కేంద్ర ప్రభుత్వ ఉజ్వల యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ఉచిత గ్యాస్ – పేదలకు మోడీ వరం
మహాదేవపూర్ నవంబర్ 10 నేటి ధాత్రి *
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలో కేంద్రంలోనీ
బీజేపీ మండల అధ్యక్షుడు రామ్ శెట్టి మనోజ్
ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు రాంశెట్టి మనోజ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు
వారు మాట్లాడుతూ భారత ప్రధాని గౌ నరేంద్ర మోడీ గారు ప్రవేశ పెట్టిన ఉజ్వల యోజన పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్ అందించడం వాళ్ళ పేద మధ్య తరగతి మహిళలు పొగరాహిత వంటకు అలవాటు పడుతారు,ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి పర్యావరణం శుభ్రంగా ఉంటుంది ఈ పథకం గ్రామీణ మహిళల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకువచ్చే పథకామని పేర్కొన్నారు, పథకానికి అర్హులైన మహాదేవపూర్ మండలం లోని అన్ని గ్రామాల ప్రజలందరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఈ పథకం కోసం స్థానిక గ్యాస్ ఏజెన్సీ లో మీ యొక్క ఆధార్ కార్డ్,రేషన్ కార్డు,బ్యాంకు పాస్ బుక్, పాస్ సైజు ఫొటోస్, ఓటర్ ఐడి, ఫోన్ నెంబర్,లు గ్యాస్ ఏజెన్సీ లో మీ సర్టిఫికెట్స్ ఇచ్చి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోగలరు తెలపడం జరిగింది
