అరుణాచల్ ప్రదేశ్, త్రిపురలో మోదీ పర్యటన…

అరుణాచల్ ప్రదేశ్, త్రిపురలో మోదీ పర్యటన

 

 

అరుణాచల్ ప్రదేశ్‌లోని ఇటానగర్‌లో 240 మెగావాట్ల సామర్థ్యం కలిగిన హియో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు, 186 మెగావాట్ల సామర్థ్యం కలిగిన టాటో-ఐ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టును ప్రారంభిస్తారని పీఎంఓ తెలిపింది.

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఈనెల 22న అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh), త్రిపుర (Tripura)లో పర్యటించనున్నారు. ఇటానగర్‌లో రూ.5,100 కోట్ల విలువచేసే పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. మాతా త్రిపుర సుందరి టెంపుల్ కాంప్లెక్స్ అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. ఇటానగర్‌లో రూ.3,700 కోట్ల విలువైన రెండు ప్రధాన హైడ్రోపవర్ ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారని పీఎంఓ తెలియజేసింది. అనంతరం త్రిపురలో ప్రధాని పర్యటించి మాతాబరిలో మాతా త్రిపుర సుందరి టెంపుల్ కాంప్లెక్‌‌ అభివృద్ధి పనులు ప్రారంభిస్తారు. ఆలయంలో పూజలు చేస్తారు.

అరుణాచల్ ప్రదేశ్‌లోని ఇటానగర్‌లో 240 మెగావాట్ల సామర్థ్యం కలిగిన హియో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు, 186 మెగావాట్ల సామర్థ్యం కలిగిన టాటో-ఐ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టును ప్రారంభిస్తారని పీఎంఓ తెలిపింది. తవాంగ్‌లో అత్యాధునిక కన్వెన్షన్ సెంటర్‌కు శంకుస్థాపన చేయనున్నారు. జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, సాంస్కృతిక ఉత్సవాలు, ఎగ్జిబిషన్లకు ఇది వేదిక కానుంది. 1,500 మంది డెలిగేట్లుకు ఆతిథ్యం ఇచ్చేలా అంతర్జాతీయ ప్రమాణాలతో దీన్ని నిర్మించనున్నారు. ఇది పర్యాటక రంగ అభివృద్ధికి దోహదం కానుంది. రూ.1,290 కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కూడా మోదీ ఈ సందర్భంగా ప్రారంభించనున్నారు. వీటిలో కనెక్టివిటీ, హెల్త్, ఫైర్ సేఫ్టీ, వర్కింగ్ ఉమన్స్ హాస్టళ్లు వంటివి ఉంటాయి.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version