కొండపైన వర్తక సంఘాన్ని రద్దు చేయాలి
యాదగిరిగుట్ట నేటి ధాత్రి:
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం సమీపంలోని కొండపైన దుకాణాల వర్తక సంఘాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ “మన గుడి మన వ్యాపారం” పేరిట యాదాద్రి పరిరక్షణ కమిటీ నిరసనకు దిగింది కమిటీ సభ్యులు, ప్రజలు, యువకులు కొండపైన కొబ్బరికాయలు విక్రయిస్తూ నిరసన వ్యక్తం చేశారు వర్తక సంగం పేరుతో నిర్వహిస్తున్న దుకాణాలను రద్దు చేసి టెండర్ల ద్వారా దుకాణాలను కేటాయించాలని డిమాండ్ చేశారు దీంతో పోలీసులు నిరసనకారులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు ఆలయ అభివృద్ధి సమయంలో కొండపై తొలగించిన దుకాణాల ను వర్తక సంఘం పేరిట ఏర్పాటు చేసి కొన్నాళ్లగా టెండర్లు వేయకుండా రెన్యువల్ చేస్తున్నారని కమిటీ సభ్యులు ఆరోపించారు
