బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదంలో అశ్విన్‌

బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదంలో అశ్విన్‌

 

shine junior college

భారత మాజీ ఆఫ్‌ స్పిన్నర్‌ ఆర్‌.అశ్విన్‌ మరో వివాదంలో చిక్కుకున్నాడు. గతవారం మహిళా అంపైర్‌తో గొడవకు దిగిన అతను తాజాగా…

 

కోయంబత్తూరు: భారత మాజీ ఆఫ్‌ స్పిన్నర్‌ ఆర్‌.అశ్విన్‌ మరో వివాదంలో చిక్కుకున్నాడు. గతవారం మహిళా అంపైర్‌తో గొడవకు దిగిన అతను తాజాగా బంతి స్వరూపాన్ని మార్చేందుకు ప్రయత్నించాడంటూ మధురై పాంథర్స్‌ జట్టు ఫిర్యాదు చేసింది. తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌ (టీఎన్‌పీఎల్‌)లో అశ్విన్‌ దుండిగల్‌ డ్రాగన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈనెల 14న ఇరుజట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. ‘డ్రాగన్స్‌ జట్టు ఆటగాళ్లు రసాయనాల్లో ముంచిన టవళ్లతో బంతిని పదేపదే తుడిచారు. తద్వారా బంతి బరువును పెంచాలని చూశారు’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు ఇందుకు తగిన ఆధారాలను చూపడంలో మధుర జట్టు విఫలమైందని టీఎన్‌పీఎల్‌ ప్రకటించింది.

డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్‌కు ఘన స్వాగతం.

డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్‌కు ఘన స్వాగతం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

shine junior college

 

 

ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) రజతోత్సవంలో భాగంగా అమెరికాలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమెరికా నుండి తిరిగి స్వదేశానికి విచ్చేసిన సందర్భంగా, సంగారెడ్డి జిల్లా ఝ రా సంగం మండలం మెదపల్లి బీ ఆర్ఎస్ సీనియర్ నేత పరమేశ్వర్ పాటిల్ ఝరాసంగం మండల బీఆర్ఎస్ పార్టీ యువనాయకులు ఎస్.కె. షోయల్ ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మాజీ ఎంపీపీ విజయకుమార్, ఝరాసంగం మండల బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు మాణికప్రభు పాటిల్, యువ నాయకులు నవీన్ పాటిల్ శివకుమార్, సంగారెడ్డి జిల్లా వీరశైవ లింగాయత్ యువజన సంయుక్త కార్యదర్శి పోలీస్ ప్రవీణ్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.

నేడు జట్టుతో చేరనున్న గంభీర్‌

నేడు జట్టుతో చేరనున్న గంభీర్‌

 

 

shine junior college
భారత క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌ గౌతం గంభీర్‌ మంగళవారం జట్టుతో చేరనున్నాడు. తల్లి సీమా గంభీర్‌ గుండెపోటుకు గురైనందున…

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌ గౌతం గంభీర్‌ మంగళవారం జట్టుతో చేరనున్నాడు. తల్లి సీమా గంభీర్‌ గుండెపోటుకు గురైనందున అతడు ఈనెల 12న స్వదేశానికి వచ్చాడు. గౌతీ తల్లి ఐసీయూలో చికిత్స పొందుతున్నప్పటికీ..ఆమె ఆరోగ్యం మెరుగైందని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం కెంట్‌లో ఉన్న భారత జట్టు శుక్రవారం నుంచి ఇంగ్లండ్‌తో జరిగే తొలి టెస్టు కోసం మంగళవారం హెడింగ్లీకి బయల్దేరి వెళ్లనుంది.

ఆర్చరీలో తెలుగమ్మాయి రెండు ప్రపంచ రికార్డులు.

ఆర్చరీలో తెలుగమ్మాయి రెండు ప్రపంచ రికార్డులు

 

shine junior college

 

సింగపూర్‌లో జరుగుతున్న ఆసియాకప్‌ స్టేజ్‌ 2 అండర్‌-21 ఆర్చరీ ర్యాంకింగ్‌ రౌండ్‌లో ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారిణి బుద్ధె షణ్ముఖి నాగసాయి…

విజయవాడ స్పోర్ట్స్‌: సింగపూర్‌లో జరుగుతున్న ఆసియాకప్‌ స్టేజ్‌ 2 అండర్‌-21 ఆర్చరీ ర్యాంకింగ్‌ రౌండ్‌లో ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారిణి బుద్ధె షణ్ముఖి నాగసాయి రెండు ప్రపంచ రికార్డులు నెలకొల్పింది. 50 మీటర్ల కాంపౌండ్‌ మహిళల టీమ్‌ ఈవెంట్‌లో షణ్ముఖి, తేజల్‌ సాల్వే, తనిష్కలతో కూడిన భారత జట్టు 2101 పాయింట్లు స్కోరుచేసి వరల్డ్‌ రికార్డు సాధించింది. ఈ క్రమంలో 2076 పాయింట్ల రికార్డును అధిగమించింది. ఇక మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో షణ్ముఖి, కుషాల్‌ దలాల్‌ ద్వయం 1420 పాయింట్లు స్కోరు చేసి గత వరల్డ్‌ రికార్డు (1419)ను అధిగమించింది.

సచిన్‌ కాదు కోహ్లీతోనే కష్టం.

సచిన్‌ కాదు కోహ్లీతోనే కష్టం…

 

shine junior college

సచిన్‌ టెండూల్కర్‌తో పోల్చితే. కోహ్లీకి బౌలింగ్‌ చేయడం తనకు ఎంతో కష్టంగా అనిపించేదని ఇంగ్లండ్‌ మాజీ పేసర్‌ జిమ్మీ అండర్సన్‌ చెప్పాడు. విరాట్‌ టెక్నిక్‌, పోరాటపటిమన.

లండన్‌: సచిన్‌ టెండూల్కర్‌తో పోల్చితే.. కోహ్లీకి బౌలింగ్‌ చేయడం తనకు ఎంతో కష్టంగా అనిపించేదని ఇంగ్లండ్‌ మాజీ పేసర్‌ జిమ్మీ అండర్సన్‌ చెప్పాడు. విరాట్‌ టెక్నిక్‌, పోరాటపటిమను కొనియాడాడు. కోహ్లీ, అండర్సన్‌ మధ్య వైరం ఎంతో ఆసక్తిగా ఉండేది. 36 ఇన్నింగ్స్‌లో ఏడుసార్లు విరాట్‌ను అండర్సన్‌ అవుట్‌ చేశాడు. ‘సచిన్‌తో పోల్చితే కోహ్లీ తత్వం భిన్నం. ఆరంభంలో విరాట్‌ను సులువుగానే అవుట్‌ చేసినా.. ఆ తర్వాత అతడిపై ఆధిపత్యం సాధించడం కష్టమైంది. దూకుడుగా ఉండే విరాట్‌.. దేనికైనా సై అన్నట్టుగా ఉంటాడ’ని అండర్సన్‌ చెప్పాడు. టెస్ట్‌లకు కోహ్లీ ఇటీవలే రిటైర్మెంట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

అవి చీకటి రోజులు.

అవి చీకటి రోజులు

 

shine junior college

 

 

లండన్‌: గత దేశవాళీ సీజన్‌లో పరుగుల వరద పారించిన కరుణ్‌ నాయర్‌కు ఎట్టకేలకు ఎనిమిది సంవత్సరాల విరామం తర్వాత జాతీయ జట్టులో చోటు లభించింది. ఈ నేపథ్యంలో…

న్యూఢిల్లీ: లండన్‌: గత దేశవాళీ సీజన్‌లో పరుగుల వరద పారించిన కరుణ్‌ నాయర్‌కు ఎట్టకేలకు ఎనిమిది సంవత్సరాల విరామం తర్వాత జాతీయ జట్టులో చోటు లభించింది. ఈ నేపథ్యంలో తన క్రికెట్‌ కెరీర్‌లో ఎత్తుపల్లాలను తలుచుకుంటూ 33 ఏళ్ల నాయర్‌ ఉద్వేగానికి గురయ్యాడు. ‘2022 ఏడాది చివరి రోజులు నా కెరీర్‌లో అత్యంత చీకటిమయం’ అని ఆర్‌.అశ్విన్‌ యూట్యూబ్‌ చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో నాయర్‌ తెలిపాడు. దేశవాళీ పోటీల్లో సత్తా చాటినా జాతీయ జట్టులో చోటు దక్కకపోవడంతో తీవ్ర ఆవేదనకు లోనైన కరుణ్‌.. ‘డియర్‌ క్రికెట్‌. నాకు మరో అవకాశం ఇవ్వు’ అంటూ 2022 డిసెంబరులో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం సంచలనం రేపింది. ‘గత రెండు మూడు సంవత్సరాలుగా నాకు అండగా నిలిచిన వారికి కృతజ్ఞతలు. ఈ సమయంలో ప్రతి క్షణం ఎంత విలువైనదో తెలుసుకున్నా. దాంతో ప్రతి రోజును కొత్తగా భావించా’ అని కరుణ్‌ తెలిపాడు. సెహ్వాగ్‌ తర్వాత టెస్ట్‌ల్లో త్రిశతకం బాదిన భారత క్రికెటర్‌గా రికార్డులకెక్కిన నాయర్‌ను 2018లో ఎలాంటి కారణం చూపకుండా టీమిండియానుంచి తప్పించడం గమనార్హం.

భారీ వర్షాలు.. 18 మంది మృతి

భారీ వర్షాలు.. 18 మంది మృతి

 

 

 

shine junior college

 

మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ వాతావరణ శాఖ జారీ చేసింది.

 

ముంబై, జూన్ 17: మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వీటి కారణంగా 18 మంది మృ‌తి చెందారు. 65 మంది గాయపడ్డారు. ఈ మేరకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. భారీ వర్షాలు, రోడ్డు ప్రమాదాలు, పిడుగుపాటు, నీట మనిగి పోవడం కారణాల వల్ల ఈ మృతులు సంభవించాయని వివరించింది. రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని.. ఈ నేపథ్యంలో గత 24 గంటలుగా భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పింది.

 

రాజధాని ముంబై మహానగరంతోపాటు ముంబై శివారు ప్రాంతం, రత్నగిరి, సిందుదుర్గ్, రాయ్‌గఢ్ తదితర జిల్లాల్లో భారీగా వర్షం కురిసిందని తెలిపింది. మరోవైపు పశ్చిమ మహారాష్ట్రలోని అరంజ్ అలర్ట్‌ జారీ చేసినట్లు పేర్కొంది. అలాగే పుణె, కోల్హపూర్, సతారాతోపాటు రాయ్‌గఢ్ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. జూన్ 15 నుంచి 18వ తేదీ వరకు మహారాష్ట్రకు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక సహాయక చర్యలు కొనసాగుతోన్నాయి. అలాగే లోతట్టు ప్రాంతాల్లో.. నీట ముంపునకు గురైన వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇంకోవైపు భారీ వర్షాల కారణంగా ముంబై మహానగరంలో రహదారులపై నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

 

 

ఇక నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో 24 గంటల్లో గుజరాత్, విదర్భా, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలోని పలు ప్రాంతాల్లో విస్తరించనున్నాయని తెలిపింది. అలాగే పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బిహార్, తూర్పు ఉత్తరప్రదేశ్‌లో మరో మూడు రోజుల్లో ఇవి విస్తరిస్తాయని పేర్కొంది. అయితే ఈ మరణాలు జూన్ 1వ తేదీ నుంచి నేటి వరకు చోటు చేసుకున్నవని వివరించింది.

 

కేరళలో..

అదీకాక.. కేరళలో జూన్ 18 వరకు విస్తృతంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు జారీ చేసింది. దీంతో జిల్లా ఉన్నతాధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది.

 

న్యూఢిల్లీలో..

ఇక ఈ రోజు సాయంత్రం లేదా రాత్రికి దేశ రాజధాని న్యూఢిల్లీలో సైతం సాధారణ వర్షాలు లేకుంటే.. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశముందని వివరించింది.

 

కర్ణాటకలో..

అలాగే కర్ణాటకలో సైతం భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపింది ఈ జూన్ మాసంలో సగటు కంటే 110 శాతం అధిక వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ విభాగం పేర్కొంది.

మళ్లీ వస్తున్న హనుమాన్‌ జంక్షన్‌.

మళ్లీ వస్తున్న హనుమాన్‌ జంక్షన్‌

 

 

shine junior college

 

అర్జున్‌, జగపతిబాబు, వేణు హీరోలుగా 2001లో వచ్చిన ‘హనుమాన్‌ జంక్షన్‌’ చిత్రం మళ్లీ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది…

అర్జున్‌, జగపతిబాబు, వేణు హీరోలుగా 2001లో వచ్చిన ‘హనుమాన్‌ జంక్షన్‌’ చిత్రం మళ్లీ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఎడిటర్‌ మోహన్‌ నిర్మించిన ఈ చిత్రంతోనే ఆయన తనయుడు మోహన్‌ రాజా దర్శకుడిగా పరిచయమయ్యారు. లయ, స్నేహ, విజయలక్ష్మి హీరోయిన్లుగా నటించిన ‘హనుమాన్‌ జంక్షన్‌’ చిత్రాన్ని ఈ నెల 28న మళ్లీ థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. పూర్తి స్థాయి కామెడీ ఎంటర్‌టైనర్స్‌ తక్కువగా వస్తున్న ప్రస్తుత తరుణంలో ‘హనుమాన్‌ జంక్షన్‌’ మళ్లీ తన మ్యాజిక్‌తో మెస్మరైజ్‌ చేస్తుందని దర్శకనిర్మాతలు చెప్పారు.

పెళ్లి పేరుతో నమ్మించి.. డబ్బు తీసుకుని వంచించి..

పెళ్లి పేరుతో నమ్మించి.. డబ్బు తీసుకుని వంచించి..

 

shine junior college

ఓ వివాహ వెబ్‌సైట్‌లో బిజినెన్‌ మ్యాన్‌గా పరిచయం చేసుకున్నాడు. కొన్నాళ్లకు పరిచయం ఆన్‌లైన్‌ నుంచి ఆఫ్‌లైన్‌కు మారింది. ఓ హోటల్‌లో అప్పుడప్పుడూ కలుసుకునేవారు. ఆమె నుంచి రూ.లక్షల్లో డబ్బు కూడా తీసుకున్నాడు.

 

ఓ వివాహ వెబ్‌సైట్‌(Website)లో బిజినెన్‌ మ్యాన్‌గా పరిచయం చేసుకున్నాడు. కొన్నాళ్లకు పరిచయం ఆన్‌లైన్‌ నుంచి ఆఫ్‌లైన్‌కు మారింది. ఓ హోటల్‌లో అప్పుడప్పుడూ కలుసుకునేవారు. ఆమె నుంచి రూ.లక్షల్లో డబ్బు కూడా తీసుకున్నాడు. పెళ్లి చేసుకోవాలని, డబ్బు తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తే ఇద్దరూ కలిసి ఉన్నప్పటి వీడియోలు వైరల్‌ చేస్తానని మహిళను బెదిరించడంతో పాటు ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేశాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

 

 

నగరంలోని ఓ మహిళకు షాదీ డాట్‌ కామ్‌లో ముంబైకి చెందిన కల్ఫేష్‌ కక్కడ్‌తో 2022లో పరిచయం ఏర్పడింది. ఆమెతో పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అప్పుడప్పుడు నగరానికి వచ్చి ఆమెను కలిసేవాడు. జనవరి 23న కల్ఫేష్‌ నగరానికి వచ్చి బేగంపేట(Begumpet)లో ఉన్న ఓ హోటల్‌లో దిగి ఫోన్‌ చేయడంతో ఆమె అక్కడికి వెళ్లింది. తన వ్యాపార అభివృద్ధికి డబ్బు కావాలని కోరడంతో రెండు విడతలుగా రూ.24లక్షలు ఇచ్చింది.

 

 

ఆ తర్వాత ముఖం చాటేయడంతో తన డబ్బు తిరిగి ఇవ్వాలని, పెళ్లి చేసుకోవాలని పలుమార్లు ఆయనను ఫోన్‌లో నిలదీయడంతో మనం కలిసి ఉన్నప్పుడు తీసిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో పెడతానని బెదిరించాడు. దీంతో బాధితురాలు ఈనెల 14న బేగంపేట పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

 

విభిన్న కథతో.

విభిన్న కథతో

 

shine junior college

 

‘అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండ్‌’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన సుహాస్‌, శివానీ నగరం మరోసారి జంటగా తెరపై కనిపించనున్నారు. వీర్దిద్దరూ కలసి…

‘అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండ్‌’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన సుహాస్‌, శివానీ నగరం మరోసారి జంటగా తెరపై కనిపించనున్నారు. వీర్దిద్దరూ కలసి నటించనున్న కొత్త చిత్రం సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. గోపీ అచ్చర ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. త్రిశూల్‌ విజనరీ స్టూడియోస్‌ బ్యానర్‌పై నరేంద్ర రెడ్డి నిర్మిస్తున్నారు. ముహూర్తం షాట్‌కు సత్యదేవ్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, నాగ్‌ అశ్విన్‌ క్లాప్‌ కొట్టారు. వంశీ నందిపాటి ఫస్ట్‌ షాట్‌కు దర్శకత్వం వహించారు. విభిన్న కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని మేకర్స్‌ తెలిపారు. షణ్ముఖ ప్రశాంత్‌ ఈ చిత్రానికి కథను అందించారు. 

డీసీఎంఎస్ చెర్మన్ శివకుమార్ గారికి ఘనంగా స్వాగతం.

ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చెర్మన్ శివకుమార్ గారికి ఘనంగా స్వాగతం పలికిన మెదపల్లి తాజా మాజీ సర్పంచ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

shine junior college

ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ గారు భారత రాష్ట సమితి రజతోత్సవం లో భాగంగా బి ఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు ఆదేశానుసారం అమెరికాలో జరిగిన రజతోత్సవంలో భాగంగా పాల్గొని తిరిగి స్వదేశానికి విచ్చేసిన సందర్భంగా మెదపల్లి తాజా మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్ మరియు ,ఝరాసంగం మండల బి ఆర్ యస్ పార్టీ యువనాయకులు sk షోయల్ ఘనంగా స్వాగతం పలకడం జరిగింది .ఇట్టి కార్యక్రమం లో జహీరాబాద్ మాజీ ఎంపీపీ విజయకుమార్.
ఝరసంగం మండల బి ఆర్ యస్ పార్టీ ఉపాధ్యక్షులు మాణికప్రభు పాటిల్ .యువనాయకులు నవీన్ పాటిల్ శివకుమార్ .సంగారెడ్డి జిల్లా వీరశైవ లింగాయత్ యువజన సంయుక్త కార్యదర్శి పోలీస్ ప్రవీణ్ పాటిల్.తదితరులు పాల్గొన్నారు.

అర్ధాంతరంగా అమెరికాకు ట్రంప్

అర్ధాంతరంగా అమెరికాకు ట్రంప్

 

 

shine junior college

 

అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తన కెనడా పర్యటనను అర్ధాంతరంగా ముగించుకున్నారు. ఆయన అమెరికా బయలుదేరి వెళ్లనున్నారు.

కెనడా పర్యటనలో ఉన్న అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పర్యటనను కుదించుకున్నారు. జీ 7 సదస్సులో పాల్గొన్న ఆయన వెంటనే ఆమెరికాకు బయలుదేరేందుకు సమాయత్తమవుతున్నారు. అమెరికా చేరుకున్న వెంటనే భద్రతా మండలితో అత్యసవర సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు వైట్ హౌస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయన ఈ పర్యటనను కుదించుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఈ యుద్ధం ముగించాలని ఇప్పటికే జీ 7 సదస్సులో పాల్గొన్న నేతలు పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే.
మరోవైపు.. అమెరికా రాగానే ట్రంప్ పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. భద్రతా సలహాదారులతో ఆయన అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. అందుకోసం వైట్‌హౌస సిచ్యుయేషన్ రూమ్‌లో సిద్ధంగా ఉండాలని భద్రతా మండలి అధికారులను ఆదేశించారు. ఇజ్రాయెల్, ఇరాన్ ఉద్రికత్తలకు సంబంధించి ట్రంప్ కీలక ప్రకటన లేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకోవైపు ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని పౌరులను వెంటనే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలంటూ ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అమెరికా సైతం ప్రత్యక్ష దాడులు జరిపే అవకాశముందని తెలుస్తోంది.

రెగ్యులర్‌ షూట్‌ షురూ.

రెగ్యులర్‌ షూట్‌ షురూ

 

shine junior college

 

 

రవితేజ కథానాయకుడిగా కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో ఇటీవలె ఓ చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ‘ఆర్‌టీ 76’ వర్కింగ్‌ టైటిల్‌…

రవితేజ కథానాయకుడిగా కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో ఇటీవలె ఓ చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ‘ఆర్‌టీ 76’ వర్కింగ్‌ టైటిల్‌. సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. సోమవారం రెగ్యులర్‌ షూట్‌ను మొదలెట్టారు. హైదరాబాద్‌లో నిర్మించిన ఓ ప్రత్యేక సెట్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందులో రవితేజతో పాటు ఇతర తారాగణం పాల్గొంటున్నారు. ఇది రవితేజ మార్క్‌ కామెడీతో పూర్తి స్థాయి కుటుంబ కథా చిత్రంగా ఉండనుంది. ఇందులో ఆయన సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్‌. ఈ చిత్రానికి ఎడిటింగ్‌: శ్రీకర్‌ ప్రసాద్‌, డీఓపీ: ప్రసాద్‌ మూరెళ్ల, సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో.

రైతు నేస్తం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా.

రైతు నేస్తం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా,

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

shine junior college

 

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల కోసం రూపొందించిన ‘రైతునేస్తం’ కార్యక్రమం సోమవారం సాయంత్రం 4 గంటలకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 566 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం కల్పించబడి ఉండగా, తాజాగా మరో 1,034 వేదికల్లో ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. ఈ కార్యక్రమాన్ని ఝరాసంగం మరియు కప్పుడ్ రైతు వేదిక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులు వీక్షించడం జరిగింది.

దీనిలో భాగంగా ప్రస్తుతం మండలానికి ఒక రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ఉండగా దీనికి అదనంగా తాజాగా మండలానికి మరో 2 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం కల్పించి ప్రతీ మంగళవారం నిర్వహించే రైతునేస్తం ద్వారా శాస్త్రవేత్తలతో ముఖాముఖి, ఆదర్శరైతుల అనుభవాలు, కొత్త పంటల సాంకేతికతపై చర్చలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్టు స్థానిక వ్యవసాయ అధికారి వెంకటేశ్ వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి సుధాకర్, మండల అధ్యక్షులు హన్మంతరావు పాటిల్,ఆలయ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ పటేల్ ఛైర్మన్ , పాక్స్ చైర్మన్ గౌస్ ఉద్దీన్, మాజీ ఎంపీపీ దేవదాస్, వ్యవసాయ విస్తరణ అధికారులు సుకుమార్, సంపత్ కుమార్, ఙ్ఞానం, రేణుక, వేదవతి భారతి, హరికృష్ణ, తాజా మాజీ ప్రజాప్రతినిధులు
శ్రీకాంత్ రెడ్డి, మల్ల రెడ్డి, ఆరిఫ్, శ్రీనివాస్ రెడ్డి, స్వామి,ఇతర రైతులు పాల్గొన్నారు..

ఇల్లు కొంటున్నారా.. నాలాపై ఉందా చూడండి

ఇల్లు కొంటున్నారా.. నాలాపై ఉందా చూడండి

 

 

shine junior college

ఇల్లు కొనుగోలు చేసే సమయంలో చెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ తరహాలోనే నాలా ఆక్రమించి నిర్మాణం చేపట్టారా అన్నది కూడా చెక్‌ చేసుకోవాలని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ పౌరులకు సూచించారు.

హైదరాబాద్‌ సిటీ: ఇల్లు కొనుగోలు చేసే సమయంలో చెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ తరహాలోనే నాలా ఆక్రమించి నిర్మాణం చేపట్టారా అన్నది కూడా చెక్‌ చేసుకోవాలని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌(Hydra Commissioner AV Ranganath) పౌరులకు సూచించారు. బుద్ధభవన్‌లో సోమవారం జరిగిన ప్రజావాణిలో 47 ఫిర్యాదులు వచ్చాయి. మల్కాజ్‌గిరి, బాచుపల్లి, సికింద్రాబాద్‌(Malkajgiri, Bachupally, Secunderabad)లోని పద్మారావునగర్‌, మాదాపూర్‌ తదితర ప్రాంతాలకు చెందిన వారు నాలాల ఆక్రమణలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.
గ్రామ పంచాయతీ అనుమతితో లే అవుట్లు చేసి గతంలోనే విక్రయించిన స్థలాలకు వ్యవసాయ భూములంటూ తప్పుడు పాస్‌ పుస్తకాలతో కొందరు వ్యక్తులు కబ్జాకు ప్రయత్నిస్తున్నారని ప్లాట్ల యజమానులు రంగనాథ్‌ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ఆయన పాత లే అవుట్లలోని రహదారులు, పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కాపాడుతూనే అమాయకులు మోసపోకుండా చర్యలు తీసుకుంటున్నామని ఫిర్యాదుదారులకు భరోసానిచ్చారు.
AV Ranganath

ప్రజావాణికి దృష్టికి వచ్చిన కొన్ని ఫిర్యాదులు

– ఘట్‌కేసర్‌ మండలం పోచారం మునిసిపాలిటీ పరిధి కొర్రెముల గ్రామం సర్వే నంబర్‌ 739 నుంచి 749 వరకు ఉన్న 147 ఎకరాల్లో ఏకశిలానగర్‌ లే అవుట్‌ను 1985లో అభివృద్ధి చేశారు. 2006లో అందులోని 47 ఎకరాలను వ్యవసాయ భూమిగా చూపుతూ ఓ వ్యక్తి లే అవుట్‌ స్వరూపం మార్చారు. ఇదే లే అవుట్‌లో రెండు బడా రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు ప్రహరీలు నిర్మించి కొంత మేర కాజేశాయి.

– కొర్రెములలోని సర్వే నంబర్‌ 796లో 11.20 ఎకరాల భూమి ఉండగా, ఇందులో 7.20 ఎకరాల్లో మెడికల్‌ కళాశాల ఏర్పాటు చేశారు.

 

 

– పంజాగుట్ట ఆఫీసర్స్‌ కాలనీలో 1000 చ.గ పార్కు స్థలంలో సగం జాగాలో దుర్గాభవానీ ఆలయం నిర్మించారు. మిగతా 500 గజాల స్థలం కబ్జాకాకుండా పార్కు అభివృద్ధి చేయాలి.

– అల్వాల్‌ మండలం జొన్నబండ గ్రామంలోని వజ్ర ఎన్‌క్లేవ్‌లో 900 చ.గల పార్కు స్థలం కబ్జా అవుతోంది.

– తూముకుంట మునిసిపాలిటీ దేవరయాంజల్‌ గ్రామంలోని తురకొని కుంట శిఖం భూమిలో వేయింగ్‌ మిషన్‌ ఏర్పాటు చేస్తున్నారని సీతారామచంద్ర స్వామి దేవస్థానం భూముల పరిరక్షణ సమితి ప్రతినిధులు ఫిర్యాదు చేశారు.

టీ వై జె ఎఫ్ జర్నలిస్టు పిల్లలకు 100 శాతం ఫీజు రాయితీ.

టీ వై జె ఎఫ్ జర్నలిస్టు పిల్లలకు 100 శాతం ఫీజు రాయితీ

◆ టీ వై జె ఎఫ్ జహీరాబాద్ అధ్యక్షులు అనిల్ కుమార్

జహీరాబాద్ నేటి ధాత్రి:

shine junior college


సంగారెడ్డి/జహీరాబాద్:నిత్యం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు విద్యాసంస్థల్లో నూటికి నూరు శాతం ఫీజు రాయితీని కల్పించాలని ( టీ వై జె ఎఫ్) తెలంగాణ యూత్ జర్నలిస్టు ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు తనుగుల జితేందర్ రావు, ఆదేశాల మేరకు జహీరాబాద్ అధ్యక్షులు అనిల్ కుమార్, ఉపాధ్యక్షుడు నగేష్, ఆధ్వర్యంలో సోమవారం నాడు సంగారెడ్డిలో డిఈఓ వెంకటేశ్వర్లు ను కలిసి వినతి పత్రం సమర్పించారు. టీ వై జె ఎఫ్ జహీరాబాద్ అధ్యక్షులు అనిల్ కుమార్ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి తమ సంఘం పాటుపడుతుందని వివరించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలు కోసం జర్నలిస్టులు నిరంతరం కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో చాలామంది జర్నలిస్టులు తమ కుటుంబాన్ని కూడా పట్టించుకోవడంలేదని అన్నారు పేద మధ్యతరగతి వర్గాల వారే ఎక్కువమంది జర్నలిస్టులు ఉన్నారని చెప్పారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో వారి పిల్లలకు ఫీజు రాయితీ కల్పించడం ద్వారా ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. అంతేకాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా అర్హులైన వారికి అందించాలని విజ్ఞప్తి చేశారు. సంగారెడ్డి జిల్లాలో ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రైవేటు విద్యాసంస్థల్లో నూటికి నూరు శాతం ఫీజు రాయితీని జర్నలిస్టుల పిల్లలకు కల్పించాలని డీఈఓ ను కోరారు గతంలో కొందరు ప్రైవేటు విద్యాసంస్థలవారు డీఈవో ఉత్తర్వులను కూడా అమలు చేయలేదని ఆరోపించారు ఈసారి ఆ విధంగా కాకుండా కచ్చితంగా ప్రతి విద్యా సంస్థ వారు అమలు చేసే విధంగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు దీనికి డీఈఓ వెంకటేశ్వర్లు సానుకూలంగా స్పందించారు. జర్నలిస్టు పిల్లలకు నూటికి నూరు శాతం రాయితీని అందే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఝరాసంగం మండల టీ వై జె ఎఫ్ అధ్యక్షులు ఎర్రోళ్ల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

కోహీర్: కుళ్లిన శవం లభ్యం.

కోహీర్: కుళ్లిన శవం లభ్యం.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

shine junior college

 

కోహిర్ మండలం కొత్తూరు – బి గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై కుళ్లిన శవం లభ్యమైనట్లు ఎస్సై సోమవారం తెలిపారు.16.06.2025 నాడు మద్యాహ్నం 13.30 గంటలకు కొత్తూర్-డి గ్రామ శివారులో గల నేషనల్ హైవే-65 రోడ్డు పక్కన గల పొదలలో ఒక మగ మనిషి శవం కుళ్లిన స్తితిలో ఉన్నది, అతని వయస్సు అందజ 40-45 సం,ల మద్యన ఉంటుంది, అతడి శరీరం మీద ఎరుపు మరియు నలుపు గెత్తల షర్ట్, బ్రౌన్ కలర్ బనియన్ దరించి దాని మీద “S” అని, షర్ట్ కాలర్ పట్టి మీద మరియు బటన్స్ కింద “హై డిమాండ్ ప్రీమియం షైర్ట్స్” అనే స్టికర్ ఉంది, ఎవరైనా ఈ వ్యక్తిని గుర్తిస్తే ఈ దిగువన ఉన్న ఫోన్ నంబర్స్ కి కాంటాక్ట్ చేయగలని అన్నారు.
DSP Zaheerabad – 8712656708
CIP Zaheerabad Town – 8712656731
SIP Kohir – 8712656765

రెచ్చిపోతున్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్

రెచ్చిపోతున్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్

 

కేవలం నెల రోజుల వ్యవథిలో అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూర్చిన నాలుగు సినిమాల నుండి నాలుగు సింగిల్స్ రాబోతున్నాయి.

ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్ (Anirudh Ravichander) ఓ యువ సంచలనం. యుక్త వయసులోని చిత్రసీమలోకి అడుగుపెట్టి సంగీత దర్శకుడిగా తన సత్తాను చాటుకుంటున్నాడు. కోలీవుడ్ లోని స్టార్స్ తో అతనికి అనుబంధం ఉన్నా… తన ప్రతిభతోనే అతను ప్రయాణాన్ని కొనసాగిస్తూ ముందుకు వెళుతున్నాడు. వచ్చిన అవకాశాలను జాగ్రత్తగా ఒడిసిపట్టుకుని, తనకంటూ ఓ ప్రత్యేక మార్గాన్ని క్రియేట్ చేసుకున్నాడు.
shine junior college
విశేషం ఏమంటే… జూన్ మాసం అనిరుధ్‌ దే అని కోలీవుడ్, టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అతను సంగీతాన్ని సమకూర్చుతున్న నాలుగు సినిమాలకు సంబంధించిన నాలుగు సింగిల్స్ ఈ నెల రోజుల వ్యవధిలో సంగీత ప్రియులను అలరించబోతున్నాయి.
సౌతిండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) ‘కూలీ’ చిత్రానికి అనిరుధ్‌ స్వరాలు సమకూర్చుతున్నాడు. ఈ సినిమా ఆగస్ట్ 14న విడుదల కాబోతోంది. ఈ మూవీ నుండి ఇప్పటికే చికితూ వైబ్, పవర్ హౌస్ ట్రాక్ విడుదలై సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి. ఈ వారంలో చికితూ వైబ్ ఫుల్ వర్షెన్ ను విడుదల చేయబోతున్నారు. ఇందులో రజనీకాంత్ తన ట్రేడ్ మార్క్ స్టైల్ లో కనిపించబోతున్నాడు. ఈ ట్యూన్ ను శింబు తండ్రి టి. రాజేందర్ మూవీ నుండి తీసుకున్నారట. అలానే అనిరుథ్‌… విజయ్ (Vijay) నటిస్తున్న పొలిటికల్ డ్రామా ‘జన నాయగన్’కూ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. విజయ్ పుట్టిన రోజు జూన్ 22ను పురస్కరించుకని ఈ సినిమా నుండి ఓ గ్లిమ్స్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఇందులో బ్యాక్ గ్రౌండ్ సాంగ్ ఒకటి ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా దర్శకుడు హెచ్. వినోద్… తెలుగు సినిమా ‘భగవంత్ కేసరి’ నుండి స్ఫూర్తి పొంది తీస్తున్నట్టు సమాచారం.
అలానే ప్రముఖ దర్శకుడు ఎ.ఆర్. మురుగదాస్ ప్రస్తుతం శివ కార్తికేయన్ (Siva Karthikeyan) తో ‘మదరాసి’ మూవీని తీస్తున్నాడు. ఈ యాక్షన్ డ్రామాకూ అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నాడు. సెప్టెంబర్ 5న ఈ సినిమా విడుదల కాబోతోంది. అయితే ఈ మూవీని నుండి ఇదేవారం ఫస్ట్ సింగిల్ ను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట.
ఇక అనిరుధ్‌ సంగీతం అందిస్తున్న మరో తెలుగు సినిమా విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) నటించిన ‘కింగ్ డమ్’. ఈ మూవీ నిజానికి మే 30న విడుదల కావాల్సింది. అయితే అనివార్య పరిస్థితుల్లో వాయిదా పడింది. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ఆల్ రెడీ గత నెల విడుదలై సూపర్ రెస్పాన్స్ ను అందుకుంది. అయితే ఈ నెల చివరాఖరు లేదా ఆగస్ట్ మొదటి వారంలో ‘కింగ్ డమ్’ నుండి సెకండ్ సింగిల్ ను విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. ఈ రకంగా అనిరుధ్‌ స్వరాలు సమకూర్చిన ‘కూలీ, జన నాయగన్, మదరాసి, కింగ్ డమ్’ చిత్రాలకు సంబంధించిన సింగిల్స్ ఒకే నెల వ్యవధిలో రాబోతున్నాయి. మరి అనిరుథ్‌ తన మ్యాజికల్ మ్యూజిక్ తో ఈ సినిమాలను ఏ విధంగా విజయతీరాలకు చేర్చుతాడో చూడాలి.

తేనెకళ్ల సుందరి మోనాలిసా సాంగ్ అదుర్స్…

తేనెకళ్ల సుందరి మోనాలిసా సాంగ్ అదుర్స్…

 

అమ్మో అమ్మాయేనా… ఎల్లోరా శిల్పమా అని పాడుకుంటున్నారు ఆ అమ్మడిని చూసి నెటిజన్లు. అమ్మడికి పట్టిన అదృష్టాన్ని చూసి కొందరు మధ్యలో ట్రోల్ చేశారు కానీ రీసెంట్ గా వదిలిన శాంపిల్ ను చూసి నోరెళ్ల బెడుతున్నారు. అవమానించిన వాళ్లే ఔరా అంటున్నారు. ఇంతకీ ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా… మోనాలిసా గురించి.

 

shine junior college
మహా కుంభమేళ 2025లో ఒక్కసారిగా సోషల్ మీడియాని షేక్ చేసిన అమ్మాయి మోనాలిసా భోంస్లే (Monalisa). ఈ 16 ఏళ్ల మధ్యప్రదేశ్ బ్యూటీ, ప్రయాగ్‌రాజ్‌లో రుద్రాక్ష మాలలు, పూసల దండలు అమ్ముతూ ఉండగా, ఒక నెటిజన్ తీసిన వీడియోతో రాత్రికి రాత్రే వైరల్ అయ్యింది. ఆమె ఆకర్షణీయమైన తేనెకళ్లు, చిరునవ్వు, సింపుల్‌గా ఉండే స్వచ్ఛమైన అందంతో నెట్టింట్లో స్టార్ అయిపోయింది. జాతరలో పూసలు అమ్మే అమ్మాయి నుంచి ఓవర్‌నైట్ సెన్సేషన్‌గా మారింది. బాలీవుడ్ లో  ఛాన్స్ కొట్టేసింది కానీ సినిమా తెరపైకి వచ్చేందుకు టైం పట్టేలా ఉంది. ఆ లోపు అమ్మడు మరోసారి ట్రెండింగ్ లో నిలిచింది.

ఈ భామ ఇటీవల ఒక మ్యూజిక్ వీడియోలో నటించింది. అది రీసెంట్ గా యూట్యూబ్‌లో రిలీజ్ అయ్యి రచ్చ చేస్తోంది. ఉత్కర్ష్ సింగ్‌ (Utkarsh Singh)తో కలిసి మోనాలిసా ఆ సాంగ్‌లో ఎంబ్రాయిడరీ లెహంగా, క్లాసీ జ్యువెలరీతో ఫుల్ స్టన్నింగ్‌గా కనిపించింది. ఆమె డాన్స్, ఎక్స్‌ప్రెషన్స్ చూసి ఫ్యాన్స్ ఫ్లాట్  అవుతున్నారు. ఈ అమ్మాయి… హీరోయిన్స్‌కి ఏం తక్కువ అంటూ  కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. అంతేకాదు.. ఈ సాంగ్‌ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానులు తెగ చూసేస్తున్నారు.

Monalisa

సనోజ్ మిశ్రా (Sanoj Mishra) డైరెక్ట్  చేస్తున్న హిందీ సినిమాలో ఈ భామ లీడ్ రోల్‌లో కనిపించబోతోంది. యాక్టింగ్ స్కిల్స్ పెంచుకోవడానికి ఫుల్ ట్రైనింగ్ తీసుకుంటూ, సినిమా ఎంట్రీ కోసం ఎగ్జైట్‌మెంట్‌తో ఎదురుచూస్తోంది. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసిన ‘సాద్గి’ సాంగ్ లింక్‌కి లైక్స్, కామెంట్స్ జోరు చూస్తే, ఆమె క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థమవుతుంది. పూసల అమ్మాయి నుంచి కలల రాణిగా మారిన మోనాలిసా జర్నీ చూస్తే, ఎవరైనా సరే అవకాశం వస్తే ఆకాశం అందుకోవచ్చని నిరూపించేలా ఉంది. ఇక ఇప్పుడు ఈ భామ సినిమా రంగంలో ఎలా రాణిస్తుందో చూడాలి!

కన్నప్ప కు రజనీ అభినందనలు.

కన్నప్ప కు రజనీ అభినందనలు…

 

shine junior college

దిగ్గజ నటులు రజనీకాంత్‌, మోహన్‌బాబు కలసి నటించిన ‘పెదరాయుడు’ విడుదలై 30 ఏళ్లు పూర్తయ్యాయి. 1995 జూన్‌ 15న విడుదలైన ఆ చిత్రం సంచలన…

దిగ్గజ నటులు రజనీకాంత్‌, మోహన్‌బాబు కలసి నటించిన ‘పెదరాయుడు’ విడుదలై 30 ఏళ్లు పూర్తయ్యాయి. 1995 జూన్‌ 15న విడుదలైన ఆ చిత్రం సంచలన విజయం సాధించి, వసూళ్ల చరిత్రలో సరికొత్త అధ్యాయం సృష్టించింది. ఈ నేపథ్యంలో ఆదివారం రజనీకాంత్‌ ఇంట్లో ఆయన్ని కలిశారు మోహన్‌బాబు. నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఈ క్రమంలోనే మోహన్‌బాబు నిర్మించిన ‘కన్నప్ప’ చిత్రాన్ని రజనీకాంత్‌ చూశారు. విష్ణుని అక్కున చేర్చుకుని సినిమా బాగుందంటూ అభినందించారు. ఈ ఆనందాన్ని ఎక్స్‌ వేదికగా పంచుకున్నారు విష్ణు. ‘ఈ క్షణం కోసమే 22 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను. నా నటనని రజనీ అంకుల్‌ మెచ్చుకోవాలని నా కల. అది ఇప్పుడు నెరవేరింది. ఈ రోజు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది’ అని అందులో పేర్కొన్నారు. అలాగే మోహన్‌బాబు కూడా సోషల్‌ మీడియా వేదికగా స్పందిస్తూ ‘ నేను నిర్మించిన ‘పెదరాయుడు’ చిత్రానికి 30 ఏళ్లు పూర్తైన రోజునే నా ప్రియ మిత్రుడు రజనీకాంత్‌ ‘కన్నప్ప’ చిత్రాన్ని తన కుటుంబ సభ్యులతో కలసి చూశారు. సినిమా చూసిన అనంతరం ఆయన కురిపించిన ప్రేమ, అభిమానం, ప్రశంసలు, ఇచ్చిన ప్రోత్సాహం ఎప్పటికీ మరచిపోలేను. థాంక్యూ మిత్రమా’ అని పేర్కొన్నారు. ‘కన్నప్ప’ చిత్రం ఈ నెల 27న విడుదలవుతోంది.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version