ముగిసిన దేవీ శరన్నవరాత్రులు…

ముగిసిన దేవీ శరన్నవరాత్రులు

బాలానగర్ /నేటి ధాత్రి

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని చిన్నరేవల్లి గ్రామంలో దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగగా..శనివారం ముగిశాయి. ఈ సందర్భంగా అమ్మవారి వస్త్రాలను, పూర్ణ కలశమును వేలంపాట నిర్వహించారు. పూర్ణ కలశాన్ని సింగిల్ విండో మాజీ చైర్మన్ బత్తుల వెంకటరామ గౌడ్ వేలంపాటలో పాల్గొని కలశాన్ని రూ.51 వేలకు దక్కించుకున్నారు. అమ్మవారిని ప్రతిమను నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు భారీగా పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version