రోడ్డు భద్రత అందరి బాధ్యత..!- ప్రతిజ్ఞ..

రోడ్డు భద్రత అందరి బాధ్యత..!– ప్రతిజ్ఞ..
సిఐ డి మల్లేశం ఎస్సై ముప్పు సురేష్
(నేటి ధాత్రి): మొగులపల్లి

రోడ్డుపై ప్రయాణించే ప్రతి వాహనదారుడు సామాజిక బాధ్యతగా భద్రత చర్యలు తీసుకోవాలని చిట్యాల సిఐ డి మల్లేశం ఎస్సై ముప్పు సురేష్ అన్నారు. భూపాలపల్లిజిల్లా మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక, 99 రోజుల రహదారి భద్రత… వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వాహనదారులందరూ భద్రత ప్రమాణాలను పాటించాలన్నారు. హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం, నిదానంగా ప్రయాణించడం, రోడ్డు భద్రత సూచనలు పాటించాలన్నారు. సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు.. ప్రమాద రహిత సమాజం కోసం కృషి చేయాలని కోరారు. ప్రాణాలు అమూల్యమైనవని, ప్రమాదాల నివారణను సామాజిక బాధ్యతగా స్వీకరించాలన్నారు. ఎవరికివారు జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలు జరగవని, మద్యం తాగి వాహనాలను నడపవద్దని ఆయన సూచించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ జయంతి సందర్భంగా వచ్చిన వారితోవాహనదారులతో ప్రతిజ్ఞ చేయించారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. వారితో కలిసి అంబేద్కర్ స్టార్చ్ నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ చాట్ల విజయ రవీందర్ మాజీ సొసైటీ చైర్మన్ సంపెల్లి నరసింగరావు చిట్యాల మార్కెట్ వైస్ చైర్మన్ మహమ్మద్ రఫీ మాజీ సర్పంచ్ మోటే ధర్మారావు జిల్లా నాయకులు తక్కల్లపల్లి రాజు వివిధ పార్టీల నాయకులుపోలీస్ సిబ్బందిపాల్గొన్నారు.

మద్యం,గుట్కా చెడు అలవాట్లపై అవగాహనా….

మద్యం,గుట్కా చెడు అలవాట్లపై అవగాహనా

గుండాల,నేటిధాత్రి :

దామరతోగు గ్రామంలో గ్రామోత్సవ సభ నిర్వహించారు .ఈ కార్యక్రమంలో గుండాల సీఐ తిరుపతి,ఎస్సై సైదా రహూఫ్ పోలీస్ సిబ్బంది, గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డ్ మెంబర్లు, పంచాయతీ సిబ్బంది మరియు సుమారు 80 మంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ఎస్సై రహూఫ్ మాట్లాడుతూ గ్రామం వెనుకబడటానికి గల ముఖ్య కారణాలను వివరించి, యువత అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, మద్యం మరియు గుట్కా వంటి చెడు అలవాట్లకు అలవాటు పడవద్దని సూచించారు. అనంతరం సీఐ తిరుపతి మాట్లాడుతూ గత పరిస్థితులతో పోలిస్తే ప్రస్తుత పరిస్థితులు మెరుగుపడ్డాయని, విద్యపై దృష్టి పెట్టాలని, పోలీస్ శాఖ నుండి అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా మండలానికి చెందిన కష్టపడి ప్రభుత్వ ఉద్యోగం (కానిస్టేబుల్) సాధించిన బాలరాజు మరియు కిరణ్‌లను శాలువా కప్పి సన్మానించారు.

రోడ్డు భద్రత పై అవగాహన సదస్సు

రోడ్డు భద్రత పై అవగాహన సదస్సు

జైపూర్, నేటిధాత్రి:

 

మైనర్‌లకు వాహనాలు ఇవ్వరాదు

సురక్షిత ప్రయాణం ప్రతి ఒక్కరి బాధ్యత…సీపీ అంబర్ కిషోర్ ఝా

జైపూర్ మండల కేంద్రంలోని దుబ్బ పల్లి ఫంక్షన్ హాల్ వద్ద రోడ్డు భద్రతపై డ్రైవర్లకు అవగాహన కల్పించి కంటి పరీక్షలు నిర్వహించారు.
రోడ్డు ప్రమాదాల నివారణ, వాహనదారులు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవడం ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం,తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు చేపట్టిన“అరైవ్ అలైవ్ ఫేజ్-3” కార్యక్రమంలో భాగంగా సోమవారం జైపూర్ పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా,మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ,రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన“అరైవ్ అలైవ్”కార్యక్రమం ద్వారా ప్రజల్లో రోడ్డుభద్రతపై అవగాహన పెంపొందించడం లక్ష్యమని తెలిపారు.ప్రజా ప్రగతి ప్రణాళికలో భాగంగా ట్రాఫిక్ నియమాలపై అవగాహన సదస్సులు,కంటి వైద్య శిబిరాలు,ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమానికి హాజరైన యువకులు, కార్మికులు,విద్యార్థులు రోడ్డు భద్రతపై తెలుసుకున్న విషయాలను తమ గ్రామాలు,కాలనీలు, స్నేహితులు,కుటుంబ సభ్యులకు,సహచరులకు తెలియజేసే దూతలుగా మారాలని సూచించారు.ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించేలా చైతన్యవంతం చేయడం సామాజిక బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.మద్యం సేవించి వాహనాలు నడపకూడదని,హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని స్పష్టం చేశారు.మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని హెచ్చరిస్తూ,వారి భవిష్యత్తు దృష్ట్యా తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.రాత్రి సమయంలో డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని,రోడ్డుపై నడిచే వారిని గమనిస్తూ వాహనాలు నడపాలని సూచించారు.కనీస జాగ్రత్తలు పాటిస్తే రోడ్డుప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు.ప్రతి ఒక్కరి సహకారంతో రామగుండం కమిషనరేట్‌ను ప్రమాదరహిత ప్రాంతంగా మార్చాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు,జైపూర్ సీఐ నవీన్,చెన్నూర్ టౌన్ సీఐ బన్సీలాల్,చెన్నూర్ రూరల్ సీఐ కృష్ణ,జైపూర్ ఎస్సై రాజశేఖర్,శ్రీరాంపూర్ ఎస్సై సంతోష్,భీమారం ఎస్సై రాజేందర్ పోలీస్ అధికారులు,సిబ్బంది,ప్రజలు యువత పాల్గొన్నారు.

ఝరాసంగంలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం

రోడ్డు భద్రత మన అందరి బాధ్యత:ఝరాసంగం పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండల కప్పాడ్ గ్రామ చౌరస్తా దగ్గర
ఝరాసంగం పోలీసుల ఆధ్వర్యంలో,సీఐ హనుమంతు మరియు ఎస్సై క్రాంతి కుమార్ పటేల్ మరియు నాయకత్వంలో “ప్రాణాలతో చేరుకుందాం – రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం”ను విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం రోడ్డు ప్రమాదాలను నివారించడం మరియు ప్రజల్లో రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పించడం.ఈ సందర్భంగా విద్యార్థులు, ద్విచక్ర వాహనదారులు, ఆటో రిక్షా డ్రైవర్లు, కార్ డ్రైవర్లు మరియు సాధారణ ప్రజలకు రోడ్డు భద్రత నిబంధనలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి, నాలుగు చక్రాల వాహనాల్లో సీటు బెల్టు వినియోగించాలి, మద్యం సేవించి వాహనం నడపకూడదు, వాహనం నడుపుతున్న సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగించకూడదని స్పష్టంగా వివరించారు.అలాగే వేగ నియంత్రణ పాటించడం ఎంత ముఖ్యమో, పాదచారులకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి వాహనదారుడిపై ఉందని తెలియజేశారు. మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని తల్లిదండ్రులకు హెచ్చరిక జారీ చేశారు. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు, ప్రాణనష్టానికి దారి తీస్తుందని తెలిపారు.రోడ్డు భద్రత నిబంధనల ఉల్లంఘన చట్టపరమైన చర్యలకు మాత్రమే కాకుండా అమూల్యమైన ప్రాణాల నష్టానికి కారణమవుతుందని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం ద్వారా “రోడ్డు భద్రత మన అందరి బాధ్యత” అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు.ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించి, తమతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడుకోవచ్చని పోలీసులు ప్రజలకు సూచించారు. అవగాహన కార్యక్రమం లో కప్పడ్ మాజీ సర్పంచ్ నందప్ప పటేల్ మాజీ ఎంపీటీసీ మహేందర్ గారు సర్పంచ్ కీర్తన ప్రభాకర్ మాకు ఉప సర్పంచ్ ఇస్మాయిల్ సాబ్ మరియూ గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది,

నెక్కొండలో రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం

రోడ్ సేఫ్టీ పాటిస్తేనే ప్రమాదాల నివారణ

#నెక్కొండ, నేటి ధాత్రి:

 

రోడ్ సేఫ్టీ వార్షికోత్సవాల్లో భాగంగా నెక్కొండ మండలంలో వాహనదారులకు, ఆటో డ్రైవర్లకు,అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట ఏసీపీ పి. రవీందర్ రెడ్డి, నెక్కొండ సీ ఐ సన్నాయిల శ్రీనివాస్, ఎస్సై మహేందర్,మోటార్ వెహికల్ సబ్ ఇన్‌స్పెక్టర్ నరేందర్, నెక్కొండ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సమావేశానికి నెక్కొండ మండలానికి చెందిన ఆటో డ్రైవర్లు, జీప్ డ్రైవర్లు, స్కూల్ బస్సుల డ్రైవర్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏసీపీ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలు మానవ తప్పిదాల వల్లే ఎక్కువగా జరుగుతున్నాయని, మద్యం సేవించి వాహనాలు నడపడం, ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్ వంటి అలవాట్లను పూర్తిగా విడిచిపెట్టాలని సూచించారు. ప్రతి వాహనదారుడు లైసెన్స్, వాహన బీమా తప్పనిసరిగా కలిగి ఉండాలని, అధిక ప్రయాణికులతో వాహనాలు నడపరాదని తెలిపారు.
రోడ్ సేఫ్టీని పాటించడం చట్టబద్ధమైన బాధ్యత మాత్రమే కాకుండా, మన కుటుంబాల భద్రతకు కూడా కీలకమని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ నియమాలను గౌరవిస్తేనే ప్రమాద రహిత సమాజం సాధ్యమని ఆయన పిలుపునిచ్చారు.

రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించిన అధికారులు…

రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించిన అధికారులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

కొహిర్ మండలం దిగ్వాల్ లోని జిల్లా పరిషత్ తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల- న్యాలకల్ (TGSWRS) లో రోడ్డు భద్రతా మాసంలో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోహిర్ ఎస్ఐ నరేష్, డెక్కన్ టోల్ ప్లాజా సేఫ్టీ మేనేజర్ నాగరాజు విద్యార్థులకు రోడ్డు ప్రమాదాల కారణాలు, భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యతను వివరించారు. పాఠశాల ఉపాధ్యాయులు, డెక్కన్ టోల్ ప్లాజా సిబ్బంది పాల్గొన్నారు.

యువతమత్తు పదార్థాలకు బానిస కావొద్దు…

యువతమత్తు పదార్థాలకు బానిస కావొద్దు

సిఐ రంజిత్ రావు, ఎస్సై పరమేష్

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండల కేంద్రంలో కూడలి వద్ద యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దని మాదకద్రవ్యాల నిర్మూలనపై సీఐ రంజిత్ రావు ఎస్సై పరమేష్ ప్రతిజ్ఞ చేయించారు. మాట్లాడుతూ మాదకద్రవ్యాల వల్ల కలిగే శారీరక మానసిక సామాజిక దుష్పప్రహాలను వివరించారు అలవాటు పడితే వ్యక్తి ఆరోగ్యం భవిష్యత్తు కుటుంబం సమాజం నాశనం అవుతుందని హెచ్చరించారు కూడలి వద్ద ప్రజలతోని డ్రక్స్ రహిత జీవనశైలి పాటించడం చుట్టుపక్కల వారు మాదక ద్రవ్యాలకు బారిన పడకుండా చూడడం వాటి విక్రయం కొనుగోలు అక్రమ రవాణా వంటి కార్యక్రమాలపై అధికా రులకు సమాచారం అందిం చడం డ్రగ్స్ లేని సమాజ నిర్మాణంలో భాగస్వాములు అవ్వాలని ప్రతిజ్ఞ చేశారు. అదేవిధంగా మత్తుపదార్థా లకు బానిసలుగా మారితే చట్టపరమైన చర్యలు తీసుకుం టామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బం ది, యువతీ యువకులు ప్రజ లు అధిక మొత్తంలో పాల్గొ న్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version