ఉప సర్పంచ్ ఉప్పలయ్య కుటుంబానికి 50కిలోల బియ్యం అందజేత…

ఉప సర్పంచ్ ఉప్పలయ్య కుటుంబానికి 50కిలోల బియ్యం అందజేత

అప్పయ్యపల్లి ఉపసర్పంచ్ కనపర్తి వినయ్ కుమార్

గణపురం మండలం అప్పయ్య పల్లి గ్రామంలో ఇటీవలే స్వర్గస్తులైన దొంతుల ఉప్పలయ్య కుమారుడు కోడలు ఆయన దొంతుల రవి సమ్మక్క లకు అప్పయ్యపల్లి గ్రామ ఉపసర్పంచ్ కనపర్తి వినయ్ కుమార్ 50 కిలోల బియ్యం అందించి వారి కుటుంబాన్ని ఓదార్చి వారి ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో బోలెడ్ల ప్రభాకర్ రెడ్డి యాదవ సంఘం మండల అధ్యక్షులు దోమల రాజయ్య, కందికొండ అనిల్ ,నేతగాని రాజేష్ గ్రామ నాయకులు పాల్గొన్నారు

కరీంనగర్ డేయిరీ పాల కేంద్రంఆధ్వర్యంలో పుస్తె మట్టలపంపిణీ….

కరీంనగర్ డేయిరీ పాల కేంద్రంఆధ్వర్యంలో పుస్తె మట్టలపంపిణీ….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండలం అంకిరెడ్డిపల్లి గ్రామంలో నూతన వధువుకు. కరీంనగర్ డేయిరీ పాల యజమాన్యం ఆధ్వర్యంలో పుస్తె మట్టలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా నేరెళ్ల రూట్ సూపర్వైజర్ ఉమ్మారెడ్డి భానుచందర్.రెడ్డి మాట్లాడుతూ కరీంనగర్. డే యి రీ. ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాల కొనసాగు.తున్నయని అందులో భాగంగా కళ్యాణ.మస్తు. పథకం ద్వారా పేద కుటుంబాలకు ఆడబిడ్డల వివాహాలకు సహాయం అందిస్తున్నామని తెలుపుతూ ఇట్టి కార్యక్రమంలో భాగంగా. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం.అంకి రెడ్డిపల్లి. గ్రామంలోని పల్లె లక్ష్మారెడ్డి.కలల.కూతురు రజిత వివాహానికి. కరీంనగర్ పాలకేంద్రం యజమాన్యం తరపున.పుస్తె మట్టెలు అందజేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. అంకిరెడ్డి పల్లె పాల ఉత్పత్తిదారుల సంస్థ అధ్యక్షులు సింగిరెడ్డి మాధవరెడ్డి. డైరెక్టర్లు రాగుల రాజిరెడ్డి. ఏలేటి విజయ్ రెడ్డి. తొoటిరాజయ్య. పల్లె లక్ష్మారెడ్డి. గొట్టిపర్తిరాజు. సుంకపాక.దేవయ్య. పోచంపల్లి రంగయ్య. భీమరి రాములు. సెక్రెటరీ ఐ రెడ్డి సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు

రత్నాకర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర

రత్నాకర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లి గ్రామ వాస్తవ్యులు ఒద్దుల రత్నాకర్ రెడ్డి తల్లి ఒద్దుల సరోజన మృతిచెందగా విషయం తెలుసుకున్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వారి నివాసానికి చేరుకొని సరోజన పార్టీవదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు కార్యక్రమంలో వారి వెంట గ్రామస్తులు, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

పాఠశాలలో స్టేజి నిర్మాణానికి భూమి పూజ….

పాఠశాలలో స్టేజి నిర్మాణానికి భూమి పూజ….

పాఠశాల అభివృద్ధి లో ప్రభాకర్ రావు పాత్ర అభినందనీయం….

మాదన్నపేట సర్పంచ్ కత్తి రమేష్…….

నేటిధాత్రి

 

కమలాపూర్(హనుమకొండ) కమలాపూర్ మండలంలోని మాదన్నపేట గ్రామానికి చెందిన వ్యాపారవేత్త గంగు ప్రభాకర్ రావు గ్రామంలోని ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం బుధవారం రూ.రెండు లక్షల ఖర్చుతో స్టేజి నిర్మాణ పనికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమములో ముఖ్య అతిథిగా పాల్గొన్న గ్రామ సర్పంచ్ కత్తి రమేష్ మాట్లాడుతూ గ్రామానికి చే దిన ప్రభాకర్ రావు పాఠశాల అభివృద్ధికి ముందుకు రావడం పట్ల అభినందించారు.సౌకర్యాల లేమితో ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సౌకర్యం కోసం గత వారం క్రితం రూ.లక్ష విలువగల ఫర్నిచర్ అందించడం తో పాటు పాఠశాల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు గాను రూ.రెండు లక్షల ఖర్చుతో స్టేజి నిర్మాణ కార్యక్రమానికి పూనుకోవడం మాదన్నపేట గ్రామ విద్యార్థుల అదృష్టం గా భావిస్తున్నట్లు తెలిపారు.తన స్వంత డబ్బుతో పాఠశాల అభివృద్ధి కి తోడ్పాటు అందిస్తున్న ప్రభాకర్ రావుకు గ్రామ సర్పంచి తో పాటు పాలక మండలి సభ్యులు,పాఠశాల అధ్యాపక బృందం, గ్రామస్తులు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమములో గ్రామ సర్పంచ్ రమేష్,మాజీ సర్పంచ్ చెరుకు రాజయ్య,దాత గంగు ప్రభాకర్ రావు తో పాటు ప్రధానోపాధ్యాయులు కొల్లూరు వెంకన్న,ఉపాధ్యయబృందం,గ్రామస్తులు,విద్యార్థులు పాల్గొన్నారు.

సర్వాపురంలో మహిళ మృతి – కౌన్సిలర్ సంతాపం…

సర్వాపురంలో మహిళ మృతి – కౌన్సిలర్ సంతాపం

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డ్ సర్వపురంలో మంగళవారం జన్ను రాజు భార్య జన్ను లావణ్య మృతి చెందారు.ఈ సందర్భంగా 5వ వార్డ్ కౌన్సిలర్ పొన్నాల మనీషా ప్రకాష్ మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో ఊరి పెద్దలు ఆకులపెల్లి రమేష్, చిలుక జంపయ్య, కొంగర సాంబయ్య, మాసు స్వామి, పొన్నాల శంకర్, మాసు కొమ్మలు, బోట్ల కుమార్, తడుగుల ఎల్లయ్య తదితరులు పాల్గొని సంతాపం ప్రకటించారు.

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

మాజీ సర్పంచ్ మేకల ఎల్లారెడ్డి

వీణవంక, నేటి ధాత్రి:

వీణవంక మండల పరిధిలోని మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన మోరె చంద్రయ్య మంగళవారం రోజు మృతి చెందగా, విషయం తెలుసుకున్న మాజీ సర్పంచ్ మేకల ఎల్లారెడ్డి మృతుడి భౌతికకాయాన్ని సందర్శించి, నివాళులు అర్పించి,వారి కుటుంబాన్ని ప్రగడ సానుభూతి తెలియజేశారు మృతుడి కుటుంబానికి 5000 /- రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి తన మానవత్వాన్ని చాటుకున్నారు.
ఈ కార్యక్రమంలో తనవెంట వీణవంక మండల ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు పల్లెర్ల కిరణ్ గుప్తా, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు నిమ్మల సమ్మయ్య, అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి ప్రధాన కార్యదర్శి ముద్దసాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

మండపల్లి సమ్మక్క సారలమ్మ జాతరకు మాజీ జెడ్పిటిసి కుటుంబానికి ఆహ్వానం

మండపల్లి గ్రామంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు ఆహ్వానించిన ఆలయ కమిటీ….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండలం మండపల్లి గ్రామంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు రావాలని మాజీ జెడ్పిటిసి పూర్మాని మంజుల రామలింగారెడ్డి కుటుంబ సభ్యులను ఆహ్వానించిన ఆలయ కమిటీ సభ్యులు మండపల్లి గ్రామ సర్పంచ్ గాధగోని సాగర్. ఈ సందర్భంగా మాట్లాడుతూ తంగళ్ళపల్లి మండలం మండపల్లి గ్రామంలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే సమ్మక్క సారలమ్మ జాతర మహోత్సవానికి మాజీ జెడ్పిటిసి మంజుల లింగారెడ్డి కుటుంబ సభ్యులతో వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని తీర్థ ప్రసాద స్వీకరించి అమ్మ వార్లను దర్శించుకోవాల్సిందిగా సమ్మక్క సారలమ్మ ఆలయ కమిటీ చైర్మన్ .కడారిరామ రెడ్డి ఆలయ కమిటీ సభ్యులు మండపల్లి గ్రామ సర్పంచ్ గాధగోని సాగర్ ఆహ్వానించారు. ఇ o దుకుగాను మాజీ జెడ్పిటిసి మంజుల లింగారెడ్డి తప్పకుండా కుటుంబ సభ్యులతో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటామని. అది మా అదృష్టంగా భావించి అమ్మవార్ల ఆశీస్సులు పొందుతామని తెలియజేస్తూ నూతనంగా ఎన్నికైన గ్రామపంచాయతీ సర్పంచి ఉపసర్పంచ్ వార్డ్ మెంబర్లను. పాలకవర్గాన్ని అలాగే ఆలయ కమిటీ సభ్యులను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ .కడారి రామ్ రెడ్డి. స్థానిక సర్పంచ్ గాధగోని సాగర్. జిల్లా .కాంగ్రెస్ ఫిషరీఫ్.ప్రధాన కార్యదర్శి చెన్నమనేని ప్రశాంత్. మాజీ జెడ్పిటిసి పూర్మాని .మంజుల లింగారెడ్డి. తదితరులు పాల్గొన్నారు

నల్ల నీళ్ల కోసం రోజుల తరబడి ఎదురుచూపులు…

నల్ల నీళ్ల కోసం రోజుల తరబడి ఎదురుచూపులు

మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ శూన్యం

రోడ్డు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే నీటి తిప్పలు

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

 

కేసముద్రం విలేజ్ లో గత కొన్ని రోజులుగా నీటి సరఫరా చేసే పైప్ లైన్లు రోడ్డు విస్తరణ పనులలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా పనులు చేయడంతో నేటి సరఫరా పైప్ లైన్లు ఎక్కడికక్కడ పగుళ్లు ఏర్పడి గత కొన్ని రోజులుగా కేసముద్రం గ్రామ ప్రజలకు నేటి సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇలా నీటి కష్టాలు ఇంకా ఎన్ని రోజులు పడాల్సి వస్తుందోనని కేసముద్రం విలేజ్ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేసముద్రంలోని ఒకటవ వార్డు బజారుకు సుమారు 60 కుటుంబాలు వారం రోజులుగా నల్ల నీటి కోసం ఎదురుచూస్తున్నారు. రోజు వారి వాడుకునే నల్ల నీళ్లు లేక నరక యాత్ర అనుభవిస్తున్నారు. ప్రతిరోజు నీరు లేనిదే ఏ పని జరగదు ఉదయం మొదలుకొని రాత్రి పడుకునే వరకు నీటితోనే అవసరం అలాంటిది వారం పది దినాలుగా నీళ్లు లేకపోవడంతో నానా కష్టాలు పడుతున్నారు. పండగ దగ్గరికి వస్తున్నందున నీళ్ల అవసరం చాలా ఎక్కువే అని ఇలా అయితే మనకు నీటి కష్టాలు తప్పవా అని సంబంధిత అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఈ నీటి సమస్యకు కారకులు రోడ్డు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పనులు చేయించడం వల్లనే భారీ యంత్రాలతో రోడ్డు వెడల్పు చేసే క్రమంలో భూమిలో ఉన్న పైపులు సైతం పలిగేలా పనులు చేసుకుని వెళ్ళిపోతున్నారు.కానీ వాటి మరమ్మత్తులు మాత్రం మున్సిపల్ అధికారులు సకాలంలో చేయించకపోగా అరకొర సిబ్బందితో నత్త నడకగా పైపులైన్ రిపేరు జరుగుతున్నందున నీటి ఎద్దడి ఏర్పడుతుందని ప్రజలు అధికారులు నిలదీస్తున్నారు. ఈ నేటి ఎద్దడికి కారకులైన రోడ్డు కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి మేము బలైపోతున్నామని ఇటు మునిసిపల్ అధికారుల మధ్య ఇటు రోడ్డు కాంట్రాక్టర్ మధ్య మేము నీళ్ళు లేక అల్లాడిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . రోడ్ కాంట్రాక్టర్ పైపులైన్లను పగలగొడుతుంటే మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నట్టు అని ప్రశ్నిస్తున్నారు. కేసముద్రం విలేజ్ లోని రైస్ మిల్ దగ్గర మాజీ ఎంపిటిసి సట్ల వెంకన్న బజార్ అయినటువంటి పూర్వం గ్రామపంచాయతీ గల ఒకటో వార్డు సంబంధించిన నీటి సరఫరా పైప్లైన్ రోడ్డు ఆ చివర నుండి ఈ చివరి వరకు నీటి సరఫరా పైపు చాలా చోట్ల డ్యామేజ్ అయి ఉన్నందున ఎప్పటికైనా డ్యామేజ్ అయిన పైప్ లైన్ మొత్తం పూర్తిగా తొలగించి నాణ్యత గల పైపును అమర్చి మాకు నీటి ఎద్దడి సమస్య రాకుండా సరిచేయాలని మున్సిపల్ అధికారులను కోరుకుంటున్నామని కేసముద్రం గ్రామ ప్రజలు ఎదురుచూస్తున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version