అఖిల్ రిసెప్షన్.. మహేష్ టీ షర్ట్ ధరపై చర్చ

అఖిల్ రిసెప్షన్.. మహేష్ టీ షర్ట్ ధరపై చర్చ

 

సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu).. రీల్ లోనే కాదు రియల్ గా కూడా ఎంతో స్టైలిష్ గా కనిపిస్తాడు.

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu).. రీల్ లోనే కాదు రియల్ గా కూడా ఎంతో స్టైలిష్ గా కనిపిస్తాడు. ప్రస్తుతం SSMB29 సినిమాతో బిజీగా ఉన్న మహేష్ తాజాగా అఖిల్ అక్కినేని(Akhil Akkineni) రిసెప్షన్ లు కుటుంబ సమేతంగా హాజరై నూతన దంపతులను ఆశీర్వదించాడు. మహేష్ తో పాటు నమ్రత(Namrata) , సితార కూడా ఈ వేడుకలో సందడి చేశారు. అఖిల్- జైనబ్ వివాహం జూన్ 6 న జరిగిన విషయం తెల్సిందే. ఇరు వర్గాల కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో సింపుల్ గా ఈ వివాహం జరిగింది. ఇక జూన్8 న వవీరి రిసెప్షన్ గ్రాండ్ గా నిర్వహించారు.

 

ఇండస్ట్రీ నుంచి స్టార్ సెలబ్రిటీలు అందరూ ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ వేడుకలో మహేష్ బాబు సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా మారాడు. ఎంతో సింపుల్ గా కనిపించినా.. అందరి చూపు మహేష్ పైనే ఉంది అని చెప్పొచ్చు. ఇక మహేష్ ధరించిన టీ షర్ట్ ను చూసి ముచ్చటపడిన అభిమానులు.. అలాంటి టీ షర్ట్ నే కొనడానికి, దాని రేటు ఎంత అని గూగుల్ చేసి ఖంగు తిన్నారు.

ఆలివ్ గ్రీన్ కలర్ లో ఫ్లవర్ డిజైన్ తో ఉన్న టీ షర్ట్ హెర్మ్స్ అనే ఇంటర్నేషనల్ బ్రాండ్ తయారుచేసింది. దీని విలువ అక్షరాలా రూ. 1.51 లక్షలు. నమ్మడానికి వీలు లేకున్నా అది నిజం. అది సూపర్ స్టార్ రేంజ్. మొదటి నుంచి మహేష్ బయటకు చాలా సింపుల్ గా వచ్చినా చాలా కాస్ట్లీ దుస్తులు ధరిస్తూ ఎప్పటికప్పుడు అభిమానులకు షాక్ లు ఇస్తూనే ఉంటాడు. ఇక టీ షర్ట్ ధర లక్షల్లో ఉండడంతో నెటిజన్స్.. ఆమ్మో ఒక్క టీ షర్ట్ ధర అంతనా అని నోర్లు వెళ్లబెడుతున్నారు. ప్రస్తుతం మహేష్ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారింది.

ఎవరైనా సరే ఆధారాలు ఉంటే నిజ నిర్ధారణ చర్చకు సిద్ధం.

ఎవరైనా సరే ఆధారాలు ఉంటే నిజ నిర్ధారణ చర్చకు సిద్ధం…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీసులోఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎంపిటిసి రాము మాట్లాడుతూ. నేను పార్టీలు మారిన ప్రజల సంక్షేమం కోసం మారిన కానీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు .నేను తప్పు చేశానని ఆధారాలు ఉంటే తీసుకురండి చర్చకు సిద్ధంగా ఉన్నాను సోషల్ మీడియాలో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిపై తప్పుడు ఆరోపణలు చేసి రాక్షసానందo పొందాలని కుట్రలు మానుకోవాలని నిజా నిజాలు తెలుసుకొని రుజువు చేయాలని ఆధారాలు ఉంటే చర్చకు రావాలని వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా సోషల్ మీడియా వేదిక గా పోస్టులు పెట్టడం నాపై అసత్య ఆరోపణలు చేసిన వారిపై చట్టపరంగా ముందుకు వెళ్తానని పరువు నష్టం దావా వేసి న్యాయపోరాటం చేస్తానని నా గురించి నా గ్రామ ప్రజలకు నా గురించి తెలుసు తెలుసు అని. మీ ప్రభుత్వ హాయంలో పేదలు ప్రజల భూములను అన్యాయం గుంజుకొని ఇబ్బందులు పెట్టింది మీరు కాదా. మరోసారి నాపై అసత్య ఆరోపణ చేస్తే సహించేది లేదు ఇకనైనా నేను తప్పు చేశానని ఆధారాలు ఉంటే తీసుకురండి ఎక్కడైనా ఎక్కడైనా చర్చకు సిద్ధంగా ఉన్నాను తప్పుడు ఆరోపణలు మానుకోవాలని తమపై ఆరోపణలు చేసిన వారికి తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ మండల బీసీ సెల్ ప్రెసిడెంట్ మల్లేష్ యాదవ్ హ్యూమన్ రైట్స్ జిల్లా ప్రెసిడెంట్ భరత్ గౌడ్ జలంధర్ రెడ్డి చరణ్ యాదవ్ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version