ధమ్మచక్ర పరివర్తన దినం…

ధమ్మచక్ర పరివర్తన దినం

-బహుజన సమాజ్ పార్టీ మండల ఉపాధ్యక్షులు మనోజ్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పూర్వ భారత దేశ పూర్వ మత మైనటువంటి బౌద్ధ మతాన్ని స్వీకరించినటువంటి శుభదినం ఈరోజు ఆయన నాగపూర్ పట్టణంలో బౌద్ధాన్ని స్వీకరించినటువంటి శుభదినా రోజునా పర్లపెల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం పుష్పాలంకరణ కార్యక్రమం బహుజన సమాజ్ పార్టీ మండల ఉపాధ్యక్షులు మనోజ్ ఆద్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రత్న భాస్కర్ , బీసీ సంఘం నాయకులు ఆకుతోట రమేష్, పొన్నం రమేష్, నియోజకవర్గ అధ్యక్షులు పుల్యాల భగత్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యకమం లో మనోజ్ మాట్లాడుతూ…ధమ్మచక్ర పరివర్తన దినం అంటే డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ , ఆయన అనుచరులు హిందూ మతం నుండి బౌద్ధమతాన్ని స్వీకరించిన రోజును సూచిస్తుంది. ఈ సంఘటన 1956 అక్టోబర్ 14న నాగ్‌పూర్‌లోని దీక్షాభూమిలో జరిగింది, అప్పటి నుండి ఈ రోజును బౌద్ధ పండుగగా జరుపుకుంటారు.

జహీరాబాద్‌లో ఉప్పిట్ హోటల్ ప్రారంభం…

ఉప్పిట్ హోటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం..

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహిరాబాద్ పట్టణం దత్తగిరి కాలనిలో జరిగిన ఉప్పిట్ హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం పాల్గొని నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు,ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ నామా రవికిరణ్,విష్ణువర్ధన్ రెడ్డి,చల్లా శ్రీనివాస్ రెడ్డి,చెంగల్ జైపాల్,సంగారెడ్డి,బి.విఠల్,నరేష్,మనోజ్,దిలీప్,తదితరులు పాల్గొన్నారు

భూవివాదంలో మహిళను హత్య చేసిన మనోజ్..

భూవివాదంలో మహిళను హత్య చేసిన మనోజ్ అనే రౌడి షీటర్ పై పీడీ యాక్ట్ నమోదు.

నిందుతుడు మనోజ్ కి పిడి యాక్ట్ నిర్బంధ ఉత్తర్వులు అందజేసి శుక్రవారం రోజున చందుర్తి సి.ఐ ఆధ్వర్యంలో చర్లపల్లి జైలు కి తరలించినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపీఎస్ గారు ఒక ప్రకటనలో తెలిపారు.

2023 సం.లో హత్య కేసులో, దొంగతనం , బెదిరింపులకు పాల్పడిన కేసులలో నిందుతుడిగా మనోజ్..

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న మనోజ్ పై 2024 సంవత్సరంలో రౌడి షీట్ ఓపెన్.

నిందుతులు వివరాలు.
1.బొల్లు మనోజ్ s/o స్వామి వయస్సు:20 సంవత్సరాలు

చందుర్తి, నేటిధాత్రి:

చందుర్తి మండలానికి చెందిన బొల్లు మనోజ్ అనే వ్యక్తి మహిళ హత్య కేసు తో పాటుగా, హత్య కేసులల్లో, దొంగతనం,బెదిరింపులకు పాల్పడిన కేసులలో నిందుతుడిగా ఉండి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ తరచు ప్రజలను భయబ్రాంతులకు గురి చేయగా 2024 సంవత్సరంలో మనోజ్ పై రౌడి షీట్ ఓపెన్ చేసి పలు మార్లు కౌన్సెలింగ్ నిర్వహించిన మనోజ్ ప్రవర్తనలో ఎలాంటి మార్పు రానప్పటికి తరచు నేరాలకు పాల్పడుతు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్నందున జిల్లా కలెక్టర్ గారు పిడి యాక్ట్ అమలు చేయడానికి ఉత్తర్వులు జారీ చేయగా చందుర్తి సి.ఐ వెంకటేశ్వర్లు మనోజ్ కి పిడి యాక్ట్ నిర్బంధ ఉత్తర్వులు అందజేసి నిందుతుణ్ణి చర్లపల్లి జైలుకు తరలించడం జరిగింది.

జిల్లాలో ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించబోమని జిల్లా ఎస్పీ గారు ఈసందర్భంగా హెచ్చరించారు. జిల్లాలో ఉన్న రౌడి షీటర్స్ పై పాత కేసులలో ఉన్న నెరస్థులపై నిత్యం పోలీస్ నిఘా ఉంటుందని, గతంలో పలు కేసులల్లో నిందుతులగా ఉండి తరచు నేరాలకు పాల్పడే వారిపై పిడి యాక్ట్ అమలు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version