కాగడాల ర్యాలీ నిర్వహించారు. బుధవారం రాత్రి యువజన కాంగ్రెస్ విభాగం జిల్లా అధ్యక్షుడు నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో జహీరాబాద్ పట్టణంలోని ఐపీ గెస్ట్ హౌస్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. దాడులలో మృతి చెందిన వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.

ప్రజాసమస్యలపై పోరాటం దాడు లకు బయపడo ఐక్యవేదిక.

ప్రజాసమస్యలపై పోరాటం దాడు లకు బయపడo ఐక్యవేదిక

వనపర్తి నేటిదాత్రి :

 

ప్రజా సమస్యలపై 45 రోజుల పాటు కమిటీలు వేస్తూ, వారోత్సవాలు, జరపాలని నిర్ణయం తీసుకున్నామని అఖిలపక్ష ఐక్యవేదిక వనపర్తి జిల్లా.అధ్యక్షులు సతీష్ యాదవ్ తెలిపారు
సతీష్ యాదవ్ నివాసంలో విలేకరుల తో ఆయన మాట్లాడుతూ, అఖిలపక్ష ఐక్యవేదిక రిజిస్టర్ అయీ నాలుగు సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా ప్రజా సమస్యలపై వినూత్నంగా వారోత్సవాలు జరిపాలని నిర్ణయించడం జరిగిందని, ఇంతకుముందు ప్రజలు వచ్చి సమస్యలు చెప్పేవారని, ఇకనుండి ప్రజల వద్దకే పోయి సమస్యలను స్వీకరించి వార్డు, ఊరు, మండలం, జిల్లా కమిటీలు వేయడం జరుగుతుందని, ప్రజలు చెప్పే సమస్యలన్నీ ప్రభుత్వ దృష్టికి అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని అవి పరిస్కారమయ్యే వరకు పోరాడుతామని, ఇప్పటివరకు మాపై జరిగిన దాడులు సమర్థవంతంగా ఎదుర్కొన్నామని, ఇకపై ఎవరైనా మాపై దాడులు చేయాలని చూస్తే ప్రజల సమక్షంలోని ఎదుర్కొంటామని, దాడులకు భయపడమని అన్నారు
ఈ సమావేశంలో సతీష్ యాదవ్ తో , వెంకటేశ్వర్లు, కొత్త గొల్ల శంకర్, గౌనికాడి యాదయ్య, బొడ్డుపల్లి సతీష్, గంధం భరత్, శివకుమార్, పుట్టపాక బాలు,పాషా,కుమార్, శ్రీనివాసులు, సురేష్, రాముడు, కృష్ణయ్య, నాగరాజు, అన్వర్ తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version