బిజెపి జిల్లా కార్యదర్శిగా జిట్టబోయిన సాంబయ్య
గణపురం నేటి ధాత్రి :
గణపురం మండలం
భూపాలపల్లి జిల్లా బీజేపీ నూతన కమిటీలను ప్రకటించింది.జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి కమిటీలను ప్రకటించారు.
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామ్ చందర్రావు ఆదేశాలతో నూతన కమిటీని ప్రకటించినట్లు జిల్లా అధ్యక్షులు తెలిపారు. గణపురం మండలానికి చెందిన జిట్టబోయిన సాంబయ్యను జిల్లా కార్యదర్శిగా ప్రకటించారు. జిల్లా నూతన కమిటీలో స్థానం పొందిన సాంబయ్య రాష్ట్ర జిల్లా నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.