సదరు ఉత్సవాలలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు

సదరు ఉత్సవాలలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు

◆:- డా౹౹సిద్దం.ఉజ్వల్‌రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ పట్టణంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదరు ఉత్సవాలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్‌రెడ్డి పాల్గొన్నారు. వారికి యాదవ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. అనంతరం ఉజ్వల్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏడాది జహీరాబాద్ పట్టణంలో యాదవ సోదరులు సదరు ఉత్సవాలు నిర్వహించడం ఆనందదాయకమన్నారు. సదర్ ఉత్సవాలు మన సాంస్కృతిక వైభవానికి, ప్రజల ఐక్యతకు ప్రతీక అన్నారు.ఈ ఉత్సవాలు మన సంప్రదాయాలను, సాంస్కృతిక విలువలను తరతరాలకు చేరుస్తాయన్నారు.అనంతరం దున్నపోతుల ప్రదర్శనను వీక్షించి,నిర్వాహకులను అభినందించారు.ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పి.నర్సింహారెడ్డి,యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు పి.నాగిరెడ్డి,యూత్ కాంగ్రెస్ లీగల్‌ సెల్ చైర్మన్ నథానెయల్, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ కార్యదర్శి హర్షవర్ధన్ రెడ్డి, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ రెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కిరణ్‌కుమార్ గౌడ్, సీనియర్ నాయకులు శ్రీకాంత్‌రెడ్డి,ఇమామ్‌ పటేల్, అరుణ్‌కుమార్, పాండు యాదవ్, సాయి యాదవ్, పవన్ యాదవ్ మరియు యాదవ సంఘం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version