అంగన్వాడి ఉపాధ్యాయురాలు ఆత్మహత్య.

అంగన్వాడి ఉపాధ్యాయురాలు ఆత్మహత్య.

చందుర్తి, నేటిధాత్రి:

 

చందుర్తి మండలం సనుగుల గ్రామస్తురాలైన గొట్టే పరిమళ వయసు 36 సంవత్సరాలు, ప్రస్తుతం దేవుని తండా గ్రామంలో అంగన్వాడీ టీచర్ గా పనిచేస్తుంది. మృతురాలికి ఇద్దరు కుమారులు మరియు భర్త ఆర్టీసీ హయర్ బస్సు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. పరిమళ గత 8 నెలల నుండి గర్భసంచిలో గడ్డలు అయినవని పలు హాస్పిటల్లో తిరిగి ఎన్ని మందులు వాడినా కూడా కడుపునొప్పి తగ్గడం లేదని బాధపడుతుండేది. ఇట్టి విషయంలో మనస్థాపానికి గురై ఈరోజు ఉదయం సుమారు 8:30 గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరు లేని సమయంలో బెడ్ రూమ్లో సీలింగ్ ఫ్యాన్ కు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు చందుర్తి ఎస్ఐ రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడమైనది.

ఆరోగ్యవంతమైన సమాజానికి తల్లిపాలు దోహదం.

ఆరోగ్యవంతమైన సమాజానికి తల్లిపాలు దోహదం.

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తల్లిపాలు దోహదపడతాయని ఐసీడీసీ సూపర్వైజర్ సద్గుణ అన్నారు.తల్లి పాల వారోత్సవాల కార్యక్రమంలో సోమవారం మొగుడంపల్లి మండలంలో అంగన్వాడి టీచర్ ఎస్.తుల్జమ్మ ఆధ్యక్షతన అంగన్వాడి సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా మాట్లాడారు.శిశువు పుట్టిన దగ్గర నుంచి రెండేళ్ల వయస్సు వచ్చే వరకు తల్లిపాలు పట్టించాలన్నారు.తల్లిపాలు బిడ్డ మానసిక,శారీరకంగా ఎదుగులకు ఉపయోగపడతాయన్నారు.చాలా మంది తల్లులు పిల్లలకు తేనె,నీళ్లు వంటివి పడుతుంటారని,అలా చేయడం వల్ల బిడ్డ అనారోగ్యానికి గురవుతారన్నారు.రెండేళ్ల నుంచి బిడ్డకు అనుబంధ పోషకాహారాన్ని అందించాలని సూపర్వైజర్ సద్గుణ పేర్కొన్నారు. అనంతరం అంగన్‌వాడీ సెంటర్ పరిధిలోని గర్భిణులకు మంగళవారం సీమంతాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం స్వరూప,ప్రవీణ, అంగన్వాడి టీచర్ తుల్జమ్మ, ఆశ వర్కర్లు యశోద, ప్రకృత,ఆయాలు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version