14 స. బాలికలు హెచ్ పివి టీకాలు వేయించుకోవాలి

14 స. బాలికలు హెచ్ పివి టీకాలు వేయించుకోవాలి

మున్సిపల్ చైర్మన్ కొమురయ్య వైస్ చైర్మన్ శ్రీనివాస్

భూపాలపల్లి నేటిధాత్రి

మున్సిపాలిటీ పరిధిలో 26వ వార్డులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో (గర్భాశయ ముఖంలో ఏర్పడే క్యాన్సర్) 14 సంవత్సరాలు పూర్తి చేసి 15 సంవత్సరాలు చేరని బాల, బాలికలకు హెచ్ పివి టీకలు వేసే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మున్సిపాలిటీ చైర్మన్ బుర్ర కొమురయ్య గౌడ్ వైస్ చైర్మన్ శ్రీ అంబాల శ్రీనివాస్ 26వ వార్డు కౌన్సిలర్ దుర్గం రాధా ఐలయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా భూపాలపల్లి మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ మాట్లాడుతూ ఈ గర్భాశయ ముఖం లో ఏర్పడే క్యాన్సర్ అనేది సహజంగా 45 సంవత్సరాలు 50 సంవత్సరాల లోపు మహిళలను ఏర్పడుతుంది కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా ఈ వ్యాధి ఇప్పుడు అన్ని వయసుల వారికి వస్తుంది కాబట్టి ఈ వ్యాధి రాకుండా హెచ్ పివి టీకలు వేసుకోవాలి చిన్న వయసులో వివాహం వ్యక్తిగత శుభ్రత లోపం వల్ల ఈ వ్యాధి ప్రభావం ఉంటుంది కాబట్టి అందరూ కూడా 14 సంవత్సరాల నిండిన బాల బాలికలు ఈ టీకాలు కంపల్సరిగా వేసుకోవాలని సూచించడం అదేవిధంగా నూతనంగా ఎన్నికైన భూపాలపల్లి మున్సిపాలిటీ చైర్మన్ బుర్ర కొమురయ్య వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్ 26వ వార్డు కౌన్సిలర్ రాధ 25
వ వార్డు కౌన్సిలర్ పోనగంటి మేఘన శ్రీనివాస్ 24 వ వార్డు కౌన్సిలర్ వేముల జ్యోతి శ్రీకాంత్ ను ఆసుపత్రి డాక్టర్లు సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసే డాక్టర్స్ నర్సులు ఏఎన్ఎంలు సిబ్బంది పాల్గొన్నారు.

రాజకీయాలకు అడ్డగా మారిన చిట్యాల సివిల్ ఆస్పత్రి.

రాజకీయాలకు అడ్డగా మారిన చిట్యాల సివిల్ ఆస్పత్రి.

డ్రెస్ కోడ్ పాటించని ఆసుపత్రి సిబ్బంది.

కలెక్టర్ గారూ జర దృష్టి సారించండి.

చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్.

చిట్యాల, నేటిదాత్రి :

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని సివిల్ ఆస్పత్రి రాజకీయాలకు అడ్డగా మారింది. చిట్యాల సివిల్ ఆస్పత్రిలో పనిచేసే సిబ్బంది డ్రెస్ కోడ్ పాటించకుండా..నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ..రాజకీయ అవతారం ఎత్తి..చిట్యాల సివిల్ ఆస్పత్రిని రాజకీయ వేదికగా మార్చుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, డీఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ మధుసూదన్ దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని, భూపాలపల్లి శాసనసభ్యులు వెంటనే తగిన చర్యలు తీసుకొని ప్రజలకు న్యాయం చేయాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ డిమాండ్ చేశారు.

ఆరోగ్యవంతమైన సమాజానికి తల్లిపాలు దోహదం.

ఆరోగ్యవంతమైన సమాజానికి తల్లిపాలు దోహదం.

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తల్లిపాలు దోహదపడతాయని ఐసీడీసీ సూపర్వైజర్ సద్గుణ అన్నారు.తల్లి పాల వారోత్సవాల కార్యక్రమంలో సోమవారం మొగుడంపల్లి మండలంలో అంగన్వాడి టీచర్ ఎస్.తుల్జమ్మ ఆధ్యక్షతన అంగన్వాడి సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా మాట్లాడారు.శిశువు పుట్టిన దగ్గర నుంచి రెండేళ్ల వయస్సు వచ్చే వరకు తల్లిపాలు పట్టించాలన్నారు.తల్లిపాలు బిడ్డ మానసిక,శారీరకంగా ఎదుగులకు ఉపయోగపడతాయన్నారు.చాలా మంది తల్లులు పిల్లలకు తేనె,నీళ్లు వంటివి పడుతుంటారని,అలా చేయడం వల్ల బిడ్డ అనారోగ్యానికి గురవుతారన్నారు.రెండేళ్ల నుంచి బిడ్డకు అనుబంధ పోషకాహారాన్ని అందించాలని సూపర్వైజర్ సద్గుణ పేర్కొన్నారు. అనంతరం అంగన్‌వాడీ సెంటర్ పరిధిలోని గర్భిణులకు మంగళవారం సీమంతాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం స్వరూప,ప్రవీణ, అంగన్వాడి టీచర్ తుల్జమ్మ, ఆశ వర్కర్లు యశోద, ప్రకృత,ఆయాలు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version