నిజాంపేటలో వైయస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-02T143516.488.wav?_=1

నిజాంపేటలో వైయస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి

నిజాంపేట, నేటి ధాత్రి

మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్ గౌడ్ ఆధ్వర్యంలో వై.యస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గొప్ప రాజకీయవేత్త వైయస్ రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కొమ్మట బాబు, వై వెంకటేశం, మారుతి, రవి, అబ్దుల్ ,కృష్ణ తదితరులు ఉన్నారు.

నర్సంపేటలో వైఎస్ఆర్ 16వ వర్ధంతి వేడుకలు..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-02T143118.908.wav?_=2

రామరాజ్యం తలపించేలా వైఎస్ఆర్ పాలన

టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు

నర్సంపేట,నేటిధాత్రి:

ప్రజా సంక్షేమమే ప్రధాన ఎజెండాగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి దేశంలోనే గుర్తింపు పొందుతూ రామరాజ్యం తలపించేలా దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన చేశారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు సభ్యులు పెండెం రామానంద్ తెలిపారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి
వైఎస్ఆర్ 16వ వర్ధంతి సందర్భంగా
నర్సంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బత్తిని రాజేందర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ నాయకులతో కలిసి వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా పెండెం రామానంద్ గారు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు,అవసరాలను తెలుసుకున్న నేత అని పేర్కొన్నారు. ఏకకాలంలో రుణమాఫీ చేసి రైతుల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచారని తెలిపారు. పేద ప్రజలు,విద్యార్థుల కోసం ఆరోగ్య శ్రీ పథకం,ఫీజు రియంబర్స్మెంట్ పథకాలను ప్రవేశపెట్టి చిరస్మరణీయుడయ్యారని కొనియాడారు.వైఎస్ఆర్ పాలన సంక్షేమమే ప్రధాన ఎజెండా గా కార్యకర్తలే సైనికులుగా కాంగ్రెస్ పార్టీయే ప్రాణంగా పని చేసిన గొప్ప నాయకుడు అని రామానంద్ గుర్తుకు చేశారు. దివంగత డాక్టర్ వైయస్సార్ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలే నేటికీ కొనసాగుతున్నాయని ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కర్నాటి పార్వతమ్మ,మాజీ కౌన్సిలర్ ఎలకంటి విజయ్ కుమార్, ర్మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్ర యాకూబ్ రెడ్డి,మాజీ సొసైటీ వైస్ చైర్మన్ పాలాయి రవి,నర్సంపేట మండలం అధ్యక్షులు కత్తి కిరణ్, నర్సంపేట పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రవి, పంబి వంశీకృష్ణ, మార్కెట్ డైరెక్టర్ డక్క శ్రీను,నర్సంపేట పట్టణ కార్యదర్శి చిప్ప నాగ,నర్సంపేట పట్టణ మహిళా అధ్యక్షురాలు ధోని కీర్తన, నర్సంపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొంత రంజిత్, గజ్జి రాజు, లక్కాసు రమేష్, నాగేల్లి సారంగం, పొన్నం నరసింహారెడ్డి, కొప్పు అశోక్, బాణాల శ్రీను, మెరుగు కిరణ్, మహిళ నాయకురాలు హసీనా, గాజుల రమేష్, గండు గిరి, బిట్ల మనోహర్, పాతార బోయిన చంద్ర మొగిలి, మేడం కుమార్, ఎండి సర్వర్, దేశీ సాయి పటేల్, కాంగ్రెస్,మహిళా,యూత్ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

చల్లా ధర్మారెడ్డి మృతుల కుటుంబాలను పరామర్శించారు..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-02T142141.562-1.wav?_=3

మృతుల కుటుంబాలకు అండగా ఉంటా..చల్లా ధర్మారెడ్డి

నడికూడ,నేటిధాత్రి:

మండలంలోని వరికోలు, నార్లపూర్,చర్లపల్లి గ్రామాలలో ఇటీవలే మృతిచెందిన గుండెకారి జమున,దొగ్గెల శ్రావణ్ కుమార్(లెనిన్),దొగ్గెల కొమురయ్య,ఓరుగంటి లచ్చమ్మ,బయ్య తిరుపతి, చెక్క శంకరయ్య,చెక్క రాజమ్మ,దైనంపల్లి మల్లయ్య,ఈర్ల పెద్దులు, చేపూరి కొమురయ్య,కొత్తపల్లి కరుణ,నందికొండ కౌసల్య కుటుంబాలను పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరామర్శించారు.ఈ సందర్భంగా మృతుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం వారి మృతికిగల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని మాజీ ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు,యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

భారీ వర్షాల తర్వాత రైతులకు నష్టపరిహారం మాణిక్ రావు…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-02T135416.170-1.wav?_=4

కరువు మండలంగా ప్రకటించాలి’

◆:- టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నుల్క మానిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండలంలో వివిధ

 గ్రామాలలో గత కొన్ని రోజుల నుండి భారి నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పెసర మినుము, పత్తి, సోయా, మొక్కజొన్న చాలావరకు నీట మునిగాయి. వర్షాల ప్రభావంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీర్ఘకాల సగటులో 109% వర్షపాతం నమోదయింది. ఆగస్టులోనే రికార్డు స్థాయిలో వానలు కురిశాయి.

TRS party senior leader Nulka Manik Rao

సాధారణం కంటే 75% వర్షపాతం నమోదయింది .కావున తెలంగాణ ప్రభుత్వం మండలంలోని ప్రతి గ్రామాన్ని ఏ.ఈ.ఓ, ద్వారా సర్వే చేయించి అన్ని పంటలకు నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని, మాణిక్ రావు డిమాండ్ చేశారు.

ఇందిరమ్మ లబ్దిదారుల ఆర్థిక భారాలు పెరుగుతున్నాయి…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-02T134106.110.wav?_=5

ఆర్థిక భారంతో ‘ఇందిరమ్మ’ లబ్ధిదారులు

◆:- సొంతింటి కల నెరవేరేనా!

◆:- పెరిగిన నిర్మాణ సామాగ్రి ధరలు

◆:- బేస్మిట్ లెవెల్ కే రెండు లక్షలు దాటుతున్న పరిస్థితి!

◆:- నేటికీ అందని ఉచిత ఇసుక!

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకుంటే సొంత ఇంటి కల నెరవేరడం ఖాయమని, అవసరమైతే లబ్దిదారుడిపై ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం ఉచితంగా ఇసుక అందిస్తామని ఎన్నికల ముందు చెప్పిన మాటలు ప్రచారాలకే పరిమితమవుతున్నాయనే ఆరోపణలు మండల వ్యాప్తంగా విస్తారంగా వినిపిస్తున్నాయి. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పనులు ప్రారంభమై రెండు నెలలు దాటుతున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం అందిస్తామన్న ఉచిత ఇసుక అందలేదు. మండలానికి 583 ఇందిరమ్మ గృహాలు మంజూరు కాగా ఇప్పటి వరకు 380 ఇండ్ల పనులు ప్రారంభమైనాయి.

Indiramma Beneficiaries

 

పెరిగిన నిర్మాణ సామాగ్రి ధరలు

విస్తారంగా కురుస్తున్న వర్షాల ప్రభావం వల్ల ఓవైపు ఇసుక, మరోవైపు కంకర, సిమెంట్, స్టీల్ ధరలు మూడింతలు పెరగడంతో ఇందిరమ్మ లబ్దిదారులు ఆర్ధిక భారంతో సతమతమవుతున్నారు. దీంతో ఇండ్ల నిర్మాణ పనులలో వేగం తగ్గింది. ప్రభుత్వం ఇందిరమ్మ లబ్దిదారులకు ఉచిత ఇసుక పంపిణీ చేస్తామని చెప్పినా నేటి వరకు అందలేదు. కనీసం ఇసుకైనా ఉచితంగా అందితే కొంతమేర భారం తగ్గుతుందని లబ్దిదారులు వాపోతున్నారు. మరో వైపు ఉన్నత అధికారుల నుంచి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని లబ్దిదారులకు ఒత్తిళ్లు రావడంతో ఎం చేయాలో తోచని పరిస్థితులు
నెలకొంటున్నాయని వాపోతున్నారు. ఒకానొక దశలో అధికారులు లబ్దిదారులకు చేతులు జోడించి తమకు పైనుంచి వస్తున్న ఒత్తిళ్లను అర్ధం చేసుకోవాలని వేడుకొంటున్నారు. లేనిపక్షంలో బిల్లుల చెల్లింపులో ఇబ్బందులు పడాల్సి వస్తుందని స్పష్టం చేస్తున్న పరిస్థితులు నెలకొంటాయని పేర్కొంటున్నారు. దీంతో లబ్దిదారులు ఏం చేయలేక పెరిగిన ధరలతో అనుకున్న అంచనా కంటే అధికంగా ఖర్చులు అవుతున్నాయని ఏం చేయాలో అర్ధం కావడంలేదని అధికారులకు లబ్దిదారులు మొరపెట్టుకుంటున్నారు.

ఉచిత ఇసుక సరఫరా అయ్యేనా !

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఉచితంగా ఇసుకను సరఫరా చేస్తామని తెలిపినా ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభమై రెండు నెలలు గడిచినా నేటికీ ఆ ప్రక్రియ ప్రారంభమే కాలేదని లబ్దిదారులు వాపోతున్నారు. ఉచిత ఇసుక సరఫరా అనేది మండల స్థాయిలో తహసీల్దార్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో ఒక పాయింట్ని ఏర్పాటు చేసి అక్కడి నుండి మండలంలోని వివిధ గ్రామాలకు సరఫరా చేయాలని ఉన్నత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కానీ ఆ ప్రక్రియ నేటికీ ప్రారంభం కాకపోవడంతో లబ్దిదారులు నిరాశ చెందుతున్నారు. దీంతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు ప్రశ్నార్ధకంగా మారాయి. కొందరు లబ్దిదారులు మొదటి బిల్లుతో బేస్మెంట్ వరకు పనులు చేసి నిలిపివేస్తే, మరికొందరు పిల్లర్లను నిర్మించి పనులను అక్కడే నిలుపుదల చేసిన పరిస్థితులు నెలకొన్నాయి.

త్వరలో ఉచిత ఇసుక అందజేస్తాం

-ఎంపీడీఓ, మంజుల, ఝరాసంగం

ఇందిరమ్మ అబ్దిదారులకు త్వరలో ఉచిత ఇసుక అందించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే పంచాయతీ కార్యదర్శుల నుండి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ వివరాలు సేకరించాం. దీని ప్రకారం ప్రభుత్వ నిర్ణయం మేరకు ఒక్కొక్క ఇందిరమ్మ ఇంటికి 40 టన్నుల ఉచిత ఇసుక అందిచే విధంగా ప్రణాళికలు తయారు చేస్తున్నాం.

జహీరాబాద్‌లో పేకాట స్థావరంపై పోలీసుల దాడి…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-02T125829.950.wav?_=6

పేకాట స్థావరంపై పోలీసుల దాడి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణ పోలీసులు సోమవారం రాత్రి జహీరాబాద్ పట్టణంలోని పేకాట స్థావరంపై దాడి చేసి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి రూ. 15800/- నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు, మరియు 52 పేకాట ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు, జహీరాబాద్ పట్టణంలోని మస్తాన్ కాలనీలో కొంతమంది వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు తెలిసింది. దీంతో జహీరాబాద్ టౌన్ సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కె. వినయ్ కుమార్ తమ సిబ్బందితో కలిసి దాడి చేశారు. పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించిన వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్ట రిత్య చర్య తీసకుంటారని తెలిపారు.

కాట్రియాల గ్రామంలో శ్రావణ్ కుమార్ మృతి..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-02T122515.833-1.wav?_=7

కాట్రియాల గ్రామంలో శ్రావణ్ కుమార్ మృతి..

యూత్ కాంగ్రెస్ నేత రమేష్ చారి పరామర్శ..

రామాయంపేట సెప్టెంబర్ 2 నేటి ధాత్రి (మెదక్)

కాట్రియాల గ్రామానికి చెందిన కట్ట శ్రావణ్ కుమార్ (25) అనారోగ్యంతో నాలుగు నెలలుగా హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున 1 గంట సమయంలో మృతి చెందాడు. గతంలోనే తండ్రి మరణించడంతో తల్లి నర్సవ్వ, తమ్ముడు శివతో కలిసి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబం తీవ్ర కష్టాలు ఎదుర్కొంటోంది.
శ్రావణ్ అనారోగ్యంతో ఆసుపత్రుల్లో ఉన్న నాలుగు నెలల కాలంలో తల్లి అప్పులు చేసి చికిత్స చేయించినా ఫలితం లేకపోయింది. కుటుంబం పరిస్థితి మరింత దయనీయంగా మారింది.
ఈ విషయం తెలుసుకున్న మెదక్ జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కమ్మరి రమేష్ చారి గ్రామానికి వెళ్లి మృతుని కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబానికి సొంతంగా 50 కిలోల బియ్యం అందజేసి, వారి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కట్ట చంద్రం, కిష్టయ్య, గ్రామ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గొల్ల నరేష్, నవీన్, రాజు, విజయ్, నరేష్, నిఖిల్, కమల్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

 ఎమ్మెల్యేలు వసూల్ రాజాలు…

 ఎమ్మెల్యేలు వసూల్ రాజాలు

 

తెలుగునాట.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో పలువురు శాసనసభ్యులు వారి ముఖ్యమంత్రులకు కంట్లో నలుసుల్లా తయారవుతున్నారా? ఎం.ఎల్‌.ఎ. అంటే మెంబర్‌ ఆఫ్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీ.. అంటే చట్టసభ సభ్యులు. చట్టసభల్లో చట్టాలు చేస్తూ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి….

తెలుగునాట.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో పలువురు శాసనసభ్యులు వారి ముఖ్యమంత్రులకు కంట్లో నలుసుల్లా తయారవుతున్నారా? ఎం.ఎల్‌.ఎ. అంటే మెంబర్‌ ఆఫ్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీ.. అంటే చట్టసభ సభ్యులు. చట్టసభల్లో చట్టాలు చేస్తూ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారం కోసం కృషి చేయాల్సిన శాసనసభ్యులే ఇప్పుడు ప్రజలపాలిట సమస్యగా మారుతున్నారు. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్‌లో కొంత మంది శాసనసభ్యులు లేని అధికారాలను సంక్రమింప జేసుకొని ఆయా నియోజకవర్గాలలో ప్రజలు గాలి పీల్చుకోవాలన్నా తమ అనుమతి తప్పనిసరి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. 2004 నుంచి ప్రారంభమైన ఈ ధోరణి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో వెర్రితలలు వేస్తోంది. జగన్మోహన్‌ రెడ్డి హయాంలో శాసనసభ్యులకు అపరిమిత స్వేచ్ఛను ఇవ్వడంతో వారు ప్రభుత్వ కార్యాలయాలను తమ అజమాయిషీలోకి తెచ్చుకున్నారు. ఇప్పుడు కూటమి ఎమ్మెల్యేలకూ అదే ఆదర్శమైంది. గతానికి భిన్నంగా ఈ జాడ్యం ఇప్పుడు తెలంగాణకు కూడా విస్తరించింది. 2009లో ఎమ్మెల్యేగా ఎన్నికైన లోక్‌సత్తా అధినేత జయప్రకాష్‌ నారాయణ మంచినీటి సరఫరా, డ్రైనేజీ వంటి స్థానిక సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చిన వారిని ఉద్దేశించి, వాటి గురించి స్థానిక ప్రజాప్రతినిధులైన కార్పొరేటర్లకు చెప్పాలని సూచించేవారు. ఇది ప్రజలకు రుచించలేదు. అది వేరే విషయం! 1983కు ముందు గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ ఉనికి ఉండేది కాదు. అక్కడి ప్రజా సమస్యలను స్థానిక సంస్థలే పరిష్కరించేవి. అప్పట్లో ఎమ్మెల్యేలు ప్రజలకు పెద్దగా అందుబాటులో ఉండేవారు కారు. ఎమ్మెల్యేలను కలుసుకోగలిగే పరిస్థితి జిల్లా స్థాయిలో కొద్దిమందికే ఉండేది. ఇక మంత్రులు, జిల్లా కలెక్టర్లను కలుసుకోవడం అరుదైన అవకాశంగా ఉండేది. అలా కలుసుకోగలిగిన వారికి పలుకుబడి ఉన్నట్టు పరిగణించేవారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌ హయాంలో ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ చేశారు. దీంతో ఎమ్మెల్యేలు ప్రజల్లో తిరగక తప్పలేదు. ఫలితంగా ప్రజలు తమ వ్యక్తిగత సమస్యలను, కుటుంబ పంచాయితీలను పరిష్కరించవలసిందిగా కూడా ఎమ్మెల్యేలను కోరేవారు. మొగుడూ పెళ్లాల పంచాయితీలు తామెందుకు పరిష్కరించాలని ఆ రోజుల్లో ఎమ్మెల్యేలు విసుక్కొనేవారు. హైదరాబాద్‌లో ఉండే తమ ఎమ్మెల్యేలను తెలంగాణ జిల్లాలకు చెందిన ప్రజలు వచ్చి కలుసుకొని బాధలు చెప్పుకొనేవారు. కొంతమందైతే తిరుగు ప్రయాణాలకు చార్జీలు ఇవ్వవలసిందిగా ఎమ్మెల్యేలను కోరేవారు. తమను కలవడానికి వచ్చిన వారికి కాఫీ, టీలు తాగించడంతో పాటు భోజనం, వసతి కూడా ఏర్పాటు చేయవలసి రావడంతో శాసనసభ్యులు ఆర్థికంగా నలిగిపోయేవారు. పెళ్లిళ్లు, చావులకు వెళ్లడం విధిగా మారింది. అదే సమయంలో ఖర్చుల కోసం డబ్బు కూడా డిమాండ్‌ చేసేవారు. తెలంగాణలో ఇప్పటికీ ఈ పరిస్థితి ఉంది. కొంత కాలం క్రితం ఒక లారీ డ్రైవర్‌ తమ నియోజకవర్గ ఎమ్మెల్యేకు ఫోన్‌ చేసి తాను డ్యూటీ మీద దూరంగా ఉన్నాననీ, పురిటి నొప్పులతో బాధపడుతున్న తన భార్యను ఆస్పత్రిలో చేర్పించి ప్రసవం చేయించవలసిందిగా కోరారు. ఇలాంటి విచిత్రమైన అనుభవాలను శాసనసభ్యులు గతంలో పంచుకొనేవారు. ఇదంతా గతం. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాలకు సామంత రాజులుగా, దండ నాయకులుగా తయారయ్యారు. తెలంగాణలో కూడా ఈ పోకడలు మొదలయ్యాయి. తెలంగాణలో యూరియా కొరత ఇప్పుడు ప్రధాన సమస్యగా ఉంది.

రైతులు ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన రామగుండం ఎరువుల కంపెనీ తెలంగాణలో ఉన్నప్పటికీ సాంకేతిక సమస్యలు తలెత్తి ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో యూరియా కొరత మరింత తీవ్రమైంది. ఈ పరిస్థితుల్లో ఎవరైనా ఏమి చేస్తారు? ఎరువుల ఫాక్టరీలో మరమ్మతులను వేగంగా పూర్తిచేయించి ఉత్పత్తి తిరిగి ప్రారంభమయ్యేలా చేస్తారు. కానీ అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. మరమ్మతుల కాంట్రాక్టు పొందిన సంస్థ ప్రతినిధులు తనను కలసి తన సంగతి ఏమిటో తేల్చకపోతే ఎలా అని భీష్మించుకొని కూర్చున్నారు. ఈ వ్యవహారం మంత్రి, ముఖ్యమంత్రి వరకూ వెళ్లింది. దీంతో సంబంధిత శాఖ మంత్రి కల్పించుకొని సదరు ఎమ్మెల్యేను పిలిపించుకొని సర్దిచెప్పారు. ఈ ధోరణిని ఏమనాలి? ఇల్లు తగలబడుతుంటే బొగ్గులు ఏరుకోవడానికి ప్రయత్నించినట్టుగా లేదా? కేసీఆర్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన కూడా తమ పార్టీ ఎమ్మెల్యేలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఈ విషయంలో ఒకరికొకరు ఆదర్శం అయ్యారు. ఫలితంగా తెలంగాణలో గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల ఆధిపత్యం పెరిగిపోయింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు సంబంధించిన సమస్యల పరిష్కారం చేయాలన్నా ఎమ్మెల్యేల అనుమతి తప్పనిసరి చేశారు. పోలీస్‌ స్టేషన్లో ఎఫ్‌ఐఆర్‌ కట్టాలన్నా శాసనసభ్యుడి అనుమతి ఉండాలని నిర్దేశించారు. దీంతో యావత్‌ అధికార యంత్రాంగం రాజకీయ నాయకుల గుప్పిట్లోకి వెళ్లిపోయింది. ఒకవైపు లేని అధికారాలను అనుభవిస్తూ, మరోవైపు భూ కబ్జాలు, దందాలలో ఎమ్మెల్యేలు మునిగితేలారు. ఫలితంగా 2023 ఎన్నికలకు ముందు భారత రాష్ట్ర సమితికి చెందిన శాసనసభ్యులపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. అయినప్పటికీ ఆ ఎన్నికల్లో కేసీఆర్‌ అభ్యర్థులను మార్చకుండా పాతవాళ్లు అందరికీ టికెట్లు ఇచ్చారు. అప్రతిష్ఠపాలైన శాసనసభ్యులను మార్చి ఉంటే కేసీఆర్‌ అధికారం కోల్పోయి ఉండేవారు కాదన్న అభిప్రాయం భారత రాష్ట్ర సమితి ముఖ్యులలో ఇప్పటికీ ఉంది.

రామడుగులో బిఆర్ఎస్ కీలక సమావేశం…

ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వీర్ల వెంకటేశ్వరరావు

రామడుగు, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని వైశ్య భవన్ లో బిఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు గంట్ల జితేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల గురించి, ప్రతి గ్రామ పంచాయతీలో నోటీసు బోర్డులో పెట్టిన ఓటర్ లిస్టులో పేర్లు ఉన్నాయో లేవో చెక్ చేసుకుని, ఏమైనా తప్పులు ఉన్నచో సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలనీ, ఎన్నికల గురించి ముఖ్యమైన అంశాల గురించి చర్చించి, తగు సూచనలు చేసిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, రామడుగు సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు. ఈకార్యక్రమంలో మాజీ ఎంపీపీ మార్కొండ కిష్టారెడ్డి, తౌటు మురళి, మాజీ మార్కెట్ చైర్మన్ లు మామిడి తిరుపతి, గంట్ల వెంకటరెడ్డి, పూడూరు మల్లేశం, వైస్ చైర్మన్ చాడ ప్రభాకర్ రెడ్డి, నాయకులు నాగి శేఖర్, జిల్లా రైతుబంధు సమితి మాజీ సభ్యులు వీర్ల సంజీవరావు, మాజీ సర్పంచులు పంజాల జగన్మోహన్ గౌడ్, వీర్ల రవీందర్ రావు, ఒంటెల వెంకటరమణరెడ్డి, సైండ్ల కరుణాకర్, దాసరి రాజేందర్ రెడ్డి, గుండి ప్రవీణ్, ఒంటెల అమర్, జవ్వాజి శేఖర్, జుట్టు లచ్చయ్య, మన్నె దర్శన్ రావు, గునుకొండ అశోక్, ఉకంటి చంద్రారెడ్డి, చిలుముల ప్రభాకర్, మాజి ఎంపీటీసీలు వంచ మహేందర్ రెడ్డి, కనకం కనకయ్య, బుగ్గ మల్లారెడ్డి, నాయకులు పిల్ల జగన్ రెడ్డి, లంక మల్లేశం, శనిగారపు అనిల్, శనిగరపు అర్జున్, బత్తిని తిరుపతి, ఆరెపల్లి ప్రశాంత్, ఎండి మోయిస్, చెన్నూరి శ్రీకాంత్ రెడ్డి, గంట్ల కిట్టురెడ్డి, పెరుమండ్ల శ్రీనివాస్, వంగ రమణ, మీసా లచ్చయ్య, దొడ్డి లచ్చిరెడ్డి, కళ్ళపల్లి కుమార్, మినుకుల తిరుపతి, గడ్డం మోహన్, రాగం లచ్చయ్య, మామిడి నర్సయ్య, శ్రీనివాస్, దర్శనాల మునిందర్, పెసరి రాజమౌళి, చిరుత జగన్, తదితరులు పాల్గొన్నారు.

బిజెపి జిల్లా కార్యదర్శిగా మహేందర్ గౌడ్…

బిజెపి జిల్లా కార్యదర్శి గా రామగౌని మహేందర్ గౌడ్ నియామకం

తాండూరు(మంచిర్యాల)నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శిగా రామగౌని మహీధర్ గౌడ్ నీ శుక్రవారం జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర గౌడ్ నియమించి నియామక పత్రాన్ని అందించారు.ఈ సందర్భంగా బిజెపి మంచిర్యాల జిల్లా కార్యదర్శి మహీధర్ గౌడ్ మాట్లాడుతూ.. నాపైన ఎంతో నమ్మకంతో ఈ పదవి బాధ్యతలు కల్పించినందుకు బిజెపి పార్టీకి నా శక్తి మేర కృషి చేస్తూ పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.అలాగే బిజెపి రాష్ట్ర నాయకులకు,జిల్లా నాయకులకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.

వనపర్తి లో వినాయక పూజ చేసిన మాజీ మంత్రి…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-29T123747.767.wav?_=8

వినాయక మండపాలలో పూజలో మాజీ మంత్రి

వనపర్తి నేటిదాత్రి .
భక్తుల ఆహ్వానం మేరకు వనపర్తి లో వినాయక మండపాలు సందర్శించి విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారని జిల్లా బీ ఆర్ ఎస్ మీడియా సెల్ ఇంచార్జి నంది మల్ల అశోక్ ఒక ప్రకటన లో తెలిపారు హనుమాన్ టేకిడి,గ్రీన్ పార్క్ఎన్.టి.ఆర్ కాలనీల వినాయక మండ పాల నిర్వాహకులు మాజి మంత్రి ని ఆహ్వానించారని అశోక్ తెలిపారుమాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విఘ్నాలు తొలగించి వనపర్తి జిల్లా ప్రజలకు విజయాలు జరగాలని వినాయకుడిని పూజించారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వెంట మున్సిపల్ మాజీ చైర్మన్ గట్టు యాదవ్ మాజీ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ మాజీ మార్కేట్ కమిటి చైర్మన్,పలస రమేష్ గౌడ్ మీదీయ ఇంచార్జి నందిమల్ల అశోక్,మాజీ కౌన్సిలర్లు బండారు కృష 33 వ వార్డు ఉంగ్లం తిరుమల్ నాయుడు ప్రేమ్ నాథ్ రెడ్డ్ చిట్యాల రాము సూర్యవంశంముగిరి గ్రీన్ పార్క్ గణేష్ ఉత్సవ కమిటీ నిర్వ హుకులు రాజేష్ కుమార్ రాజేందర్ ఎలిశెట్టి వెంకటేష్ ప్రేమ్ నాథ్ రెడ్డ్ వంశీకృష్ణ రాహుల్ విజయాచారి ఎన్.టి.ఆర్ కాలనీ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు రాజశేఖర్ సాయినాథ్ రాకేష్ జమునా రాణి శారద విజయ విజయ లక్ష్మీ పరిమళ భక్తులు పాల్గొన్నారని అశోక్ తెలిపారు

అకాల వర్షాలకు అప్రమత్తంగా ఉండండి: షేక్ సోహెల్..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-97-1.wav?_=9

అకాల వర్షాలకు అప్రమత్తంగా ఉండాలని బిఆర్ఎస్ యువ నాయకులు షేక్ సోహెల్ అన్నారు

జహీరాబాద్ నేటి ధాత్రి:

అకాల వర్షాలకు జాగ్రత్త: ప్రజలు అప్రమత్తంగా ఉండండి – షేక్ సోహెల్ బిఆర్ఎస్, తుమ్మనపల్లి గ్రామ యువ నాయకులు మాట్లాడుతూ ఇటీవలగా రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న అకాల వర్షాలను దృష్టిలో ఉంచుకొని, నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.ప్రజలు తక్కువ ప్రాంతాల నుంచి పర్యవేక్షణలో ఉండి, అలాంటి విపత్తులు ఎదురైతే అధికారులు లేదా స్థానిక నాయకులకు వెంటనే సమాచారం ఇవ్వాలని.”ప్రజల రక్షణకే ప్రాధాన్యం… ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలన్నారు,”

ప్రజలకు సూచనలు:*

@ :- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు

@ :- నీటిలో ఉండే వంతెనలు, కట్టలు దాటవద్దు

@ :- జలపాతాలు, వాగులు, నదులు, చెరువులకు వెళ్లవద్దు

@ :- ఎలక్ట్రిక్ పోల్‌లు, వైర్లను తాకవద్దు

@ :- బట్టలు అరేసే ఇనుప వైర్లను తాకవద్దు.

@ :- పురాతన భవనాలకు దగ్గరగా ఉండవద్దు*

@ :- చేపల వేటకు వెళ్ళవద్దు

@ :- తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి

మైనారిటీ పాఠశాలలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-94.wav?_=10

మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే.

వంటగదిలో ఆహార పదార్థాలను రుచి చూసిన ఎమ్మెల్యే జి ఎస్ ఆర్

భూపాలపల్లి నేటిధాత్రి

విద్యార్థుల బంగారు భవిష్యత్తు కొరకు సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. గురువారం భూపాలపల్లి మంజూరునగర్ లోని ప్రభుత్వ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలను స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా వంట గదిలో విద్యార్థులకు పెట్టే ఆహార పదార్థాలను మీడియా మిత్రులతో కలిసి టేస్ట్ చూశారు. అనంతరం ఎమ్మెల్యే అన్ని తరగతి గదులను కలియ తిరుగుతూ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు తమ సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించుకున్నారు. తరగతి గదుల్లో కూర్చోడానికి బెంచీలు కావాలని పలువురు విద్యార్థులు అడిగారు. అదేవిధంగా, తరగతి గదులకు కిటికీలు లేకపోవడంతో వర్షం వచ్చినప్పుడు వర్షం నీరు తరగతి గదుల్లోకి వస్తుందని పలువురు విద్యార్థులు తెలిపారు. సీసీ రోడ్లు, బాత్రూమ్స్, డార్మెటరీ, డ్రైనేజీ, తరగతి గదిలోకి పాములు రావడం తదితర సమస్యలను విద్యార్థులు వివరించారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే మున్సిపల్ అధికారులను అట్టి సమస్యలను త్వరితగతిగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థుల బంగారు భవిష్యత్తు కొరకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంద న్నారు. అన్ని వసతి గృహాల్లో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు భోజనాన్ని అందించేందుకు కృషి చేస్తుందని తెలిపారు. అందులో భాగంగానే విద్యార్థులకు మెస్ చార్జీలతో పాటు కాస్మోటిక్ ఛార్జీలను కూడా పెంచినట్లు ఎమ్మెల్యే గుర్తుచేశారు. విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగి సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బిరు శ్రీనివాస్ పట్టణ అధ్యక్షుడు దేవాన్ పిసిసి మెంబర్ చల్లూరు మధు ముంజాల రవీందర్ దాట్ల శ్రీనివాస్ భౌత్ విజయ్ ప్రజా ప్రతినిధులు, పట్టణ మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

ప్రజా ప్రభుత్వంలో.. రైతుల కడగండ్లు..

ప్రజా ప్రభుత్వంలో.. రైతుల కడగండ్లు

రైతు శ్రేయస్సును మరిచిన.. కాంగ్రెస్ ప్రభుత్వం

బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను రాజును చేసింది.

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను గాలికొదిలేసింది.

రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి వాల్యా నాయక్.

బాలానగర్ /నేటి ధాత్రి

బాలానగర్ మండల కేంద్రంలో మంగళవారం రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి వాల్యా నాయక్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క రైతుకు ఇబ్బందులు కలగలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతును రాజును చేసిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ముందుచూపు లేకపోవడంతో రైతులు యూరియా లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులను గాలికి వదిలేసారన్నారు. సకాలంలో ప్రభుత్వం స్పందించి త్వరితగతిన రైతులకు యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. యూరియా సరఫరాలో ఆలస్యం జరిగితే రైతులు ఆర్థికంగా నష్టపోతారన్నారు. ఇందిరమ్మ రాజ్యం వస్తే ప్రజలందరికీ మేలు చేసే విధంగా ప్రజా ప్రభుత్వం ఉంటుందని ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరడం లేదన్నారు. ఆరు గ్యారెంటీ ల పథకాలు అమలు కావడం లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రూ.లక్ష కోట్ల అవినీతి అవస్తమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి.. మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలన్నారు. వచ్చే మూడేళ్ల తర్వాత బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటు వేసి ఇప్పుడు బాధపడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రావు, మాజీ ఎంపీపీ కమల, లక్ష్మయ్య, గోపి నాయక్, లక్ష్మణ్ నాయక్, తిరుపతి నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఎంఎల్ఏ నాయిని రాజేంద్ర రెడ్డి మట్టి గణపతులను పంపిణీ..

మట్టి గణపతులను పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం

#మట్టి వినాయకులని పూజించాలని ఎమ్మెల్యే నాయిని పిలుపు…

#క్యాంపు కార్యాలయం వేదికగా నగరవాసులకు మట్టి గణపతులను పంపిణీ…

హన్మకొండ, నేటిధాత్రి:

పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి పిలుపునిచ్చారు.ఈ మేరకు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నగరంలోని భక్తులకు,ప్రజలకు స్వచ్ఛందంగా మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు.
పంపిణీ అనంతరం వారు మాట్లాడుతూ హనుమకొండ జిల్లా ప్రజలందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.ఈ వినాయక నవరాత్రి ఉత్సవాలు పర్యావరణ హితంగా ఉండాలని కోరుతూ నగరంలో 30000 విగ్రహాలకు అందిస్తున్నామని తెలిపారు.ప్రభుత్వం వినాయక మండపాలకు ఉచిత విద్యుత్తు సరఫరా అందిస్తున్నదని వెల్లడించారు.మా వంతుగా చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని కోరారు.ఈ మట్టి గణపతుల పూజతో పాటుగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని అన్నారు.
ఇప్పటికే అధికారులకు కచ్చితమైన ఆదేశాలను ఇచ్చామని నవరాత్రి వేడుకలలో ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలని,నగరంలో ఏర్పాటు చేసిన మండలాలలో పర్యవేక్షణను చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు,భక్తులు పాల్గొన్నారు.

శ్రీరామ్ యూత్ అధ్యక్షునిగా ముంజ మహేష్ ఎన్నిక…

శ్రీరామ్ యూత్ అధ్యక్షునిగా ముంజ మహేష్ ఎన్నిక

నేటి ధాత్రి కథలాపూర్

కథలాపూర్ మండలం లోని సిరికొండ శ్రీరాం యూత్ అధ్యక్షునిగా ముంజ మహేష్ వీరేంద్ర ను మంగళవారం రోజున నియమించినట్లు యూత్ సభ్యులు తెలిపారు. ఉపాధ్యక్షులు నునుగొండ పునీత్, ప్రధాన కార్యదర్శి బెజ్జారపు నితిన్, కోశాధికారిగా మర్రిపెల్లి వంశీ లు ఎన్నికయ్యారు. తన నియామకానికి సహకారాన్ని అందించిన సభ్యులకు వీరేంద్ర కృతజ్ఞతలు తెలియజేశారు. యూత్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు చేపడతామని అన్నారు.. ముందస్తుగా అందరికీ వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నీలి శ్రీనివాస్, ఓలవేని శ్రీనివాస్,నీలి కన్నయ్య, సిరిమల్లె రాజశేఖర్,మల్యాల మారుతి,గాంధారి శ్రీనివాస్ మహేష్ వీరేంద్ర ను అభినందించారు.

చెన్నూర్‌లో బాల్క సుమన్ కాంగ్రెస్ పరిపాలనపై విమర్శ…

కాంగ్రెసోళ్ళు ఉద్యోగాలు ఇస్తామని గద్దెనెక్కారు…

కాంగ్రెస్ కర్కశ పరిపాలనలో పథకాలకు ఎగనామం పెడుతున్నారు…

చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

10 ఏండ్ల బిఆర్ఎస్ పరిపాలనలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన కొనసాగించారని , ప్రస్తుత కాంగ్రెస్ పరిపాలన కర్కశ పరిపాలనగా కొనసాగుతోందని ,గడిచిన 20 నెలలుగా ఎలాంటి అభివృద్ధి పనులకు నియోజక వర్గం నోచుకోలేదని, ఏ ఒక్క హామీని నిలబెట్టుకోవడం లేదని చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. సోమవారం క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బాల్క సుమన్ నివాసంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమీక్ష సమావేశంలో చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ రాజా రమేష్ తో కలిసి పాల్గొన్నారు.నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల, మున్సిపాలిటీల కార్యకర్తలు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడారు. పరిపాలన అప్పుడే మంచిగుండే మా పోరాటం మా గ్రామం నుండే అనే నినాదంతో నియోజకవర్గంలో విస్తృతస్థాయి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామని , అందులో భాగంగానే ఈ నెల 28 న చెన్నూర్, భీమారం, జైపూర్, రామకృష్ణాపూర్, మందమర్రి ఏరియాలలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

Congress Governance

గడిచిన 20 నెలల కాలంలో కాంగ్రెస్ పరిపాలన అధ్వానంగా తయారయిందని, ఇక ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. నియోజకవర్గంలో నూతన ఫ్యాక్టరీలు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ,యువతకు 45 వేల ఉద్యోగ అవకాశాలు సైతం కల్పించేందుకు కృషి చేస్తానని ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి గద్దెనెక్కారని ,పదవి వచ్చాక ఉద్యోగాల ఊసే లేదని, తన ఇంట్లో మాత్రం రెండు ఉద్యోగాలు వచ్చాయని విమర్శించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బి ఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ముందుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.చెన్నూర్ ప్రాంత కాంగ్రెస్ నాయకులు బాల్క సుమన్ సమక్షంలో పార్టీలో చేరారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గస్థాయి బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

భూపాలపల్లిలో బిజెపి నాయకులకు ఘన సన్మానం…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-26T161743.003.wav?_=11

నూతనంగా ఎన్నికైన బిజెపి నాయకులకు ఘనంగా సన్మానం

భూపాలపల్లి నేటిధాత్రి

రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావాలని ప్రజలు ఎదురుచూస్తున్నారని దొంగల రాజేందర్ అన్నారు
స్థానిక బిఎంఎస్ కార్యాలయంలో బిజెపి జిల్లా నూతన పదవులు వచ్చిన సందర్భంగా సన్మాన కార్యక్రమం స్థానిక బిజెపి నాయకులు ఏర్పాటు చేయడం జరిగింది
నూతనంగా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన దొంగల రాజేందర్ బిజెపి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ ఊరటి మునిందర్ రూరల్ మండల అధ్యక్షుడు పులి గుజ్జరాజు కి భూపాలపల్లి స్థానిక బిజెపి నాయకులు బిఎంఎస్ కార్యాలయంలో ఘనంగా పూల పుష్పం ఇచ్చి శాలువాలతో సన్మానించడం జరిగింది అనంతరం స్వీట్స్ పంపిణీ చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో భట్టు రవి కంబాల రాజయ్య కంచం నరసింహమూర్తి అజ్మీర రాజు నాయక్ జంజాల సురేష్ తుమ్మేటి దామోదర్ బాణాల మధు ఆవుల సంతోష్ తాండ్ర హరీష్ తోట్ల స్వామి సిలోజు సాగర చారి తదితరులు పాల్గొన్నారు

రైతన్నల పక్షపాతి బిఆర్ఎస్ పార్టీ

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-82-1.wav?_=12

రైతన్నల పక్షపాతి బిఆర్ఎస్ పార్టీ

ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే యూరియా కొరత

ఎద్దు ఏడ్చిన ఏవుసం, రైతు ఏడ్చిన రాజ్యం చరిత్రలో లేదు

మళ్లీ సారె కావాలి, మళ్లీ కారు ఏ కావాలి అంటున్న రైతన్నలు

యూరియా కోసం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా

మరిపెడ నేటిధాత్రి

 

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయడం లేదని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో ని ఆర్ అండ్ బీ అతిధి గృహం ముందు వరంగల్, ఖమ్మం హైవే పై రైతన్నలు రోడ్డెక్కారు. మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపుడి నవీన్ రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధర్నా కార్యక్రమం లో ముఖ్య అతిథిగా పాల్గొని రైతులతో కలిసి మాజీ మంత్రి, డోర్నకల్ మాజీ శాసనసభ్యులు డిస్ రెడ్యానాయక్ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూరియా కోసం రైతులతో కలిసి వర్షంన్ని సైతo లెక్క చేయకుండా ధర్నాకు దిగారు, సకాలంలో రైతులకు యూరియా అందడం లేదని ఫైర్ అయ్యారు.యూరియా కొరత ఉందని పడిగాపులు గాసినా ఈ కాంగ్రెస్ ప్రభుత్వ నికి చలనం లేదు అన్నారు, ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం చరిత్రలో ఎక్కడ లేదు అన్నారు, సకాలంలో పంటలకు యూరియా లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి అని, ఐన కూడా రాష్ట్ర ప్రభుత్వo నిర్లక్ష్య వైఖరినీ అవలంభిస్తున్నది అన్నారు, పంట నష్టపోయిన ప్రతి రైతాంగన్ని ఆదుకొని, ప్రతి రైతు కు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు,ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే యూరియా కొరత ఏర్పడింది అన్నారు, స్థానిక ఎమ్మెల్యే తక్షణమే మరిపెడ మండలానికి 5 వేల టన్నుల యూరియాను సరఫరా చేయాలన్నారు,యూరియాను సరఫరా చేయడంలో రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిగా విఫలం అయ్యిందని మండిపడ్డారు,కేసీఆర్ హయాంలో కూడా యూరియా ఇవ్వడానికి కేంద్రం సహకరించలేదనీ, ఐన ముందు చూపుతో నా తెలంగాణ రైతన్న లు యూరియ కోసం,ఎరువుల కోసం తిప్పలు పడవద్దు అని, రైతన్నలు అప్పుల పాలు కావద్దు అని ఏ సీజన్ కు ఆ సీజన్ లోనే రైతు బంధు డబ్బులు ఇచ్చే వారు అన్నారు, ఇది ముందే గ్రహించిన కేసీఆర్ రెండు నెలల ముందే యూరియా బస్తాలను తీసుకువచ్చి గోడౌన్లలో నిలువ చేశారన్నారు,తెలంగాణను దోచుకోవడానికే వచ్చిన పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ అన్నారు, ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. రైతులకు ఎరువుల బస్తాలు అందించలేని చేతకాని దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ మండి పడ్డారు. ప్రజా పాలన తెచ్చిన మార్పు ఇదేనా అన్నారు, ప్రజలు మార్పు మార్పు అంటే రైతన్న ను అగం చేసే మార్పు వస్తాది అనుకోలేదు అన్నారు, మళ్లీ సారే కావాలి, కారు ఏ రావాలి అంటున్న రైతన్న లు,కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి చేసిన తప్పు ని ప్రజలు మరోసారి పునరావృతం కావద్దు అని,కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటేసేందుకు ప్రజలు సిద్ధంగా లేరన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి తగిన గుణపాఠం చెప్పుతరు అన్నారు,బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి పై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రైస్ మిల్లు అసోసియేషన్ అధ్యక్షుడు రవిచంద్ర,బీఆర్ఎస్ మండల నాయకులు రాంబాబు, రవీందర్, కాలు నాయక్,మాజీ ఎంపిపి గడ్డం వెంకన్న,మాజీ డీసీఎంఎస్ చైర్మన్ మహేందర్ రెడ్డి, చిన్న గూడూరు మండల పార్టీ అధ్యక్షులు రామ్ సింగ్, మాజీ కౌన్సిలర్లు,మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాంపల్లి రవి గౌడ్, మండల నాయకులు తాళ్ళపల్లి శ్రీనివాస్,ప్రవీణ్ రెడ్డి,లతీఫ్, తాళ్లపల్లి రఘురాం,కొమ్ము చంద్రశేఖర్,కొమ్ము నరేష్,అజ్మీర రెడ్డి, దుస్సా నర్సయ్య,గంధసిరి కృష్ణ, బాలాజి,రెండు మండల ల మాజీ సర్పంచ్ లు,మాజీ ఎంపీటీసీలు,గ్రామ పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు,రైతులు, యువకులు పాల్గొన్నారు.

హద్నూర్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-26T133713.630-1.wav?_=13

హద్నూర్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం.

జహీరాబాద్ నేటి ధాత్రి:

న్యాల్కల్ మండలంలోని హద్నూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకంలో భాగంగా అర్హులైన లబ్ధిదారులు ఆసక్తిగా పాల్గొంటున్నారని అధికారులు తెలిపారు. గ్రామానికి మంజూరైన 58 ఇండ్లలో ఇప్పటివరకు 46 మంది లబ్దిదారులు బేస్మెంట్ స్థాయిని పూర్తి చేశారు. ఈ దశలో పనులు పూర్తి చేసిన ప్రతి లబ్దిదారుడికి ఒక్కొక్కరికి రూ.1,00,000 చొప్పున వారి ఖాతాలలో జమ చేసినట్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి ధనరాజ్ వివరించారుసోమవారం ఆయన నిర్మాణ పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు నరేష్, రమేష్, శుకూర్ మియా తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version