హనుమాన్ దీక్ష స్వాములు కొండగట్టుకు పాదయాత్ర ప్రారంభం

వర్షకొండ నుండి కొండగట్టుకు హనుమాన్ దీక్ష స్వామి లు పాదయాత్ర

ఇబ్రహీంపట్నం. నేటిదాత్రి

ఇబ్రహీంపట్నం మండలంలోని వర్ష కొండ గ్రామం నుండి హనుమాన్ దీక్ష స్వాములు సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పవిత్రమైన కొండగట్టు ఆంజనేయస్వామి గుడికి పాదయాత్రగా బయలుదేరారు స్వాములు మాట్లాడుతూ రేపు సాయంత్రంలోగా కొండగట్టుకు చేరుకుంటామని మాట్లాడారు గురుస్వాములు. తరుణ్ కుమార్. శివ. ఆదిత్య. సుధీర్. రిషిత్ కుమార్. గంగ సాయి. శశి. గణేష్.వర్షిత్. సోమిత్ స్వాములు ఉన్నారు

అంగన్వాడి కేంద్రాలలో సరుకుల పంపిణీ…

అంగన్వాడి కేంద్రాలలో సరుకుల పంపిణీ

ఇబ్రహీంపట్నం, నేటిదాత్రి

మండలంలోని డబ్బా గ్రామంలో
నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్ పుప్పల లక్ష్మి మహేష్, ఉప సర్పంచ్ రాపల్లి మహేష్ కు అంగన్వాడి టీచర్లు ఘనంగా స్వాగతం పలుకుతూ గ్రామంలోని రెండు అంగన్వాడి కేంద్రాలలో ఆరు నెలల నుండి మూడు సంవత్సరం లోపు పిల్లలకు బాలమృతం, కోడిగుడ్లు పంపిణీ చేశారు, ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సెక్రటరీ రా పెళ్లి రవళి ప్రధానోపాధ్యాయులు తగుకుల రమేష్,, యువ నాయకుడు కోటి అరుణ్, అంగన్వాడీ టీచర్లు సుందరగిరి గంగామణి, వై సంజీవరాణి ,ఆశ కార్యకర్తలు రజిత, జ్యోతి అంగన్వాడి ఆయా గుండు శ్యామల, విమల, పిల్లల తల్లులు తదితరులు పాల్గొన్నారు,

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version