అక్రమ అరెస్టులు గృహనిర్బంధాలను ఖండిస్తున్నాం కొంకుల రాజేష్ అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు.
బెల్లంపల్లి నేటిధాత్రి :
క్యాతనపల్లి మున్సిపాలిటీ 22 వార్డులకు ఎన్నికలు జరగగా పొత్తులో భాగంగా బీఆర్ఎస్ సిపిఐ 14 వార్డులు గెలవగా కాంగ్రెస్ 7వార్డులు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలవడం జరిగింది, మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు బీఆర్ఎస్ సిపిఐ కి తగిన మెజారిటీ ఉన్న అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మంత్రి ఎంపీలు ఈ ఎన్నిక ను వాయిదా వేయటానికి కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు, నిన్న కేతనపల్లి మున్సిపాలిటీలో బిఆర్ఎస్ సిపిఐ కౌన్సిలర్ల మీద జరిగినటువంటి దాడి వైఖరిని చూస్తే ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుందని కళ్లకు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది నిన్న జరిగినటువంటి దురాగాతానికి ఈరోజు కేతనపల్లి బంద్ కి సిపిఐ బిఆర్ఎస్ బందు పిలుపు ఇవ్వడం జరిగింది, ప్రభుత్వం ఈ బందు కొనసాగకుండా పోలీస్ బలగాలను పట్టణంలోని మోహరించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు వనం సత్యనారాయణ నీ అరెస్టు చేసి జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్, మిగతా కామ్రేడ్స్ అందరి ఇంటి వద్ద బీఆర్ఎస్ నాయకుల ఇంటి వద్ద పోలీస్ బలగాలను పెట్టి వారిని ఇంట్లోనే నిర్బంధించి హౌస్ అరెస్టులను చేయడాన్ని అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ మంచిర్యాల జిల్లా సమితి తీవ్రంగా ఖండిస్తోందని వారన్నార, మంత్రివర్యులు ఇప్పటికైనా ప్రజల తీర్పును గౌరవించి క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, ఎన్నికను సజావుగా జరగనివ్వాలని నిర్బంధాలతో తెలంగాణ ప్రజలను అణిచివేయలేరని గ్రహించాల్సిందిగా కోరుతున్నాం.
