ఉర్సే షీరీఫ్ ఫీర్ గైబ్ సాహెబ్ ఉత్సవాల్లో పాల్గొన్న నూతన సర్పంచ్…

ఉర్సే షీరీఫ్ ఫీర్ గైబ్ సాహెబ్ ఉత్సవాల్లో పాల్గొన్న నూతన సర్పంచ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల కేంద్రంలోని న్యాల్కల్ గ్రామంలో ఉర్సే షీరీఫ్ ఫీర్ గైబ్ సాహెబ్ జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రత్యేకంగా ఫీర్ గైబ్ సాహెబ్ ను దర్శించుకున్న ఝరాసంగం మండల తుమ్మనపల్లి గ్రామ నూతన సర్పంచ్ నాజియా అంజుమ్ షేక్ సోహెల్ తమ స్నేహితులతో కలిసి ప్రత్యేక దర్శనం చేసి దట్టి పూలమాలలు టెంకాయలు అగార్ బత్తి సమర్పించి తమ మొక్కులను తీర్చుకున్నారు గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని నా యొక్క ఐదు సంవత్సరాల పదవి ఇలాంటి అడ్డంకులు లేకుండా గ్రామ అభివృద్ధి పొందేటట్టు ఆశీర్వాదం ఇవ్వగలరని కోరారు ఈ జాతరకు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి భక్తులు భారీ సంఖ్యలో వచ్చారు. పశువుల జాతరలో వేలాది పశువులు తరలిరాగా, కోట్ల రూపాయల వ్యాపారం జరిగిందన్నారు. దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసి గ్రామ అభివృద్ధికి ఆశీర్వాదాలు కోరుకున్నారు,
తమతో పాటు యువ నాయకులు శశివర్ధన్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి సత్తార్ పాల్గొన్నారు,

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version