చిరుధాన్యాలు మొలకెత్తిన గింజలతో సంపూర్ణ ఆరోగ్యం.
చిట్యాల, నేటి ధాత్రి :
చిట్యాల మండలంలోని అందుకు తండ గ్రామ పరిధిలోని పోషణ మాసంలో భాగంగా అందుకు తండా గ్రామపంచాయతీ పరిధిలో ఐదుగురు టీచర్లు ఏర్పాటు చేసిన సమావేశమునకు జయప్రద సూపర్వైజర్ హాజరై ప్రతిరోజు చిరుధాన్యాలతో కూడిన భోజనం, మొలకెత్తించిన గింజలను భుజించి, సేంద్రియ ఎరువులు వాడి, పంటలు పండించాలని, వ్యక్తిగత శుభ్రత ,పరిసరాల పరిశుభ్రత, త్రాగునీరు ప్లాస్టిక్ నివారణ గూర్చి వివరించారు. స్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీనాథ్, ప్రతాప్ గారు మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులుగా ఎదగాలంటే చిన్ననాటి నుండి క్రమశిక్షణతో పెంచుతూ,మొబైల్స్ కు దూరంగా ఉంచుతూ బయట తిను బండారాలు పిల్లలకు పెట్టకుండా ఇంటిలో తయారు చేసిన సమతుల హారము అందించినప్పుడు అన్ని రంగాలలో రాణిస్తారు అని సూచించారు. ఈ ప్రోగ్రాం లో నలుగురు పిల్లలకు అక్షరాభ్యాసము, ముగ్గురు పిల్లలకు అన్నప్రాసన చేయించి అందరితో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రామ్ సింగ్ గ అంగన్వాడి టీచర్లు కస్తూరి, రజిత ప్రమీల, మమత, ఉమాదేవి, అనూష ,స్వప్న ,ఏఎన్ఎం లావణ్య, ఆశ వర్కర్స్ ఎక్కువ సంఖ్యలో మహిళలు హాజరైనారు. టీచర్స్ ఏర్పాటు చేసిన పోషకాహార స్టాల్స్ చాలా చాలా, ఉపయోగకరమైనది అని మహిళలు హర్షం వ్యక్తం చేశారు.