భీమారం లో ఉచిత నేత్ర వైద్య శిభిరము.

భీమారం లో ఉచిత నేత్ర వైద్య శిభిరము

30 మంది రేకుర్తి ఆసుపత్రి కి తరలింపు

జైపూర్,నేటి ధాత్రి:

 

 

డాక్టర్ భాస్కర్ మాదేకర్ ఉదార నేత్ర వైద్యశాల రేకుర్తి, కరీంనగర్ వారి సౌజన్యంతో, వైస్ చైర్మన్ లయన్ చిదురా సురేష్ సహకారంతో, మంచిర్యాల జిల్లా భీమారం జడ్పి ఉన్నత పాఠశాలలో శుక్రవారం లయన్స్ క్లబ్ మంచిర్యాల,లయన్స్ క్లబ్ మంచిర్యాల గోల్డెన్ జూబ్లీ,లయన్స్ క్లబ్ విజన్ కేర్ ల ఆధ్వర్యంలో ఉచిత నేత్ర శిభిరము నిర్వహించారు. వైద్య శిభిరానికి 70 మంది విచ్చేసి బి పి,షుగర్,కంటి పరీక్షల అనంతరం 30 మంది కంటి ఆపరేషన్ కోసం అర్హత సాధించినట్లు,వారిని ఉచిత కంటి ఆపరేషన్ కోసం రేకుర్తి ఆసుపత్రి కి పంపించామని రేకుర్తి ప్రతినిధి ప్రభాకర్ మరియు లయన్ డాక్టర్ కె. సుగుణాకర్ రెడ్డి తెలిపారు.ఐ పెషేంట్ లకు వారి వెంట వెళ్లే వారికి ఉచిత బస్సు ప్రయాణం,ఉచిత భోజన వసతి ఉంటుందని తెలుపుతూ,కంటి ఆపరేషన్ తరువాత ఆదివారం భీమారం కు తిరిగి వస్తారని తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ఛైర్పర్సన్ ఫర్ ఐ క్యాంప్స్ లయన్ మోదుంపురం వెంకటేశ్వర్,మంచిర్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ పుల్లూరి బాలమోహన్,కోశాధికారి లయన్ కొల్ల వెంకటేశ్వర్లు, బెల్లంపల్లి విజన్ కేర్ అధ్యక్షులు లయన్ సయ్యద్ ఇలియాస్ వారి సిబ్బంది,భీమారం మాజీ సర్పంచ్ చేకుర్తి సత్యనారాయణ రెడ్డి,భగద్గీత అధ్యయన మండలి సభ్యుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version