వైసీపీకి బిగ్ షాక్.. కాకాని గోవర్ధన్ రెడ్డిపై మరో కేసు..

వైసీపీకి బిగ్ షాక్.. కాకాని గోవర్ధన్ రెడ్డిపై మరో కేసు

 

మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో బిగ్ షాక్ తగిలింది. వెంకటాచలం పోలీస్ స్టేషన్‌లో ఇవాళ(ఆదివారం) మరో కేసు నమోదు చేశారు.

 మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి (Kakani Govardhan Reddy) మరో బిగ్ షాక్ తగిలింది. వెంకటాచలం పోలీస్ స్టేషన్‌లో కాకణిపై ఇవాళ(ఆదివారం) మరో కేసు నమోదు చేశారు. మాజీమంత్రి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కాకాని పరుష పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేశారని చవటపాలెం సొసైటీ చైర్మన్ రావూరు రాధాకృష్ణ నాయుడు వెంకటాచలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు కాకణిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

నకిలీ మద్యం కేసుల్లో కీలక ఫైళ్లు..

మరోవైపు.. మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి నకిలీ మద్యం కేసుల్లో కీలక ఫైళ్లు మాయం అయ్యాయి. 2014 ఎన్నికల్లో గోవా నుంచి నకిలీ మద్యానికి లేబుళ్లు వేసి, ఓటర్లకు పంపిణీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. నకిలీ మద్యం తాగి అపట్లో పలువురు మృతిచెందగా… వందలాది మంది తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. 2018లోనే కొన్ని కీలక ఫైళ్లు మిస్ అయినట్లుగా విజయవాడ ప్రత్యేక కోర్టు నిర్ధారించింది. ఈ క్రమంలో సీఐడీకి కేసును అప్పగించింది న్యాయస్థానం. 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో ఈ కేసు దర్యాప్తు చేయలేదు. ప్రస్తుతం మళ్లీ తెరపైకి ఈ కేసు వచ్చింది. ఈ కేసును నీరుగార్చేందుకే కీలక‌ ఫైళ్లు మాయం చేశారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

బెంగళూరులో దారుణం.. సీనియర్‌ విద్యార్థినిపై కాలేజ్ స్టూడెంట్ అత్యాచారం…

బెంగళూరులో దారుణం.. సీనియర్‌ విద్యార్థినిపై కాలేజ్ స్టూడెంట్ అత్యాచారం!

 

బెంగళూరులో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఇంజినీరింగ్ చదువుతున్న ఓ విద్యార్థినిపై ఆమె జూనియర్ అత్యాచారానికి ఒడిగట్టాడు. పోలీసులు నిందితుడిని తాజాగా అదుపులోకి తీసుకున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: బెంగళూరులో తాజాగా దారుణం వెలుగు చూసింది. ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీ స్టూడెంట్ తనకు సీనియర్ అయిన విద్యార్థినిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. నిందితుడిని జీవన్ గౌడగా పోలీసులు గుర్తించారు. తాజాగా అతడిని అరెస్టు చేశారు (Bengaluru Engineering Student Violated).

ఎఫ్‌ఐఆర్‌లోని వివరాల ప్రకారం, బాధితురాలు బీటెక్ చదువుతోంది (7వ సెమెస్టర్). ఆమెకు జీవన్‌తో మూడు నెలల క్రితమే పరిచయం ఏర్పడింది. అక్టోబర్ 10న లంచ్ సమయంలో అతడు బాధితురాలికి పలుమార్లు కాల్ చేసి ఆర్కిటెక్చర్ బ్లాక్ వద్ద కలుద్దామని చెప్పాడు. అక్కడకు వెళ్లిన ఆమెకు బలవంతంగా ముద్దు పెట్టాడు. ఆపై వాష్‌రూమ్‌లోకి లాక్కెళ్లి తలుపులు వేసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అక్కడి నుంచి తప్పించుకున్న బాధితురాలు జరిగిన దారుణం గురించి మొదట స్నేహితులకు చెప్పింది. అనంతరం, తల్లిదండ్రులకు తెలిపింది. ఈ ఘటనకు సంబంధించి అక్టోబర్ 15న పోలీసులకు ఫిర్యాదు అందింది.

దారుణానికి ఒడిగట్టిన తరువాత నిందితుడు ఆమెకు కాల్ చేసి గర్భనిరోధక మాత్ర కావాలా? అని అడిగినట్టు పోలీసులు తెలిపారు. భవనంలో ఘటన జరిగిన అంతస్తుకు సంబంధించి సీసీటీవీ కెమెరా ఫుటేజీ లేదని తెలిపారు. అయితే, డిజిటల్, ఇతర ఫిజికల్ ఆధారాలను ఫారెన్సిక్ బృందాలు పరిశీలిస్తున్నట్టు తెలిపారు.

నగరంలో ఆగస్టులో వెలుగు చూసిన మరో ఘటనలో పేయింగ్ గెస్టు హాస్టల్‌లో ఉంటున్న కాలేజీ విద్యార్థినిపై ఓనర్ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. రాత్రి సమయంలో కారులో ఆమెను బలవంతంగా నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు అష్రాఫ్‌ను అరెస్టు చేశారు.

ఇక కోల్‌కతాలోని దుర్గాపూర్‌లో ఇటీవల వెలుగుచూసిన అత్యాచర ఘటనలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంజినీరింగ్ చదువుతున్న యువతిపై ఆమె క్లాస్‌మెట్‌యే ఈ దారుణానికి పాల్పడ్డాడు. తనకు మత్తు మందు ఇచ్చి అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

అమిత్‌షాపై అభ్యంతకర వ్యాఖ్యలు.

 అమిత్‌షాపై అభ్యంతకర వ్యాఖ్యలు.. మహువా మొయిత్రాపై ఎఫ్ఐఆర్

 

అమిత్‌షాపై మహువా మొయిత్రా వ్యక్తిగత విమర్శలకు దిగారు. బంగ్లాదేశ్‌ నుంచి చొరబాట్లను అడ్డుకోవడంలో షా విఫలమయ్యారన్నారు. ఆయన తలను నరికి బల్లపై పెట్టాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

రాయపూర్: కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit shah)పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra)పై ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్‌లో ఎఫ్ఐఆర్ (FIR) నమోదైంది.

స్థానికుడు ఒకరు చేసిన ఫిర్యాదుపై మనా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైనట్టు పోలీసులు తెలిపారు. భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 196, సెక్షన్ 197 కింద ఆమెపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. దీనికి ముందు పశ్చిమబెంగాల్‌లోని కృష్ణానగర్‌లో పోలీసులకు బీజేపీ ఫిర్యాదు చేసింది. మహువా అసహ్యకరమైన, ద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించింది. ఇదే టీఎంసీ వైఖరా అని ప్రశ్నించింది. అయితే మహువా వ్యాఖ్యలపై టీఎంసీ అధికారికంగా స్పందించలేదు.నదియా జిల్లాలో గత గరువారంనాడు ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మహువా మొయిత్రా పాత్రికేయులతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం సరిహద్దు భద్రత విషయంలో తన బాధ్యతల నుంచి తప్పించుకుంటోందన్నారు. ఈ సందర్భంగా అమిత్‌షాపై వ్యక్తిగత విమర్శలకు దిగారు. బంగ్లాదేశ్‌ నుంచి చొరబాట్లను అడ్డుకోవడంలో షా విఫలమయ్యారన్నారు. ఆయన తలను నరికి బల్లపై పెట్టాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘మన సరిహద్దులను కాపాడటానికి ఎవరూ లేకపోతే, వేరే దేశం నుంచి ప్రతి రోజూ ప్రజలు ప్రవేశిస్తుంటే, చొరబాటుదారులు మన తల్లులు, సోదరీమణులపై కన్నేయడంతోపాటు మన భూములను లాక్కుంటున్నారని మన దేశ పౌరులు ఫిర్యాదు చేస్తుంటే.. మొదట మీరు అమిత్‌షా తల నరికి బల్లపై పెట్టాలి’ అని వ్యాఖ్యానించారు.

 

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version