నూతన తాసిల్దార్ని సన్మానించిన మాజీ సర్పంచ్.

నూతన తాసిల్దార్ని సన్మానించిన మాజీ సర్పంచ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

న్యాల్కల్ మండల్ నూతన తహశీల్దారిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి మల్గి గ్రామానికి భూభారతి గ్రామ రెవెన్యూ సదస్సుకు విచ్చేసిన ఎమ్మార్వో ప్రభులు సార్ గారికి సన్మానించిన మాజీ సర్పంచ్ జట్గొండ మారుతి వారితో పాటు బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు సిద్ధారెడ్డి మైనార్టీ నాయకులు అఖిల్ మియా తదితరులు పాల్గొన్నారు.

పేదోడికి దక్కని ఇందిరమ్మ ఇల్లు.

పేదోడికి దక్కని ఇందిరమ్మ ఇల్లు

మొదటి జాబితాలో పేరు న్న ఆ తర్వాత మాయం

ఇందిరమ్మ కమిటీల మాయాజాలం

పంతపాడుతున్న అధి కారులు

శాయంపేట నేటిధాత్రి:

 

 

 

 

శాయంపేట మండలం పత్తిపాక గ్రామంలో వైద్యుల రాజిరెడ్డి నిరుపేద కుటుంబం రేక్కాఆడితే గాని డొక్కా నిండని పరిస్థితి. నిత్యం కూలి పని చేస్తూ ఇద్దరి కూతుర్ల పెళ్లి చేసి కష్టంగా జీవనం కొనసాగిస్తున్నారు నిజానికి తమకంటే గ్రామంలో నిరుపేదలు ఉండరని పై అధికారులు వచ్చి చూస్తే అన్ని తెలుస్తాయని వారు అంటు న్నారు. గ్రామసభలు జరిగినప్పుడు తమ పేర్లు ఉన్నాయని చెప్పి ఇప్పుడు తమ పేర్లు కనిపించకపోకుండా చేశారని వారు బోరు మంటున్నారు. గ్రామంలో 35 ఇండ్లు వస్తే ముందుగా ఉండాల్సిన తమ పేరు లేకపోవడం ఎంపికలో ఎంత అన్యాయం జరిగిందో చెప్పడానికి నిదర్శనం అంటున్నారు నాకు ఇద్దరు ఆడబిడ్డల పెళ్లి చేసి ఇల్లు లేక గుడిసెలలో నివసించి, ప్రజల సహకారంతో అద్దె ఇంట్లో జీవనం కొనసాగిస్తున్నాము. ఇందిరమ్మ ఇండ్లు పూర్తిగా అర్హులకే ఇస్తాం ఎవరు ఎటువంటి అక్రమాలకు పాల్పడిన సహించే లేదంటూ చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు నీటిముట్టలేనా!

ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటేస్తే ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం

Indiramma’s committees.

 

 

ఎన్నికల్లో చేత గుర్తుకు ఓటేస్తే ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం అన్నారు చేత గుర్తుకు ఓటేసినా మాకు ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వలేదు ఇద్దరు ఆడబిడ్డలతో కూలి పని చేసుకుని బతుకుతున్న ఊళ్లో నాకంటే పేదవాళ్ళు ఎవరూ లేరు గ్రామంలో 35 మందికి ఇల్లు వస్తే నాలాంటి పేదోడికి మాత్రం రాలేదు ఒకసారి మా గ్రామానికి వచ్చి మేము చెప్పేది నిజము కాదా చూస్తే తెలుస్తుంది

మా పేదరికం కనబడలేదా!
శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన వైద్యుల రాజిరెడ్డి దంపతులు కూలి పని చేస్తూ ఇద్దరూ కూతురుపెళ్లిళ్లు చేసి జీవనో పాధి సాగడం చాలా ఇబ్బం దిగా మారింది. ఉండడానికి ఇల్లు లేక అద్దె ఇంట్లో చాలా కష్టంగా నివసిస్తున్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మా కుటుంబం పట్ల చొరవ చూపి నిరుపేద కుటుంబానికి ఆసరా చూపాలని ఆవేదన వ్యక్తం చేశారు

అప్పుడున్న పేరు ఇప్పు డేమైనట్లు!

ఇందిరమ్మ ఇండ్లు కోసం అందరిలాగే దరఖాస్తు చేసుకున్నాం గ్రామ సభలో మా పేరు చదివినప్పుడు మాకు ఇల్లు వస్తుందని అనుకున్నాం ఇప్పుడు మాత్రం లేదంటు న్నారు గ్రామపంచాయతీ ఆఫీసర్లను అడిగితే పైనుంచి పేర్లు వచ్చినాయి మమ్మల్ని ఏమి చేయమంటారు అన్నారు మాకు ఏమి సంబంధం లేదన్నారు గ్రామంలో మాకంటే పేదవారు ఎవరూ లేరు ఆర్థికంగా ఉన్న వాళ్లకు నాయకుల దగ్గర ఉన్నోళ్లకు మాత్రం ఇండ్లు వచ్చినాయి మేము ఏం పాపం చేసిన్నా మని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యుల రాజిరెడ్డి దంపతులు, ప్రకాశ్ రెడ్డి, మహిళలు ప్రజలు అధిక మొత్తంలో పాల్గొన్నా

వివేక్ కు మంత్రి పదవి పట్ల హర్షం.

వివేక్ కు మంత్రి పదవి పట్ల హర్షం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వేంకట స్వామి మాలకి తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ లో మంత్రిగా స్థానం లభించిన విషయం విదితమే. ఈ విషయం పట్ల అంబేడ్కర్ యువజన సంఘం జహిరాబాద్ నియోజకవర్గం అద్యక్షులు డి.శ్రీనివాస్ సోమవారం ఉదయం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అఖిలపక్షం బహిరంగ లేఖ…

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అఖిలపక్షం బహిరంగ లేఖ…

నేటి ధాత్రి – గార్ల :-

 

 

 

ప్రజా సమస్యలపై తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సోమవారం మండల కేంద్రంలో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో బహిరంగ లేఖను విడుదల చేశారు.

2016లో ఇల్లందు, మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల సాగు, త్రాగు నీటి అవసరాల కోసం శంకుస్థాపన చేసిన సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్,రోల్లపాడు ప్రాజెక్టును 2018లో సీతారామ ప్రాజెక్టును రీ ఇంజనీరింగ్, రిడిజైన్ చేపించి సీతారామ ప్రాజెక్టును సత్తుపల్లి, అశ్వరావుపేట, వైరా, ఖమ్మం, పాలేరు ప్రాంతాలకు అక్రమంగా దారి మల్లించడం జరిగింది.

ఏజెన్సీ గిరిజన ప్రాంతంగా ఉన్న మహబూబాబాద్, ఇల్లందు, డోర్నకల్ నియోజకవర్గాల ప్రాంతాలకు తీరని అన్యాయం చేశారు.

సీతారామ ప్రాజెక్ట్ రీ డిజైన్ లో అనేక అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయి.

సీతారామ ప్రాజెక్ట్ దారి మళ్లింపు పై, ఆ ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి అక్రమాలపై తగు విచారణ జరిపించి మొదటి డిపిఆర్ ప్రకారం సీతారామ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి ఇల్లందు మహబూబాబాద్ డోర్నకల్ నియోజకవర్గాల బీడు భూములకు సాగునీరు ఇక్కడి ప్రజలకు త్రాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.

పాఖాలేరు అలిగేరు కలిసేచోట గార్ల మండలం, ముల్కనూరు గ్రామం వద్ద మున్నేరు ప్రాజెక్ట్ నిర్మాణం కోసం గత 50 సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు, మున్నేరు ప్రాజెక్టు నిర్మాణం ఎన్నికల వాగ్దానం గానే మిగిలిపోతుంది.

ఈ ప్రాజెక్టు నిర్మించడం వల్ల గార్ల, బయ్యారం, కారేపల్లి, కామేపల్లి, ఖమ్మం రూరల్, డోర్నకల్, కురవి, మహబూబాబాద్, మరిపెడ తదితర మండలాలకు సాగు, త్రాగు నీరు అందించవచ్చు.

గత ప్రభుత్వాలు అనేకసార్లు సర్వేలు, జీవోలతో కాలం వెళ్ళదీశారు.

తెలంగాణ ఉద్యమంలో సైతం మున్నేరు ప్రాజెక్టు నిర్మాణం అనేది ప్రధాన ఏజెండాగా ఉన్నది.

తెలంగాణ ఏర్పడి 11 ½ సంవత్సరాలు అయినప్పటికీ ఈ ప్రాజెక్టు నిర్మాణం మీద ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు.

వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో మున్నేరు ప్రాజెక్టు నిర్మాణం కోసం 136 కోట్ల రూపాయల వ్యయంతో మున్నూరు ప్రాజెక్టుకు అనుమతులు ఇస్తూ 1076 జీవో విడుదల చేసినప్పటికీ ఆ తర్వాత కాలంలో ఆ జీవోను పట్టించుకున్న పాపానా పోలేదు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి తెలంగాణ ప్రభుత్వం సైతం ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసింది.

ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమైన ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కావాల్సిన నిధులు మంజూరీ చేస్తూ, మున్నేరు ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేపట్టేలా తగు చర్యలు తీసుకోగలరని కోరారు.కాకతీయుల కాలం నాటి గార్ల పెద్ద చెరువు ఈ ప్రాంతంలో వ్యవసాయానికి ప్రాణాధారం లాంటిది.

గార్ల పెద్ద చెరువు శిఖం భూములను ఆక్రమించుకొని కొంతమంది వ్యక్తులు అక్రమంగా పట్టా పాస్ బుక్కులు పొందడం జరిగింది.

అట్టి శిఖం భూములలో బావులు తవ్వడం, పంటలు సాగు చేయడం వలన నీటి నిల్వ సామర్థ్యం తగ్గి సుమారు రెండువేల ఎకరాల వ్యవసాయ భూములకు సాగు నీరు అందక పంటలు ఎండిపోతున్న పరిస్థితి ఏర్పడింది.

దీనివల్ల రైతులు అప్పులు
తెచ్చి పెట్టుబడి పెట్టి తీవ్రంగా నష్టపోతున్నారు.

అనేక సంవత్సరాలుగా వివిధ రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, ప్రజలు ఉద్యమాలు చేయడంతో చెరువు భూములను కొలతలు వేస్తూ వదిలేస్తున్నారు తప్ప, అక్రమ పట్టాలు తీసుకున్న వ్యక్తులపై చర్య తీసుకోవడం గానీ చెరువు శిఖం భూములకు రక్షణ వలయాలను ఏర్పాటు చేయడం గానీ చేయకుండా ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

గార్ల పెద్ద చెరువు భూములను పరిరక్షించే విధంగా నీటి నిల్వ సామర్థ్యం పెరిగే విధంగా తగిన చర్యలకు ఆదేశించగలరని కోరారు.

పాఖాలేటిపై హై లెవెల్ బ్రిడ్జి లేకపోవడం వల్ల రాంపురం మద్దివంచ గ్రామపంచాయతీలో ఉన్నటువంటి సుమారు 15 తండాల, గ్రామాల ప్రజలు గార్ల మండల కేంద్రానికి చేరుకోవడానికి అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలో పాఖాలేరు ఉదృతంగా ప్రవహిస్తున్న సమయంలో సుమారు నాలుగు నెలల పాటు రహదారి బంద్ అవుతుంది.

ఆ ప్రాంత ప్రజలు విద్య, వైద్యం ఇతర పనుల నిమిత్తం గార్ల మండల కేంద్రానికి రావడానికి బ్రిడ్జి సౌకర్యం లేదు.

అనేక మంది పాఖాలేరులో పడి కొట్టుకుపోయి చని పోయినారు.

పాఖాలేటిపై గార్ల రాంపురం హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం కోసం గత 30 సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలు, రాజకీయ పార్టీలు అనేక ఉద్యమాలను నిర్వహించాయి.

ఫలితంగా గత ప్రభుత్వం 15 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది.

అయినప్పటికీ బ్రిడ్జి నిర్మాణం కాలేదు.

ప్రస్తుత ప్రభుత్వం ఏడాదిన్నర కాలం గడుస్తున్నప్పటికీ బ్రిడ్జి నిర్మాణంపై ఒక అడుగు కూడా ముందుకు వయలేదు.

ఈ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేసి బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టి గార్ల రాంపురం మద్దివంచ ప్రాంతాలను అనుసంధానం చేస్తూ ప్రజల రహదారి సౌకర్యాన్ని కల్పించవలసిందిగా విజ్ఞప్తి చేశారు.

మున్నేరు నీటిని సీతారామ ప్రాజెక్టు కాలువ ద్వారా పాలేరు తరలించేందుకు ప్రస్తుత ప్రభుత్వం 2025, మే 17 తారీఖున జీవో నెంబర్ 98 విడుదల చేస్తూ కాలువ నిర్మాణ పనులకు 162 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది.

దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం.

మున్నేరు నీటిని మున్నేరు పరివాహక ప్రాంత రైతులకు సాగు తాగునీరు ఇచ్చిన తర్వాతే మిగతా ప్రాంతాలకు తీసుకుపోవాలి తప్ప ఇక్కడ ప్రాంతాలను ఎండబెట్టి వేరొక ప్రాంతాలకు నీరు ఇవ్వడం దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నాం.

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మున్నేరు నీటిని పాలేరుకు తరలించే జీవో నెంబర్ 98 ను తక్షణమే రద్దు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యావంతులు వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు విశ్వ జంపాల, సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు కట్టెబోయిన శ్రీనివాస్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కందునూరి శ్రీనివాస్, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు గుగులోత్ సక్రు, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు గంగావత్ లక్ష్మణ్ నాయక్, సిపిఐ మండల కార్యదర్శి జంపాల వెంకన్న, టీజేఎస్ రాష్ట్ర నాయకులు గిన్నారపు మురళి తారక రామారావు, బీఎస్పీ మండల అధ్యక్షులు బాదావత్ వెంకన్న, టిడిపి మండల కార్యదర్శి కత్తి సత్యం, బిజెపి మండల నాయకులు తోడేటి నాగరాజు, వివిధ పార్టీల నాయకులు పోతుల నరసింహారావు మొదలాకర్ శివాజీ, శంకర్, బాలాజీ, కేలోత్ బాల, గుండేటి వీరభద్రం, తెల్ల గర్ల నాగేశ్వరరావు, ప్రవీణ్,అశోక్ తదితరులు పాల్గొన్నారు.

మందమర్రి మండల బిజెపి కార్యవర్గ సమావేశం.

మందమర్రి మండల బిజెపి కార్యవర్గ సమావేశం

మందమర్రి నేటి ధాత్రి

 

 

చిర్రగుంట గ్రామంలో మండల అధ్యక్షులు గిర్నాటి జనార్దన్ అధ్యక్షతన జరిగినది సమావేశానికి ముఖ్య అతిథులుగా బిజెపి జిల్లా అధ్యక్షులు నంగునూరు వెంకటేశ్వర గౌడ్ lప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్ సీనియర్ నాయకులు దేవరనేనిసంజీవరావు దీక్షితులు పాల్గొన్నారు .

ఈ కార్యక్రమంలో మండలప్రధాన కార్యదర్శులువంజరి వెంకటేష్ రాజేష్ నాయక్ కర్రె రాజయ్య ఎనగందుల రాజయ్య దుర్గ మల్లేష్ చిరంజీవి దేవేందర్ రాము మెండే పోచయ్య ప్రదీప్ కుమార్అశోక్ఉప్పుల రాజుసలేంద్ర శ్రీనివాస్ దిలీప్ దశరథం రాకేష్ ప్రశాంత్ మారుతి వివిధ గ్రామాల బిజెపి అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు .

BJP Durgam Ashok.

 

 

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు 11 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి సుపరిపాలన గురించి స్థానిక సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి పై రాబోవు స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి రాబోవు నెల రోజులలో చేయవలసిన పార్టీ కార్యక్రమాల గురించికార్యకర్తలతో మాట్లాడారు

ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేసిన నాయకులు.

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేసిన నాయకులు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

 

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో. స్థానిక కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ప్రవీణ్ ఆధ్వర్యంలో ఇందిర ఇండ్ల లకు. భూమి పూజ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ. పేద ప్రజల అభివృద్ధిలో లో. పేద రాష్ట్రపతిగా అభివృద్ధి.లక్ష్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు సాగిస్తూ. దేశంలో ఇందిరమ్మ. కన్న కలలు సహకారం చేస్తూ నిరుపేద కుటుంబాలకు ఇండ్లు మంజూరు చేయిస్తూ. వారి కుటుంబాల కల సహకారం చేస్తున్నారని. అలాగే ఇప్పటివరకు మండలంలో 85 ఇండ్లకు గాను గ్రౌండ్ వర్కింగ్ చేయడం జరుగుతుందని. ఇప్పటివరకు. 45 ఇందిరమ్మ గృహాలకు భూమి పూజ చేయడంతో పాటు. ముగ్గు పోసి నూతన గృహాలు ప్రారంభించామని. అలాగే గత ప్రభుత్వాలతో పోల్చితే. ఈ ప్రభుత్వ. హయాంలో. అలాంటి అవినీతికి తావియ్యకుండా ప్రజా పరిపాలన సాగిస్తున్న ఏకైక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ అని. ఇకముందు కూడా గ్రామాలలో లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్లకు ఎంపికై. నిరుపేద కుటుంబాల కలసహకారం చేసుకోవాలని. కుటుంబ. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తున్నది అధికారులు కూడా మీకు అందుబాటులో ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇందిరమ్మ కమిటీ సభ్యులు రాపల్లి ఆనందం మాట్లాడుతూ. ఇప్పటివరకు మండలంలో చాలామందికి ఇందిర ఇండ్లకు ముగ్గుపోసి భూమి పూజ చేయడం జరిగిందని మండలంలో ప్రజలందరూ రాష్ట్ర ప్రభుత్వం. మహోద్యమంగా మొదలుపెట్టిన. ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇందుకుగాను. మాకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణాలు. రావడానికి కృషిచేసిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి. పొన్నం ప్రభాకర్కి. ఆది శ్రీనివాస్ కి. సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి కి. తంగళ్ళపల్లి మండల అధ్యక్షులు ప్రవీణ్ కి లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో. ఏఎంసి వైస్ చైర్మన్ నేరెళ్ల నర్సింగ్ గౌడ్. లింగాల భూపతి. సుద్దాల శ్రీనివాస్. సుద్దాల కర్ణాకర్. సామల గణేష్. సత్యనారాయణ రెడ్డి. మచ్చ. మధు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు

తెలంగాణ కేబినెట్ విస్తరణ లో ఒక ముస్లిం కూడా లేరు.

తెలంగాణ కేబినెట్ విస్తరణ లో ఒక ముస్లిం కూడా లేరు..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో రెండోసారి ముస్లింలను చేర్చుకోకపోవడం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాషాయ ముఖం బయటపడిందని సూచిస్తుంది.ఈ సందర్భంగా, బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు షేక్ సోహెల్ ఝరాసంగం మండల తుమ్మలపల్లి గ్రామ యువ నాయకుడు విలేకరుల ప్రతినిధులతో మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ముస్లింలు లేకుండా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడపడం ఇదే మొదటిసారి అని అన్నారు. గతంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరియు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఇలా జరగలేదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇది జరుగుతోంది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మరియు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి సామాజిక న్యాయం జరగడం లేదని ఖాళీ వాగ్దానాలు చేస్తున్నారని వారు అన్నారు.ముస్లింలను పూర్తిగా విస్మరిస్తున్నారు. ఇదేనా సామాజిక న్యాయం? వారు కొన్ని రోజుల క్రితం బిజెపిలో చేరుతారు. ఈరోజు వారు కాంగ్రెస్ పార్టీలో చేరారు మరియు వారు విజయం సాధించేవారు. ఈరోజు వారిని రాష్ట్ర మంత్రివర్గంలో చేర్చారు మరియు మంత్రిని చేశారు – దేశమంతా ఇదేనా: దేశమంతా పెద్ద కాంగ్రెస్ పార్టీయేనా! లౌకికవాదం వారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీపై ప్రజల నమ్మకాన్ని కోల్పోయారు. తెలంగాణలో ప్రజల విశ్వాసం కోల్పోతున్నారు. బిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో 10 సంవత్సరాలు అధికారంలో ఉంది మరియు అందరికీ న్యాయం చేసింది.

ఆగిన రోడ్డు మరమ్మతులు.

ఆగిన రోడ్డు మరమ్మతులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

ఝరాసంగం : గత మూడేళ్ల క్రితం రోడ్డు మరమ్మతు కోసం నిధులు మంజూరు కాగా ఇటీవలే పనులు ప్రారం భమైనప్పటికీ తిరిగి నిలిచిపోవడంతో గిరిజనులు అవస్థలు పడుతు న్నారు.

దేవుడు వరమిచ్చిన పూజారి కనికరించనట్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలోనే నిధులు మంజూరు జరిగిన కాంట్రాక్టర్ మా త్రం పనులు వెంటనే ప్రారంభించ లేదు.

ఇటీవలే పనులు ప్రారంభమై నప్పటికీ కొన్ని నెలల్లోనే అర్ధాంతరంగా పనులను నిలిపివేశారు.

ఇందుకుసంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఝరాసంగం మండలంలోని కక్కర్ వాడ గ్రామం నుండి పూర్యానాయక్ తండా వైపు 3.50 కిలోమీటర్ల మేర రోడ్డును మరమ్మతులు చేసేందుకు 2022 సంవత్సరంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.2.38 కోట్లు మంజూరు చేయడం జరిగింది.

ఇట్టి పనులను పర్యవేక్షించేందుకై ప్రభుత్వం రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగానికి నియమించింది.

దీంతో ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ విభాగం టెండర్లు పిలిచి ఇట్టి పనిని చేసేందుకు కాంట్రాక్టర్కు అప్పగించింది.

అయితే కాంట్రాక్టర్ గత మూడు సంవత్సరాలు పాటు ఎలాంటి రోడ్డు మర మ్మతు పనులను ప్రారంభించకపోవడంతో గిరిజనుల ఆశలు సన్నగిల్లాయి.

 

BRS Government.

 

గత కొన్ని ఏళ్లుగా గిరిజనులు కంకర తేలి గుంతలపడ్డ రో డ్డుపైనే ప్రయాణం కొనసాగిస్తున్నారు.

ద్విచక్ర వాహనాల మాట అటు ఉంచితే కనీసం కాలినడకన వెళ్లాలన్న ఈ రోడ్డు అనువుగా లేక పోవడంతో గిరిజనులు నానా అవస్థలు పడుతున్నారు.

ఈ తరు ణంలోనే గత రెండు నెలల క్రితం కాంట్రాక్టర్ ఈ రోడ్డు మరమ్మతు పనులు ప్రారంభించడంతో గిరిజనుల ఆశలు తిరిగి రేకెత్తిన్నాయి.

కాగా ఇప్పటి వరకు ఈ రోడ్డుపై పలుచోట్ల కల్వర్టులు నిర్మించారు.

అలాగే రోడ్డుకు ఇరువైపులా ఉన్న రేగడి మట్టిని తవ్వి సైడ్ వైన్దింగ్ పనులను చేపట్టారు.

అదే విధంగా మొరం కాకుండా చెడేతో కూడు కున్న మట్టిని రోడ్డుపై వేసి చదును చేశారు.

తదుపరి కంకర వేయ కుం డా రోడ్డు మరమ్మతు పనులను అర్ధాంతరంగా వదిలిపెట్టారు.

దీంతో ప్రస్తుతం ఈ రోడ్డు చిరుజల్లుతే చిత్తడిగా మారి ప్రయాణం చేయ డా నికి తీవ్ర అవస్థలు పడాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆయా తండాలో గిరి జనులు ఆందోళన వ్యక్తం చేశారు.

పలువురు వాహనదారులు జారి పడి ప్రమాదాన్ని గురైనట్లు వారు వివరించారు. ఇప్పటికైనా సం బంధిత అధికారులు

ఈ రోడ్డుపై కంకర వేసి బీటీ రోడ్డుగా మార్చడా నికి తగిన చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు.

ముస్లింను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

ముస్లింను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గుర్తించండి..

◆ తెలంగాణ ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న కాంగ్రెస్ పార్టీ…..

◆ ఆరోపించిన ఝరాసంగం మండల ఎంఐఎం పార్టీ అధ్యక్షులు షేక్ రబ్బాని……

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

 

ఝరాసంగం మండల ఎంఐఎం పార్టీ అధ్యక్షులు షేక్ రబ్బాని మాట్లాడుతూ అయ్యో, కాంగ్రెస్ పార్టీలో ముస్లింలకు ప్రాముఖ్యత లేదు … ఒక్క ముస్లింను కూడా మంత్రివర్గంలోకి తీసుకోలేదు. ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీని మంత్రివర్గంలోకి తీసుకున్నారు, అందులో ముగ్గురు కొత్త మంత్రులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అత్యున్నత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఒక ముస్లింను చేర్చుకుంటారని తెలంగాణ ముస్లింలు ఆశించారు. మంత్రివర్గంలో ఒక్క ముస్లింను కూడా చేర్చకపోవడం విచారకరం. తెలంగాణలో ముస్లింల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. ముస్లింల ఓట్లు అందుకు అనుకూలంగా మారాయి. కాంగ్రెస్ పార్టీలో ముస్లింలకు ప్రాముఖ్యత లేదు. ముస్లింలు అసూయపడే మంత్రి లేరు. కాంగ్రెస్ పార్టీ లౌకిక పార్టీ. అవును,కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముస్లింలను మంత్రివర్గంలోకి తీసుకున్నారు,కానీ బిజెపి మరియు మోడీ ప్రభుత్వాల మాదిరిగానే సిఎం రేవంత్ రెడ్డి తెలంగాణను పాలిస్తున్నారు. తదుపరి ఎన్నికల్లో ముస్లింలు కాంగ్రెస్ పార్టీ సిఎం రేవంత్ రెడ్డికి అందరూ మంచి గుణపాఠం నేర్పించాలని కోరారు. ముస్లింలను ఓటు బ్యాంకు రాజకీయంగా వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు వచ్చే గ్రామ పంచాయతీ జడ్పిటిసి ఎంపిటిసి ఎలక్షన్లలో ముస్లింలందరూ కలిసి కాంగ్రెస్ పార్టీని గుణపాఠం నేర్పించాలని కోరారు.

నేడే విస్తరణ.

నేడే విస్తరణ.

 

 

నేటిధాత్రి

 

 

 

 

 

ఆదివారం మధ్యాహ్నం 12.19 గంటలకు రాజ్‌భవన్‌లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. మంత్రివర్గంలో ఆరు ఖాళీలు ఉండగా.. అన్నీ కాకుండా ప్రస్తుతానికి పాక్షికంగా మాత్రమే భర్తీ చేయనున్నారు.

మధ్యాహ్నం 12.19కు రాజ్‌భవన్‌లో ప్రమాణం

ఆరు ఖాళీల్లో.. మూడు మాత్రమే భర్తీచేసే అవకాశం

బీసీ, ఎస్సీ వర్గాలకే మంత్రివర్గ విస్తరణ పరిమితం!

బీసీల నుంచి వాకిటి శ్రీహరికి క్యాబినెట్‌ బెర్తు పక్కా

ఎస్సీల్లో మాల, మాదిగలకు ఒక్కొక్కరి చొప్పున..

మాల సామాజివర్గం నుంచి జి.వివేక్‌కు చాన్స్‌

మాదిగల్లో కవ్వంపల్లి, అడ్లూరి లక్ష్మణ్‌లలో ఒకరికి!

ఎస్టీల నుంచీ ఒకరికి ఇవ్వాలంటున్న సీఎం రేవంత్‌

ఓసీల నుంచి సుదర్శన్‌రెడ్డి పేరూ ప్రతిపాదన

విస్తరణకు కాంగ్రెస్‌ అధిష్ఠానం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినా.. తుది జాబితాలో ఎవరెవరు ఉంటారన్న ఉత్కంఠ

 

అందుబాటులో ఉండండి: సీఎం

మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, వేముల వీరేశం, కాలె యాదయ్య, మందుల సామేలు శనివారం రాత్రి సీఎం రేవంత్‌ను కలిశారు.

విస్తరణలో తమ సామాజికవర్గానికి స్థానం కల్పించాలని కోరారు.

‘ఆదివారం అందుబాటులో ఉండండి. మీలో ఒకరికి మంత్రి పదవి వస్తుంది.

ఎవరికి వచ్చినా.. ఇప్పుడు కలిసివచ్చినట్లే కలిసి ఉండాలి, కలిసి రావాలి’ అని వారితో సీఎం అన్నట్లు సమాచారం.

కాగా, ఈ ఐదుగురిలో కవ్వంపల్లి పేరు తొలి ప్రాధాన్యంగా ఉండగా..

అడ్లూరి లక్ష్మణ్‌ పేరూ పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది.

 

చివరికి ఇన్నాళ్లకు జరగబోతోంది.

ఆశావహులు, సామాజిక సమీకరణలు వంటి అంశాలతో ఎన్నోసార్లు వాయిదా పడుతూ వచ్చిన రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్‌ అధిష్ఠానం నుంచి ఎట్టకేలకు గ్రీన్‌సిగ్నల్‌ లభించింది.

ఆదివారం మధ్యాహ్నం 12.19 గంటలకు రాజ్‌భవన్‌లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది.

మంత్రివర్గంలో ఆరు ఖాళీలు ఉండగా..

అన్నీ కాకుండా ప్రస్తుతానికి పాక్షికంగా మాత్రమే భర్తీ చేయనున్నారు.

ఈ దఫాలో కేవలం ముగ్గురినే తీసుకోవాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం.

అది కూడా బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలకే చోటు దక్కనుంది.

బీసీల నుంచి నారాయణపేట జిల్లా మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి అవకాశం లభించనుంది.

ముదిరాజ్‌ సామాజికవర్గానికి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి గతంలోనే ప్రకటించారు.

ఆ వర్గం నుంచి ఉన్న ఏకైక ఎమ్మెల్యే శ్రీహరే కావడంతో ఈయనకు బెర్త్‌ ఖాయమైంది.

ఇక ఎస్సీల నుంచి మాల సామాజికవర్గానికి చెందిన మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే జి.వివేక్‌కు అవకాశం దక్కనుంది.

మరో బెర్తును కూడా ఎస్సీల నుంచే భర్తీ చేయనున్నారు.

ఈ అవకాశం మాదిగ సామాజికవర్గానికి చెందిన కరీంనగర్‌ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు గానీ, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు గానీ లభించనుంది.

ఇలా ఎస్సీల నుంచి మాల, మాదిగలకు ఒక్కొక్కరికి చొప్పున ఇద్దరు ఎమ్మెల్యేలకు చోటు కల్పించనున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

3 బెర్తులూ కొత్త ఎమ్మెల్యేలకే..

క్యాబినెట్‌లో భర్తీ చేయబోయే మూడు స్థానాలకూ తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారినే తీసుకుంటుండడం గమనార్హం.

వీరిలో జి.వివేక్‌ 2009-2014 మధ్య ఓసారి ఎంపీగా పనిచేసినా..

ఎమ్మెల్యేగా ఎన్నికయింది మాత్రం తొలిసారే.

వాకిటి శ్రీహరి, కవ్వంపల్లి సత్యనారాయణ, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ కూడా తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచినవారే.

అయితే ఇదే తుది జాబితా కాదన్న అభిప్రాయాలూ ఉన్నాయి.

బీసీ, ఎస్సీలతోపాటు ఒక ఎస్టీకి, అదే సమయంలో ఓసీల నుంచి సీనియర్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డికీ అవకాశం ఇవ్వాలని స్వయంగా సీఎం రేవంత్‌ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.

ఎస్టీల నుంచి లంబాడ సామాజికవర్గానికి చెందిన నల్లగొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్‌తోపాటు మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ ఎమ్మెల్యే జాటోత్‌ రాంచందర్‌నాయక్‌ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.

కాగా, నిజామాబాద్‌ జిల్లా బోదన్‌ ఎమ్మెల్యే పి.సుదర్శన్‌రెడ్డికి మంత్రివర్గంలో స్థానం ఖాయమని ముందు నుంచీ ప్రచారం జరుగుతోంది.

అయితే తుది జాబితాలో ఆయన పేరు ఉంటుందా? లేదా? అన్నది సస్పెన్స్‌గానే మారింది. మంత్రివర్గ విస్తరణకు గ్రీన్‌సిగ్నల్‌ లభించి, విస్తరణ ముహూర్తం కూడా ఖరారైౖనా..

జాబితాపై మాత్రం అర్ధరాత్రి వరకు తుది చర్చలు నడుస్తూనే ఉన్నాయి.

ఈ నేపథ్యంలో బెర్తుల ఖరారులో మార్పుచేర్పులు కూడా ఉండవచ్చని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా..

ప్రస్తుతం జరిగేది మంత్రివర్గ విస్తరణా? పునర్‌వ్యవస్థీకరణా? అన్న చర్చ కూడా నడిచింది.

అయితే ప్రస్తుతానికి విస్తరణ మాత్రమే ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మాగంటి మృతి పట్ల కేసీఆర్ సంతాపం.

BRS: మాగంటి మృతి పట్ల కేసీఆర్ సంతాపం..

 

నేటిధాత్రి:

 

 

 

 

 

బీఆర్ఎస్ సీనియర్ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల.. ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. సంతాపం ప్రకటించారు. మాగంటి మరణం పార్టీకి తీరనిలోటు అని అన్నారు.

బీఆర్ఎస్ సీనియర్ నేత (BRS Senior Leader), జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే (Jubilee Hills MLA) మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) మృతి పట్ల.. ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ (Ex CM KCR) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. సంతాపం (Tribute) ప్రకటించారు. మాగంటి మరణం పార్టీకి తీరనిలోటు అని అన్నారు. ఎంతో కష్టపడి రాజకీయాల్లో అంచలంచెలుగా ఎదిగిన మాగంటి గోపీనాథ్ ఎంతో సౌమ్యుడుగా ప్రజానేతగా పేరు సంపాదించారని అన్నారు. జూబ్లీహిల్స్ నియోజక వర్గ ఎమ్మెల్యేగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, హైదరాబాద్ నగర సీనియర్ రాజకీయనేతగా మాగంటి తనదైన స్థానాన్ని సంపాదించుకున్నారని కేసీఆర్.. మాగంటి జ్ఞాపకాలను స్మరించుకున్నారు.

ప్రగాఢ సానుభూతి…

మాగంటి గోపీనాథ్‌ను కాపాడుకునేందుకు వైద్యులు చేసిన కృషి, పార్టీ తరఫున చేసిన ప్రయత్నాలు ఫలించక పోవడం దురదృష్టకరమని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. మాగంటి గోపీనాథ్ మరణానికి చింతిస్తూ.. శోకతప్తులైన ఆయన కుటుంబ సభ్యులు, మిత్రులు, అభిమానులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మాగంటి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కేసీఆర్ ప్రార్థించారు.

కాగా బీఆర్ఎస్ సీనియర్ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఆదివారం ఉదయం 5.45 గంటలకు తుది శ్వాస విడిచారు. ఈ నెల 5న గుండెపోటుతో ఏఐజీ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారు జామున మృతి చెందారు. ఈ మేరకు వైద్యులు అధికారికంగా ప్రకటించారు.

పెద్దమ్మ . పెద్ద రాజుల.కళ్యాణ మహోత్సవానికి హాజరైన బిజెపి నాయకులు…

పెద్దమ్మ . పెద్ద రాజుల.కళ్యాణ మహోత్సవానికి హాజరైన బిజెపి నాయకులు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి… .

 

 

 

తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో పెద్దమ్మ . పెద్ద రాజుల కళ్యాణ మహోత్సవమునకు ప్రత్యేకంగా హాజరైన జిల్లా బిజెపి అధ్యక్షుడు గోపి. జిల్లా బీజేవైఎం. జిల్లా అధ్యక్షులు రావుల రాజిరెడ్డి. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో గోపి రాజు రెడ్డి బిజెపి పార్టీ నాయకులు కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు బిజెపి పార్టీ నాయకులను. ప్రత్యేకంగా శాలువాతో సన్మానించారు ఇట్టి కార్యక్రమంలో. బిజెపి పార్టీ నాయకులు. సుధాకర్. రాజేందర్. నెల్లుట్ల రమేష్. కాజు గంటి రాజు. చిందం నరేష్. సందీప్ జిల్లెల్ల గ్రామ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు పిట్ల మల్లేశం ముదిరాజ్ ఈసా నరసయ్య సంఘం నాయకుడు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

గృహ ప్రవేశానికి హాజరై న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి.

గృహ ప్రవేశానికి హాజరై న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

వనపర్తి నేటిధాత్రి:

 

పెద్దమందడి మండలంలో
మోజార్ల గ్రామానికి చెందిన బీ అర్ యస్ పార్టీ నేత వెంకటేష్ నూతన గృహ ప్రవేశ ని ప్రవేశంలో మాజీ మంత్రిసింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొని వారి కుటుంబ సభ్యులకుకృతజ్ఞతలు తెలిపారు
మాజీ మంత్రి వెంటసునీత తిరుపతయ్య జగదీశ్వర్ రెడ్డి కుమార్ యాదవ్ నాగేంద్ర యాదవ్, శ్రీనివాసులు,జగన్ గౌడ్ తదితరులుఉన్నారు

ముప్పై పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం సాయల్ టెస్ట్ నిర్వహించిన.

ముప్పై పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం సాయల్ టెస్ట్ నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం లో మరో ముందడుగు

కొత్తగూడ,నేటిధాత్రి:

 

 

మహబూబాబాద్ జిల్లా ఉమ్మడి కొత్తగూడ మండల ప్రజల చిరకాల కోరిక.. త్వరలో తీరానున్న పెద్ద ఆసుపత్రి కల..!!తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులుడాక్టర్ అనసూయ సీతక్క
ప్రత్యేక దృష్టితో ఉమ్మడి కొత్తగూడ ప్రజల కోసం 30 పడకల ఆసుపత్రి మంజూరు చేసిన సంగతి విధితమే
శనివారం రోజు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య ఆధ్వర్యంలో..ముప్పై పడకల ఆసుపత్రి నిర్మాణం లో భాగంగా సాయల్ టెస్ట్ నిర్వహించడం జరిగింది…
ఈ కార్యక్రమం లో.. డిసిసి సభ్యులు వీరనేని వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షులు గుమ్మడి సమ్మయ్య, ఉపాధ్యక్షులు వెలుదండి వేణు, మండల నాయకులు వజ్జ బాలరాజు,హలవత్ సురేష్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ సిరిగిరి సురేష్, నాయకులు కందుల సందీప్, రవి, తదితరులు పాల్గొన్నారు,.,

విగ్రహాల పునర్ ప్రతిష్టాపన ధ్వజస్తంభం శిఖర ప్రతిష్టాపన మహోత్సవం.

విగ్రహాల పునర్ ప్రతిష్టాపన ధ్వజస్తంభం శిఖర ప్రతిష్టాపన మహోత్సవం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

న్యాల్కల్ మండల మెటల్ కుంట గ్రామం లో ఆంజనేయ స్వామి విగ్రహాల పునర్ ప్రతిష్టాపన ధ్వజస్తంభం శిఖర ప్రతిష్టాపన మహోత్సవలో బిఆర్ఎస్ పార్టీ న్యాల్కల్ మండల సీనియర్ నాయకులు రాజేందర్ రెడ్డి ఆహ్వానం మేరకు మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మల్గి మాజీ సర్పంచ్ జట్గొండ మారుతి కార్యక్రమంలో మెటల్ కుంట గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పాండురంగ రెడ్డి మాజీ ఎంపీటీసీ శివానంద శ్రీపతి మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శివరాజ్ మండల బిఆర్ఎస్ సీనియర్ నాయకులు గొల్ల అశోక్ లోకేష్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.

పంచాయతీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా.. పనిచేయాలి.

పంచాయతీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా.. పనిచేయాలి.

బాలానగర్ /నేటి ధాత్రి.

 

 

 

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో శనివారం బీజేపీ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన బూత్ కమిటీ అధ్యక్షులు, సభ్యులు బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు గోపాల్ నాయక్ మాట్లాడుతూ.. వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో గెలిపి లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. గ్రామంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పథకాలు వైఫల్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామీణ ప్రాంతంలో నెలకొన్న సమస్యలపై అధికారులను నిలదీస్తూ.. ప్రజా సమస్యలపై పోరాటం చేయాలన్నారు. ప్రతి గ్రామంలో బీజేపీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలన్నారు. ప్రజలపై సత్సంబంధాలు మెరుగుపరిచేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. నూతనంగా ఎన్నికైన మండల కమిటీని పలువురు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

చిన్నారుల శుభకార్యానికి ఎమ్మెల్యే దొంతి హాజరు.

చిన్నారుల శుభకార్యానికి ఎమ్మెల్యే దొంతి హాజరు.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

నర్సంపేట పట్టణానికి చెందిన 2వ వార్డు కమలాపురంలో నేడు లోడే రాజు-నాగమణి దంపతుల కుమారులు లోడే కౌశిక్-లోకేష్ ల ధోతి కట్టించుట శుభకార్యానికి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై చిన్నారులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్, 2వ వార్డు ఇంచార్జ్ మాజీ ఎంపీటీసీ ముత్తినేని వెంకన్న, నర్సంపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మాదాసి రవికుమార్, ఐఎన్టియుసి నర్సంపేట పట్టణ అధ్యక్షులు కంచు రవి, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ ప్రచార కార్యదర్శి బిట్ల మనోహర్, జన్ను మురళీ, మాజీ వార్డు సభ్యులు గండి గిరి గౌడ్, 3వ వార్డు అధ్యక్షులు కోరే సాంబయ్య, పూజారి సారంగం గౌడ్, వేల్పుల కృష్ణ, అల్లంశెట్టి సోమయ్య, గాదగోని వీర సోమయ్య, లోడే పెద్దరాజు, వింతల రాంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు.

ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్.

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

 

 

బక్రీద్ పండుగ త్యాగానికి ప్రతీకగా నిలుస్తుందని టేకుమట్ల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్ అన్నారు.శనివారం మండలంలోని వెలిశాల లో జరిగిన బక్రీద్ వేడుకలలో సతీష్ గౌడ్.వెలిశాల మాజీ సర్పంచ్ ఎండి కమరుద్దీన్ కాంగ్రెస్ నాయకులతో కలిసి పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేసి స్వీట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ప్రేమ, సౌబ్రాతుత్వంతో ఎలాంటి విభేదాలు లేకుండా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.అన్ని మతాలను గౌరవించే భారతదేశ సంస్కృతిలో బక్రీద్ పండుగ విశేష స్థానం కలిగి ఉందని అన్నారు.ఈ పండుగను ప్రతి ఏటా శాంతియుతంగా,స్నేహపూర్వక వాతావరణంలో జరుపుకోవడం సంతోషంగా ఉందని,హిందువులు సోదర భావంతో శుభాకాంక్షలు తెలియజేస్తూ కులమత బేదలకు అతీతంగా భవిష్యత్తులో కూడా ఈ సాంప్రదాయాన్ని కొనసాగించాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో.జిల్లా నాయకులు దొంతుల శ్రీనివాస్ బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు నాంపల్లి వీరేశం.మండల ప్రధాన కార్యదర్శి బండి రవీందర్.కాంగ్రెస్ నాయకులు ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

జోరుందుకున్న ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజలు.

జోరుందుకున్న ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజలు

మండలం లో ప్రతీ గ్రామం లో
ఇండ్ల కు ముగ్గులు పోస్తున్న అధికారులు

కొత్తగూడ, నేటిధాత్రి:

 

 

 

 

తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎన్నో ఏళ్లకు ఎదురుచూస్తున్న తరుణం ఆసన్నమైంది పేదింటి వాడి సొంతింటి కల నెరవేరే అవకాశం మరి కొద్ది రోజుల్లో పూర్తవునుంది..ఎప్పుడో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లులు తప్ప తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత రాష్ట్ర ప్రజలు సొంతింటి కల నెరవేరుతుందని కోటి ఆశలతో ఎదురు చూశారు కానీ గత పాలకుల నిర్లక్ష్యం వారి స్వార్థాలతో పదేళ్లపాటు సొంత గూడు లేక అల్లాడిపోయిన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ఊరటనిచ్చింది.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కొత్తగూడ మండలంలోని పోగుల్లపల్లి గ్రామంలో
శనివారం రోజు ప్రభుత్వ అధికారులు పంచాయతీ కార్యదర్శి బి కళ్యాణి
ఆధ్వర్యంలో ముగ్గు పొసే కార్యక్రమం నిర్వహించారు..ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల వివరాలు పేర్లు1 బుగ్గ పద్మ.2. భూక్య అనిత 3. మోకాళ్ళ మౌనిక 4 బైరబోయిన రజిని 5 జూల వనక్క 6 బోళ్ల పద్మ 7 శిరపోయిన లచ్చమ్మ 8 నక్క సారమ్మ 9 బోళ్ల సమ్మక్క 10 శిర బోయిన స్వరూప 11 ముత్యం మమత 12 రాగి దేవేంద్ర 13 మొత్తం సప్న 14 దొంతర బోయిన రాధిక 15 కాగితం వెంకటమ్మ 16 నన్నే బోయిన కోమల 17 పడిగే నర్సమ్మ 18 గుగ్గిళ్ళ దీవెన.. అను లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్ల గృహ నిర్మాణం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు…
ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు డేగల భద్రయ్య కాంగ్రెస్ పార్టీ మండల యూత్ ఉపాధ్యక్షులు చొప్పరి కుమార్,గ్రామ పెద్దలు యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు….

22వ డివిజన్లో కమ్యూనిటీ హాల్ కు శంకుస్థాపన..

22వ డివిజన్లో కమ్యూనిటీ హాల్ కు శంకుస్థాపన..

నేటిధాత్రి, పోచంమైదాన్.

 

 

వరంగల్ తూర్పు నియోజకవర్గం పరిధిలో 22వ డివిజన్ ప్రజల అభ్యర్థన మేరకు స్థానిక కార్పొరేటర్ బస్వరాజు కుమారస్వామి డివిజన్ ప్రజల సౌకర్యార్ధం, వారి సమస్యను కొన్ని సంవత్సరాల నుండి ఫంక్షన్స్ కు ఇతర కార్యక్రమాలు చేసుకోవాలనుకుంటే పేద మధ్యతరగతి ప్రజలు బాధపడుతున్న పరిస్థితిని గుర్తించి, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దృష్టికి తీసుకురాగా, వెంటనే స్పందించిన మంత్రి కమ్యూనిటీ హాల్ కు 50 లక్షల నిధులతో నిర్మాణం చేయించాలని కోరారు.

కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించిన మంత్రి కొండా సురేఖ.

 

Minister Konda Surekha

 

శుక్రవారం సాయంత్రం నగర మేయర్ గుండు సుధారాణి, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి లు విచ్చేసి కమ్యూనిటీ హాల్ కు శంకుస్థాపన చేశారు. నగర మేయర్ సైతం తనవంతు నిధులు కేటాయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బస్వరాజు కుమారస్వామి, డివిజన్ నాయకులు కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version