ప్రకృతి వ్యవసాయ సాగుతో మరింత ఆరోగ్య..

ప్రకృతి వ్యవసాయ సాగుతో మరింత ఆరోగ్యం

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

మంచిర్యాల,నేటి ధాత్రి:

https://youtu.be/NoviIp1TUK4?si=EohsYI-9HsxUTNf_

 

ప్రకృతి వ్యవసాయ సాగుతో ప్రజల జీవన ప్రమాణాన్ని మరింత పెంపొందించవచ్చని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాలలో జాతీయ మిషన్ ఫర్ ప్రకృతి వ్యవసాయంపై నిర్వహించిన ఒక రోజు శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి మొదటి ప్రాధాన్యత అందించి రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తుందని తెలిపారు.ప్రకృతి వ్యవసాయ సాగులో సహజ సిద్ధమైన సేంద్రియ ఎరువులు, సాగు పద్ధతులు అవలంబించడం ద్వారా ఆరోగ్యకరమైన పంట ఉత్పత్తులు సాధించవచ్చని, తద్వారా ప్రజలకు మరింత ఆరోగ్యవంతమైన ఆహార ఉత్పత్తులను అందించవచ్చని తెలిపారు.రైతులకు ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందని, పంట సాగులో రైతులకు అవసరమైన మెలకువలను అందించి అధిక దిగుబడి సాధించేలా ప్రోత్సహిస్తుందని తెలిపారు.10 సంవత్సరాల పాటు ప్రకృతి వ్యవసాయ సాగు చేయడం జరుగుతుందని తెలిపారు.జిల్లాలోని హాజీపూర్ మండలం గుడిపేట రైతు వేదిక నుండి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సురేఖ,ప్రకృతి వ్యవసాయ రైతు కొట్టే రవీందర్,అధికారులతో కలిసి హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 15 రైతువేదికలలో 1 వేయి 875 మందితో వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్ నిర్వహించడం జరిగిందని తెలిపారు.ప్రకృతి వ్యవసాయ పథకం పురోగతి దిశగా జిల్లాలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.అనంతరం రైతులకు ప్రకృతి వ్యవసాయ కిట్లను అందజేశారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఆత్మ చైర్మన్ సింగతి మురళీ,కార్పొరేటర్లు రాజన్న,బియ్యాల త్రివేణి,కమల, లగిశెట్టి రాజయ్య,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

చిరుధాన్యాలు మొలకెత్తిన గింజలతో సంపూర్ణ ఆరోగ్యం…

చిరుధాన్యాలు మొలకెత్తిన గింజలతో సంపూర్ణ ఆరోగ్యం.

చిట్యాల, నేటి ధాత్రి :

 

చిట్యాల మండలంలోని అందుకు తండ గ్రామ పరిధిలోని పోషణ మాసంలో భాగంగా అందుకు తండా గ్రామపంచాయతీ పరిధిలో ఐదుగురు టీచర్లు ఏర్పాటు చేసిన సమావేశమునకు జయప్రద సూపర్వైజర్ హాజరై ప్రతిరోజు చిరుధాన్యాలతో కూడిన భోజనం, మొలకెత్తించిన గింజలను భుజించి, సేంద్రియ ఎరువులు వాడి, పంటలు పండించాలని, వ్యక్తిగత శుభ్రత ,పరిసరాల పరిశుభ్రత, త్రాగునీరు ప్లాస్టిక్ నివారణ గూర్చి వివరించారు. స్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీనాథ్, ప్రతాప్ గారు మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులుగా ఎదగాలంటే చిన్ననాటి నుండి క్రమశిక్షణతో పెంచుతూ,మొబైల్స్ కు దూరంగా ఉంచుతూ బయట తిను బండారాలు పిల్లలకు పెట్టకుండా ఇంటిలో తయారు చేసిన సమతుల హారము అందించినప్పుడు అన్ని రంగాలలో రాణిస్తారు అని సూచించారు. ఈ ప్రోగ్రాం లో నలుగురు పిల్లలకు అక్షరాభ్యాసము, ముగ్గురు పిల్లలకు అన్నప్రాసన చేయించి అందరితో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రామ్ సింగ్ గ అంగన్వాడి టీచర్లు కస్తూరి, రజిత ప్రమీల, మమత, ఉమాదేవి, అనూష ,స్వప్న ,ఏఎన్ఎం లావణ్య, ఆశ వర్కర్స్ ఎక్కువ సంఖ్యలో మహిళలు హాజరైనారు. టీచర్స్ ఏర్పాటు చేసిన పోషకాహార స్టాల్స్ చాలా చాలా, ఉపయోగకరమైనది అని మహిళలు హర్షం వ్యక్తం చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version