మెట్ పల్లి అక్టోబర్ 10 నేటి ధాత్రి
దసరా పండుగ సందర్భంగా గోషా మహల్ శాసనసభ్యుడు రాజా సింగ్ మహమ్మద్ ప్రవక్త ముస్లిం ల పట్ల అనుచిత వాక్యాలు చేయడం జరిగింది. ఆయన వాక్యాలు యావత్ ముస్లిం ప్రజలకు బాద కలిగించే విధంగా ఉన్నాయి. అంతే కాకుండా మత విద్వేషాలను రెచ్చ గొట్టే విధంగా ఉన్నాయి. ఆయనపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలి.
కావున మాయందు దయతలచి మహమ్మద్ ప్రవక్త ముస్లిం ల పట్ల అనుచిత వాక్యాలు చేసిన గోషా మహల్ శాసనసభ్యుడు రాజా సింగ్ పై తగు చట్టరీత్యా చర్యలు తీసుకోగలరని తమరిని సవినయంగా ప్రార్థిస్తున్నాము.
మెటుపల్లి పట్టణ ముస్లిం ప్రజలు.
