భారీ వర్షాలకు పొంగి పొర్లుతున్న వాగులు వంకలు.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-29-5.wav?_=1

భారీ వర్షాలకు పొంగి పొర్లుతున్న వాగులు వంకలు.

పరవళ్ళు తొక్కుతున్న పాకాల సరస్సు,మాదన్నపేట చెరువు మత్తడి నీరు..

అశోక్ నగర్ వద్ద ఉగ్రరూపం దాల్చిన పాకాల వరదనీరు..

వట్టేవాగు వద్ద ఉదృతంగా ప్రవహిస్తున్న మాదన్నపేట చెరువు అలుగు వరద*

కాకతీయ నగర్ కాలనీ వాసుల్లో మొదలైన ఆందోళన.

నర్సంపేట నుండి మాదన్నపేట,,నర్సంపేట నుండి పాకాల కొత్తగూడ రాకపోకలు బంద్.

ప్రమాదాలు జరుగకుండా పోలీస్ శాఖ అధికారులు బందోబస్తు..రెవెన్యూ మున్సిపల్ ,పంచాయితీ రాజ్ అధికారుల చర్యలు.

వరి పంటను దెబ్బతీస్తున్న భారీ వర్షాలు..

17,18 తేదీల్లో కురిసే భారీ వర్షాలతో రైతుల్లో అలజడి.

నర్సంపేట,నేటిధాత్రి:

గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నర్సంపేట డివిజన్ పరిధిలోని సరస్సు,చెరువులు,కుంటులు మత్తల్లు పోస్తున్నాయి.ఆసియా ఖండంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు పాకాల గత రెండు రోజులుగా అలుగుపోస్తున్న ది.సరస్సులో 31 ఫీట్ల పైబడి వరదనీరు చేరడంతో ఓక ఫీట్ ఎత్తుగా మత్తడి పరవళ్ళు తొక్కుతున్నది.నర్సంపేట మాదన్నపేట చెరువు గత ఐదు రోజులుగా మత్తడి పోస్తూ నేడు వరద ఉదృతం పెరుగుతున్నది.శుక్రవారం అర్థరాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షానికి డివిజన్ పరిధిలోని చెరువులు,కుంటలు,వాగులు,వంకలు వరద నీటితో పారుతున్నాయి.నర్సంపేట నుండి పాకాల మీదుగా కొత్తగూడ వెళ్లే ప్రధాన రహదారిపై అశోక్ నగర్ వద్ద ఉన్న పాకాల నీటి ప్రవాహం తీవ్రస్థాయిలో పరవళ్ళు తొక్కుతుంది.

అటువైపు రాకపోకలు పూర్తిస్థాయిలో బంద్ అయ్యాయి.వాగువద్ద ఎలాంటి ప్రాణనష్టం జరుగకుండా ఖానాపూర్ పోలీస్ అధికారులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.మాదన్నపేట రోడ్డు వాగు వద్ద వరద నీటి ప్రవాహం ఉదృతం కావడంతో మున్సిపల్,పోలీస్ ,రెవెన్యూ శాఖల అధికారులు బందోబస్తు చర్యలు చేపట్టారు.మాదన్నపేట చెరువు ఉగ్రరూపం దాల్చి మత్తడి పడితే చాలు..నర్సంపేట పట్టణంలో ఎన్టీఆర్ నగర్ కాలని వాసుల్లో గుబులు పుట్టిస్తోంది.నర్సంపేట నుండి నేక్కొండ వైపు ముగ్దుంపురం కాజ్ వే వద్ద వరద భీభత్సం పెరుగడంతో అటువైపు వెళ్లే వాహనాలను చెన్నారావుపేట పోలీసులు,అధికారులు ఎక్కడికక్కడ నిలిపివేశారు.నల్లబెల్లి మండలం నుండి నందిగామ వైపు వెళ్లే ప్రధాన రహదారి లెంకాలపల్లి నందిగామ గ్రామాల మధ్య ఉన్న లో లెవర్ కాజ్ వే పై వరద నీటితో భయంకరంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.ప్రమాదాలు జరుగకుండా నల్లబెల్లి ఎస్సై,రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో తగిన చర్యలు చేపట్టారు.దుగ్గొండి,నల్లబెల్లి,నర్సంపేట,ఖానాపూర్,చెన్నారావుపేట, నెక్కొండ మండలాల పరిధిలోని చెరువులు,కుంటలు నిండి మత్తళ్ళు పోస్తున్నాయి.దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.కొన్ని చోట్ల వాగుల వద్ద చేపలవేట చేస్తున్నారు.అనుకోకుండా ప్రమాదాలు
జరగవచ్చని అధికారులు హెచ్చరించినప్పటికి అవేవీ పట్టించుకోవడం లేదు.

Ashok Nagar

17,18 తేదీల్లో కురిసే భారీ వర్షాలతో రైతుల్లో అలజడి.

గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు డివిజన్ వ్యాప్తంగా చెరువులు,కుంటలు నిండు కుంటల్లా మారి శుక్రవారం అర్థరాత్రి కురిసిన భారీ వానకు అతలాకుతలం అయ్యింది.17,18 తేదీల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రకటించారు.ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.దీంతో ఇప్పటికే చెరువులు,కుంటలు వాగులు నిండి భారీ ఎత్తున వరద భీభత్సం సృష్టించింది.ఐతే 17,18 తేదీల్లో అతి భారీ వర్షాలు కురిస్తే పంటల పరిస్థితి ఎలా అని రైతులు ఆందోళన చెందుతున్నారు.

వరి పంటను దెబ్బతీస్తున్న భారీ వర్షాలు..

*ఋతుపవనాలు ముందుగానే వచ్చినట్లు వచ్చి వెనక్కివెళ్లడంతో సుమారు 20 నుండి నెల రోజుల ఆలస్యంగా రైతులు వరినాట్లు సాగుచేసుకున్నారు.వరినాట్లు జోరందుకుంటున్న నేపథ్యంలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు,కుంటలు నిండడం వరదలకు వరినాట్లు నీట మునుగడం,కొట్టుకుపోయే పరిస్థితులు నెలకొన్నాయి.మరిన్ని రోజులు వర్షాలు కురిస్తే పంటలకు నష్టాలు వాటిల్లే అవకాశం ఉన్నాయని పలువురు రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.

నీటి ప్రవాహం వద్ద పోలీస్ అధికారుల సేవలు భేష్..

*నర్సంపేట డివిజన్ పరిధిలోని కురుస్తున్న భారీ వర్షాలకు ప్రవహిస్తున్న వరద నీటి వద్ద ప్రమాదాలు జరుగకుండా రేయింబవళ్లు పహారా కాస్తున్న పోలీస్ అధికారుల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈలాంటి సేవలు అందించడంలో నర్సంపేట డివిజన్ పోలీసులు ముందుంటారని ప్రజలు పేర్కొన్నారు.

టిడిపి పార్టీ ఆధ్వర్యంలో 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-16T161436.087.wav?_=2

 

టిడిపి పార్టీ ఆధ్వర్యంలో 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

పరకాల నేటిధాత్రి

 

 

పట్టణంలోని 52వ బూత్ సగర వీధిలో టిడిపి సీనియర్ నాయకులు భూపాలపల్లి నియోజకవర్గ పరిశీలకులు పరకాల పట్టణ అధ్యక్షుడు చిదురాల రామన్న ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించి జాతీయ గీతం గీతం ఆలపించారు.ఈ సందర్భంగా రామన్న మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీలకు అతీతంగా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి సంస్కరణలు అమలు చేసి బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండి ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజల కీర్తిని వెలుగెత్తి చాటిందని అన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షులు కొత్తపల్లి శంకర్, రాజశేఖర్,నరసయ్య పి శరత్ బాబు,మహిళా నాయకురాలు కురిమిండ్ల కనక లక్ష్మీ,ఎల్లమ్మ, ఐలమ్మ తదితరులు పాల్గొన్నారు.

కాశిబుగ్గ గణపతి ఉత్సవాల వేదిక పనులు ప్రారంభం

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-47-1.wav?_=3

కాశిబుగ్గ గణపతి ఉత్సవాల వేదిక పనులు ప్రారంభం

నేటిధాత్రి, కాశీబుగ్గ

వరంగల్ కాశీబుగ్గ వర్తక సంఘం ఆధ్వర్యంలో, రాబోవు గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా, ఉత్సవాల వేదిక నిర్మాణ పనులకు వర్తక సంఘం అధ్యక్షులు గుండేటి కృష్ణమూర్తి చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. గత 34 సంవత్సరాల నుండి కాశిబుగ్గ వర్తక సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు, ప్రతిరోజు సాయంత్రం పూజ అనంతరం ప్రసాద వితరణ చేస్తారు. కాశిబుగ్గ వర్తక సంఘం కార్యవర్గ సంఘo సభ్యుల సహకారంతో ఈ సంవత్సరం కూడా ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఏర్పాటు చేస్తున్నామని గుండేటి కృష్ణమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో 20వ డివిజన్ కార్పొరేటర్ గుండేటి నరేంద్ర కుమార్, మాజీ కార్పొరేటర్ బయ్య స్వామి, వడిచర్ల సదానందం, మండల శ్రీరాములు, గుల్లపల్లి రాజ్ కుమార్, డాక్టర్ గోనె జగదీశ్వర్, బిట్ల చక్రపాణి, ఓరుగంటి కొమరయ్య, వంగరి లింగయ్య, మాటేటి విద్యాసాగర్, గుత్తికొండ నవీన్, బండారి శ్రీనివాస్, కుసుమ నగేష్, బోడకుంట్ల వైకుంఠం, కందగట్ల రాజు, గుండు సత్యనారాయణ, అలాగే ప్రతి సంవత్సరం ఉత్సవాలకు సేవలందిస్తున్న లక్ష్మీ గణపతి సహకార పరపతి సంఘం కార్యవర్గం అధ్యక్షులు వంగరి రాంప్రసాద్, ప్రధాన కార్యదర్శి మండల సురేష్, దుస్స కృష్ణ, దాసి శివకృష్ణ, మండల చందు, పసునూటి శ్రీకాంత్, క్యాతం రవీందర్, బండారి భాస్కర్, క్యాతం శ్రీనివాస్, బండారి రాజు, గాజుల రాజేష్, సిందం కృష్ణ, కోడం శరత్, కానుగంటి పవన్, బండారి లక్ష్మణ్, చిలగాని రమేష్, దాసరి దేవేందర్, ముడుతనపల్లి శ్రీనివాస్, గాదే సతీష్, వంగ ఐలయ్య ఉత్సవ సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

పోత్కపల్లి ఎస్ఐకి ఉత్తమ సేవ పురస్కార అవార్డు.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-15-7.wav?_=4

పోత్కపల్లి ఎస్ఐకి ఉత్తమ సేవ పురస్కార అవార్డు..

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

పోత్కపల్లి పోలీస్ స్టేషన్ ఎస్పై
ది కొండా రమేష్ కు 79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవ పురస్కారం అవార్డును ఎమ్మెల్యే చేతుల మీదుగా అందుకున్నారు 79 వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎస్ఐకి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారం అవార్డును
అందించారు.

గణపురంలో ఘనంగా 79 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-16T160419.545-1.wav?_=5

 

 

గణపురంలో ఘనంగా 79 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండల కేంద్రంలో 79 వ స్వతంత్ర దినోత్సవవేడుకలను శుక్రవారం ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, కార్యాలయాలు,వివిధ రాజకీయ పార్టీల నాయకులు,యువజన, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.జాతీయ జెండాలు ఎగుర వేసి, స్వీట్లు పంపిణీ చేశారు. తహసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ తహసిల్దార్ మధురకవి సత్యనారాయణ స్వామి మండల పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక అధికారి అసోద కుమారస్వామి,పోలీస్ స్టేషన్ ఆవరణలో సీఐ చెన్నమనేని కర్ణాకర్ రావు,ఆర్టీవో కార్యాలయంలో ఎం వి ఐ సందాని, కేటీపీపి లో సీఈ శ్రీప్రకాష్, మండల విద్యా వనరుల కేంద్రంలో ఎంఈఓ ఊరుగొండ ఉప్పలయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్మన్ కిష్టయ్య, గ్రామపంచాయతీ కార్యాలయాలలో ఆయా పంచాయతీ కార్యదర్శులు, పాఠశాలలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సొసైటీ కార్యాలయంలో చైర్మన్ కన్నేబోయిన కుమార్

 

 

యాదవ్, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు రేపాక రాజేందర్, బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు మోతె కర్ణాకర్ రెడ్డి,బిజెపి పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు ఊర నవీన్ రావు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిని అనూష, పశువైద్యశాలలో వైద్యాధికారి శ్రీకాంత్ రెడ్డి, ఈ కార్యక్రమంలో ఎంపీడీవో భాస్కర్ ,ఎస్సై రేఖ అశోక్, పంచాయతీ కార్యదర్శులు ఉమ్మల్ల విజేందర్ ముక్కెర హేమంత్ ,నవీన్, రాకేష్ ,షఫీ నాగమణి,రాజకీయ పార్టీల నాయకులు కొత్త వెంకన్న, పొనగంటి మలహాల్ రావు, కటుకూరి శ్రీనివాస్,మోకిరాల తిరుపతిరావు,లింగంపల్లి వేణు రావు,విడిదినేని అశోక్,చోటే మియా, సూరినేని సంపత్ రావు,లక్కం రాములు,పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి,బైరగాని కుమారస్వామి గౌడ్,మంద మహేష్, అయితు రమేష్, తదితరులు పాల్గొన్నారు.

మొరంచపల్లి వాగు ఉదృతిని ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-46-2.wav?_=6

మొరంచపల్లి వాగు ఉదృతిని ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. జిల్లా కలెక్టర్

భూపాలపల్లి నేటిధాత్రి

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ శనివారం మొరంచపల్లి వాగు ఉదృతిని ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వాగు ఉదృతి దృష్ట్యా ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితులు తలెత్తినపుడు తక్షణమే స్పందించి రక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖలకు ఆదేశించారు. ఎగువ భాగం నుండి ఎంత వరద వచ్చే అవకాశం ఉందన్న వివరాలు ఈ ఈ ప్రసాదు ను అడిగి తెలుసుకున్నారు. జాగ్రత్తగా ఉండాలని వరద పరిస్థితిని ముందుగా అంచనా వేసి ప్రజలను ముందస్తు అప్రమత్తం చేయాలని సూచించారు.
వాతావరణ శాఖ సూచన మేరకు
జిల్లాకు ఆదివారం వరకు
రెడ్ అలెర్ట్ జారీ చేసిన నేపథ్యంలో యంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సిబ్బంది కార్యస్థానాల్లో అందుబాటులో ఉండి రక్షణ చర్యలు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.
భారీ వర్షాలు దృష్ట్యా ప్రజల, పశువుల ప్రాణరక్షణలో తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ముంపు ప్రాంతాలను గుర్తించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర సేవలకు ప్రజలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 24 గంటలు పనిచేసే విధంగా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్ కు కాల్ చేయాలని సూచించారు.
90306 32608 ద్వారా వచ్చిన ఫిర్యాదులకు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పశువులను మేతకు బయటికి పంపకుండా ఇంటి పట్టునే ఎత్తైన ప్రదేశంలో ఉంచాలని తెలిపారు.
రహదారులపై నీళ్లు చేరిన ప్రాంతాల్లో ప్రజలు ప్రయాణాలు చేయకుండా పటిష్ట నియంత్రణ చేయాలని తెలిపారు. కొంతమంది. అత్యుత్సాహంతో ఎవరైనా దాటే ప్రయత్నం చేసే అవకాశం ఉన్నందున రెవెన్యూ, పోలీస్, పంచాయతీ రాజ్ సిబ్బంది పటిష్ట పర్యవేక్షణలో బారికేడ్లు ఏర్పాటు చేసి రవాణా నియంత్రణకు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఈఈ ప్రసాద్, డిఈ వరుణ్, ఏఈ షర్ఫ్ఉద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

విరాళంగా కంప్యూటర్ ల్యాబ్ కు లక్ష రూపాయలు..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-28-4.wav?_=7

విరాళంగా కంప్యూటర్ ల్యాబ్ కు లక్ష రూపాయలు

నేటి ధాత్రి కథలాపూర్

అందజేసిన ఎన్ ఆర్ ఐ డా. గట్ల నర్సింగం

కథలాపూర్, ఆగస్టు 16 : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని కంప్యూటర్ ల్యాబ్ కొరకు లక్ష రూపాయలను ఎన్ ఆర్ ఐ డా. గట్ల నర్సింగం విరాళంగా అందజేశారు. శనివారం
కథలాపూర్ మండలం సిరికొండ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కంప్యూటర్ ల్యాబ్ కు సిరికొండ గ్రామానికి చెందిన అమెరికా ప్రవాస భారతీయులు డా. గట్ల నర్సింగం 1 లక్ష రూపాయలు విరాళం అందజేసినట్టు ప్రధానోపాధ్యాయులు లోకిని శ్రీనివాస్ తెలిపారు. తన మిత్రులైన విశ్రాంత ఉపాద్యాయులు ఒటారికారి చిన్న రాజన్న, డా. వేముల ప్రభాకర్ మిత్ర బృందం పాఠశాలలో నగలు రూపేణా ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. నర్సింగం గతంలో కూడా పాఠశాలలో ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించారని, పాఠశాల అభివృద్ధికి తన సహకారాన్ని అందించారనీ లోకిని శ్రీనివాస్ గుర్తు చేశారు. ఈ సందర్భంగా నర్సింగము కు గ్రామస్తులు, ఉపాద్యాయులు, విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు.

మృతదేహాలకు నివాళులర్పించి వారి కుటుంబాలకు పరామర్శించిన ఎమ్మెల్యే నాగరాజు

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-45-1.wav?_=8

మృతదేహాలకు నివాళులర్పించి వారి కుటుంబాలకు పరామర్శించిన ఎమ్మెల్యే నాగరాజు

వర్దన్నపేట (నేటిధాత్రి ):

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం పరిధిలోని ఇల్లంద గ్రామానికి చెందిన మల్లెపాక ఉప్పలయ్య, సట్ల నర్సయ్య గారు నిన్న అనారోగ్యంతో మరణించగా

నేడు వారి నివాసాలకు వెళ్లి మృతదేహాలకు పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి * కేఆర్ నాగరాజు
ఎమ్మెల్యే వెంట ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు….

బిజెపి జిల్లా కార్యదర్శిగా జిట్టబోయిన సాంబయ్య.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-14-5.wav?_=9

బిజెపి జిల్లా కార్యదర్శిగా జిట్టబోయిన సాంబయ్య

గణపురం నేటి ధాత్రి :

గణపురం మండలం
భూపాలపల్లి జిల్లా బీజేపీ నూతన కమిటీలను ప్రకటించింది.జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి కమిటీలను ప్రకటించారు.
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామ్ చందర్రావు ఆదేశాలతో నూతన కమిటీని ప్రకటించినట్లు జిల్లా అధ్యక్షులు తెలిపారు. గణపురం మండలానికి చెందిన జిట్టబోయిన సాంబయ్యను జిల్లా కార్యదర్శిగా ప్రకటించారు. జిల్లా నూతన కమిటీలో స్థానం పొందిన సాంబయ్య రాష్ట్ర జిల్లా నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

మంచిర్యాలలో సర్దార్ పాపన్న జయంతి ఉత్సవాలు.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-27-5.wav?_=10

సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలి

మోకు దెబ్బ రాష్ట్ర అధికార ప్రతినిధి భూసారం మొండి గౌడ్

మంచిర్యాల,నేటి ధాత్రి:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఆగస్టు 18న జరిగే ఉత్సవానికి గౌడ బాంధవులు అందరూ తప్పకుండా వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని మోకు దెబ్బ రాష్ట్ర అధికార ప్రతినిధి భూసారం మొండిగౌడ్ అన్నారు.ఈ కార్యక్రమం అనంతరం ఏజెన్సీ ప్రాంతంలో గీత కార్మికులకు లైసెన్స్ లేనందున,గీత కార్మికుల సమస్యలపై అలాగే మంచిర్యాల జిల్లాలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ఏర్పాటు కొరకై జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేయడం జరుగుతుందని అన్నారు.

తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు నిధులు నియామకాలు కోసం…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-16T155338.351-1.wav?_=11

 

తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు నిధులు నియామకాలు కోసం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

జహీరాబాద్ మా కళ్ళ ముందే కర్ణాటకకు నారింజ నీళ్లు ప్రవహిస్తున్నాయి మా జహీరాబాద్ నీళ్లు మేము నిలబెట్టుకోలేని దుస్థితి మా సొంత రాష్ట్రంలో కూడా నారింజ ప్రాజెక్టు పునరుద్ధరణ మరియు నిర్మాణానికి పడని అడుగులు జహీరాబాద్ ప్రాంత ప్రజలు కోసం నారింజకు లోతైన పూడిక తొలగించి, ప్రాజెక్టును పునర్నిర్మిస్తే, జహీరాబాద్‌లో కురిసిన ప్రతి నీటి చుక్క జహీరాబాద్ ప్రాంత వ్యవసాయ రైతన్నలకు సాగునీటి సమస్యలను పరిష్కరిస్తుంది.

 

తెలంగాణ తెచ్చుకున్నదే మన నీళ్లు మనకు కావాలని, కళ్ళముందే మన జహీరాబాద్ ప్రతి నీటి బొట్టు పక్క రాష్ట్రానికి పారిపోతుంటే దుఃఖం వస్తుంది.మా జహీరాబాద్‌లోని ప్రతి నీటి చుక్క పొరుగు రాష్ట్రానికి పారుతుండటం విచారకరం కనీసం ఇప్పుడైనా, జహీరాబాద్ ప్రాంత ప్రజాప్రతినిధులు, పార్టీలకు అతీతంగా ఐక్యంగా, ఒక ఉద్యమంగా, నారింజ ప్రాజెక్టు పునర్నిర్మాణమై, ద్వారా, జహీరాబాద్ నియోజకవర్గాన్ని సింగూరు ప్రాజెక్టు లాగా నిర్మాణం జరిగి జహీరాబాద్ భూమిని పచ్చని వనంల మారాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారు.

శాకాంబరీ అలంకారం లో భవాని మాత..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-26-5.wav?_=12

శాకాంబరీ అలంకారం లో భవాని మాత

ఓదెల(పెద్దపల్లి జిల్లా) నేటిధాత్రి:

పోత్కపల్లి శ్రీ భవాని సమేత మహలింగేశ్వర స్వామి ఆలయంలో తాడూరి శ్రీదేవి – భానుప్రకాష్ రావు దంపతుల ఆద్వర్యంలో శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని శ్రీ భవాని మాత కు వివిధ రకాల కూరగాయలతో శాకంబరిదేవి అలంకరణ చేయడం జరిగినది. ఈ కార్య్రమంలో సుమారు వంద కు పైగా మహిళల భక్తులు పాల్గొని శాకాంబరీ అలంకరణ లో ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు.

నేషనల్ ర్యాంకర్ ను సన్మానించిన సామాజిక సేవా కార్యకర్త

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-44-2.wav?_=13

నేషనల్ ర్యాంకర్ ను సన్మానించిన సామాజిక సేవా కార్యకర్త

పలమనేరు(నేటి ధాత్రి)

పలమనేరు పట్టణానికి చెందిన, భాగీరధి లక్ష్మీపతి కుమారుడు శశి శ్రీనివాస్ అటు సీఎంఏ, సీఏ లో ఆల్ ఇండియా ర్యాంకులు సాధించిన విషయం తెలిసిందే.
చిన్నప్పటినుంచి చదువులో చురుకుగా ఉంటూ. పదవ తరగతి నుండి, ఏడుసార్లు జాతీయ ర్యాంకులు సాధించిన విద్యార్థి ప్రతిభను గుర్తించి….
పలమనేరు సామాజిక సేవా కార్యకర్త, నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ నేషనల్ సెక్రెటరీ మధు మోహన్ రావు, ఈరోజు, ఆ అబ్బాయిని స్థానిక ఆంజనేయ స్వామి దేవస్థానంలో సన్మానించడం జరిగింది.
ఈ సందర్భంగా మధుమోహన్రావు మాట్లాడుతూ…పలమనేరు ఖ్యాతిని జాతీయస్థాయిలో తీసుకువెళ్లి, మూడుసార్లు కలకత్తాలో, ఒకసారి చెన్నైలో, మొన్నటికి మొన్న ఢిల్లీలో రాష్ట్రపతి వద్ద అవార్డు తీసుకున్న ఇటువంటి విద్యార్థిని, మంచి ప్యాకేజీలో సెలెక్ట్ అయిన విద్యార్థిని సన్మానించడం అదృష్టంగా భావిస్తున్నానని, చదువుతున్న విద్యార్థులందరూ…ఈ అబ్బాయిని రోల్ మోడల్ గా తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారుసామాజిక సేవ చేస్తున్న నేను,ఇకపై,
ఈ విధంగా ర్యాంకులు తెచ్చుకున్న విద్యార్థులను సన్మానిస్తానని, ఈ సందర్భంగా మధుమోహన్రావు తెలియజేశారు.

ఉత్తమ ఉద్యోగి అవార్డులు అందుకున్న మండల అధికారులు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-16T154511.268-1.wav?_=14

 

ఉత్తమ ఉద్యోగి అవార్డులు అందుకున్న మండల అధికారులు

మహాదేవపూర్ ఆగస్టు 16 (నేటి ధాత్రి)

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపురం మండలంలోనీ పలువురు అధికారులు ఉత్తమ ఉద్యోగి అవార్డులు 79 వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా శుక్రవారం రోజున జిల్లా పరిపాలన అధికారి ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది. మండలంలోని డివిజనల్ పంచాయతీ అధికారి వీరభద్రయ్య, మండల పంచాయతీ అధికారి ప్రసాద్ మరియు మహాదేవపూర్ గ్రామపంచాయతీ అధికారి కల్పన లు 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆధ్వర్యంలో ఉత్తమ ఉద్యోగి అవార్డులను తీసుకోవడం జరిగింది. అనంతరం పంచాయతీ కార్యదర్శి కల్పన మాట్లాడుతూ ఉత్తమ ఉద్యోగి అవార్డు 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో తీసుకోవడం సంతోషంగా ఉందని ప్రజలకు చేసిన సేవలు జిల్లా అధికారులు గుర్తించి అవార్డును ఇచ్చినందుకు అభినందనలు తెలియజేయడం జరిగింది.

మంత్రి కొండా సురేఖకు శాలువా కప్పి అడ్వాన్స్ జన్మదిన శుభాకాంక్షలు

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-43-1.wav?_=15

జననేత మంత్రి కొండా సురేఖకు శాలువా కప్పి అడ్వాన్స్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వేముల మహేందర్ గౌడ్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

ప్రజల హృదయాలను గెలుచుకున్న జననేత అటవీ, పర్యావరణ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ జన్మదినం ఈనెల 19న ఉన్నందున..శనివారం హన్మకొండ రాంనగర్ లోని కొండా దంపతుల నివాసంలో మంత్రి సురేఖను బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి ఆమెకు అడ్వాన్స్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వేముల మహేందర్ గౌడ్ మాట్లాడారు. నిస్వార్థ సేవకు నిలువెత్తు ప్రతిరూపం..ఆపదోస్తే అండగా ఉండే ఆపద్బాంధవురాలు..నిరుపేదల పక్షపాతి అయినటువంటి కొండా సురేఖ గొప్పతనాన్ని మహేందర్ గౌడ్ అభివర్ణించారు. పేద ప్రజలకు సేవ చేయడంలోనే దైవత్వం దాగి ఉందని భావించే గొప్ప మనసున్న మహా నాయకురాలని, నిరుపేద ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకునే కొండా సురేఖ..వీరత్వంలో ఝాన్సీరాణిలాగా..ధీరత్వంలో ఓరుగల్లు రుద్రమదేవిలాగా..గుణంలో సీతాదేవిలాగా..రూపంలో పార్వతీ దేవిలాగా..ఓర్పులో భూమాతలాగా..శత్రువుల పాలిట కాళికాదేవిలాగా..ఓరుగల్లు ప్రజలను కాపాడే భద్రకాళి లాగా నిత్యం ప్రజల గుండెల్లో కొలువైన అమ్మవారిలాగా..జనహృదయాలను గెలుచుకున్న కొండా సురేఖ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ దేవదేవున్ని వేడుకుంటున్నట్లు మహేందర్ గౌడ్ తెలిపారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం కలిగిన కొండా సురేఖ..నమ్ముకున్న నిరుపేద ప్రజలు, అభిమానుల కోసం ఎంతటి వారినైనా ఎదిరించే వీరత్వం కలిగిన ధీరవనిత అని కొనియాడారు. పదవుల కోసం కాకుండా..ప్రజాసేవలో నిమగ్నమయ్యే కొండా సురేఖ నమ్ముకున్న వారికోసం పదవులను సైతం త్రుణప్రాయంగా వదిలిపెట్టి..మంత్రి పదవిని సైతం లెక్కచేయకుండా..మంత్రి పదవికి రాజీనామా చేసిన దమ్మున్న నాయకురాలు కొండా సురేఖన్నారు. నమ్ముకున్న ప్రజలు అభిమానుల కష్టాలను తీర్చేందుకు..కొండా దంపతులు ఎన్నో కష్టాలను అనుభవించారన్నారు. ప్రజలకు మంచి చేయాలనే తపన తప్ప..ఎలాంటి స్వార్థం లేని నిస్వార్ధ సేవకురాలు కొండా సురేఖని, ఇలాంటి అరుదైన నాయకురాలు నేటి తరంలో ప్రపంచంలో ఎక్కడ కనుచూపు మేరలో దొరకరన్నారు. అందుకే కొండా సురేఖ-మురళీధర్ రావులది భిన్నమైన నాయకత్వమని, పార్టీలు కాదు ముఖ్యం..ప్రజాసేవ చేయడమే తన కర్తవ్యమని భావించే..అరుదైన నాయకులు కొండా దంపతులన్నారు. అందుకే పార్టీలకతీతంగా ఆ ఇంటి గడపను తట్టే లక్షలాది మంది సమస్యల పరిష్కారమే ఇందుకు నిదర్శనమన్నారు. పార్టీలు ఏవైనా..ప్రజలంతా తనవారేనని నమ్మే కొండా దంపతులు..ఎలక్షన్ల వరకే పార్టీలు..ఆ తర్వాత అభివృద్ధి అనే ఏజెండాతోనే ముందుకు సాగుతారన్నారు. వరంగల్ జిల్లా గ్రామీణ ప్రాంతంకు చెందిన ఉక్కల్ లో తుమ్మ రాధ-చంద్రమౌళి దంపతులకు జన్మించిన ఈ కోహినూర్ వజ్రం..మహిళా ఫైర్ బ్రాండ్ కొండా సురేఖ భర్త కొండా మురళీధర్ రావు చల్లని నీడలో..ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని..ఆ దేవదేవుని ఆశీస్సులతో..ప్రజల నిండు దీవెనలతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలని..మంత్రిగా ప్రజలకు ఉన్నతమైన సేవలను అందిస్తూ..రాజకీయ రంగంలో మరింతగా రాణించాలని ఓరుగల్లు భద్రకాళి అమ్మవారిని వేడుకున్నట్లు మహేందర్ గౌడ్ తెలిపారు.

భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-24-4.wav?_=16

భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
టిపిసిసి డెలిగేడ్ కల్వకుంట్ల సుజిత్ రావు

మెట్ పల్లి ఆగస్టు 16 నేటి ధాత్రి
ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రాకూడదని ప్రమాదాలకు గురి కాకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని టీపీసీసీ డెలిగేట్ మెంబర్ కల్వకుంట్ల సుజీత్ రావు కోరారు శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజలకు పలు సూచనలు చేశారు. 2రోజులపాటు భారీ వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారని, అందువల్ల ప్రజలు భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో ప్రజలు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలని,పట్టణంతో పాటు పలు మండలాలు, గ్రామాల ప్రజలు వరద ప్రవాహం ఉన్న వంతెనలు, కల్వర్ట్, రహదారులపై నుండి దాటవద్దని, శిధిల వ్యవస్థలో ఉన్న ఇండ్లలో నివాసం ఉండవద్దని, తడిగా ఉన్న కరెంట్ పోల్స్, ట్రాన్సఫర్స్ తాకవద్దని, శివారు ప్రాంతాల్లో చేపల వేటకు ఎవరు వెళ్ళొద్దని సూచించారు. అదే విధంగా రైతులు కరెంటు బావుల దగ్గరికి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని, వరద నీరు వెళ్లే నాలాలు, మ్యాన్ హోల్స్ సమీపంలోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని కోరారు. విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడే ప్రమాదాలు గతంలో చూశామని, కావున ప్రతీ ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. వర్షాలు, వరదల వల్ల సహాయక చర్యలు చేపట్టేందుకు స్థానిక అధికారులు సిద్ధంగా ఉన్నారని, కానీ అన్నిటి కన్నా ముఖ్యంగా ఎవరికివారు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అత్యవసరమైతే, ఏదైనా సంఘటన జరిగితే స్థానిక అధికారులకు సమాచారం అందించి సహాయక చర్యలు పొందాలని కోరారు ప్రభుత్వం సంబంధిత కార్యాలయాలలో అధికారులను అప్రమత్తం చేసిందని ఏదైనా అత్యవసరం అయితే అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.

మండలంలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు…

మండలంలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు

మహాదేవపూర్ ఆగస్టు 16 (నేటి ధాత్రి)

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల కేంద్రంలో శుక్రవారం రోజున ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మండల కేంద్రంలో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా మండలంలోని పాఠశాలల్లో జెండా ఆవిష్కరణ అనంతరం పాటలు, ఆటలు, క్విజ్ లు నిర్వహించి విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ కార్యాలయాలలో జెండా ఆవిష్కరించిన అనంతరం పలువురు అధికారులు విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది.

జాగృతి జిల్లా అధ్యక్షుడిగా రెండోసారి హరీష్ రెడ్డి ఎన్నిక

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-42-1.wav?_=17

జాగృతి జిల్లా అధ్యక్షుడిగా రెండోసారి హరీష్ రెడ్డి ఎన్నిక

భూపాలపల్లి నేటిధాత్రి

తెలంగాణ జాగృతి జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడిగా రెండోసారి మాడ హరీష్ రెడ్డి ఎన్నికైనారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నా మీద నమ్మకం తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నన్ను రెండోసారి అధ్యక్షుడిగా నియమించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని వారు అన్నారు తెలంగాణ జాగృతిని ద్వారా మరిన్ని కార్యక్రమాలు చేసి ప్రజల్లోకి తీసుకెళ్తానని వారు అన్నారు

అర్ధరాత్రి కుండపోత వర్షం.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-23-3.wav?_=18

అర్ధరాత్రి కుండపోత వర్షం.

#లో లెవెల్ బ్రిడ్జిలపై పొంగిపొర్లుతున్న వరద నీరు.

#కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు.

#మత్తడి దూకుతున్న పలు చెరువులు.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

మండలంలో శుక్రవారం అర్ధరాత్రి కురిసిన కుండపోత వర్షానికి మండలంలోని చెరువులు, కుంటలు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల కారణంగా మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో లో లెవెల్ బ్రిడ్జిలపై ప్రమాదకరంగా ఉధృతంగా నీరు ప్రవహిస్తుండడంతో లెంకలపల్లి, నందిగామ గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో ఈ మేరకు తహసిల్దార్ ముప్పు కృష్ణ, ఎస్సై వి గోవర్ధన్ అప్రమతమై తమ సిబ్బందిని వెంట తీసుకొని ఉధృతంగా ప్రవహిస్తున్న వాగుల వద్ద భారీ కేడ్లతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి ప్రజలను అప్రమత్తం చేశారు. భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని మండల ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని వారు ప్రజలకు సూచన చేశారు. అలాగే పలు గ్రామాలలో చెరువులు నిండుకుండల మారి మత్తడి దూకుతున్నాయి. మండల కేంద్ర సమీపాన ఉన్న వెంకటపాలెం చెరువు భారీ ఎత్తున మత్తడి పోయడంతో ప్రజలు ఆసక్తిగా తిలకించేందుకు వెళ్ళగా మరికొందరు వలలతో చేపల వేట చేశారు.

Flood water overflowing

అదేవిధంగా మండలంలోని అతిపెద్ద చెరువు అయినా రంగయ్య చెరువు పూర్తిగా నిండి మత్తడి పోసేందుకు సిద్ధంగా ఉందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. మరో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కావున రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని. శిధిలవస్థలో ఉన్న ఇండ్లలో ఉండరాదని, విద్యుత్ స్తంభాల వద్ద జాగ్రత్తగా ఉండాలని, పంట పొలాలకు ఎలాంటి ఎరువులు రైతులు వేయరాదని తాసిల్దార్ ముప్పు కృష్ణ మండల ప్రజలను కోరారు. వీరివెంట ఎంపీడీవో పసర గొండ రవి, పంచాయతీ కార్యదర్శులు, రెవిన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది తదితరులు ఉన్నారు.

స్థానిక మంజీర విద్యాలయంలో శ్రీకృష్ణాష్టమి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-41-1.wav?_=19

స్థానిక మంజీర విద్యాలయంలో శ్రీకృష్ణాష్టమి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.

రామాయంపేట నేటి ధాత్రి (మెదక్)

ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీకృష్ణుని దివ్యచరిత్రను , శ్రీకృష్ణుడు జన్మించినప్పటి నుండి గోకులలో చేసిన చిలిపి చేష్టలను తో పాటు గోవర్ధన గోవర్ధనగిరి నెత్తి గోపులాని ఎలా కాపాడాడు కన్నుల కట్టినట్టు చూపించారు. శ్రీకృష్ణ పూజ అనంతరం మోహన్ పంతులుగారు విద్యార్థులకు శ్రీకృష్ణుని చిలిపి చేష్టలను వివరించారు.శ్రావణమాసంలో లభించే పండ్లు, శొంఠి, బెల్లం కలిపిన వెన్న, మీగడ, మీగడ వంటి రుచికరమైన పదార్థాలు, వంటకాలు స్వామివారికి నైవేద్యంగా పెట్టారు.

Sri Krishna Ashtami

శ్రీకృష్ణుడి విగ్రహాన్ని అందంగా అలంకరించి, ఊయలలో పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, శ్రావ్యమైన కీర్తనలు పాడారు. చిన్నారి విద్యార్థిని విద్యార్థులు గోపిక మరియు శ్రీకృష్ణ వేషాదరణలో వచ్చి చూపరులను ఆకట్టుకున్నారు.

 

అలాగే శ్రీకృష్ణ గోపికలచే ఉట్టి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ జితేందర్ రెడ్డి వాసవి హెడ్మాస్టర్ సురేష్ మౌనిక మీనా సౌమ్య శ్రీనివాస్ జయప్రకాష్ ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version