జోరుగా సాగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం

జోరుగా సాగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసుఫ్ గూడ డివిజన్ లో లక్ష్మీనరసింహ నగర్ (L.N )డోర్ టు డోర్ ప్రచారంలో తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి మరియు మహబూబ్ నగర్ జిల్లా మూడ చైర్మన్ & పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్ పాల్గొని ప్రజలకు ప్రజా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారికి ఓటు వేసి గెలిపించాలని ఓట్లరను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సంజయ్ గౌడ్, మహబూబ్ నగర్ జిల్లా మైనారిటీ ప్రెసిడెంట్ ఫయాజ్, టీం పట్వారీ శశిధర్, బి. రాజేష్ యాదవ్, ప్రేమ్, కలముద్దీన్, వెంకటమ్మ, పద్మమ్మ, రాజేష్, చిన్ను, హానీబ్, హనీఫ్, అతిఫ్, మన్సూర్, నద్దు మరియు బూత్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు

జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసుఫ్ గుడా డివిజన్‌లో ఇంటింటా ప్రచారం…..

జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసుఫ్ గుడా డివిజన్‌లో ఇంటింటా ప్రచారం

◆:- తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసఫ్ గుడా డివిజన్‌లోని 253,254,255,256,257, 258 బూత్ లో నిర్వహించిన ఇంటింటా ప్రచార కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్,ఎమ్మెల్యే వీర్లపల్లీ శంకర్, బిసి కార్పొరేషన్ చైర్మన్ నూతి.శ్రీకాంత్ గౌడ్,సిని నటుడు సుమన్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి,యువ నాయకుడు,ప్రజా సంకల్పంతో నిండిన నవీన్ యాదవ్ గారిని గెలిపించడం అత్యంత కీలకమనితెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,స్థానిక నాయకులు,మహిళలు,యువత మరియు ప్రజలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version