“పంచాయతీ ఎన్నికలకు రెడీ ఏర్పాట్లు”

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని

ఎన్నికల ప్రవర్తనా నియమావళి కట్టుదిట్టంగా అమలు

నామినేషన్ల స్వీకరణకు పటిష్ట ఏర్పాట్లు

మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్ సజావుగా జారీ చేయాలి

పంచాయతీ ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ఎన్నికల సంఘం కమీషనర్

హాజరైన ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

సిరిసిల్ల(నేటి ధాత్రి ):

 

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని ఆదేశించారు.

పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని అన్ని జిల్లాల కలెక్టర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ రాణి కుముదిని మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న గ్రామ పంచాయతీలకు 2వ సాధారణ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిందని, డిసెంబర్ 11న మొదటి విడత, డిసెంబర్ 14న రెండవ విడత, డిసెంబర్ 17న మూడవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనున్నట్లు తెలిపారు.

పంచాయతీ ఎన్నికల సంబంధించి గ్రామానికి అప్ డేట్ చేసిన రిజర్వేషన్లు, ఏ విడత పోలింగ్ ఉంటుంది, పోలింగ్ కేంద్రాల జియో లోకేషన్ వివరాలు వెంటనే టి-పోల్ వెబ్ సైట్, యాప్ లో నమోదు చేయాలని అన్నారు. టి-పోల్ వెబ్ సైట్ , యాప్ లో వచ్చే ఫిర్యాదుల పరిష్కారం కోసం జిల్లాలో నోడల్ అధికారిని నియమించాలని, ఎన్నికల కమిషన్ నుంచి వచ్చే ఫిర్యాదులను మూడు రోజులలో పరిష్కరించాలని సూచించారు.

ఫైనల్ చేసిన ఓటర్ జాబితా, పోలింగ్ కేంద్రాల ప్రకారం పంచాయతీ ఎన్నికల నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 2 కంటే ఎక్కువ పోలింగ్ కేంద్రాల్లో ఉన్న భవనం దగ్గర హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని, వెబ్ క్యాస్టింగ్ జరిగే పోలింగ్ కేంద్రాల వివరాలు పంపాలని , పోలింగ్ కేంద్రాలలో మంచి వెలుతురు, ఫర్నిచర్, పవర్ సరఫరా వంటి ఏర్పాట్లు చేయాలని అన్నారు.

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్ నవంబర్ 27న ఉదయం 10.30 గంటల వరకు విడుదల చేయాలని అన్నారు. నోటిఫికేషన్ జారీ చేయడంతో పాటు పంచాయతీ పరిధిలోని ఓటరు జాబితా వివరాలను ప్రచురించాలని అన్నారు .

నవంబర్ 27 నుంచి నవంబర్ 29 వరకు ప్రతిరోజు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరించాలని ఆదేశించారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధిత రిటర్నింగ్ అధికారులు వద్ద నామినేషన్ దాఖలు చేసేందుకు వీలుగా అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు.

నామినేషన్ల పరిశీలన నవంబర్ 30 న సాయంత్రం 5 గంటల వరకు పూర్తి చేసి చెల్లుబాటైనా నామినేటెడ్ అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని అన్నారు. అభ్యర్థుల జాబితా పై అప్పిళ్ళ కోసం డిసెంబర్ 01, సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉంటుందని, డిసెంబర్ 2 నాడు ఆపిళ్ళ పరిష్కరించాలని, నామినేషన్ల ఉపసంహరణకు డిసెంబర్ 03 మధ్యాహ్నం మూడు గంటల వరకు గడువు ఉంటుందని, అదే రోజు పోటీ చేసే అభ్యర్థుల జాబితా ప్రచురణ చేయాలని అన్నారు .

నామినేషన్ల స్వీకరణ, పరిశీలన,అప్పిళ్ళ పరిష్కారం, గుర్తుల కేటాయింపు, పోటి చేసే అభ్యర్థుల ప్రకటన పకడ్బందీగా జరిగేలా అవసరమైన మార్గదర్శకాల జిల్లా ఎన్నికల అధికారులు జారీ చేయాలన్నారు.

జిల్లాలో ఉన్న ప్రింటర్లకు అనుమతి లేకుండా ఎన్నికల ప్రచార కరపత్రాల ముద్రణ చేయవద్దని ఆదేశాలు జారీ చేయాలని, ఎన్నికల ప్రచారం సంబంధించి అభ్యర్థుల వ్యయ వివరాలను నమోదు చేసేందుకు ధరలను ఖరారు చేయాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్ లకు ఎన్నికల కమిషనర్ సూచించారు.

ప్రతి జిల్లాలో ఎం.సి.ఎం.సి కమిటి, జిల్లా మీడియా సెల్ ఏర్పాటు చేయాలని అన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో వినియోగించే ఎలక్ట్రానిక్ వీడియోలకు ముందుగా ఎం.సి.ఎం.సి అనుమతి ఉండాలని అన్నారు. ఎన్నికల దృష్ట్యా తనిఖీలు నిర్వహించే నేపద్యంలో రైతులు పంట డబ్బులు తీసుకుని వెళ్లే సమయంలో తప్పనిసరిగా రశీదు పెట్టుకునేలా అవగాహన కల్పించాలని అన్నారు.

ఎం.సి.సి అమలులో నిర్వహించే తనిఖీల లో నగదు, బంగారం, ఇతర పరికరాలు సీజ్ చేసే సమయంలో తప్పనిసరిగా రశీదు అందించాలని, సీజ్ చేసిన పరికరాలకు సంబంధించిన ఆధారాలు సమర్పించేందుకు ఏ అధికారి ముందు హాజరు కావాలని వివరాలు ఆ రసీదు లో ఉండాలని అన్నారు.

ఇంచార్ట్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీల రిజర్వేషన్ వివరాలు టి-పోల్ లో అప్ లోడ్ చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. మొదటి విడతగా గ్రామ పంచాయతీలలో ఎన్నికలు నామినేషన్ల స్వీకరణ అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు.

ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు చేసేందుకు ఎఫ్.ఎస్.టి, ఎస్.ఎస్.టీ బృందాలను ఏర్పాటు చేశామని అన్నారు. ఎం.సి.ఎం.సి , మీడియా సెల్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.

ఈ సమావేశంలో సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, డీఆర్డీఓ శేషాద్రి, డీపీఓ శర్ఫుద్దిన్ తదితరులు పాల్గొన్నారు.

అప్పాని శ్రీనివాస్ కొత్త కార్మిక కోడ్లకు మద్దతు

తప్పుడు ఆరోపణలు చేస్తున్న కార్మిక సంఘాలు

అప్పాని శ్రీనివాస్ వర్కింగ్ ప్రెసిడెంట్

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

భూపాలపల్లి ఏరియా సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం బిఎంఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో, భూపాలపల్లి ఏరియా ఉపా ధ్యక్షులు వెలబోయిన రజేందర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్ సి ఎంకెఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
అప్పాని శ్రీనివాస్ హాజరైనారు అనంతరం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన నాలుగు కార్మిక చట్టాల కోడ్లు కార్మికులందరికీ అనుకూలంగా ఉండడంతో బి ఎం ఎస్ కార్మిక సంఘం వాటిని పూర్తిగా సాగదీస్తుంది భారత దేశంలో అసంఘటిత, వలస, గిగ్, ప్లాట్‌ఫారమ్ అనధికార రంగాలు దాదాపు 40 కోట్ల మంది కార్మికులకు తొలిసారిగా చట్టబద్ధమైన సామాజిక భద్రత వ్యవస్థలోకి రావడం. ఈ కోడ్ల అత్యంత కీలకమైన ప్రయోజనమని గ్రహించాలి.
వేజ్ కోడ్ కనీస వేతన హక్కు
సకాలంలో, పారదర్శకంగా జీతం చెల్లింపు సమాన పనికి సమాన వేతనం
బోనస్, అలవెన్సులపై స్పష్టమైన నియమాలు డిజిటల్ మీడియాలో కాంట్రాక్ట్ / స్ట్రింగర్ / ప్రాజెక్ట్ బేస్డ్ పనిచేసే వారికి ఇది అతిపెద్ద భద్రతా కవచం.
ఏమి మారింది? పాత్రికేయ నిర్వచనం విస్తృతమైంది
ఇప్పటివరకు “వర్కింగ్ జర్నలిస్ట్” అనే పదం ప్రధానంగా
ఇప్పుడు ఆ నిర్వచనం విస్తరించి మూడు పెద్ద రంగాలనూ జతచేసుకుంది:
డిజిటల్ / ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్స్
టీవీ న్యూస్ & ఎలక్ట్రానిక్ మీడియా
రేడియో / ఎఫ్‌ఎం / కమ్యూనిటీ రేడియో పాత్రికేయులు
ఫలితంగా డిజిటల్-ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫామ్‌లపై వార్తా కంటెంట్ తయారుచేసే అతిపెద్ద వర్గం ఇక అధికారికంగా కార్మిక రక్షణ పరిధిలోకి వచ్చేసింది. ముందస్తు లేఖలు
ధర్నాలు-నిరసనలు
కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖతో చర్చలు
పార్లమెంటరీ కమిటీలకు సూచనలు కొత్త కోడ్ డ్రాఫ్ట్‌లపై అభ్యంతరాలు
ఈ అన్ని కృషే ఈ మార్పుకు పునాది వేశాయి. అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో వెలబోయిన సుజెందర్ బ్రాంచి ఉపాధ్యక్షులు. పాండ్రాల మల్లేష్ పని రమేష్ కొత్తూరు మల్లేష్ రఘుపతి రెడ్డి అన్నం శ్రీనివాస్. తాండ్ర మొగిలి. దాసరి ఓదెలు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

వరంగల్‌ మున్సిపల్ కమిషనర్‌ – రిలయన్స్ స్టోర్‌కు జరిమానా

శెభాష్ వరంగల్‌ మున్సిపల్ కమిషనర్ – రిలయన్స్ స్టోర్‌కు జరిమానా

కొన్ని రోజులుగా వాహనాలు రోడ్డు మీద పార్కింగ్. నగరంలోని అన్ని షాపింగ్ మాల్స్ ఇదే విధంగా అమలు చేయాలని కోరుతున్న ప్రజలు.

నేటిధాత్రి, వరంగల్.

 

వరంగల్ నగరంలో పౌరులకు ఇబ్బందులు కలిగిస్తున్న పార్కింగ్ సమస్యపై మున్సిపల్ కమిషనర్ చాహత్ భాజ్‌పాయ్ కఠిన చర్యలు తీసుకున్నారు.

పోచమ్మ మైదాన్ ప్రాంతంలోని రిలయన్స్ స్మార్ట్ సూపర్ స్టోర్ వద్ద గత కొన్ని రోజులుగా వాహనాలు రహదారిపై అస్తవ్యస్థంగా పార్క్ చేయడం వల్ల వాహనదారులు, స్థానికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితిని స్వయంగా పరిశీలించిన కమిషనర్ చాహత్ భాజ్‌పాయ్ స్టోర్ యాజమాన్యంపై జరిమానా విధించారు. జరిమానా చెల్లింపు వరకు స్టోర్‌లో క్రయవిక్రయాలు జరగకుండా బల్దియా సిబ్బంది స్టోర్ ద్వారాలను మూసివేశారు.

రోడ్డుపై పార్కింగ్ సమస్యను గుర్తించి వెంటనే స్పందించిన కమిషనర్ చర్యలను స్థానిక కాలనీ వాసులు అభినందించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ముందడుగు వేసిన మున్సిపల్ అధికారుల నిర్ణయం నగరంలో శ్లాఘనీయమని పలువురు పేర్కొన్నారు.

సిరిసిల్లలో ప్రజలలో అవగాహన కోసం బీజేపీ కరపత్రాల పంపిణీ

ప్రజలను తప్పుదారి పట్టించిన విధానాలపై అవగాహన

– ప్రజల్లో రాజకీయ చైతన్యం పెంచడంలో కీలక పాత్ర పోషించాలి

సిరిసిల్ల (నేటి ధాత్రి):

 

సిరిసిల్ల పట్టణం శాంతినగర్ లో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ ప్రజలకు పంపించిన కరపత్రాల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారము ఘనంగా ప్రారంభించారు.
ఈ కరపత్రాల ద్వారా కాంగ్రెస్–బిఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన దొంగ హామీలు, అమల్లో పెట్టని సంక్షేమ వాగ్దానాలు, ప్రజలను తప్పుదారి పట్టించిన విధానాలపై అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నామని పార్టీ నాయకులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ మాట్లాడుతూ
“ప్రతి బూత్ స్థాయిలో కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను అందించి, ప్రజల నుండి సంతకాలు సేకరించాలని బండి సంజయ్ సూచించారన్నారు. ప్రజల్లో రాజకీయ చైతన్యం పెంచడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. సిరిసిల్లలో ప్రతి కార్యకర్త చురుకగా పాల్గొని ఈ ఉద్యమాన్ని విజయవంతం చేస్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో కోడం రవి, శేఖర్, అభి రామారావు విజయ్, ప్రవీణ్, మహిళా మోర్చా నాయకురాలు కౌసల్య, లత, రేఖ, పద్మ తదితరులు పాల్గొన్నారు.

️ ఇంటింటికీ కరపత్రాల పంపిణీ & సంతకాల సేకరణ కార్యక్రమం
ఈ రోజు బూత్ స్థాయిలో కార్యకర్తలు ఉదయం 8:00 గంటల నుండిఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు

జారీ చేసిన వారు:
దుమాల శ్రీకాంత్
పట్టణ అధ్యక్షులు,
భారతీయ జనతా పార్టీ – సిరిసిల్ల

ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి నాసిరకం బీటీ రోడ్ పై ఆగ్రహం

నాసిరకం బీటీ రోడ్డు నిర్మాణంపై ఎమ్మెల్యే ఆగ్రహం.

* కాంట్రాక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలి.

* ట్రైబల్ వెల్ఫేర్ అధికారులకు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి లేఖ.

జడ్చర్ల /నేటి ధాత్రి.

 

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం
బాలానగర్ మండలంలోని బోడగుట్ట తండా నుంచి దేవుని గుట్ట తండా వరకు నిర్మించిన 1 కిలోమీటర్ బీటీ రోడ్ ఏమాత్రం నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నాసీరకంతో నిర్మించడానికి కారణమైన కాంట్రాక్టర్, ఈ రోడ్డు నాణ్యతను ధ్రువీకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి కోరారు.
ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కు లేఖ రాశారు. దేవునిగుట్ట తండాలో వేసిన బీటీ రోడ్డు ఒక రోజుకే గుంతలు పడిపోవడం, చేతితో లాగితే రోడ్డుపై వేసిన బీటీ పెళ్లపెల్లలుగా రావడం, బీటీ కింద కంకర వేసిన ఆనవాళ్లు కనిపించకపోవడంతో ఈ రోడ్డు నిర్మాణం విషయంగా తాండా ప్రజలు ఆందోళన వ్యక్తం చేయడం, అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో గతంలోనే ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తీవ్రంగా స్పందించి నాసిరకంగా వేసిన కొత్త బీటీ రోడ్ మొత్తాన్ని తీసివేసి దాని స్థానంలో పూర్తి నాణ్యత ప్రమాణంతో కొత్త రోడ్డు వేయాలని అధికారులను ఆదేశించడం ఈ మేరకు అధికారులు నాసిరకంగా వేసిన రోడ్డు మొత్తాన్ని తీసివేయడం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అనిరుద్ రెడ్డి ట్రైబల్ వెల్ఫేర్ ఈఈకి లేఖ రాశారు.
ఈ నాసిరకం రోడ్డు కారణంగా ప్రభుత్వం అప్రదృష్ట పాలయిందని ప్రజాధనం వృథా అయిందని పేర్కొన్నారు. ఈ రోడ్డు నిర్మాణంలో బీటీ కింద వేయాల్సిన WBM కంకర లేకపోవడం, కంకర వేయకుండానే రోడ్డు వేయడం తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం అని అభిప్రాయపడ్డారు. ఈ నాసిరకం రోడ్డు నిర్మాణానికి కారణమైన కాంట్రాక్టర్, పర్యవేక్షించిన అధికారులు, నాణ్యతను ధ్రువీకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అనిరుధ్ రెడ్డి డిమాండ్ చేశారు.

జహీరాబాద్ మహిళా కాంగ్రెస్ రాజ్యాంగ దినోత్సవం

రాజ్యాంగ దినోత్సవం జరుపుకున్నా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు

జహీరాబాద్ నేటి ధాత్రి,:

 

రాజ్యాంగ దినోత్సవం పురష్కరించుకొని జహీరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మ మహిళా కాంగ్రెస్ నాయకురాళ్ళు కలిసి రాజ్యాంగ దినోత్సవం జరుపుకున్నారు.భారతదేశంలో రాజ్యాంగ దినోత్సవం (సంవిధాన్ దివస్) ప్రతి సంవత్సరం నవంబర్ 26న జరుపుకుంటారు. ఈ రోజున, 1949లో భారత రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించిన జ్ఞాపకార్థం, రాజ్యాంగ విలువల పట్ల ప్రజలలో రాజ్యాంగ మౌలిక లక్ష్యం సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందరికీ అందించడం గౌరవాన్ని పెంపొందించడానికి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26న ఆమోదించబడింది. ఈ చారిత్రాత్మక రోజును స్మరించుకోవడానికి, రాజ్యాంగంలోని ప్రజాస్వామ్య విలువలను గౌరవించడానికి మరియు విద్యార్థులు, పౌరులలో రాజ్యాంగం మరియు ప్రజాస్వామ్య విలువల గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది.

పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి

పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

మూడు విడతల్లో పంచాయితీ ఎన్నికలు

బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి..నోడల్ అధికారులకు ఆదేశాలు

వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట,నేటిధాత్రి:

రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలు పాటిస్తూ గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికలను పకడ్బందీగా, ప్రశాంతంగా, నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు.బుధవారం వరంగల్ కలెక్టరేట్ లో కలెక్టర్ డాక్టర్ సత్య శారద
గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికల నిర్వహణ పై అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డిఆర్ ఓ విజయలక్ష్మి, జెడ్పి సీఈఓ రామిరెడ్డి, డిపిఓ కల్పన లతో కలసి ఆర్డీఓ లు, ప్రత్యేక అధికారులు, నోడల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో అధికారుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. నోటిఫికేషన్ విడుదలైనందున జిల్లాలోని 11 మండలాల్లోని 317 గ్రామ పంచాయతీ సర్పంచ్ లు, 2754 వార్డు సభ్యుల ఎన్నికలకు 3 విడతల్లో ఈ నెల 27, 30 మరియు డిసెంబర్ 3 తేదీల్లో నామినేషన్ స్వీకరణ ఉంటుందని, నామినేషన్ పత్రాల స్వీకరణ నుంచి ఎన్నికల నిర్వహణ ప్రక్రియ పూర్తయ్యే వరకు అధికారులు అప్రమత్తంగా ఉంటూ తమకు అప్పగించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఎన్నికల హ్యాండ్ బుక్ లోని ప్రతి అంశంపై సంపూర్ణ అవగాహన తెచ్చుకోవాలన్నారు. పొరపాట్లకు ఆస్కారం ఇవ్వవద్దని.. అనుమానాలు ఉంటే ఉన్నతాధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

Panchayat Elections

ఎన్నికల విధులు ఎంతో కీలకమైనవని, ఎక్కడా ఏ చిన్న పొరపాటు జరగకుండా అన్ని జాగ్రత్తలతో సమర్థవంతంగా నిర్వర్తించాలని అన్నారు. ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యానికి తావిస్తే కఠిన చర్యలకు గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే విధంగా నగదు, మద్యం, పంపిణీపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, ఇతర వస్తువుల సీజ్ చేసిన సందర్భాలలో అన్ని బృందాలు సమన్వయం చేసుకోవాలని సూచించినారు. , జిల్లాలోని చెక్ పోస్టులలో వాహనాల తనిఖీలు నిష్పక్షపాతంగా, పకడ్బంధీగా జరిగేలా చూడాలని అన్నారు. నోడల్ అధికారులు ప్రతి రోజు రిపోర్ట్ లు నిర్ణిత ఫార్మాట్ లో సమర్పిచాలని తెలిపారు.జిల్లాలో మాన్ పవర్ మేనేజ్మెంట్, బ్యాలెట్ బాక్సుల మేనేజ్మెంట్, ట్రాన్స్‌పోర్ట్ మేనేజ్మెంట్, శిక్షణా కార్యక్రమాల నిర్వహణ, మెటీరియల్ మేనేజ్మెంట్, ఎక్స్‌పెండిచర్ మానిటరింగ్, మీడియా కమ్యూనికేషన్, హెల్ప్‌లైన్ & కంప్లైంట్స్ రెడ్రెస్సల్, తదితర విభాగాల వారీగా నోడల్ అధికారులను నియమించామని,జిల్లాలో ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా,నిష్పక్షపాతంగా ఎలాంటి అంతరాయం లేకుండా జరిగేందుకు నోడల్ అధికారులు బాధ్యతాయుతంగా నిర్వర్తించాలన్నారు. ప్రజల్లో నమ్మకాన్ని పెంచేలా ఎన్నికల నిర్వహణ జరగాలి. శాంతియుత, స్వేచ్ఛాత్మక మరియు పారదర్శక ఎన్నికలకై ప్రతి ఒక్కరు కృషి చేయాలని స్పష్టం చేశారు.మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్నందున అందరూ పాటించాల్సిన నిబంధనలను గుర్తుచేశారు.అధికారులు, సిబ్బంది సమన్వయంతో ముందుకు సాగుతూ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. జిల్లా ప్రజలందరూ ఎన్నికల నియమావళిని పాటించి, శాంతియుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించు కోవాలని అన్నారు.ఈ సమావేశం లో ఆర్డీఓలు సుమా రెడ్డి, ఉమారాణి, ఎన్నికల ప్రత్యేక అధికారులు,నోడల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులు ఎంపిడివోలు, ఎంపిఓ లు తదితరులు పాల్గొన్నారు.

మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ

కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ కోహీర్ మండల అధ్యక్షులు శ్రీ పట్లోళ్ల రాంలింగా రెడ్డి ఆధ్వర్యంలో కోహీర్ మండలం దిగ్వాల్ గ్రామంలో స్వయం సహాయక సంఘం మహిళలకు ‘పుట్టింటి సారై’ మాదిరిగా ఆత్మగౌరవంతో కూడిన నాణ్యమైన ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ, మాజీ ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

జహీరాబాద్‌లో ఇందిరమ్మ మహిళ శక్తి కార్యక్రమం

ఇందిరమ్మ మహిళ శక్తి కార్యక్రమం – జహీరాబాద్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాదులో జరిగిన ఇందిరమ్మ మహిళ శక్తి కార్యక్రమంలో ప్రధాన అతిథిగా పాల్గొన్న జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ శేట్కార్ , అలాగే సంక్షేమ కార్యక్రమాల అమలులో ముందుండే సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ గారు పాల్గొనడం ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.మహిళల సాధికారత, ఆర్థిక స్వావలంబన, ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై అవగాహన ఈ కార్యక్రమం ద్వారా మరింత బలంగా ప్రజలకు చేరువైంది. స్థానిక మహిళలతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలు, వారి అవసరాలు తెలుసుకోవడంలో నేతల పాల్గొనడం అభినందనీయం.మన జహీరాబాద్ అభివృద్ధి మహిళల అభివృద్ధి నుంచే ప్రారంభమవుతుంది. ఇదే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న అడుగులు ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందిస్తున్నాయి,

రెండు రాష్ట్రాలకు అడ్డాగా మారిన జహీరాబాద్

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-12T132142.597.wav?_=1

 

రెండు రాష్ట్రాలకు అడ్డాగా మారిన జహీరాబాద్

◆:- రెండు రాష్ట్రాలకు అడ్డాగా మారిన ఖేడ్

◆:- పంట పొలాల్లోనే తయారీ..

◆:- నిబంధనలు ఉల్లంఘించి బరితెగించిన వ్యాపారులు

◆:- సమాచారం తెలిపినా కన్నెత్తి చూడని అధికారులు

◆:- పట్టించుకోని రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు

జహీరాబాద్ నియోజకవర్గం ఇటుక బట్టీలకు దందాగా మారింది. ఆంధ్ర ఒడిస్సా, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కార్మికులను తీసుకొచ్చి ఇటుక బట్టీలను తయారు చేస్తున్నారు. సంబంధిత పంచాయతీకి రావలసిన ఆదాయానికి వ్యాపారులు గండి కొడుతున్నారు. అంతేకాకుండా నిబంధనలు కాలరాస్తూ.. కొనుగోళ్లు చేస్తూ రూ.కోట్లకు దండుకుంటున్నా రు. ఈ వ్యవహారంపై వ్యవహారం సంబంధిత శాఖ అధికారుల దృష్టి సారించకపోవడం తో దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుంది. ఇంతా దందా సాగుతున్న అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది.

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ : రెండు రాష్ట్రాలకు అడ్డాగా మారిన ఖేడ్ ఇటుక బట్టీల దందా కొనసాగిస్తు
న్నారు. సంత్ పూర్ నుంచి వచ్చి మూడు సంవ త్సరాల నుంచి ఇటుక బట్టులను తయారు చేస్తూ… ఒడిస్సా, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కార్మికులను తీసుకొచ్చి ఇటుక బట్టీలను తయారు చేస్తున్నారు. రూ. కోట్లల్లో దందా జరు గుతుంది. కూలీలకు డబ్బులు ఇవ్వకపోతే కొట్టిన సంఘటనలను అనేకం ఉన్నాయి. పని చేయిం చుకున్న తర్వాత పోయేముందు కార్మికులకు డబ్బులు ఇవ్వడానికి నిరాకరిస్తే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి కేసులు నమోదైన సంఘటనలు ఉన్నాయి. ప్రభుత్వ భూముల్లో ఇటుక బట్టీల వ్యాపారం చేస్తూ.. ఎలాంటి నిబంధనలు పాటించని అక్రమార్కులకు ఎంకరేజ్ చేస్తున్నా రు. ఇటుక బట్టీల వ్యాపారులతో ప్రత్యేక ఒ ప్పందం పెట్టుకుంటున్నారు. సంబంధిత పంచా యతీకి రావలసిన ఆదాయానికి గండి కొడుతు న్నారు. అంతేకాకుండా నిబంధనలు కాలరాస్తూ కొనుగోళ్లు చేస్తూ కోట్లకు పడగలెత్తుతున్నారు. అక్రమాలకు పుట్టగా ఇటుక బట్టీలు తయారవు తున్నాయి. ఇటుక బట్టీ ఏర్పాటు చేయాలంటే ముందుగా గ్రామపంచాయతీ, మున్సిపాలిటీ తో పాటు, మైనింగ్, రెవెన్యూ, పరిశ్రమ శాఖ. కాలుష్య, కార్మిక శాఖ, ఇరిగేషన్, విద్యుత్ శాఖ, రవాణా శాఖ, నియంత్రణ మండలి రవాణా శాఖ అనుమతులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే అవేమి కనిపించవు. ఈ వ్యవహా రంపై సం బంధిత శాఖ అధి కారుల దృష్టి సారించక పోవడంతో వ్యాపారులు దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగు తుంది. ఇటుక బట్టీల సీజన్ లో అధికారులకు సైతం నెల నెలకు మా మూలు అందుతున్నాయన్న ఆరోప ణలు ఉన్నాయి. దీంతో ఆయా గ్రామా ల్లోని ప్రభుత్వ భూములను నిబంధనలకు విరుద్ధంగా ఇటుక బట్టీలు దందా కొనసాగుతున్నప్పటికీ ఏమీ బాధ్యత లేని అన్నట్లు ఆయా విభా గాల అధికారులు వ్యవహ రిస్తున్నారు. ఇటుక బట్టీల వ్యాపా రం యథేచ్చగా సాగుతున్న అధికారులు అటు వైపు కన్నెత్తి చూడ కపోవడంతో పలు అనుమానా లు తవిస్తోంది. జిల్లాలోనే జహీరాబాద్ నియోజకవర్గంలో ఇటుక బట్టీల అక్రమ దందాపై జిల్లా కలెక్టర్, ఉన్నతా అధికారులు వెంటనే విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

పంట పొలాల్లో తయారీ..

ధనార్జననే ధ్యేయంగా కొందరు అక్రమార్కులు పంటలు పండించాల్సిన భూముల్లో ఇటుక బట్టిలను బిజినెస్ సాగిస్తున్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని శివారులో ఆంధ్రకు చెందిన జహీరాబాద్ లో ఉంటూ పరిచయం పెంచుకుంటూ మొగుడంపల్లి జహీరాబాద్ న్యాల్కల్ మండల శివారులోని రూట్లో భూమిని లీజుకు తీసుకొని పెద్ద ఎత్తున ఇటుక బట్టీలను తయారు చేసి హైదరాబాద్, కర్ణాటక మహారాష్ట్ర తరలిస్తున్నారు. అదేవిధంగా జహీరాబాద్ మండలం , శాఖాపూర్ రోడ్డు చిన్న హైదరాబాద్ శాఖాపూర్ కొత్తూరు ఇప్పేపల్లి గ్రామలో ఇటుక బట్టీ ఏర్పాటు చేశారు.

50 కు పైగానే ఇటుక బట్టీలు

నియోజకవర్గంలో సుమారు 50 పైగా ఇటుక బట్టీలు అక్రమంగా కొనసాగిస్తున్నట్లు సమా చారం. వీటిలో అన్ని ఇటుక బట్టీలు అనుమ తులు లేకుండానే కొనసాగిస్తుండడంతో ప్రభు త్వం ఆదాయం కోల్పోతుంది. లక్ష ఇటుకలు తయారు చేస్తున్న బట్టీ నిర్వహణకు గనుల శాఖ అనుమతి కోసం రూ.16 వేలు చెల్లించాలి. మట్టికి ఒక క్యూబిక్ మీటర్ కు సీనరేజీతో కలు పుకొని రూ. 40చొప్పున కట్టివ్వాలి. అవేమీ చెల్లించకుండానే వందల ట్రిప్పుల మట్టిని తవ్వు కుపోవుతున్నారు. పొగ వస్తున్న కాలుష్యం ని యంత్రణ బండలి అధికారులు పట్టించుకోవడం లేదు. మట్టిని తరలిస్తున్న రెవెన్యూ అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని, ఆరో పణలు వెల్లువెత్తుతున్నాయి.

సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌ ‘‘కేటీఆర్‌’’!

`జూబ్లీ హిల్స్‌ ఎన్నికల ప్రచారంలో కేటీఆరే కీలకం

`కాంగ్రెస్‌, బిజేపిలకు దక్కని క్రేజ్‌ కేటీఆర్‌ సొంతం

ktr jubliee hills election

`అన్ని రకాల ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్న కేటీఆర్‌

`అటు మీడియా సమావేశాలు.ఇటు పార్టీలో చేరికలు

`హైదరాబాదులో ప్రభుత్వ బాదితులతో సమావేశాలు

`సమయం చూసి హైడ్రాను ఉతుకుడు ఉతుకుతున్నాడు

`విస్మరించిన ప్రభుత్వ హామీలను గుర్తు చేస్తున్నాడు

`బాకీ కార్డులిచ్చి జనాన్ని చైతన్య పరుస్తున్నాడు

`అండగా వుంటామని వారికి భరోసా కల్పిస్తున్నాడు

`ఎక్కడికక్కడ సభలు, సమావేశాలు

`అన్ని డిజిజన్లలో పెద్ద ఎత్తున రోడ్‌ షోలు

`గతం కన్నా వినూత్నమైన రీతిలో ప్రచారాలు

`సీఎం. ‘‘రేవంత్‌ రెడ్డి’’కి కూడా కనిపించని క్రేజ్‌ ‘‘కేటీఆర్‌’’ సొంతం చేసుకున్నాడు

`కాంగ్రెస్‌ సభలకు రెట్టింపు జనాలు కేటిఆర్‌ సభలకు హజరౌతున్నారు

`‘‘కేటీఆర్‌’’ రోడ్‌షోలకు ప్రభంజనంలా తరలివస్తున్న జనం

`2015 జిహెచ్‌ఎంసి ఎన్నికలకు మించి సక్సెస్‌ అవుతున్న రోడ్‌షోలు

`పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ప్రచారంలో దూసుకుపోతున్నాడు

`ఒంటి చేత్తో పార్టీ స్టీరింగ్‌ పట్డుకొని కారు జోరు పెంచుతున్నాడు

`సారే రావాలని జనం కోరుకునేలా ప్రసంగాలు కొనసాగిస్తున్నాడు

`క్షణం తీరిక లేకుండా ‘‘జూబ్లీ హిల్స్‌’’ ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నాడు

`ప్రభుత్వం మీద పదునైన విమర్శనాస్త్రాలు సందిస్తున్నాడు

`అధికార పార్టీ కాంగ్రెస్‌ను గుక్క తిప్పుకోకుండా చేస్తున్నాడు

`ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌ చేతులెత్తేసేలా ఇరుకున పెడుతున్నాడు

`‘‘కేటీఆర్‌’’ సభలు, రోడ్‌ షోలు జనంతో కళకళలాడుతున్నాయి

`‘‘కేటీఆర్‌’’ జిందాబాద్‌ నినాదాలతో సభలు మారుమ్రోగిపోతున్నాయి

`పిల్లలు సైతం ‘‘దేక్‌లేంగే’’ అని పాటలు పాడుతున్నారు

`’’కేటీఆర్‌’’ అంకుల్‌ నమస్తే అంటూ స్వాగతిస్తున్నారు

హైదరాబాద్‌, నేటిధాత్రి:
తులం బంగారం ఇయ్యరు. వృద్దులకు ఇస్తామని చెప్పిన నాలుగు వేల పించన్లు ఇయ్యరు. మహిళలకు ఇస్తామన్న రెండు వేల ఐదు వందలు ఇయ్యరు. విద్యార్దినులకు ఇస్తామన్న స్కూటీల జాడ లేదు. రైతులకు ఇచ్చే రైతు బంధుకు రాం..రాం..అంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వం మీద బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంటు కేటిఆర్‌ పంచ్‌ డైలాగులు కొడుతుంటే జూబ్లీహిల్స్‌ జనం కేరింతలు కొడుతున్నారు. కేటిఆర్‌ చెబుతున్నప్పుడు వంత పాడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తున్నారు. అలవి కాని హమీలన్నీ ఇచ్చి ఇప్పుడు మాట మారుస్తున్న కాంగ్రెస్‌ పార్టీని జూబ్లీహిల్స్‌ ప్రజలు చిత్తు చిత్తుగా ఓడిరచాలంటూ చేస్తున్న వ్యాఖ్యలకు ప్రజలు చప్పట్లు కొడుతున్నారు. కారు గుర్తుకే మన ఓటు అంటూ కేటిఆర్‌ అంటుంటే రోడ్‌షోలకు హజరైన జనం మన ఓటు అంటూ దిక్కులు పిక్కటిల్లేలా అంటున్నారు. ఇదీ కేటిఆర్‌ క్రేజ్‌ అంటూ బి ఆర్‌ఎస్‌ శ్రేణులు సంబరపడుతున్నాయి. చాలా కాలం తర్వాత ప్రజలు బిఆర్‌ఎస్‌ పార్టీ ప్రచారంలో, స్ట్రీట్‌ కార్నర్‌ సభల్లో, కేటిఆర్‌ రోడ్‌షోలకు విపరీతంగా హజరౌతున్నారు. స్వచ్చంధంగా వచ్చి కేటిఆర్‌ చెప్పే మాటలు వింటున్నారు. కేటిఆర్‌ వేస్తున్న పంచ్‌ డైలాగులకు జనం ఊడిపోతున్నారు. ఇంతటి క్రేజ్‌ ఈ మధ్య మరే నాయకుడికి లేదు. సహజంగా బిఆర్‌ఎస్‌ అధినేత కేసిఆర్‌ను చూసేందుకు జనం ఇలా ఎగబడుతుంటారు. సభలకు హజరౌతుంటారు. ఆయన మాటలు వినడానికి లైవ్‌ కార్యక్రమాలు చూస్తుంటారు. ఇప్పుడు సరిగ్గా ఆ క్రెడిట్‌ను కేటిఆర్‌ సొంతం చేసుకున్నారు. జూబ్లీహిల్స్‌ ఎన్నికల ప్రచారంలో బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంటు కేటిఆర్‌ సెంటఆర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలుస్తున్నారు. కేటిఆర్‌ సభలకు విచ్చినంత జనం ఇతర పార్టీలకు రావడం లేదు. కాంగ్రెస్‌ పార్టీ తరుపున అసలైన స్టార్‌ క్యాంపెయిన్‌ అయిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి సైతం ఇంత మంది రావడం లేదు. ఆయన సభలు చాలా సప్పగా సాగుతున్నాయి. గత వారం రోజుల నుంచి సిఎం. రేవంత్‌ రెడ్డి ఎంతో కష్టపడుతున్నారు. ప్రచారంలో విసృతంగా పాల్గొంటున్నాడు. అటు మంత్రులు, ఇటు కాంగ్రెస్‌ అభ్యర్ధిని వెంట పెట్టుకొని సిఎం. రేవంత్‌ రోడ్‌షోలు నిర్వహిస్తున్నారు. దానికి తోడు రహమత్‌ నగర్‌లో సిఎం. రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో ఆగ్రహాన్ని తెప్పించాయి. జూబ్లీహిల్స్‌ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ గెలిస్తే ఇటీవల ఇచ్చిన 25వేల రేషన్‌కార్డులు కట్‌ అవుతాయని హెచ్చరించారు. ఉచిత కరంట్‌ బంద్‌ అవుతుందన్నారు. సన్న బియ్యం ఆపేస్తామన్నారు. సబ్సిడీ సిలిండర్‌ ఇవ్వమన్నారు. ఇదిలా వుంటే తాజాగా కొత్తగా నియామకమైన మరో మంత్రి అజహరుద్దీన్‌ కాంగ్రెస్‌ను గెలిపించకపోతే జూబ్లీహిల్స్‌ రాను అంటూ వ్యాఖ్యానించారు. ఇది కేటిఆర్‌కు ఆయుధాలుగా మారాయి. మామూలుగానే కేటిఆర్‌ లాంటి వాగ్ధాటి వున్న నాయకులకు చిన్న అవకాశం దొరికినా రచ్చ రచ్చ చేస్తారు. అలాంటిది సాక్ష్యాత్తు సిఎం. రేవంత్‌రెడ్డి బియ్యం ఆపేస్తాం. రేషన్‌ కార్డులు కట్‌ చేస్తామంటూ ప్రజలను బెదిరించేలా వ్యాఖ్యలు చేస్తే ఊరుకుంటారా? వీటిపై కేటిఆర్‌ ప్రభుత్వాన్ని తూర్పారపడుతున్నారు. దుమ్ము దుమారం రేపుతున్నారు. ప్రజలను చైతన్యం చేస్తున్నారు. ప్రజలను బెదిరిస్తే ఓట్లు పడతాయని రేవంత్‌ అనుకుంటున్నారు. అలాంటి నియంతకు తగిన బుద్దిచెప్పాలంటూ కేటిఆర్‌ ప్రజలకు సూచిస్తుంటే జనం చప్పట్లు కొడుతున్నారు. సహజంగా రోడ్‌ షోలలో కార్నర్‌ మీటింగ్‌లు పది నిమిషాలు, పావు గంట సాగితేనే ఎక్కువ. కాని కేటిఆర్‌ కార్నర్‌ సభలు గంటకు పైగా సాగుతున్నాయి. జోరు వానలో కేటిఆర్‌ మాట్లాడుతుంటే జనం కదలడం లేదు. పైగా వానలో కూడా డ్యాన్సులు చేస్తూ కేటిఆర్‌కే ఉత్సాహాన్ని నింపుతున్నారు. దాంతో కాంగ్రెస్‌, బిజేపి నాయకులకు దక్కని క్రేజ్‌ కేటిఆర్‌కు సొంతమౌతోంది. ఇక బిజేపి నుంచి స్టార్‌ క్యాంపెయినర్లు ఎంత మంది వున్నా, రోడ్‌షోలకు, సభలకు, ప్రచారానికి పెద్దగా స్పందన లేదు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో ఆది నుంచి అన్ని రకాల బాధ్యతలు కేటిఆర్‌ నిర్వహిస్తూ వస్తున్నారు. అన్ని రకాల ప్రచార బాద్యతలు ఆయన భుజాన వేసుకున్నారు. మాగంటి గోపీనాధ్‌ చనిపోయిన నుంచి జూబ్లీహిల్స్‌లో అనేక రకాల పార్టీ సభలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఎన్నికల సమయంలో పార్టీ నాయకులకు అప్పగించే బాధ్యతలు అప్పగించినా, అందిరికన్నా ఎక్కువ కష్టపడుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ మీద కౌంటర్ల కోసం ఎప్పటికప్పుడు మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని, కాంగ్రెస్‌ పార్టీని తూర్పారపడుతున్నారు. పైగా ఓట్‌ చోరి అంశంలో జూబ్లీహిల్స్‌లో దొంగ ఓట్ల నమోదుపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఎన్నికల కమీషన్‌ దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. ఉప ఎన్నికల వేళ పార్టీలోకి పెద్దఎత్తున చేరికలు జరుగుతున్నాయి. అటు కాంగ్రెస్‌, ఇటు ఎంఐఎం, బిజేపిలనుంచి బిఆర్‌ఎస్‌లోకి డివిజన్ల వారిగా చేరికలు జరుగుతూనే వున్నాయి. వాటన్నింటికీ హజరౌతూ, వారితో సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ గెలుపుకోసం కృషి చేస్తున్నారు. పార్టీలోకి చేరుతున్న వారికి స్వయంగా కేటిఆర్‌ కండువాలు కప్పి ఆహ్వానిస్తున్నారు. వారిలో ఉత్సాహం నింపుతున్నారు. ఇక ఇటీవల ప్రభుత్వం వల్ల నష్టపోయిన హైడ్రా బాదితులు, మూసీ బాధితులను స్వయంగా కలుస్తున్నారు. వారు తెలంగాణ భవన్‌కు వస్తామంటే రమ్మంటున్నారు. వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. ఆ కుటుంబాలు పడిన భాధనలు, వేధనలు వింటున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా హైడ్రా బాదితులతో ఇటీవల ఏర్పాటు చేసిన సమావేశం చూసిన కాంగ్రెస్‌ ప్రభుత్వం వణికిపోయిందనే చెప్పాలి. అందుకే వెంటనే స్పందించిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంటు జగ్గారెడ్డి హైడ్రా వల్ల తమ పార్టీకి నష్టం జరుగుతోందని అన్నారు. అంటేనే హైడ్రా పేదల జీవితాలను ఎలా తలకిందులు చేస్తుందో అర్ధం చేసుకోవచ్చు. తెలంగాణ భవన్‌కు వచ్చిన చిన్న పిల్లలు తమ అనుభవాలను చెబుతూ కన్నీటి పర్యంతమౌతుంటే కేటిఆర్‌ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రజలను ఓదార్చే ప్రయత్నం చేశారు. ఇలా అన్ని వర్గాల ప్రజలనుంచి కేటిఆర్‌ ప్రశంసలు అందుకుంటున్నారు. ఇక ఎన్నికల ముందు కాంగ్రెస్‌పార్టీ ఇచ్చిన హమీలు, ప్రజలకు ప్రభుత్వం వున్న బాకీలను గుర్తు చేస్తూ ప్రచారం సాగిస్తున్నారు. బాకీ కార్డులను ప్రజలకు అందజేస్తూ, ప్రచారానికి వస్తున్న కాంగ్రెస్‌ నాయకులను నిలదీయాలని సూచిస్తున్నారు. ప్రభుత్వం వల్ల నష్టపోయిన వారికి హైడ్రా బాధితులకు తప్పకుండా పార్టీ అండగా వుంటుందని భరోసా కల్పిస్తున్నారు. పొరపాటున జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను నమ్మితే, ఇక్కడికి కూడా బుల్డోజర్‌ వస్తుందని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇలా ఎక్కడిక్కడ సభలు, సమావేశాలు నిర్వహిస్తూ క్షణం తీరుకలేకుండా ప్రచారంలో పాల్గొంటున్నారు. బిఆర్‌ఎస్‌ అభ్యర్ది సునీతను గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు. గతం కన్నా వినూత్నమైన రీతిలో కేటిఆర్‌ ప్రచారం సాగిస్తున్నారు. ఎల్‌ఈడీ స్క్రీన్‌లలో ప్రభుత్వం ఇచ్చిన హమీలు, చేసిన మోసాలు చూపిస్తూ ప్రచారంలో పాల్గొంటున్నారు. దాంతో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం చేసిన మోసాలను గుర్తు చేస్తూ ప్రజలను చైతన్యం చేస్తున్నారు. సిఎం. రేవంత్‌రెడ్డి సభలకు, రోడ్‌షోలకు వస్తున్న జనాలకంటే రెట్టింపు జనాలు కేటిఆర్‌ సభలకు ప్రజలు హజరౌతున్నారు. కేటిఆర్‌ రోడ్‌షోలకు జనం ప్రభంజనంలా వస్తున్నారు. 2015 జిహెచ్‌ఎంసి ఎన్నికల సమయంలో కేటిఆర్‌ రోడ్‌షోలకు జనం తండోపతండాలుగా వచ్చే వారు. కేటిఆర్‌ ఎక్కడికెళ్లినా జనం పెద్దఎత్తున సమూహమయ్యేవారు. ఇక రోడ్‌షోలలో కేటిఆర్‌ వెహికిల్‌ కదిలేది కాదు. అంత జనం వచ్చే వారు. ఇప్పుడు సరిగ్గా జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రచారంలోనూ కేటిఆర్‌ సభలకు ప్రజలు వస్తున్నారు. కేటిఆర్‌కు హైదరాబాద్‌ ప్రజల్లో ఎంత ఆదరణ వుందో, క్రేజ్‌ వుందో ఈ రోడ్‌షోల ద్వారా మరోసారి రుజవౌతోంది. తెలంగాణ ప్యూచర్‌ లీడర్‌ కేటిఆరే అనేది తేలిపోతోంది. అందుకే కేటిఆర్‌ను చూస్తూ జనం కేరింతలు కొడుతున్నారు. ఈలలు, చప్పట్లతో ఆయన మాటలకు ఫిదా అవుతున్నారు.

రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

రైతులు పత్తి పంటను సీసీఐ కేంద్రాల్లో అమ్ముకో వాలి

ప్రైవేటు వ్యక్తులు, దళారులకు అమ్ముకొని మోసపోవద్దు

సీసీఐ పత్తి కొనుగోళ్లను ప్రారంభించిన, గండ్ర సత్యనారాయణ రావు

శాయంపేట నేటిధాత్రి:

 

రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం, రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పత్తి పంటను సీసీఐ కేంద్రాల్లో అమ్ముకొని మద్దతు ధర పొందాలని గండ్ర సత్యనారా యణరావు సూచించారు. పరకాల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు లో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన పత్తి కొనుగో లు కేంద్రాన్ని ఎమ్మెల్యే లిద్దరు రిబ్బన్ కట్ చేసి ప్రారంభిం చారు. ఈ సందర్భంగా వేరు వేరుగా మాట్లాడుతూ సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని రైతు లు సద్వినియోగం చేసుకొని, మద్దతు ధరను పొందాలని అన్నారు.

8 నుండి 12 శాతం వరకు తేమ శాతం ఉండడం వలన రైతులు నష్టపోతున్నా రని 20 శాతం తేమ ఉండే విధంగా కొనుగోలు చేయాల న్నారు. ప్రతి ఎకరాకి 7 క్వింటాళ్లు కొనుగోలు చేయా లనే నిబంధన కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసి, 12 క్వింటాలు కొను గోలు చేసేలా రైతులకు సహక రించాలన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపో యిన ప్రతి ఒక్కరికి పరిహారం అందించేలా సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుం దని, అధికారులు వెంటనే సర్వే చేసి ప్రభుత్వానికి నివే దిక అందించేలా సహకరిం చాలన్నారు. పత్తి కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యేలు తెలిపారు. కపాస్ కిసాన్ యాప్ ద్వారా రైతులు స్లాట్ బుకింగ్ చేసుకుని పత్తిని తీసుకురావాలని సూచించా రు. అంతకుముందు వివిధ పంటలకు సంబంధించిన కనీస మద్దతు ధర పోస్టర్ ను ఎమ్మెల్యేలు, అధికారులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శాయంపేట మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు,పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు

అభివృద్ధిపై ప్రశ్నిస్తే దాడులకు దిగుతారా

అభివృద్ధిపై ప్రశ్నిస్తే దాడులకు దిగుతారా

బిఆర్ఎస్ మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్

గుండాల,నేటిదాత్రి:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అద్వాన పరిస్థితులపై ప్రశ్నిస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు గూండాలుగా వ్యవహరించి భౌతికరిదారులకు దిగటం ఎంతవరకు సరైనదని గుండాల మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తెల్లం భాస్కర్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో పార్టీ నాయకులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు రేగ కాంతారావు డిజిటల్ మీడియా ద్వారా రహదారుల పరిస్థితి పై ప్రశ్నిస్తే భౌతిక దాడులకు దిగుతూ మణుగూరు పార్టీ కార్యాలయాన్ని కాంగ్రెస్ పార్టీ గుండాలు దాడి చేసి కాలబెట్టడం ఎంతవరకు సరైంది అని అన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేక అడిగే వారి పైన వారి పార్టీ కార్యాలయాల పైన దాడులకు దిగితే పార్టీ నాయకులు కార్యకర్తలు భయపడతారు అనుకోవడం వారి అవివేకమని అన్నారు. అభివృద్ధి చేతకాక అడిగే వారిపై దాడులు చేయడమే మీ సంస్కృతి ఇదే మీ ప్రజా పాలన అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేయకలేక ప్రజలను మభ్య పెట్టేందుకు కొత్త రకం నాటకం తెరలేపిందని అన్నారు . ఈ దారిలో పాల్గొన్న కాంగ్రెస్ గుండాలపై చర్యలు తీసుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పై దృష్టి సారించి ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని లేని పక్షంలో మరింతగా కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా ముందుకు కదులుతాడని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు భౌతిక దాడులకు దిగటం మానుకోవాలని లేని పక్షంలో చట్టపరంగా వెళ్లి వారికి శిక్ష తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిధి టి రాము, యువజన విభాగమ అధ్యక్షుడు సయ్యద్ అజ్జు,బీసీ సెల్ అధ్యక్షులు గడ్డం రమేష్, ఎస్టీ సెల్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, ఎస్సీ సెల్ అధ్యక్షులు రాములు,పార్టీ నాయకులు గడ్డం వీరన్న, కటికం నాగేశ్వరరావు, జాడి ప్రభాకర్, గోగ్గల రాంబాబు,పొంబోయిన సుధాకర్, బొమ్మెర్ల శ్రీను, బొమ్మెర్ల పద్మారావు, బొమ్మెర సతీష్, గంగాధరి ప్రమోద్, జనగం లాలయ్య, భూక్య శ్రీను, ఆగయ్య, గంగాధరి నాగన్న, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

హరీష్ రావు కుటుంబాన్ని పరామర్శించిన యువ నాయకుడు షేక్ సోహెల్

మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు కుటుంబానికి పరామర్శించిన యువ నాయకులు షేక్ సోహెల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

మాజీ మంత్రి సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు కుటుంబానికి పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసి నివాళులర్పించిన ఝరాసంగం మండలం తుమ్మన్ పల్లి గ్రామ యువ నాయకులు షేక్ సోహెల్ గారు.గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు గారి తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు రావు చిత్ర పటానికి నివాళులు అర్పించారు. వారి కుటుంబానికి వెళ్లి తన సానుభూతిని వ్యక్తం చేస్తూ దేవుడు వారి కుటుంబానికి ధైర్యం నింపాలని కోరినారు, షైక్ సోహైల్
మరియు శశివర్ధన్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు,

నివాళులు అర్పించిన వీరేష్ రావు

నివాళులు అర్పించిన వీరేష్ రావు

పరకాల,నేటిధాత్రి

 

సోమవారం నాడు హైద్రాబాదు లో మాజీ మంత్రి,సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు,తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు ఇటీవల అనారోగ్యంతో స్వర్గస్తులు కాగా వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని పరకాల బిఆర్ఎస్ యువనాయకులు వీరేష్ రావు సత్యనారాయణ రావు చిత్రపటానికి నివాళులు అర్పించారు

మిషన్ భగీరథ.. క్వాలిటీ కంట్రోల్ పై పర్యవేక్షణ.

మిషన్ భగీరథ..
క్వాలిటీ కంట్రోల్ పై పర్యవేక్షణ.

నిజాంపేట: నేటి ధాత్రి

 

గ్రామాల్లో ప్రజలకు అందుతున్న మిషన్ భగీరథ నీటిపై క్వాలిటీ కంట్రోల్ ఏఈ సుధాకర్, మిషన్ భగీరథ ఏఈ బిక్షపతి పర్యవేక్షించారు. మండలంలోని నగరం తండా గ్రామంలో సోమవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో గల మిషన్ భగీరథ నీటికి సంబంధించిన రికార్డులను ఆయన పరిశీలించారు. వాటర్ ట్యాంకులు, ఇండ్లలోకి సరఫరా అయ్యే నీటిని పరిశీలించి వాటి నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి మహమ్మద్ ఆరిఫ్, మిషన్ భగీరథ హెల్పర్ పరశురాములు, బలిజ భాస్కర్, తదితరులు ఉన్నారు

ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవం చేసిన నాయకులు

ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవం చేసిన నాయకులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాతకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమంలో భాగంగా,సోమవారం ఝరాసంగం మండలం పరిధిలో కక్కర్ వాడ గ్రామ లో తాటిపల్లి నాగమణి మహిపాల్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్య అతిథులు గా పాల్గొన్నారు.ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు సకాలంలో ఇల్లు పూర్తి చేసుకొని ఇలాంటి మంచి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం తరపున కోరుకుంటున్నాము అన్నారు.

ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మన ప్రజా ప్రభుత్వం మరిన్ని మంచి కార్యక్రమాలు నిర్వహింస్తోంది. ప్రజలు అందరూ సద్వినియగం చేసుకోవాలని కోరుకుంటున్నాము అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ హన్మంత్ రావు పాటిల్ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ జిల్లా మాజీ అధ్యక్షులు ఉదయ్ శంకర్ పాటిల్ నాయకులు మారుతి రావు సంగ్రామ్ పాటిల్ డప్పురు సంగన్న రాజ్ కుమార్ స్వామి గ్రామ యువ నాయకులు శ్రీకాంత్ రెడ్డి గోపాల్ రెడ్డి మాజీ ఎం పి టిసి నర్సిములు.అడ్వకేట్ షకీల్ సర్ శ్రీనివాసరెడ్డి రాంరెడ్డి పెన్ గన్ ఎడిటర్ రాయికోటి నర్సింలు.యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చింతలగట్టు శివరాజ్ మండల సోషల్ మీడియా ఇంచార్జి నవీన్ సుభాష్,మాణయ్య ఇస్మాయిల్ తధీతరులు పాల్గోని మహిపాల్రెడ్డికి శుభకాంక్షలు తెలియజేసారు 

హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప-ఎన్నికల ప్రచారంలో డాక్టర్.మడికొండ శ్రీను

హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప-ఎన్నికల ప్రచారంలో డాక్టర్.మడికొండ శ్రీను

పరకాల,నేటిధాత్రి

హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప-ఎన్నిక సందర్బంగా కాంగ్రెస్ పార్టీ బలపరచిన ఎంమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపుకోరుతూ టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కమిటీ పక్షాన ఎన్నికల ప్రచారం ఎర్రగడ్డ, అమీర్ పేట,సోమాజిగూడ, యూసుఫ్ గూడ డివిజన్ ఏరియాలలో ఏఐసీసీ ఎస్సీ సెల్ కో-ఆర్డినేటర్,టీపీసీసీ ఎస్సి సెల్ చైర్మన్ మరియు తెలంగాణ రాష్ట్ర ఎస్సి కార్పొరేషన్ చైర్మన్ నాగరిగారి ప్రీతం నాయకత్వంలో ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల పోస్టర్స్, కరపత్రం చూపుతూ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్లు డబ్బేట రమేష్,నత్తి కౌర్నెల్,అర్షంఅశోక్,జమ్మికుంటవిజయ్,రాజశేఖర్,శివశంకర్,కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

జోరుగా సాగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం

జోరుగా సాగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసుఫ్ గూడ డివిజన్ లో లక్ష్మీనరసింహ నగర్ (L.N )డోర్ టు డోర్ ప్రచారంలో తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి మరియు మహబూబ్ నగర్ జిల్లా మూడ చైర్మన్ & పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్ పాల్గొని ప్రజలకు ప్రజా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారికి ఓటు వేసి గెలిపించాలని ఓట్లరను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సంజయ్ గౌడ్, మహబూబ్ నగర్ జిల్లా మైనారిటీ ప్రెసిడెంట్ ఫయాజ్, టీం పట్వారీ శశిధర్, బి. రాజేష్ యాదవ్, ప్రేమ్, కలముద్దీన్, వెంకటమ్మ, పద్మమ్మ, రాజేష్, చిన్ను, హానీబ్, హనీఫ్, అతిఫ్, మన్సూర్, నద్దు మరియు బూత్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు

సదరు ఉత్సవాలలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు

సదరు ఉత్సవాలలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు

◆:- డా౹౹సిద్దం.ఉజ్వల్‌రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ పట్టణంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదరు ఉత్సవాలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్‌రెడ్డి పాల్గొన్నారు. వారికి యాదవ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. అనంతరం ఉజ్వల్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏడాది జహీరాబాద్ పట్టణంలో యాదవ సోదరులు సదరు ఉత్సవాలు నిర్వహించడం ఆనందదాయకమన్నారు. సదర్ ఉత్సవాలు మన సాంస్కృతిక వైభవానికి, ప్రజల ఐక్యతకు ప్రతీక అన్నారు.ఈ ఉత్సవాలు మన సంప్రదాయాలను, సాంస్కృతిక విలువలను తరతరాలకు చేరుస్తాయన్నారు.అనంతరం దున్నపోతుల ప్రదర్శనను వీక్షించి,నిర్వాహకులను అభినందించారు.ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పి.నర్సింహారెడ్డి,యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు పి.నాగిరెడ్డి,యూత్ కాంగ్రెస్ లీగల్‌ సెల్ చైర్మన్ నథానెయల్, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ కార్యదర్శి హర్షవర్ధన్ రెడ్డి, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ రెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కిరణ్‌కుమార్ గౌడ్, సీనియర్ నాయకులు శ్రీకాంత్‌రెడ్డి,ఇమామ్‌ పటేల్, అరుణ్‌కుమార్, పాండు యాదవ్, సాయి యాదవ్, పవన్ యాదవ్ మరియు యాదవ సంఘం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version