పోలీసు అమరవీరుల ప్రాణత్యాగాలు చిరస్మరణీయం….

పోలీసు అమరవీరుల ప్రాణత్యాగాలు చిరస్మరణీయం

వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్

ఘనంగా అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలు

వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట,నేటిధాత్రి:

 

శాంతి భద్రతల పరిరక్షణకై ప్రాణత్యాగాలు చేసిన పోలీస్ అమరవీరులు ప్రజల గుండెల్లో చిరస్మరణీయం నిలిచిపోతారని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోని అమరవీరుల స్థూపం వద్ద పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని (ఫ్లాగ్ డే)ను ఘనంగా ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గత ఏడాది నుండి ఇప్పటి వరకు దేశంలో విధినిర్వహణలో మరణించిన 191 మంది పోలీస్ అమరవీరుల పేర్లను అదనపు డీసీపీ రవి చదివి వినిపించారు.అనంతరం ముఖ్య అతిధిగా పాల్గోన్న వరంగల్ పోలీస్ కమిషనర్ తో పాటు శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి,కె. ఆర్ నాగరాజు,వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు డాక్టర్ సత్య శారద,స్నేహ శబరిష్,గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహాత్ బాజ్ పాయి,ఎన్డిపిసిఎల్ సి యండి వరుణ్ రెడ్డి,ఎన్సిసి గ్రూప్ కమాండర్ కర్నల్ సచిన్ అన్నారావు,.

కర్నల్ రవి,వరంగల్ ఈస్ట్ జోన్ డిసిపి అంకిత్ కుమార్,అదనపు డిసిపిలు సురేష్ కుమార్, ప్రభాకర్ రావు శ్రీనివాస్, బాలస్వామి,రెడ్ క్రాస్ రాష్ట్ర పాలక మండలి సభ్యుడు ఈ.వి శ్రీనివాస్ రావుతో పాటు ఏసిపిలు, ఇన్స్ స్పెక్టర్లు, ఆర్ఐలు,ఎస్ఐలు పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులు, ఇతర పోలీస్ సిబ్బంది పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద పుష్పాగుచ్చాలతో ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆర్ఐ స్పర్జన్ సారధ్యంలో సాయుధ పోలీసులు ‘శోక్ శ్రస్త్ చేసి మరణించిన పోలీసు అమరవీరులకు పోలీసు అధికారులు, సిబ్బంది,అమరవీరుల కుటుంబ సభ్యులు మౌనం పాటించారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రజల సేవకోసం తమ ప్రాణాలను ఆర్చించిన పోలీసులు మహనుభావులని, పోలీసు అమరవీరుల చూపిన మార్గదర్శకాన్ని అనుసరిస్తూ, ప్రజల శ్రేయస్సు కోరకు

పాటుపడాలన్నారు. ప్రజల్లో మంచి పేరు రావాలంటే చిత్తశుద్ధి, నీతి, నీజాయితీతో పనిచేయాల్సి వుంటుందని పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల త్యాగాలను మరువలేమని, వారు ఎల్లప్పుడు మన గుండెల్లోనే వుంటారన్నారు. వారు మన మధ్య లేనకున్నా మనం వారిని స్మరిస్తునే ఉంటామని చెప్పారు. అసువులు బాసిన అమరవీరుల కుటుంబాలను కాపాడుకోవల్సిన భాధ్యత మనందరిపై వుందని, వారికి ఎలాంటి సమస్య వున్న వారికి పోలీస్ విభాగం తరుపున పూర్తి సహకారం అందజేయడం జరుగుతుందని పోలీస్ కమిషనర్ తెలిపారు.అనంతరం పోలీస్ కమిషనరేట్ కార్యాలయము నుండి మిషన్ హస్పటల్ వరకు నిర్వహించిన ర్యాలీలో శాసన సభ్యులు,పోలీసులు,అధికారులు, సిబ్బంది పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులతో పాటు పోలీసు జాగృతి కళాబృందం

సభ్యులు పాల్గొన్నారు.

పోలీసు అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మరువలేనివి..

పోలీసు అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మరువలేనివి..

సమాజంలో శాంతి భద్రతలు కాపాడటానికి ప్రాణత్యాగం…

ప్రజలందరూ పోలీసుల పట్ల గౌరవభావం కలిగి, సమాజ శాంతి భద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలి..

అమరవీరుడు పెరుగు రవి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే నాగరాజు

హన్మకొండ జిల్లా (నేటిధాత్రి):

 

సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం అనుక్షణం అలుపెరగని కృషి చేస్తున్న పోలీసుల సేవలు వెలకట్టలేనివి నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా హన్మకొండ జిల్లా హసన్పర్తి మండల పరిధిలోని నాగారం గ్రామానికి చెందిన అమరవీరుడు గ్రేహౌండ్స్ జూనియర్ కమాండర్ పెరుగు రవి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి దేశానికి చేసిన సేవ స్మరించుకున్న గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజుఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ మన సమాజంలో శాంతి భద్రతలు కాపాడటానికి ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మరువలేనివి. వారు దేశం కోసం, ప్రజల కోసం తమ ప్రాణాలను అర్పించి అపారమైన ధైర్యసాహసానికి నిదర్శనంగా నిలిచారు. అమరవీరులు చూపిన త్యాగమార్గం ప్రస్తుత పోలీసు సిబ్బందికి, యువతకు స్ఫూర్తిదాయకంగా ఉండాలి. ప్రభుత్వం ఎల్లప్పుడూ పోలీసు శాఖ సంక్షేమం కోసం కృషి చేస్తుంది. ప్రజలందరూ పోలీసుల పట్ల గౌరవభావం కలిగి, సమాజ శాంతి భద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో హసన్పర్తి మండల పార్టీ అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు రాజి రెడ్డి, బీసీ సెల్ మండల అధ్యక్షుడు, నక్క రవి, మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎం.డి అన్వర్ కాంగ్రెస్ నాయకులు బండారి మొగిలి, చాందరాజు సంతోష్, మల్లాడి తిరుపతి రెడ్డి, వీరబోయిన రవి, బైరి సునీల్, లింగారెడ్డి, రవి, స్వర్ణలత, రావుల శ్రీకాంత్ తో హసన్పర్తి పోలీస్ స్టేషన్ సిఐ చేరాలు, ఎస్సై రవి, సిబ్బంది తో పాటు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు….

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version