దళిత బాలికల పాఠశాలలకు పునాది భాగ్యారెడ్డి వర్మ.

దళిత బాలికల పాఠశాలలకు పునాది భాగ్యారెడ్డి వర్మ.

నర్సంపేట మున్సిపల్ కమిషనర్ భాస్కర్.

ఘనంగా భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలు.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

హైదరాబాదు సంస్థానంలో దళిత బాలికల పాఠశాలలను స్థాపించిన భాగ్యరెడ్డి వర్మ వాటి అభ్యున్నతికి పునాది అయ్యాడని నర్సంపేట మున్సిపాలిటీ కమిషనర్ కె.భాస్కర్ అన్నారు. దళిత వైతాళికుడిగా ప్రసిద్ధి చెందిన సంఘ సంస్కర్త ఆది ఆంధ్ర సభ స్థాపకుడు భాగ్యరెడ్డి వర్మ జయంతిని పురస్కరించుకొని నర్సంపేట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ భాస్కర్ మాట్లాడుతూ
1906 నుండి 1933 లో హైదరాబాదు సంస్థానంలో 26 దళిత బాలికల పాఠశాలలు స్థాపించారని అన్నారు. జగన్మిత్ర మండలి,మన్యసంఘం,సంఘసంస్కా ర నాట్యమండలి,అహింసా సమాజాలను స్థాపించి హైదరాబాద్ ప్రాంతాలలో సంఘసంస్కారాలపై ఎనలేని కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ సంపత్ కుమార్, మున్సిపల్ ఇంజనీర్ రాజేష్, జేఏవో రజిని, సానిటరీ ఇన్స్పెక్టర్ నాగరాజు, వార్డుల ఆఫీసర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version