నూతన జహీరాబాద్ రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్ దేవుజా గారికి స్వాగతం పలికిన
◆:- పి.రాములు నేత
జహీరాబాద్ నేటి ధాత్రి:
జాగో తెలంగాణ వ్యవస్థాపకులు జహీరాబాద్ నూతన రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్ గా విచ్చేసిన అధికారి గారికి జాగో తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు పి.రాములు నేత గారు వారి కార్యవర్గంతో వెళ్లి ఘనంగా స్వాగతం పలికారు తర్వాత కార్యక్రమంలో జహీరాబాద్ లో తిష్ట వేసిన కొన్ని సమస్యలపై చర్చించగా సానుకూలంగా స్పందించిన రెవిన్యూ డివిజన్ అధికారి త్వరలో సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేసి దశలవారీగా సమస్యలను అన్నిటిని ఒక్కొక్కటిగా పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చినారు కార్యక్రమంలో జాగో తెలంగాణ వ్యవస్థాపక ప్రధాన కార్యవర్గ సభ్యులు మహమ్మద్ ఇమ్రాన్ మాదినం శివప్రసాద్ మహమ్మద్ ఫసియోద్దీన్ అరవింద్ పేర్ల దశరథ్ పాల్గొని రెవిన్యూ డివిజనల్ అధికారికి శాల్వా పూలమాలతో సన్మానించినారు,