జహీరాబాద్ మహిళా కాంగ్రెస్ రాజ్యాంగ దినోత్సవం

రాజ్యాంగ దినోత్సవం జరుపుకున్నా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు

జహీరాబాద్ నేటి ధాత్రి,:

 

రాజ్యాంగ దినోత్సవం పురష్కరించుకొని జహీరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మ మహిళా కాంగ్రెస్ నాయకురాళ్ళు కలిసి రాజ్యాంగ దినోత్సవం జరుపుకున్నారు.భారతదేశంలో రాజ్యాంగ దినోత్సవం (సంవిధాన్ దివస్) ప్రతి సంవత్సరం నవంబర్ 26న జరుపుకుంటారు. ఈ రోజున, 1949లో భారత రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించిన జ్ఞాపకార్థం, రాజ్యాంగ విలువల పట్ల ప్రజలలో రాజ్యాంగ మౌలిక లక్ష్యం సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందరికీ అందించడం గౌరవాన్ని పెంపొందించడానికి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26న ఆమోదించబడింది. ఈ చారిత్రాత్మక రోజును స్మరించుకోవడానికి, రాజ్యాంగంలోని ప్రజాస్వామ్య విలువలను గౌరవించడానికి మరియు విద్యార్థులు, పౌరులలో రాజ్యాంగం మరియు ప్రజాస్వామ్య విలువల గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది.

రాజ్యాంగ అవతరణ వేడుకలు ఘనంగా

ఘనంగా రాజ్యాంగ అవతరణ దినోత్సవ వేడుకలు..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

క్యాతన్ పల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో రాజ్యాంగ అవతరణ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని మున్సిపల్ కార్యాలయాలలో రాజ్యాంగ అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించాలని ఆదేశించిన నేపథ్యంలో రాజ్యాంగ అవతరణ దినోత్సవ వేడుక నిర్వహించడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు తెలిపారు. అనంతరం కమిషనర్ గద్దె రాజు మాట్లాడారు. రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపము, ప్రాముఖ్యత, భారతదేశ పౌరులందరూ విధిగా పాటిస్తూ దేశం యొక్క సమగ్రతను పెంపొందించేలా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ మేనేజర్ సతీష్, రెవెన్యూ ఆఫీసర్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

గడపగడపకు కాంగ్రెస్ ప్రభుత్వ బాకీ కార్డ్ పంపిణీ…

గడపగడపకు కాంగ్రెస్ ప్రభుత్వ బాకీ కార్డ్ పంపిణీ

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఆరు గ్యారెంటీలను ప్రవేశపెడతామని చెప్పి అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో విఫలమైన నేపథ్యంలో బాకీ కార్డులను క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని గద్దె రాగడి ఏరియాలో ఆ పార్టీ శ్రేణులు ఇంటింటికి పంపిణీ చేశారు. బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పిలుపుతో మునిసిపాలిటీలోని గద్దె రాగడిలో బాకీ కార్డులను ప్రజల వద్దకు తీసుకెళ్లి ఇంటింటికి పంచుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బాకీ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు అలుగుల సత్తయ్య, కుర్మ గురువయ్య దేవి సాయి కృష్ణ, కుర్మ దినేష్, బండారు రవీందర్, శివ, అలుగుల అరవింద్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version