భారీ వర్షాలు: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – బిఆర్ఎస్ నాయకుడు
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం బిఆర్ఎస్ పార్టీ మెదపల్లి మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పటేల్,ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరారు.
వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నందున ఇళ్ల నుండి బయటకు వెళ్లవద్దని, రైతులు వ్యవసాయ బోర్ల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరెంటు స్తంభాలను తాకరాదని, ముఖ్యంగా చిన్న పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, గణేష్ మంటపాల వద్ద కూడా తగు జాగ్రత్తలు పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.