ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ లో పాల్గొన్నా ఎమ్మెల్యే మేఘారెడ్డి
వనపర్తి నేటిదాత్రి ,
పెద్దమందడి మండలం చిన్న మందడి గ్రామానికి చెందిన , శాంతమ్మ రాములు కు చెందిన ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి బుధవారం లబ్దిదారుల తో కలిసి భూమిపూజ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలో నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు అవుతున్నాయని మంజూరైన ఇండ్లను సకాలంలో పూర్తి చేసుకోవాలన్నారు కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలు పాల్గొన్నారు
నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం తిమ్మినోనిపల్లి గ్రామానికి బీటీ రోడ్డు నిర్మించాలని గ్రామ బీఆర్ఎస్ నాయకుడు గండికోట రాజు ఆధ్వర్యంలో.. బుధవారం గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు.. కాంట్రాక్టర్లు బీటీ రోడ్డు కోసం రోడ్డు తవ్వి కంకర పరిచారని నెలలు గడుస్తున్నా… బీటీ రోడ్డు నిర్మించకపోవడంతో కంకర రోడ్డుపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనాలు రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత అధికారులు, ఎమ్మెల్యే స్పందించి బీటీ రోడ్డు పూర్తి అయ్యేలా చూడాలని కోరారు.
చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని మాతృమూర్తి కీ!!శే!! లక్ష్మి భారతి ఇటీవల వైకుంఠ ప్రాప్తి పొందారు. బుధవారం పులివర్తి వారి పల్లిలోని వారి స్వగృహమునందు జరిగిన శుభ స్వీకరణ కార్యక్రమానికి తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి హాజరయ్యారుఈ సందర్భంగా ఎమ్మెల్యే నాని మాతృమూర్తి లక్ష్మి భారతి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించారు. లక్ష్మి భారతి అమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అనంతరం ఎమ్మెల్యే నాని కుటుంబ సభ్యులను పరామర్శించారు.
చేర్యాల మండలంలో కడవెరుగు గ్రామంలో జనగామ శాసనసభ్యులు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారి సహకారంతో ఈరోజు కొమ్ముల యాదమ్మ మంజూరు అయినా ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గులు పోశారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర కార్యదర్శి గదరాజు యాదగిరి ,గదరాజు నరసింహులు, లింగము మరియు బిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేసిన బి ఆర్ ఎస్ పట్టణ నాయకులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ శాసనసభ్యులు శ్రీ కోనింటీ మాణిక్ రావు గారి , ఆదేశాల మేరకు జహీరాబాద్ పట్టణానికి చెందిన 12 మంది లబ్ధిదారులకు గాను ₹3,39,500 విలువ గల చెక్కులను అందజేయడం జరిగింది. లబ్ధిదారుల వివరాలు:-అల్లిపూర్ కి చెందిన పళ్ళ్లి లలిత ₹.55,500/-,గిరి శంకర్ ₹.33,000/-,మొహమ్మద్ ఇస్మాయిల్ ₹.60,000/- రాం నగర్ కి చెందిన మొహమ్మద్ సాధక్ గారికి ₹.29,500/- రాచన్నపేట్ కి చెందిన మర్వెళ్ళ్లి వెంకట్టయ్య ₹.19,000/- ఏపీ హెచ్ బి కాలనీ కి చెందిన సోమ్ శేఖర్ ₹.11,500/- రంజోల్ కి చెందిన కొత్త కళావతి ₹.11,500/-, మంగలి అంబిక ₹.9,000/- ఆర్య నగర్ కి చెందిన నిశ్రత్ ఫాతిమా ₹.13,500/-, హోతి కె కి చెందిన బుష్ర బేగం ₹.60,000/- పాండు రంగా స్ట్రీట్ కి చెందిన అమీనా సుల్తానా ₹.16,000/-మాణిక్ ప్రభు స్ట్రీట్ కి చెందిన కంది రాం రెడ్డి ₹.21,000/- ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నామ రవికిరణ్,మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్,మాజి హజ్ కమిటీ మెంబర్ మొహమ్మద్ యూసఫ్ ,మహిళ పట్టణ అధ్యక్షురాలు మంజుల , ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు శివప్ప,సత్య ముదిరాజ్,గణేష్ ,ప్రభు ,శంకర్ పటేల్ ,దీపక్,ప్రవీణ్ మెస్సీ తదితరులు పాల్గొన్నారు.ఈ సంధర్బంగా లబ్ధిదారులు వారి కుటుంబసభ్యులు ఎమ్మెల్యే మాణిక్ రావు గారికి ,నాయకులకు ధన్యవాదలు తెలియజేశారు.
కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో జాతీయ సదస్సు పోస్టర్ ఆవిష్కరణ:-
పాల్గొన్న వరంగల్ మరియు హన్మకొండ లీగల్ సెల్ సభ్యులు:-
హన్మకొండ/వరంగల్, నేటిధాత్రి (లీగల్):-
బుధవారం రోజున తెలంగాణ లీగల్ సెల్ రాష్ట్ర చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ పిలుపు మేరకు హన్మకొండ మరియు వరంగల్ జిల్లాల కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో జాతీయ సదస్సు పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఒక గర్వకారణమైన మరియు ప్రాముఖ్యతగల ఘట్టంగా, “సాంవిధానిక సవాళ్లు: దృక్కోణాలు & దారులు” అనే శీర్షికతో జరగనున్న జాతీయ సదస్సు పోస్టర్ను హన్మకొండ ఉమ్మడి జిల్లా కోర్ట్ లోనీ డాక్టర్ బి . ఆర్ అంబేద్కర్ హాల్లో వరంగల్ జిల్లా కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ సామంతుల శ్రీనివాస ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఆగస్టు 2న న్యూఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ ఏ ఐ సి సి లీగల్ సెల్ చైర్మన్ అభిషేక్ సింఘ్వి ఆధ్వర్యంలో జరగనున్న రాజ్యాంగ సవాళ్లు పై జాతీయ సదస్సు ను విజయవంతం చేయాలని అన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతితులుగా జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గ,తో పాటు అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. కాబట్టి ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి న్యాయవాదులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమం లో జిల్లా కన్వీనర్ కోకొండ రమేష్, రాష్ట్ర కన్వీనర్లు ముదసిర్ అహ్మద్ కయ్యుమ్,పోషిని రవీందర్, రాజోజు వేణుగోపాల్,కునూరు రంజిత్ గౌడ్, రాష్ట్ర వైస్ చైర్మన్లు నల్ల మహాత్మా, , నిమ్మని శేఖర్ రావు, రాష్ట్ర అధికార ప్రతినిధి వేముల రమేష్,తో పాటు సీనియర్ నాయకులు తోట రాజ్ కుమార్, పసుల యాక స్వామి,, గునిగంటి శ్రీనివాస్, రఘుపతి, హరి హర కుమార్, అరుణ్ ప్రసాద్, సూరం నరసింహ స్వామి, దయాన్ శ్రీనివాసన్, శ్రీనాథ్, గంప వినోద్ కుమార్, మహేందర్, రాజు, శ్రీరామ్ నాయక్, బిక్షపతి, సదానందం, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
దుగ్గొండి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చుక్క రమేష్ గౌడ్
ఎమ్మార్వో,ఎంపిడిఓ కలిసిన కాంగ్రెస్ శ్రేణులు
నర్సంపేట,నేటిధాత్రి:
అట్టడుగు వర్గాల అభివృద్ధి లక్ష్యంగా దొంతి మాధవరెడ్డి పనిచేస్తున్నారని దుగ్గొండి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చుక్క రమేష్ అన్నారు. దుగ్గొండి మండల కేంద్రంలో తహశీల్దార్ రాజేశ్వర్ రావు,ఎంపిడిఓ అరుంధతి,ఎస్సై రావుల రణధీర్ రెడ్డితో పాటు పలువురు అధికారులకు బుదవారం మండల అధ్యక్షుడు చుక్క రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో మండల కమిటీ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సన్మానించారు.
Congress ranks meet MRO, MPDO
అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చుక్క రమేష్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను నియోజకవర్గంలో ప్రతి గడపగడపకు తీసుకెళ్తూన్నా ప్రజా నాయకుడు దొంతి మాధవ రెడ్డి అని అన్నారు. పేదోళ్ళ సొంతింటి కల నెరవేర్చేందుకుగాను ఇందిరమ్మ ఇండ్లను ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్ల పాలనలో నియోజకవర్గంలో రేషన్ కార్డ్ ఇవ్వలేదని,నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రేషన్ కార్డులు ఇంచ్చిందన్నారు.దేశంలో ఎక్కడలేని విధంగా ఉచిత రేషన్ ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తూన్నా ఘనత రాష్ట్ర ప్రభుత్వందే అని పేర్కొన్నారు.రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త క్షేత్రస్థాయిలో సమిష్టి కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి అజ్మీరా రవీందర్, ఉపాధ్యక్షులు నల్ల వెంకటయ్య, కామ శోభన్ బాబు,కోశాధికారి జంగిలీ రవి,మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కొమ్మ లక్ష్మయ్య,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొత్తకొండ రవివర్మ,మాజీ ఎంపిటిసి సభ్యులు బొల్లపెల్లి రాము,నియోజకవర్గ యూత్ నాయకులు డ్యాగం శివాజీ,గిన్నె స్వామి, విరాట్, రాజేశ్వర్ రావు,తదితర మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
భీమారం మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు బోర్లకుంట శంకర్ అధ్యక్షతన స్థానిక ఎన్నికల కార్యచరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.అలాగే మండల అధ్యక్షుడు కాసెట్టి నాగేశ్వర్ రావ్ ఈసందర్భంగా మాట్లాడుతూ రానున్న స్థానిక ఎన్నికల్లో బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థులను సర్పంచ్,ఎంపీటీసీ,జెడ్పిటిసి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని,అభ్యర్థుల గెలుపుకోసం పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అథితిదిగా జాడి తిరుపతి,భీమారం మండల ఎన్నికల కన్వీనర్ మాడెం శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శి వేల్పుల రాజేష్ యాదవ్,ఉపాధ్యక్షులు సెగ్గెం మల్లేష్,కొమ్ము దుషాంత్,కత్తెరసాల కార్యదర్శి తాటి సమ్మగౌడ్,దుర్గం జేనార్ధన్,అవిడపు సురేష్, మంతెన సుధాకర్,మేడి విజయ కామెర జెనార్ధన్, కొమ్ము కుమార్ యాదవ్,వేల్పుల సతీష్ పాల్గొన్నారు.
హైదరాబాద్ లో జరిగిన మాజి మార్కెట్ చైర్మన్ రామకృష్ణ రెడ్డి గారి మేనల్లుడి వివాహా వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు ,మాజి సర్పంచ్ లు కలిం,రవికిరణ్,రమేష్ ,బి ఆర్ ఎస్ నాయకులు నసీర్ ఉద్దీన్, రయిస్ తదితరులు పాల్గొన్నారు.
యువతలో వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి నేటిధాత్రి
యువతలో వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకు వీలుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం ఉపాధి కల్పన శిక్షణ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా గ్రామీణ ప్రాంత నియోజకవర్గ కేంద్రాల్లో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను(ఏటీసీ) ఏర్పాటు చేస్తున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలను స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి సందర్శించారు. ఎమ్మెల్యేకు కళాశాల ప్రిన్సిపాల్, సిబ్బంది పూల బొకే ఇచ్చి శాలువా కప్పి స్వాగతం పలికారు. అనంతరం రూ.42.64 కోట్లతో కొత్తగా ఏర్పాటు చేస్తున్న అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ)ఏర్పాట్లను పరిశీలించారు. ఈ ఏటీసీలో రెండేళ్ల కాల పరిమితి కలిగిన ఆరు అడ్వాన్స్ టెక్నాలజీ కోర్సులు ఉన్నట్లు తెలిపారు. పదో తరగతి పాస్ అయిన భూపాలపల్లి నియోజకవర్గ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియాగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. అనంతరం ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో కోర్సుల వివరాలని ఎమ్మెల్యే తెలిపారు. ఏడాది కోర్సులు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ ఆటోమేషన్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్, పార్టిషన్ యూజింగ్ అడ్వాన్స్డ్ టూల్స్ ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా, రెండేళ్ల కాలపరిమితితో ఉన్న కోర్సులు బేసిక్ డిజైనర్ అండ్ వర్చువల్ వెరిఫైర్, అడ్వాన్సుడ్ సిఎంసి మిషన్ టెక్నీషియన్ మెకానిక్ ఎలక్ట్రికల్ వెహికల్ పురుషులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. మొత్తం 172 సీట్లు ఉన్నాయని, నియోజకవర్గం విద్యార్థులు ఇటి అవకాశాన్ని సద్వినియాగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. అంతకుముందు ఉదయం మంజూరునగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్, సిబ్బందితో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో కోర్సుల వివరాలను తెలిపే గోడపత్రికని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అప్పం కిషన్ దాట్ల శ్రీనివాస్ పిప్పాల రాజేందర్ కురిమిళ్ళ శ్రీనివాస్ తోట రంజిత్ ఉడుత మహేందర్ భౌతి విజయ్ తదితరులు పాల్గొన్నారు
జహీరాబాద్: జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే మాణిక్ రావు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గం శాసనసభ్యులు మాణిక్ రావు జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి వివేక్ వెంకట స్వామిని మర్యాదపూర్వకంగా బుధవారం కలిసారు. నియోజకవర్గ అభివృద్ధి కొరకు శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు మంత్రి వివేక్ వెంకట స్వామిని అభ్యర్థించారు.
రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు, ప్రజలందరికీ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం అని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు.బుధవారం మండల పరిధిలోని చిన్నకిష్ణాపురం గ్రామపంచాయతీ,దేశ్యతండ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు, ప్రజలు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజా పాలనాలో ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. ప్రభుత్వ పథకాలు అమలు నిరంతర ప్రక్రియ అని, ఎవ్వరు ఆందోళన చెందకూడదని ప్రజలకు స్పష్టం చేశారు. అర్హులైన వారిని గుర్తించి అందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజా పాలన ప్రజల వద్దకే వెళ్లి వారి మేలు కోరుతూ సంక్షేమాన్ని అందిస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని, సంక్షేమ పథకాలను అమలు చేసే చేతల ప్రభుత్వమని స్పష్టం చేశారు. గత పది ఏళ్లు పరిపాలించిన టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదని అన్నారు.గత ప్రభుత్వంలో పేదలకు ఇండ్లు గాని, రేషన్ కార్డులు గానీ ఇవ్వలేదని అన్నారు.రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి సంక్షేమ పథకాలను పరుగులు పెట్టిస్తున్నారని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరారు.
అనంతరం గార్ల పట్టణ శివారు కృష్ణా తార ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి చెక్కులు, సీఎంఆర్ఎఫ్ చెక్కులు, రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్, తహసిల్దార్ శారద, ఎంపీడీవో మంగమ్మ, వ్యవసాయ అధికారి రామారావు, తెలంగాణ ఉద్యమకారులు భూక్య నాగేశ్వరరావు, శీలంశెట్టి ప్రవీణ్ కుమార్, మాలోతు సురేష్, మాజీ జడ్పిటిసి ఝాన్సీ లక్ష్మి, గుండా వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీపీ మాలోత్ వెంకట్ లాల్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధనియాకుల రామారావు, గూగులోతు ఉమా భద్రు నాయక్, బాను చందర్ తదితరులు పాల్గొన్నారు.
చిట్యాల మండలం గుంటూరుపల్లి గ్రామపంచాయతీలో జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పనులలో 40 లక్షల రూపాయల వరకు అవినీతి జరిగిందని సోషల్ ఆడిట్లో తేల్చడం జరిగింది దీనికి సంబంధించిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ మండల అధికారి స్థానిక పంచాయతీ కార్యదర్శి పూర్తి బాధ్యత వహిస్తూ ఎవరైతే అవినీతికి పాలు పడ్డారో వారి నుండి డబ్బులు రికవరీ చేసి వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం గత ఐదు సంవత్సరాల కాలంలో ఉపాధి హామీ పనులు ఆ గ్రామంలో ఎక్కడెక్కడ జరిగినవో సమగ్రమైన విచారణ చేసి జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని పూర్తిస్థాయిలో విచారణ చేసి అక్రమానికి పాల్పడిన ఎవరైనా వారి మీద తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకొని నిరుపేద ప్రజలకు అండగా నిలబడి వారు కష్టపడి పని చేసిన వారికి వారి అకౌంట్లో డబ్బులు జమ చేయాలి అని అన్నారు సమగ్ర విచారణ జరగకపోతే చర్యలుతీసుకోకపోతే ఆ గ్రామ ప్రజలను సమీకరించి ఆందోళనకు సిద్ధం చేస్తామని తెలియజేస్తున్నాను ఐసా జిల్లా కార్యదర్శి శిలపాక నరేష్ రాజు పాల్గొన్నారు.
ఏపీలో శాంతి భద్రతలపై వైయస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి ఆందోళన
లోక్ సభలో రూల్ 377 ద్వారా కేంద్రం దృష్టికి మిదున్ రెడ్డి అక్రమ అరెస్టు అంశం
తిరుపతి(నేటి ధాత్రి)
ఆంధ్రప్రదేశ్లో క్షీణించిన శాంతి భద్రతల అంశాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మద్దిల గురుమూర్తి మంగళవారం మేటర్ అండర్ రూల్ 377 ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు క్షీణించాయని, పరిస్థితి విషమంగా మారిందని, ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రమాదకరమైన దాడి జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. ఇందుకు ఉదాహరణగా ఈ సమావేశాలలో తనతో పాటు ఉండాల్సిన తన సహచరుడు, రాజంపేట ఎంపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ పి.వి.మిథున్ రెడ్డిని అక్రమ కేసులో అరెస్టు చేయడం గురించి ప్రస్తావించారు. ఇదొక్క సంఘటనే కాదని, ఇవన్నీ కుట్రల శ్రేణిలో భాగమని సభ దృష్టికి తీసుకెళ్లారు. ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకోవడం, ప్రభుత్వంపై విమర్శలు చేసిన వారిని బెదిరించడం, పోలీసు యంత్రాంగాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం, ఇవన్నీ రాజ్యాంగ విలువలకు వ్యతిరేకంగా జరుగుతున్న చర్యలుగా భావించాలని ఎంపీ మద్దిల గురుమూర్తి కోరారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరచడం మాత్రమే కాకుండా, న్యాయం, సమానత్వం, ప్రాతినిధ్య పరంగా పాలన అనే సూత్రాల ఉల్లంఘన అని ఆయన పేర్కొన్నారు. ఈ చర్యలన కేంద్ర ప్రభుత్వం పరిశీలించి, రాజ్యాంగం అమలులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. తిరుపతి ఎంపీ కోరారు.
ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేసిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు.
చిట్యాల, నేటిధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండల కేంద్రంలోని గుంటూరు పల్లి లో మంగళవారం రోజున ఇందిరమ్మ ఇళ్లకు కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేసిన మండల పార్టీ అధ్యక్షుడు గూట్ల తిరుపతి, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదింటి కల నిజం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే భూపాలపల్లి నియోజకవర్గంలోని గ్రామాలను అభివృద్ధి చేసిన ఘనత ఎమ్మెల్యే సత్తన్నకు దక్కిందని అన్నారు, టిఆర్ఎస్ ప్రభుత్వం పేదోడి సొంతింటి కలలను తీర్చలేదని 10 సంవత్సరాల తర్వాత ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సందర్భంగా అన్నారు, అలాగే మాజీ ఎమ్మెల్యే కేటీఆర్ పర్యటనలో మాట్లాడుతూ కాలేశ్వరం లో మోటార్లు పెట్టడం లేదని నిరాహార దీక్ష చేస్తామనడం ఎందుకో చెప్పాలని దొరల ఫామ్ హౌస్ లోకి నీళ్లను పంపడం కోసమేనా అని అన్నారు, ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి కిష్టయ్య మండల ప్రధాన కార్యదర్శి గడ్డం కొమురయ్య మండల యూత్ అధ్యక్షుడు అల్లకొండ కుమార్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ముద్దన నాగరాజు కాంగ్రెస్ నాయకులు పాశం లక్ష్మీనారాయణ నర్రా శివరామకృష్ణ మునిమాకుల నాగేశ్వరరావు తిరుపతయ్య సాంబయ్య కాంగ్రెస్ పార్టీ యూత్ మండల్ నాయకులు రాజు తదితరులు పాల్గొన్నారు.
బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.బొంగోని సురేష్ గౌడ్
మద్దూరు నేటి ధాత్రి
జనగామ నియోజకవర్గం లో మద్దురు మండలంలోని లద్నూరు గ్రామంలో భారతీయ జనతా పార్టీ మద్దూరు మండల అధ్యక్షులు మోకు ఉదయ్ రెడ్డి అధ్యక్షతన స్థానిక సంస్థల కార్యశాల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమనికి బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొంగోని సురేష్ గౌడ్ గారు ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోటీ చేసేందుకు బిజెపి కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని, పిలుపునిచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం గ్రామానికి అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తామన్నారు. ఈరోజు గ్రామాల్లో జరుగుతున్న ప్రతీ అభివృద్ధి బీజేపీ ప్రభుత్వం గ్రామపంచాయతీ కి నేరుగా నిధులు పంపించడం వల్లనే గ్రామ అభివృద్ధి జరుగుతుంది అన్నారు .గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో బిజెపి సత్తా చాటాలి అన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ. గ్రామ స్థాయి వార్డ్ మెంబర్ నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు బీజేపీ అభ్యర్థులే గెలవాలనీ, భారత ప్రధాని మోడీ సర్కార్ మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి ఇచ్చిందని గ్రామాల్లోకి వెళ్లి కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించండి అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. లద్నూర్ గ్రామం బీజేపీ కి మంచి పట్టున్న గ్రామమని బూత్ స్థాయి నుండి ఇంకా బలోపేతం చేయాలనీ పిలుపునిచ్చారు, బిఆర్ఎస్, కాంగ్రెస్ నుండి బీజేపీ లోకి రాబోయే రోజులలో పలు నాయకులు బిజెపిలో చేరేందుకు ఉత్సాహపడుతున్నారని అన్నారు ఈ కార్యక్రమం లో మండల ప్రధాన కార్యదర్శిలు బియ్య రమేష్, బొంగోని బాలు, సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ రాపాక బుచ్చిరెడ్డి, బీజేవైఎం రాష్ట్ర నాయకులు మనోజ్ కుమార్,రామకృష్ణ రెడ్డి,మండల నాయకులు రవీందర్ రెడ్డి, వీరయ్య,గోవిందచారి,ఉపేందర్.ఐలయ్య, మరియు బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణలో 10 ఏళ్ల టిఆర్ఎస్ పాలన తర్వాత గడిచిన ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడిన విషయం తెలిసిందే. ప్రభుత్వం కొలువు దీరి 20 నెలల పాటు పాలన పూర్తయింది. ఇక ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎలాం టి అంచనాలు ఉన్నాయని చర్చ ఆసక్తికరంగా నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు వ్యూహాలు రచిస్తు న్నారు. పదేండ్ల టిఆర్ఎస్ పాలనలో అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొని పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పాటుపడితే గెలిచిన అనం తరం తమను పట్టించుకో కుండా పార్టీ ఫిరాయింపు దార్లకే పెద్ద పీట వేస్తున్నారని చాలా రకాలుగా పార్టీ నాయకులు మండిప డుతున్నారు.
పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కష్టపడ్డాం
కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కష్టపడిన కార్యకర్తలను కాదని గత బిఆర్ఎస్ ఎమ్మెల్యేల వద్ద అనేక పైరవీలు ఎమ్మెల్యేని భ్రష్టుపట్టిన వ్యక్తులు మళ్లీ తాజా ఎమ్మెల్యే వద్ద చేరినారని ఆరోపణలు వినిపిస్తున్నాయి పార్టీ జెండా మోసిన అసలు సిసలు కార్యకర్తలను పట్టించు కోకపో వడం లేదని తీవ్రమైన విమర్శలు వినిపిస్తున్నాయి.
ముందుగా సొంత పార్టీ నేతలకు భరోసా కల్పించాలి
ముఖ్యమంత్రి పదవి ప్రమాణం చేసిన నాటి నుండి నేటి వరకు అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు మరికొన్ని ప్రజలకు మేలు చేసేదిగా ఉన్నాయి. ప్రభుత్వం కొలువుదీరిన సమయం చాలా తక్కువగా ఉంది. అనేక సంక్షేమ పథకాల అమలుకు ప్రయత్నిస్తున్న మాట నిజమే. మండల కేంద్రంలో ఉన్న పలు రాజకీయ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల సంక్షేమా నికి పెద్దపీట.అయితే అటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్తి వ్యతిరేకమైన బిజెపి అధికా రంలో ఉందిరానున్న ఎన్నికల్లో పూర్తి మెజార్టీ కాంగ్రె స్ పార్టీ ముందున్న లక్ష్యం. మండలం లోని పలు గ్రామాల్లో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపుని ఏ రాజకీయ పార్టీకి వరిస్తుందోనని ప్రజల ఆలోచ నలు! అన్ని రాజకీయ పార్టీలు గెలుపు కోసం వ్యూహ రచనలు చేస్తున్నారా!
– జమ్మికుంట (నేటిధాత్రి) పరిస్థితి బాగోలేక ఆసుపత్రులపాలై ఇబ్బందులు పడ్డ లబ్ధిదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్ అన్నారు.హుజూరాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.నియోజకవర్గపరిధిలోని 5 మండలాలు,2 పట్టణాలు కలిపి 147 మంది లబ్ధిదారులకు 51,14,000/- విలువ చేసే చెక్కులను అందజేశారు.అనంతరం వారు మాట్లాడుతూ చెక్కులు అందుకున్న వారు త్వరగా బ్యాంకులో డిపాజిట్ చేసుకోవాలని,చెక్కుల పంపిణీ చేయడంలో అలసత్వం వహిస్తున్న కౌశిక్ రెడ్డి తన విధానం మార్చుకోవాలని సూచించారు.ప్రోటోకాల్ అని రెచ్చిపోయే కౌశిక్ రెడ్డి,చెక్కులు ఇచ్చే క్రమంలో సీఎం ఫోటో కట్ చేసి ఇవ్వడం ప్రోటోకాల్ ఆ అని ప్రశ్నించారు?.
ప్రజలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు..
ప్రజా సంక్షేమమే ద్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పథకాల రూప కల్పన చేస్తుందని,ప్రజా ఆమోదయోగ్య సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దేశంలో మొదటి స్థాయిలో నిలుస్తుందని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్ అన్నారు.కాంగ్రెస్ పథకాలే రాబోయే స్థానిక పోరులో మమ్మల్ని గెలిపిస్తాయని అన్నారు.ఈ కార్యక్రమంలో అన్ని మండలాల అధ్యక్షులు,మార్కెట్ చైర్మెన్ లు,డైరెక్టర్లు,దేవస్థాన చైర్మెన్ లు సీనియర్ నాయకులు,ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ నాయకులు,కార్యకర్తలు,అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
పెబ్బేరు మండలం కంచిరావు పల్లి గ్రామానికి చెందిన ఆవుల నరేష్ తండ్రి ఆవుల నాగ శేషయ్య కు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రభుత్వం తరపున సోమవారం 1,50,000 విలువగల ఎల్ ఓ సి ని మెరుగు అయన వైద్య ఖర్చుల కోసం బాధితునికి హైదరాబాద్ లో తన క్యాంపు కార్యాలయంలో అందజేశారు ఈమేరకు బాధితుడు ఎమ్మెల్యే మెగారెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు
గణపురం మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన బీఫార్మసీ అకాడమిక్స్ లో గోల్డ్ మెడల్ పొందిన దళిత బిడ్డను అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు శనిగరపు రాజేందర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది కుమ్మరి స్వరాజ్యం రవిల కుమారుడు కుమ్మరి క్రాంతి కుమార్ కు హనుమకొండ లోని విద్యానగర్ లో గల సైడ్ పీటర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసిటికల్ సైన్స్ కాలేజీలో 27వ గ్రాడ్యుయేట్ బి ఫార్మసీ అకాడమిక్స్ లో గోల్డ్ మెడల్ జిపిఏటి లో ఆల్ ఇండియా ఏ ఐ ఆర్9357 ర్యాంక్ కుమ్మరి క్రాంతి కుమార్ సాధించాడు భారతరత్న రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసి ప్రతి ఒక్కరూ చదువుకోవాలని హక్కులు కల్పించి పేదవారైనా దళితులకు చదివే ఆయుధంగా మలుచుకొని గొప్ప గొప్ప చదువులు చదివి తల్లిదండ్రులకు ఉన్న ఊరుకు మన దేశానికి మంచి పేరు తీసుకురావాలని రాజ్యాంగంలో హక్కులు కల్పించారు కూలి చేసుకుంటే గాని పూట గడవని స్థితి లో ఉండి తన కుమారుని కష్టపడి చదివించిన తల్లిదండ్రుల కు అంబేద్కర్ యువజన సంఘం కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు కట్ల శంకర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు ఆరు ముళ్ళ ఎల్ల స్వామి పీట్ల రంజిత్ ఎడ్ల సదానందం రత్నం రామకృష్ణ ఈర్ల సారయ్య ఇనుగాల రాజు గుర్రం భద్రయ్య రామంచ కిరణ్ ఎలుక పెళ్లి రాజు రామంచ మధుకర్ ఎలుక పెళ్లి సుమన్ పాల్గొన్నారు
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.