హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప-ఎన్నికల ప్రచారంలో డాక్టర్.మడికొండ శ్రీను
పరకాల,నేటిధాత్రి
హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప-ఎన్నిక సందర్బంగా కాంగ్రెస్ పార్టీ బలపరచిన ఎంమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపుకోరుతూ టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కమిటీ పక్షాన ఎన్నికల ప్రచారం ఎర్రగడ్డ, అమీర్ పేట,సోమాజిగూడ, యూసుఫ్ గూడ డివిజన్ ఏరియాలలో ఏఐసీసీ ఎస్సీ సెల్ కో-ఆర్డినేటర్,టీపీసీసీ ఎస్సి సెల్ చైర్మన్ మరియు తెలంగాణ రాష్ట్ర ఎస్సి కార్పొరేషన్ చైర్మన్ నాగరిగారి ప్రీతం నాయకత్వంలో ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల పోస్టర్స్, కరపత్రం చూపుతూ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్లు డబ్బేట రమేష్,నత్తి కౌర్నెల్,అర్షంఅశోక్,జమ్మికుంటవిజయ్,రాజశేఖర్,శివశంకర్,కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
